Home Blog Page 72

వైసీపీకి షాక్ ఇచ్చేలా కూటమి 'కాపు' సభ!

Kapu Meeting
Kapu Meeting

Kapu Meeting: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త కుల రాజకీయం మొదలుపెట్టింది. ముఖ్యంగా కాపులపై దృష్టి పెట్టింది. కాపుల్లో చీలిక వస్తే కానీ వచ్చే ఎన్నికల్లో కష్టమన్న నిర్ణయానికి వచ్చిన ఆ పార్టీ.. ఒక డేంజర్ గేమ్ మొదలుపెట్టింది. కాపు ఆత్మీయ సమావేశాల పేరుతో ఇప్పటికే వైసీపీ కాపు నేతలు రంగంలోకి దిగారు. త్వరలో ఉభయగోదావరి తో పాటు విశాఖ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వైసిపి కాపు నేతలతో పోల్చుకుంటే కూటమి కాపు నేతలు అంత దూకుడు ప్రదర్శించడం లేదు. అదే విషయాన్ని సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో సైతం ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తుంటే మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. తప్పకుండా కౌంటర్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. కానీ నేతల్లో చలనం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

* వారంతా దూకుడు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపు నేతలుగా ఉన్నారు అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని వంటి వారు. అయితే వారు దూకుడుగా ముందుకు వెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టాస్క్ ను అదే స్థాయిలో పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే వారికి ఆప్షన్ లేదు. రాజకీయంగా ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. వైసీపీని గెలిపిస్తేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వారు బలంగా భావిస్తున్నారు. అందుకే బలమైన ప్రయత్నం చేస్తున్నారు. కానీ కూటమి నుంచి ఆ స్థాయిలో కౌంటర్ లేకుండా పోతోంది.

* టిడిపి కూటమి నేతలు ఉన్నా..
టిడిపి కూటమికి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే.. కిమిడి కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రూ, మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి ప్రముఖ నేతలు ఉన్నారు. దాదాపు ఓ 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కౌంటర్ ఇచ్చిన దాఖలాలు లేవు. అనవసరంగా కుల ప్రస్తావనలు ఎందుకులే అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. అయితే మొన్ననే పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నేతలకు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు సైతం మంత్రివర్గ సమావేశంలో సహచరులకు దీనిపైనే నిలదీశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

* పవన్ చంద్రబాబు అలెర్ట్
కాపుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డేంజర్ గేమ్ ఆడుతోంది. దీనిని గట్టిగా తిప్పి కొట్టకపోతే టిడిపి కూటమికి నష్టం. ఇప్పుడు సాయి కృష్ణ ఉదంతంతో మరింత రెచ్చిపోతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సాయి కృష్ణ కు నేరచరిత ఉంది. ఆయనను వెనుకేసుకొస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండ కట్టాల్సిన అవసరం ఉంది. చట్టానికి విరుద్ధంగా ఒక నేరస్తుడ్ని లాకప్ డెత్ చేయడం అనేది నేరం. దానిపైనే ఇప్పుడు వైసీపీ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. త్వరలో ఉభయగోదావరి తో పాటు విశాఖలో భారీ బహిరంగ సభ పెట్టాలని చూస్తోంది. ఇప్పుడు పవన్ తో పాటు చంద్రబాబు అప్రమత్తం కావడంతో కూటమి కాపు నేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. గతంలో వైసిపి హయాంలో కాపులకు ఏ విధంగా అన్యాయం జరిగింది.. కూటమి వచ్చాక దక్కుతున్న గౌరవం పై కాపు సమాజానికి వివరించే ప్రయత్నం చేయనున్నారు. త్వరలో కూటమి కాపు నేతల సభ భారీగా ఉండబోతుందన్న టాక్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

బాలయ్య - కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీకి కెజిఎఫ్ సినిమాకి మధ్య సంబంధం ఏంటి..? కథ ఇదే...

Balayya Koratala Shiva Film
Balayya Koratala Shiva Film

Balayya Koratala Shiva Film: మాస్ కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన దర్శకుడు కొరటాల శివ… ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఏదో ఒక మెసేజ్ అయితే ఉంటుంది. గత రెండు సినిమాల నుంచి ఆయన కొంతవరకు నిరాశపరిచినప్పటికి అంతకుముందు మాత్రం స్టార్ హీరోలందరితో వరుస సక్సెస్ లను సాధించిన దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు బాలయ్య బాబుతో చేస్తున్న సినిమా విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కథేంటి అనే దానిమీదనే విపరీతమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా కథ కె.జి.ఎఫ్ ను మించి ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కేజిఎఫ్ లో ఎలాగైతే మదర్ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లారో ఈ సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ ని ఆసరాగా చేసుకొని సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా కనక భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం బాలయ్య బాబు క్రేజ్ అమాంతం తరా స్థాయికి వెళ్ళిపోతుంది. ఇక కొరటాల శివ సైతం టాప్ డైరెక్టర్ గా మారిపోతాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మూవీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మొదటి సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే నెలకొన్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ బాలయ్య బాబుని ఒక సింహంలా చూపించబోతున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కేజీఎఫ్ తరహాలోనే ఈ సినిమాలో కూడా భారీ ఎలివేషన్స్ ఉంటాయట. మదర్ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని బాలయ్య బాబు వచ్చిన ప్రతిసారి సక్సెస్ ని సాధించాడు అంటూ తన అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు మదర్, సిస్టర్ సెంటిమెంట్స్ తో వచ్చిన ప్రతిసారి మంచి విజయాన్ని సాధిస్తున్నాడు. అలాగే బాలయ్య బాబు అలాంటి ఎమోషన్స్ అన్నింటిలో కూడా బాగా నటిస్తాడు అనే ఒక పేరు అయితే ఉంది. కాబట్టి ఈ సినిమాలో మరోసారి అదే రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…

నాగ చైతన్య తో రిలేషన్ పై సమంత ఎమోషనల్ కామెంట్స్..ఇంత బాధని ఎలా దాచుకుందో..

