Pawan Kalyan: రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అభిమానులు పార్టీలుగా డివైడ్ అయిపోయి ఉండొచ్చు కానీ, మన చిన్నతనం లో చిరంజీవి కి , యవ్వనం లో పవన్ కళ్యాణ్ కి ఫ్యానిజం చేయకుండా ఉండలేము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే , ఒకానొక దశలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని యూత్ కి ఏకైక రోల్ మోడల్ ఆయనే. తొలిప్రేమ , సుస్వాగతం , తమ్ముడు , బద్రి , ఖుషి అంటూ ఆయన ఒక జనరేషన్ యూత్ మొత్తాన్ని తన ఫ్యాన్ బేస్ గా మార్చేసుకున్నారు. యూత్ లో ఆ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి కి కూడా పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది కాదు అనేవారు విశ్లేషకులు. ముఖ్యంగా 90’s యువత అయితే ఇప్పటికీ ఆయన్ని అదే రేంజ్ లో ఆరాధిస్తుంటారు. అందులో మన ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి , బీజేపీ నాయకుడు సత్య కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.
నేడు ఆయన ఒక ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ‘జానీ’ చిత్రం లోని పాపులర్ సాంగ్ ‘నారాజు గారకురా మా అన్నయ్య’ అనే పాటకు తోటి అభిమానులతో కలిసి చిందులేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. సత్యకుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం సమయం లో కూడా తాను పవన్ కళ్యాణ్ అభిమాని అనే చెప్పుకుంటూ వచ్చారు. తన నియోజకవర్గం లో కూడా ఎమ్మెల్యే గా గెలిచేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో సహాయపడ్డారు. ఇప్పుడు మరోసారి ఆయనలోని వింటేజ్ పవన్ కళ్యాణ్ అభిమాని బయటకు వచ్చి , తన స్థాయి ని కూడా మర్చిపోయి చిందులు వేయడాన్ని చూసి , పవన్ అభిమానులు ‘పవనిజం’ లో మ్యాజిక్ అదే సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడుతూ ఫుల్ బిజీ గా ఉంటూనే, మరోపక్క సినిమాలు కూడా చేసేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గానే ఆయన ‘ఓజీ 2’ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. నేడు ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు , మెంటలెక్కిపోతున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కలేదని , పవన్ కళ్యాణ్ సుజిత్ కి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే వండర్స్ ని క్రియేట్ చేస్తాడని అంటున్నారు ఫ్యాన్స్ , నెటిజెన్స్.















సీఎం అయినా విజయ్ కి తప్పని అవమానాలు.. ఇబ్బందులు..
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి అవమానాల కొత్తకాదు. ఇబ్బందులు కూడా కొత్త కాదు. తన సినీ కెరియర్ మొదలుపెట్టిన తొలి రోజుల్లోనూ విజయ్ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వరుసగా వైఫల్యాలు.. అతని ముఖం రంగు.. హావ భావాలు.. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఇబ్బంది పడ్డారు. చివరికి తనను తాను మలుచుకొని.. గొప్పగా ఎదిగారు. తమిళనాడు చిత్ర పరిశ్రమలోని ఎక్కువ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడిగా నిలిచారు. ఇప్పుడు ఏకంగా తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
విజయ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అదేంటి.. ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ చెప్పింది వేదం కదా.. ఆయన అన్నదే శాసనం కదా.. అలాంటప్పుడు ఆయనకు ఇబ్బందులు ఏముంటాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది.. పైగా విజయ్ భారీగా డబ్బు సంపాదించిన వ్యక్తి. తమిళనాడు ఆర్థికంగా బలమైన రాష్ట్రం.. అలాంటప్పుడు ఆయనకు ఇబ్బందులు ఏముంటాయి.. నచ్చిన ప్రేయసి త్రిష కూడా ఆయన వెంట ఉంది కదా.. అని మీరు అనుకోవచ్చు. కానీ విజయ్ కి ఉన్న ఇబ్బందులను ఆమె తల్లి శోభ వెల్లడించారు.
ఇటీవల కాలంలో విజయ్ ని ఉద్దేశించి ఉదయనిది స్టాలిన్ దారుణంగా మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలను కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు.. చివరికి కోర్టు వ్యవహారాలు.. విడాకుల సంగతులు అంటూ మాట్లాడుతున్నారు. అది విజయ్ ని తీవ్రమైన కలవరపాటుకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో విజయ్ ఎవరిని కూడా విమర్శించలేదు. దారుణంగా మాట్లాడలేదు. అంతటి ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన కేవలం తన పార్టీ విధానాలు.. అధికారంలోకి ఏం చేస్తాం అనే విషయాలను మాత్రమే ప్రకటించారు.
తాజాగా విజయ్ గురించి.. అతడు పడుతున్న ఇబ్బందుల గురించి తల్లి శోభ బయటకు చెప్పారు..” పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత విజయ్ ఏ రోజు కూడా సరిగా నిద్రపోలేదు. ఎన్నో రకాల విమర్శలు.. అవమానాలు ఎదుర్కొన్నాడు. అవన్నీ చూస్తూ మౌనంగానే ఉన్నాడు. తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడ్డారు. కొన్ని సందర్భాలలో విజయ్ కి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. అతడు అప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు. ప్రతికూల భావనలను.. ప్రతికూల పరిస్థితులను అతడు సానుకూలంగా మార్చుకున్నాడు. ఫలితంగా ముందుకు సాగాడు. అందువల్లే అతడు ఈ స్థాయిలో ఉన్నాడని” అతడి తల్లి శోభ ఇటీవల చెప్పారు. ఈ ప్రకారం విజయ్ కేవలం ఒక టర్మ్ మాత్రమే కాదు.. తమిళనాడు రాజ్యాన్ని చాలా సంవత్సరాల పాటు ఏలెందుకే రాజకీయాలలోకి వచ్చినట్టు అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.