Samantha Emotional Comments
Samantha Emotional Comments

Samantha Emotional Comments: కొంత గ్యాప్ తర్వాత సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమాల తర్వాత , ఈ చిత్రమే కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. బయ్యర్స్ కి మూడింతల లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా సమంత తన మూవీ టీం తో కలిసి నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ చిత్రం గురించి , అదే విధంగా తన మొదటి వైవాహిక జీవితం లోని అనుభవాలను నేటి తరం స్త్రీలకు చెప్తూ ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఒక రిపోర్టర్ సమంత ని ప్రశ్న అడుగుతూ ‘ప్రతీ మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటుంటారు, కానీ మీ జీవితం లోకి ఆయన వచ్చిన తర్వాత మొదటి సక్సెస్ ని ఎదురుకున్నారు. ఒక అబ్బాయిని ఎంచుకునే అమ్మాయిలు ఈమధ్య చాలా తడబడుతున్నారు, అలాంటి వారికి మోటివేషన్ గా మీరేమి చెప్తారు’ అని అడుగుతారు. అందుకు సమంత సమాధానం చెప్తూ ‘కెరీర్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ రిలేషన్ షిప్స్ మాత్రం మన చేతుల్లో ఉండదు. నేను నా అనుభవాలతో అర్థం చేసుకున్నది ఏమిటంటే మన మీద మనకు పూర్తిగా ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే మనం సరైన వాళ్ళని మన జీవిత భాగస్వాములు గా ఎంచుకోగలం. కానీ ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం లేకుండా, అసంపూర్ణ భావం తో ఉంటూ , అతను నీ జీవితం లోకి వస్తేనే సంపూర్ణం అవుతుందని అనుకున్నప్పుడే తప్పులు జరుగుతాయి. ఎందుకంటే మనకు జీవిత భాగస్వామి పై అంచనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అది కరెక్ట్ కాదు, నేను మహిళలకు ఇచ్చే అతి ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఎదుటి వ్యక్తి మీద ఆధారపడాలి అనుకోకండి, మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.

ఇదంతా ఆమె నాగ చైతన్య తో వైవాహిక జీవిత అనుభవాలను ఆధారంగా తీసుకొనే చెప్పిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇకపోతే గత కొంతకాలం నుండి సమంత గర్భం దాల్చింది అనే ప్రచారం సోషల్ మీడియా బాగా ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాల గ్యాప్ తర్వాత వచ్చారు , ఇకపై గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్న కి , సమంత సమాధానం చెప్తూ ‘దయచేసి క్షమించండి , ఇప్పుడు గర్భం తో ఉన్నాను , మెటర్నిటీ లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది’ అని చెప్పేసింది. స్వయంగా ఆమెనే ఈ విషయాన్ని చెప్పడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సొంత దేశంలోని కశ్మీరీలకు పాక్ రక్షణ మంత్రి వార్నింగ్.. వీడికి పిచ్చి ముదురుతోంది!

Pakistan Defence Minister
Pakistan Defence Minister

Pakistan Defence Minister: పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌కు కొన్ని రోజులుగా నోరు లేస్తోంది. భారత్, కశ్మీర్‌ విషయంలో అనవసంగా ధూషణలు చేస్తున్నాడు. కవ్వింపు చర్యలకు దిగుతున్నాడు. ఇటీవలే సిందూ జలాల విషయంలో యుద్ధానికైనా సిద్ధమని ప్రకటించాడు. తాజాగా కశ్మీర్‌ ప్రజలకు వార్నింగ్‌ ఇచ్చాడు. ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో అస్థిరత, ద్వంద్వ విధానాలను సూచిస్తున్నాయి. కశ్మీర్‌ ప్రజలను హెచ్చరిస్తూ, మిర్‌పూర్, రావల్‌కోట్‌ వంటి ప్రాంతాల ప్రజలను ఎవరినీ నమ్మవద్దని, వారిని తాము మనుషులుగా కూడా చూడడం లేదని పేర్కొన్నాడు.

పీవోకే ఆక్రమణ అంగీకారం..
ఖవాజా ఆసిఫ్‌ మాటలను గమనిస్తే పీవోకే(పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌)ను తాము అక్రమంగా నియంత్రణలోకి తీసుకున్నట్లు పరోక్షంగా అంగీకరించాడు. సాధారణంగా పాకిస్తాన్‌ పీవోకేను స్వతంత్ర దేశంగా చిత్రీకరిస్తూ, దానికి ప్రత్యేక హోదా ఉందని చెబుతూ వస్తుంది. కానీ ఆయన వ్యాఖ్యలు ఆ ప్రాంతంపై పాకిస్తాన్‌ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోందని, దానిని తన నియంత్రణలో ఉంచుకున్నట్లు సూచిస్తున్నాయి. ఇది దశాబ్దాలుగా పాకిస్తాన్‌ అనుసరిస్తున్న అధికారిక వైఖరికి విరుద్ధంగా ఉంది.

సైనిక త్యాగాలు, ఆర్థిక సహాయం అంటూ..
ఖవాజా ఆసిఫ్‌ పీవోకే ప్రజల కోసం పాకిస్తాన్‌ ఎంతో చేసిందని, తమ సైన్యం ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ వాదన ఆ ప్రాంత ప్రజల్లో భావోద్వేగాన్ని రేకెత్తించడానికి ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. అయితే పీవోకేలోని ప్రజల జీవన పరిస్థితులు, అభివృద్ధి, స్వేచ్ఛ వంటి అంశాలపై ఇప్పటికీ ప్రశ్నలు ఉన్నాయి. సైనిక త్యాగాలను ముందుకు తెచ్చి భావోద్వేగాన్ని రేకెత్తించడం రాజకీయంగా సాధారణ వ్యూహం అయినప్పటికీ, ఆ ప్రాంతంలోని వాస్తవ పరిస్థితులతో పోల్చినప్పుడు అది సరిపోదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ద్వంద్వ వైఖరి..
ఒకవైపు పీవోకేను స్వతంత్రంగా చిత్రీకరించి, మరోవైపు దానిపై పూర్తి నియంత్రణ చెలాయించడం పాకిస్తాన్‌ వైఖరిలోని ద్వంద్వత్వాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు ఖవాజా ఆసిఫ్‌ వాళ్లను మనుషులుగా చూడకండి అని చేస్తున్న పిలుపు రక్షణను బలహీనం చేస్తున్నాయి.

ఖవాజా వ్యాఖ్యలు భారత్‌–పాకిస్తాన్‌ సంబంధాలు, కశ్మీర్‌ సమస్యపై అంతర్జాతీయ చర్చల్లో కొత్త కోణాన్ని తెస్తున్నాయి. పాకిస్తాన్‌ ఎప్పుడూ కశ్మీర్‌ ప్రజల హక్కుల కోసం మాట్లాడుతూ వచ్చినా, పీవోకేలోని ప్రజల పరిస్థితి గురించి అదే స్థాయిలో చర్చించడం లేదనే వాదనలు బలపడుతున్నాయి.

వరుసగా 20 భూకంపాలు.. లక్షకు పైగా మరణాలు.. పెను వినాశనం

Venezuela Earthquake
Venezuela Earthquake

Venezuela Earthquake: ప్రపంచాన్ని ప్రకృతి విపత్తులు వణికిస్తున్నాయి. ఒకవైపు అతివృష్టి వరదలు, మరోవైపు కరువు, ఇంకోవైపు భూకంపాలు, సునామీలు ఇలా ఏదో ఒక రూపంలో ప్రకృతి భూమిపై కన్నెర్రజేస్తోంది. తాజాగా వెనెజువెలా రెండు తీవ్రమైన భూకంపాలతో తీవ్రంగా కంపించింది. రాజధాని ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు ఉండే అవకాశం ఉందని, దీంతో ప్రాణనష్టం భారీగా జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తీవ్ర విధ్వంసం..
రెండు భారీ భూకంపాలు వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో ఎక్కువగా బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తులు ఉండే అవకాశం ఉందని స్థానిక అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ భూకంపాల ధాటికి రోడ్లు, వంతెనలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. గాయపడిన వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం మతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు.

భారీగా ప్రాణ నష్టం..
అమెరికా జియోలాజికల్‌ సర్వే (యూఎస్‌జీఎస్‌) ప్రకారం ఈ భూకంపాల తర్వాత బలమైన ప్రకంపనలు రావచ్చు. దీంతో విధ్వంసం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. మతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు ఉండవచ్చని అంచనా వేశారు. శాస్త్రవేత్తలు ఈ విపత్తు విధ్వంసకరంగా ఉండొచ్చని, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రభుత్వం జాగ్రత్త చర్యలు..
ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల ప్రజలను నివాసాలను విడిచి బయటకు రావాలని సూచించింది. అదనపు ప్రమాదాలను నివారించేందుకు ఇళ్లకు ఇంధన సరఫరాను నిలిపివేసింది. కొన్ని భవనాలు కూలిన నేపథ్యంలో మరింత నష్టం, మంటలు జరగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. రక్షణ బృందాలు శిథిలాల నుంచి వ్యక్తులను బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యాయి.

సెలవు కావడంతో ఇళ్లలోనే..
జూన్‌ 24న జాతీయ సెలవుదినం కావడంతో చాలామంది ఇళ్లలోనే ఉన్నారు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో మొదటి భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగెత్తిన దృశ్యాలు కనిపించాయి. సాధారణ రోజులతో పోలిస్తే సెలవుదినం కారణంగా ఇళ్లలో ఎక్కువ మంది ఉండటం వల్ల ప్రాణనష్టం మరింతగా ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్‌ కూడా ఈ విపత్తులో భారీ మరణాలు జరిగే అవకాశం ఉందని తన సందేశంలో పేర్కొన్నారు.

వరుసగా 20 ప్రకంపనలు..
రెండు వరుస ప్రకంపనల తర్వాత అత్యవసర పరిస్థితి ప్రకటించింది ప్రభుత్వం. తర్వాత సుమారు 20 ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ప్రకటనతో రక్షణ బృందాలు, వైద్య సేవలు త్వరితగతిన అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు వేగంగా జరుగుతున్నాయి. మెక్వెషియా అంతర్జాతీయ విమానాశ్రయం భూకంపం ధాటికి దెబ్బతిన్నందున దానిని మూసివేశారు. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. రాజధాని మరియు ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, విద్యా సంస్థలు కూడా మూసివేశారు.

మొత్తంగా భారీ భూకంపం వెనెజువెలాను అతలాకుతలం చేసింది. లక్ష మందికిపైగా మరణించడం పెను వినాశనమే అని నిపుణులు భావిస్తున్నారు.

బాలయ్య, కొరటాల శివ.. 150 కోట్ల సినిమా...వర్కవుట్ అవుతుందా?

Balakrishna Koratala Siva movie updates
Balakrishna Koratala Siva movie updates

Balakrishna Koratala Siva Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలను చూడటానికి యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం బాలయ్య బాబు వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులు అలరిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్న బాలయ్య బాబు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలావరకు ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ కమర్షియల్ సినిమా చేస్తున్న బాలయ్య ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈరోజే ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

150 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమా ఒక హై వోల్టేజ్ కథ తో రాబోతుందట. అయితే బాలయ్య బాబు మీద 150 కోట్లు పెట్టడం అనేది ఒక వంతుకు రిస్క్ అని చాలామంది చెబుతున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే బాలయ్య భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టిన కూడా ఆయన సినిమాలు 100 కోట్లకు మించి కలెక్షన్స్ ను రాబట్ట లేకపోతున్నాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద 150 కోట్ల బడ్జెట్ పెట్టడం అనేది ప్రొడ్యూసర్ కొంతవరకు రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. ఇక మరికొంతమంది మాత్రం కథ అద్భుతంగా ఉందని దానివల్లే ఓవర్ బడ్జెట్ అయిన కూడా దానిని బాలయ్య బాబు రికవరీ చేయగలిగే కెపాసిటి ఉందని మరి కొంతమంది భావిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ బాలయ్య బాబుతో సాహసం చేస్తున్నాడనే చెప్పాలి.

ఇంతకుముందు తను చేసిన దేవర సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న కూడా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టలేక పోయింది. ఇక ఆ క్రమంలోనే బాలయ్య బాబుతో ఏ ధైర్యంతో 150 కోట్లు పెట్టి సినిమాను చేయిస్తున్నాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ లో సగభాగం వాళ్ళకే ఇస్తున్నాడుగా...

Vijay Deverakonda
Vijay Deverakonda

Vijay Deverakonda: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ…పెళ్లి చూపులు సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న ఆయన అర్జున్ రెడ్డి మూవీతో ప్రతి ఒక్కరి చూపును ఆకర్షించాడు. గీత గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. మధ్యలో కొంతవరకు తరబడినప్పటికి ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఇప్పుడు రౌడీ జనార్ధన్, రణబాలి అనే సినిమాలు చేస్తున్నాడు… వాటితో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ సినిమాలతో భారీ విజయాన్ని సాధిస్తే ఆయన క్రేజ్ తార స్థాయికి వెళ్ళిపోతుంది. లేకపోతే మాత్రం మరోసారి కెరియర్ ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట విజయ్ దేవరకొండ నుంచి వచ్చే సినిమాలు భారీ విజయాన్ని సాధించాలని ఆయన తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నాడు.

తను తీసుకునే రెమ్యూనరేషన్ లో సగభాగం వాళ్ళ అమ్మానాన్నలకే ఇస్తున్నాడట. ఎందుకంటే వాళ్లు కొన్ని సేవ కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారు. కాబట్టి తన రెమ్యూనరేషన్ లో సగభాగాన్ని పేరెంట్ కి ఇవ్వాలని తను డిసైడ్ అయి అదే చేస్తున్నాడట. మిగతా సగం మాత్రమే తను తన సొంతానికి వాడుకుంటున్నాడట. నిజానికి విజయ్ దేవరకొండ సేవ దృక్పథం ఉన్న వ్యక్తి అందువల్లే ఆయన చాలా రకాల సేవలను చేస్తూనే వాళ్ళ పేరెంట్స్ ద్వారా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టే విధంగా సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఫ్యూచర్ లో ఆయన నుంచి ఎక్కువ సంఖ్యలో సేవ కార్యక్రమాలు చూడబోతున్నామంటూ గతంలో పలు సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పాడు. దానికి అనుగుణంగానే ఆయన పెద్ద మొత్తంలో పేదలకు సేవ చేయడానికి డబ్బులను పోగేస్తున్నాడు.

ఇక ఫ్యూచర్ లో ఇంకాస్త ఎక్కువ మందికి తను చేసే సేవ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఆయన ఇప్పుడు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నాడు… రాబోయే రోజుల్లో ఆయన భారీ విజయాన్ని సాధించి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా మారితే చూడాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళన.. ఏపీ నుంచి సంచలనాలు!

Modi Cabinet Reshuffle
Modi Cabinet Reshuffle

Modi Cabinet Reshuffle: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాన నరేంద్ర మోడీ కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం నడుస్తోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో చేర్పులు మార్పులు చేయాలని భావిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించే అవకాశం ఉంది. అదే సమయంలో మిత్రులకు సైతం మరింత అవకాశాలు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఏపీలో టిడిపి తో పాటు జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో కీలక మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

* టిడిపికి మరొకటి..
ప్రస్తుతం ఏపీ నుంచి కేంద్ర క్యాబినెట్ లో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. బిజెపికి సంబంధించి భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్ర క్యాబినెట్లో కొనసాగుతున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం లేదు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీకి ఒక మంత్రి పదవి కేటాయించే ఛాన్స్ ఉందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక టాక్ నడుస్తోంది. అయితే ఈసారి రాయలసీమకు పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి పదవి ఇవ్వడం ద్వారా రాయలసీమలో మరింత పట్టు బిగించాలన్నది ఆలోచనగా సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఉన్నారు. మరోవైపు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వారిలో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని తెలుస్తోంది. ఇంకోవైపు కింజరాపు రామ్మోహన్ నాయుడు మంత్రిత్వ శాఖ మార్పుపై కూడా అనేక రకాల ఊహాగానాలు రేగుతున్నాయి. ఆయనకు గ్రామీణాభివృద్ధి శాఖను అప్పగిస్తారన్న టాక్ ఉంది. ఇప్పటివరకు సహాయం మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు ఇండిపెండెంట్ హోదా కల్పిస్తారని సమాచారం.

* జనసేనకు అవకాశం..
జనసేనకు కేంద్ర క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు లోక్సభలో. మచిలీపట్నంలో వల్లభనేని బాలసౌరి.. కాకినాడ నుంచి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఎంపీలుగా ఉన్నారు జనసేనకు. అయితే ఈసారి కేంద్ర క్యాబినెట్లో జనసేనకు స్థానం కల్పించాల్సి వస్తే బాల సౌరికి పదవి దక్కే అవకాశం ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి భూపతి రాజు శ్రీనివాస వర్మ మార్పు ఖాయమన్న టాక్ కూడా ఉంది. మార్పు అనివార్యం అనుకుంటే మాత్రం దగ్గుబాటి పురందేశ్వరికి అవకాశం కల్పిస్తారని పొలిటికల్ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది. మరి ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

నారా లోకేష్ రాజకీయంగా పండిపోయాడు.. ఏం రాజకీయాలు సామీ

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు అపర చాణిక్యుడు అన్న బిరుదు ఉంది. ఎందుకంటే ఆయన ఆజాత శత్రువు. ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోడు. అలాగని శాశ్వత మిత్రత్వం కూడా ఉండదు. రాజకీయ పరిణామాలు బట్టి.. ఏపీలో స్థితిగతులు బట్టి ఆయన తన వైఖరిని మార్చుకుంటూ ఉంటారు. జాతీయస్థాయిలో బిజెపితో పాటు కాంగ్రెస్తో స్నేహం చేశారు. ఆ రెండు పార్టీలకు సమ దూరం పాటిస్తూ కూటములను సైతం ఏర్పాటు చేశారు. ప్రాంతీయ పార్టీలన్నింటితోను ఆయనకు మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. అందుకే నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాలు చేయగలిగారు. ఓటమి ఎదురైన ప్రతిసారి గుణపాఠంగా మార్చుకొని విజయాన్ని దక్కించుకున్నారు. అయితే ఇదంతా అనుభవంతోను చంద్రబాబుకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన కుమారుడు లోకేష్ చంద్రబాబుకు మించి అన్నట్టు ఈ రాజకీయాలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు సాధిస్తున్నారు.

* రాహుల్ గాంధీకి సూచన..
ఇటీవల ఢిల్లీలో ఓ నేషనల్ మీడియా జరిపిన కాంక్లేవ్ కు లోకేష్ హాజరయ్యారు. రాజకీయ పరిణామాల గురించి తనదైన రీతిలో సమాధానాలు చెప్పారు. తనపై పప్పు అని ముద్రవేశారని.. కానీ పరిణితి సాధించి తనను తాను ప్రూవ్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో రాహుల్ గాంధీ తర్వాత తానే ఎక్కువగా ట్రోల్స్ కు గురైన విషయాన్ని సైతం ప్రస్తావించారు. రాహుల్ గాంధీ పాదయాత్రను గుర్తుచేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. తాను సైతం పాదయాత్ర చేసి పడిన ఇబ్బందులను ఒక పుస్తక రూపంలో తెచ్చానని వచ్చారు. రాహుల్ గాంధీ కూడా ఆ ప్రయత్నం చేయాలని సూచించారు. తద్వారా రాహుల్ విషయంలో లోకేష్ సానుకూల ఆలోచన బయటపడింది. అయితే రాహుల్తో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ లోకేష్ నోటి నుంచి ఈ మాటలు రావడం మాత్రం నిజంగా గొప్ప విషయం.

* ప్రధానిని కలిసే చనువు..
నారా లోకేష్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవగలరు. ఆయనతో చర్చించగలరు. లోకేష్ ఫ్యామిలీతో గంటపాటు ప్రధాని నరేంద్ర మోడీ గడిపారు. కలిసి భోజనం చేశారు. అంటే ఏ స్థాయిలో లోకేష్ తన పరిధిని పెంచుకున్నారో అర్థం అవుతుంది. లోకేష్ అఖిలేష్ యాదవ్ తో టచ్ లో ఉన్నారు. విజయ్ తో సన్నిహితంగా ఉన్నారు. డీకే శివకుమార్ తో మాట్లాడగలరు. అచ్చం చంద్రబాబు మాదిరిగానే జాతీయస్థాయిలో తన పరిధిని పెంచుకుంటున్నారు. తాజాగా తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ గురించి ప్రస్తావించారు. పెట్టుబడులతో పాటు పరిశ్రమలను తీసుకురావడంలో ఏపీతో తమిళనాడు పోటీపడిందని.. ఒక్క పారిశ్రామికవేత్త కూడా తమిళనాడులో అవినీతి, డబ్బులు డిమాండ్ చేశారని అనలేదని చెప్పుకొచ్చారు. తమిళనాడు సీఎం విజయ్.. ఆ రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో డిఎంకె ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో లోకేష్ చేసిన కామెంట్స్ ను డీఎంకే స్వాగతిస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోంది. అయితే జాతీయస్థాయిలో లోకేష్ వ్యవహారం, చేస్తున్న రాజకీయం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

టీమిండియా ఇవాళ ఓడితే ఇక ఇంటికే.. టఫ్ మ్యాచ్.. ఏం జరుగనుంది..

India Women Vs Bangladesh Women
India Women Vs Bangladesh Women

India Women Vs Bangladesh Women: టి20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. దీంతో భారత మహిళల జట్టు మీద ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలో టీమిండియా అత్యంత కీలకమైన మ్యాచ్ నేడు ఆడబోతోంది. బంగ్లాదేశ్ జట్టుతో తలపడబోతోంది.

ఈ మ్యాచ్ కు టీమిండియాకు అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఎలాగైనా భారీ అంతరంతో టీమిండియా గెలవాలి. అలా గెలిస్తే సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశాలుంటాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో పోటీపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియా మీద టీమిండియా గెలవాలంటే సర్వశక్తులు ఒడ్డాలి. టీమిండియా ప్లేయర్ల ఆట తీరు ప్రస్తుతం అంత గొప్పగా లేదు. బౌలింగ్ లో పేస్ విభాగం దారుణంగా ఉంది. స్పిన్ లో శ్రీ చరణి మాత్రమే సత్తా చూపిస్తోంది. స్మృతి మందాన, షెఫాలలి వర్మ మాత్రమే సూపర్ ఫామ్ లో ఉన్నారు. మిగతా బ్యాటర్లు అంతగా ఆకట్టుకోవడం లేదు. జమీమా తన స్థాయి ఇన్నింగ్స్ ఆడలేదు. కెప్టెన్ కౌర్ కూడా ఆకట్టుకోవడం లేదు. చివర్లో వస్తున్న రీచా మాత్రమే జోరు చూపిస్తోంది.

బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా తన లోపాలను మొత్తం సవరించుకోవాలి. భారీ అంతరంతో గెలవాలి. అలా గెలిస్తేనే టీమిండియాకు నెట్ రన్ రేట్ మెరుగవుతుంది. ఒకవేళ తదుపరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో ఓడిపోయినప్పటికీ టీమ్ ఇండియాకు సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

ఈ టోర్నీలో టీమిండియా బ్యాటర్లు నెదర్లాండ్ మీద మినహా.. మిగతా జట్ల మీద ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయారు.. బౌలర్లు కూడా ఆకట్టుకోలేకపోయారు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే మ్యాచ్ లో భారత ప్లేయర్లు భారీ ఇన్నింగ్స్ లు ఆడాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ జట్టు ఈ సిరీస్ లో ఇప్పటివరకు పాకిస్తాన్ జట్టును ఓడించింది. అంతకుముందు నెదర్లాండ్స్ ను కూడా ఓడించింది. బంగ్లాదేశ్ ను అనామకచెట్టు అనుకుంటే టీం ఇండియాకు మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందువల్లే కలిసికట్టుగా ఆడితేనే టీమ్ ఇండియాకు గెలుపు లభిస్తుంది. భారీ అంతరంతో విజయం సాధిస్తే సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.. మాంచెస్టర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.

*పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష ఏంటి? ఎందుకు చేస్తారో తెలుసా?*

Pawan Kalyan Chaturmasa Deeksha
Pawan Kalyan Chaturmasa Deeksha

Pawan Kalyan Chaturmasa Deeksha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష బూనారు. చతుర్మాస దీక్ష తీసుకున్నారు. ఏటా జేష్ఠ మాసంలో దీక్షను చేపట్టే పవన్ కళ్యాణ్.. కార్తీక మాసంలో ఈ చతుర్మాస దీక్షను విరమిస్తారు. దీక్షాకాలంలో సాత్విక భోజనం తీసుకుంటారు. దేవతారాధన, ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు. బుధవారం ఉదయం మంగళగిరిలోని శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించిన అనంతరం దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం పవన్ కళ్యాణ్ ఈ దీక్షను క్రమం తప్పకుండా ఏటా చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా దీక్ష చేపట్టడం విశేషం. కార్తీక మాసం వరకు పవన్ కళ్యాణ్ చందన వర్ణ వస్త్రధారణతోనే కనిపిస్తారు.

* ఆధ్యాత్మిక భావాలు అధికం..
పవన్ కళ్యాణ్ లో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. అందుకే సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరం అని నొక్కి చెబుతూ వస్తున్నారు. నిత్యం ఆలయాలను సైతం సందర్శిస్తుంటారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం చతుర్మాస దీక్ష నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* కఠినమైన దీక్ష…
నాలుగు నెలల పాటు ఈ దీక్ష అత్యంత కఠినంగా ఉంటుంది. దీక్షాకాలంలో నియమితమైన జీవనం గడపనున్నారు పవన్ కళ్యాణ్. సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. వీధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. నిత్యం అనుష్టానం, దేవతారాధన చేస్తూ.. సమయానుకూలంగా ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్ష స్వీకరించిన నేపథ్యంలో.. గతంలోని పాత ఫోటోలను సోషల్ మీడియా ద్వారా జనసేన పంచుకుంది. తల్లి అంజనాదేవి, సోదరులు చిరంజీవి, నాగబాబు తో కలిసి ఉన్న ఫోటోలు ప్రత్యేక ఆకర్షణ గాని నిలుస్తున్నాయి.

* ఆలయాల సందర్శన..
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పానకాల స్వామికి పట్టు వస్త్రాలతో పాటు పానకం నైవేద్యంగా పెట్టారు. కాకా ఈ దీక్ష నాలుగు నెలల పాటు కొనసాగనుంది. కార్తీక మాసంతో ఈ దీక్ష విరమిస్తారు.. ప్రస్తుతం దీక్షలో ఉండడంతో చందనవర్ణ వస్త్రాలతో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్.

అదే పనిగా వస్తువులు కొంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి ఈ పని చేయండి..

Diderot Effect
Diderot Effect

Diderot Effect: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని పెంచుకోవాలని, మంచి జీవనశైలిని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే పెరుగుతున్న ధరలు, రోజువారీ ఖర్చులు, కొత్త అవసరాల కారణంగా చాలామంది పొదుపు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరగడం వల్ల ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘డిడిరో ఎఫెక్ట్’ (Diderot Effect) అనే ఆర్థిక ప్రవర్తన గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అసలేంటిది? ఈ సమయంలో ఏం చేయాలి?

డిడిరో ఎఫెక్ట్ అంటే ఏమిటి?
డిడిరో ఎఫెక్ట్ అనే భావనకు ఫ్రెంచ్ తత్వవేత్త డెనిస్ డిడిరో పేరు పెట్టారు. ఒక కొత్త లేదా ఖరీదైన వస్తువును కొనుగోలు చేసిన తర్వాత, దానికి సరిపోయేలా మిగతా వస్తువులను కూడా అప్‌గ్రేడ్ చేయాలనే కోరిక కలగడం దీనికి ప్రధాన లక్షణం. అంటే ఒక కొనుగోలు మరిన్ని కొనుగోళ్లకు దారి తీస్తుంది. మొదట చిన్న ఖర్చుగా మొదలైన విషయం, తర్వాత పెద్ద ఆర్థిక భారంగా మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఎవరైనా ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేశారని అనుకుందాం. ఆ తర్వాత దానికి మంచి కవర్, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్ వంటి వస్తువులు కూడా కొనాలని అనిపించవచ్చు. అలాగే కొత్త సోఫా కొంటే, దానికి సరిపోయే కర్టెన్లు, టేబుల్, డెకరేషన్ వస్తువులు కొనాలనిపిస్తుంది. ఇలా ఒక కొనుగోలు మరెన్నో అదనపు ఖర్చులకు కారణమవుతుంది.

యువతపై ప్రభావం ఎక్కువ
సోషల్ మీడియా, ఆన్‌లైన్ షాపింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ కల్చర్ కారణంగా నేటి యువతలో డిడిరో ఎఫెక్ట్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త గ్యాడ్జెట్లు, బ్రాండెడ్ దుస్తులు లేదా లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత వాటికి అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవాలని చాలామంది భావిస్తున్నారు. దీని వల్ల అవసరం లేని ఖర్చులు పెరిగి, పొదుపులు తగ్గిపోతాయి.

ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
డిడిరో ఎఫెక్ట్ కారణంగా చాలామంది తమ బడ్జెట్‌ను దాటిపోయి ఖర్చు చేస్తారు. క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, వ్యక్తిగత రుణాలపై ఆధారపడే పరిస్థితి కూడా వస్తుంది. ఫలితంగా అత్యవసర పరిస్థితుల కోసం అవసరమైన నిధులు చేతిలో ఉండవు. అనుకోని వైద్య ఖర్చులు, ఉద్యోగ నష్టం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది.

దీనిని ఎలా నియంత్రించాలి?
ఏదైనా కొత్త వస్తువు కొనాలనిపించినప్పుడు అది నిజంగా అవసరమా లేదా కేవలం ఆకర్షణ మాత్రమేనా అనే విషయాన్ని ముందుగా ఆలోచించాలి. పెద్ద కొనుగోలు చేసిన వెంటనే దానికి సంబంధించిన ఇతర వస్తువులు కొనకుండా కొంతకాలం వేచి చూడడం మంచిది. ‘24 గంటల నియమం’ లేదా ‘30 రోజుల నియమం’పాటించడం ద్వారా అనవసర కొనుగోళ్లను తగ్గించుకోవచ్చు. కొనుగోలు చేయాలనుకున్న వస్తువును జాబితాలో పెట్టి కొంతకాలం తర్వాత కూడా అవసరం అనిపిస్తే మాత్రమే కొనడం ఉత్తమం.

పొదుపులను ప్రాధాన్యంగా తీసుకోవాలి:
ఆదాయం వచ్చిన వెంటనే ముందుగా కొంత మొత్తాన్ని పొదుపు లేదా పెట్టుబడుల కోసం కేటాయించడం మంచి అలవాటు. మిగిలిన మొత్తాన్ని ఖర్చుల కోసం ఉపయోగిస్తే ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే అనుకోని పరిస్థితుల్లో ఇబ్బందులు తగ్గుతాయి.

వర్షా కాలంలో తప్పనిసరిగా చూడాల్సిన ఈ 4 ప్రదేశాలు.. ఎంజాయ్ మిస్ కాకండి

Monsoon Travel
Monsoon Travel

Monsoon Travel: వర్షాకాలం ప్రకృతికి కొత్త అందాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో పచ్చని కొండలు, మేఘాల మధ్య జలపాతాలు, చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఇన్నాళ్లు వేసవి వేడిలో విసిగిపోయిన వారు ఇక్కడి వెళ్లి హాయిగా గడపొచ్చు. అలాంటి ప్రదేశాలు మన దేశంలో చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ మాన్ సూన్ లో ట్రిప్ కు అనువైన ప్రదేశాల్లో కొన్ని అద్భుతం అని అనిపిస్తాయి. అలాంటి వాటిలో ఈ 4 ముఖ్యమైనవి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం..

టీ తోటల స్వర్గం..మున్నార్:
కేరళలోని మున్నార్ మాన్‌సూన్ సీజన్‌లో మరింత అందంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పచ్చని టీ తోటలు, పొగమంచుతో కప్పుకున్న కొండలు, జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఎరవికుళం నేషనల్ పార్క్, మాట్టుపెట్టి డ్యామ్, టాప్ స్టేషన్ వంటి ప్రదేశాలు ప్రత్యేక ఆకర్షణలు. వర్షాల్లో ఇక్కడి ప్రకృతి అందాలు మరింత మెరుగ్గా కనిపిస్తాయి. హైదరాబాద్ నుంచి కొచ్చి వరకు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి సుమారు 130 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో టాక్సీ లేదా బస్సులో మున్నార్ చేరుకోవచ్చు. రైలులో ప్రయాణించేవారు ఎర్నాకుళం స్టేషన్ వరకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని ఎంచుకోవచ్చు.

కాఫీ తోటల అందాలకు కేరాఫ్..కూర్గ్:
భారతదేశంలోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ ఒకటి. వర్షాకాలంలో ఇక్కడి కాఫీ తోటలు, పచ్చని కొండలు, అబ్బే ఫాల్స్ వంటి జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి ఇది ఉత్తమ ఎంపిక. ఇక్కడికి వెళ్లాలని అనుకునేవారు హైదరాబాద్ నుంచి మైసూరు లేదా బెంగళూరు వరకు రైలు, బస్సు లేదా విమానంలో వెళ్లవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కూర్గ్ చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి కూర్గ్ దూరం సుమారు 260 కిలోమీటర్లు.

అద్భుతమైన జలపాతం..లోనావాలా..:
మహారాష్ట్రలోని లోనావాలా మాన్‌సూన్ టూరిజానికి ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో ఇక్కడి లోయలు, పచ్చని కొండలు, చిన్న పెద్ద జలపాతాలు అద్భుతంగా కనిపిస్తాయి. ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ, ఫ్యామిలీ ట్రిప్స్‌కు ఇది మంచి గమ్యస్థానం. టైగర్ పాయింట్, భూషి డ్యామ్, రాజమాచి ఫోర్ట్ వంటి ప్రదేశాలు తప్పక చూడాల్సినవి. హైదరాబాద్ నుంచి పుణె లేదా ముంబై వరకు రైలు లేదా విమానంలో వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సులభంగా లోనావాలా చేరుకోవచ్చు. పుణె నుంచి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

రంగురంగుల పూల ప్రపంచం..వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్:
ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య వేలాది రకాల అడవి పూలతో ఈ లోయ రంగుల హరివిల్లుగా మారుతుంది. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్ అభిమానులకు ఇది స్వర్గధామం లాంటిది. హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వరకు విమానంలో వెళ్లాలి. అక్కడి నుంచి జోషిమఠ్, గోవిందఘాట్ చేరుకుని ట్రెక్కింగ్ ద్వారా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు చేరుకోవాలి. ఈ ప్రయాణం కొంత కష్టమైనదే అయినా, అక్కడి అందాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.

అయితే ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడంతో వాతావరణ పరిస్థితులు తెలుసుకొని ఇక్కడికి వెళ్లాలి. అంతేకాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ లేపేయడానికి ఇజ్రాయిల్ స్కెచ్.. నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవడ్రా గ్యారెంటీ..

Pakistan Army Chief Asim Munir
Pakistan Army Chief Asim Munir

Pakistan Army Chief Munir: ఏదైనా ఒక విషయం చెబితే నమ్మే విధంగా ఉండాలి. ముఖం మీద ఉమ్మే విధంగా ఉండకూడదు. ఈ విషయం కూడా అటువంటిదే. దానిని ఒక బ్రెజిల్ జర్నలిస్ట్ చెప్పాడు. జర్నలిస్టు కదా.. చెబితే నమ్మాలి కదా అనుకుంటుంటే.. అది నమ్మే విధంగా లేదు. ముఖం మీద ఉమ్మే విధంగా ఉంది. ఇంతకీ అతడు చెప్పిన ఆ కథేంటి.. దాని వ్యవహారం ఏంటి..

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా మునిర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇతగాడు తన పదవిని కాపాడుకోవడం కోసం రకరకాల మాయలు.. రకరకాల వ్యవహారాలు సాగిస్తూ ఉంటాడు. అమెరికా ముందు సాగిలపడుతూ ఉంటాడు. అదే కాదు తన పదవి కోసం పాకిస్తాన్ ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టడానికి వెనుకాడడు. అటువంటి మునీర్ ఇజ్రాయిల్ లిస్టులో ఉన్నాడట. ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ సంస్థ మోసాద్ ఇతడిని లేపేయడానికి కుట్ర పన్నిందట. అంతేకాదు కొంతకాలంగా పాకిస్తాన్ డెలిగేట్స్ విషయంలో కూడా ఇజ్రాయిల్ పక్క ప్లాన్ తో ఉందట.

ఈ విషయాన్ని బ్రెజిల్ జర్నలిస్టు పేప్ ఎస్కో బార్ బయటపెట్టాడు. జెనీవాలో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చ సందర్భంగా మునీర్.. ఇతర పాకిస్తాన్ డెలిగేట్స్ ను చంపడానికి ఇజ్రాయిల్ స్కెచ్ వేసిందట.. ఈ విషయం పాకిస్తాన్ దేశానికి తెలిసిందంట. మా ఆర్మీకి ఏదైనా జరిగితే మీ దేశాన్ని నాశనం చేస్తామని మధ్యవర్తుల ద్వారా పాకిస్తాన్ హెచ్చరించిందట.

పాకిస్తాన్ కే దిక్కు దివానం లేదు. లెబనాన్ మీద దాడులు చేస్తుంటే అంతటి అమెరికా మూసుకొని కూర్చుంది. పైగా ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ సంస్థ ఎలా పనిచేస్తుందో అందరికీ తెలుసు. చివరికి అమెరికా కూడా ఇజ్రాయిల్ ముందు తలవంచక తప్పదు. ఇజ్రాయిల్ స్కెచ్ వేస్తే ఎంతటి నాయకుడైనా సరే చావాల్సిందే. అంతటి కోరలు చాచి ఉన్న ఇరాన్ ఖమేని చచ్చి ఊరుకున్నాడు. అటువంటి ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెన్సీ ముందు పాకిస్తాన్ నిలబడుతుందా.. మునీర్ బతికి బట్ట కడతాడా..

ఒకవేళ ఇజ్రాయిల్ దేశానికి పాకిస్తాన్ పై దాడులు చేయాల్సిన అవసరం ఏంటి.. మునీర్ ను చంపేస్తే పాకిస్తాన్ కి వచ్చే ప్రయోజనం ఏంటి. ఇవేవీ పనికొచ్చే ముచ్చట్లు కావు. బ్రెజిల్ జర్నలిస్ట్ ఏదో గాలి మాటలు మాట్లాడినట్టు కనిపిస్తోంది. ఒకవేళ చంపాలి అనుకుంటే ఇజ్రాయిల్ దేశానికి పెద్ద లెక్క కాదు. పాకిస్తాన్ దేశం పెద్ద లెక్కలోది కాదు. ఎందుకంటే ఇజ్రాయిల్ సాంకేతికంగా.. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశం. అక్కడ ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. పాకిస్తాన్ లాగా దరిద్రంగా.. చండాలంగా ఉండదు.

ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇజ్రాయిల్ మీద దాడి చేస్తే.. మరుసటి క్షణం ఈ భూమి మీద పాకిస్తాన్ పేరు ఉండదు. ఇజ్రాయిల్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇరాన్ కు తెలుసు.. హిజ్ బుల్లా ఉగ్రవాదులకు తెలుసు. తెలియనిది కేవలం పాకిస్తాన్ కి మాత్రమే. ఆల్రెడీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ అన్ని మూసుకుంది. ఆ చిన్న దళాన్నే పాకిస్తాన్ ఏం చేయలేకపోతోంది. ఇజ్రాయిల్ దేశాన్ని ఏం చేయగలుగుతుంది..

జబర్దస్త్ ఫైమా సీక్రెట్ పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా? ఊహించని ట్విస్ట్

Jabardasth Faima marriage

Jabardasth Faima marriage : జబర్దస్త్ వేదికపై తనదైన కామెడీ టైమింగ్, తెలంగాణ యాసతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన లేడీ కమెడియన్ ఫైమా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు, ఆర్భాటాలు లేకుండా తన ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు, సినీ, టెలివిజన్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తొమ్మిదేళ్ల ప్రేమకు పెళ్లి ముహూర్తం

ఫైమా భర్తగా మారిన వ్యక్తి పేరు ప్రవీణ్ నాయక్. ఆసక్తికర విషయం ఏమిటంటే.. వీరిద్దరూ గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఫైమా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టకముందే వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, ఒత్తిళ్లు, విమర్శలు ఎదురైనా ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. చివరకు ఆ ప్రేమను పెళ్లి బంధంతో శాశ్వతం చేసుకున్నారు.

ఎమోషనల్ పోస్ట్‌తో మనసు విప్పిన ఫైమా

పెళ్లి అనంతరం రిజిస్ట్రార్ కార్యాలయంలో భర్త ప్రవీణ్‌తో కలిసి దిగిన ఫోటోలు, వీడియోను ఫైమా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ అభిమానులను కదిలించింది.

“మమ్మల్ని అనుమానించారు.. మమ్మల్ని విమర్శించారు.. మమ్మల్ని విడదీయడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ మా ప్రేమ ప్రతి అడ్డంకిని అధిగమించి మరింత బలపడింది. ఈ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, అంతులేని సహనం ఉన్నాయి. ఒకరినొకరు వదిలేయడానికి వేల కారణాలు ఉన్నా.. ప్రతిరోజూ ఒకరి కోసం ఒకరం జీవించాలని నిర్ణయించుకున్నాం. చివరకు ఈ రోజు భార్యాభర్తలమయ్యాం” అంటూ తన ప్రేమ ప్రయాణాన్ని భావోద్వేగంగా వివరించింది.

పటాస్ నుంచి బిగ్‌బాస్ వరకు…

పటాస్ కార్యక్రమంతో కెరీర్ ప్రారంభించిన ఫైమా, జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. అనంతరం బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొని మరింత ప్రజాదరణ పొందింది. తన సహజమైన కామెడీ, టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది.

సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

ఫైమా పెళ్లి వార్త బయటకు రావడంతో అభిమానులతో పాటు జబర్దస్త్ సహచరులు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు, పలువురు టెలివిజన్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్నో ఒడిదొడుకులను దాటి ప్రేమను గెలిపించుకున్న ఫైమా-ప్రవీణ్ జంటకు నెటిజన్లు అభినందనలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)