AP Panchayat Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తోంది. సెప్టెంబర్ లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డిసెంబర్లో పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కొత్త సంవత్సరం నాటికి కొత్త పాలకవర్గాలు కొలువుదీరేలా చూడాలని ప్రభుత్వం కూడా చూస్తోంది. ఇప్పటికే మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసింది ముందుగా. తర్వాత పంచాయితీ పాలకవర్గాల గడువు కూడా ముగిసింది. వచ్చే నెలలో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాల గడువు ముగియనుంది. దాదాపు స్థానిక సంస్థలన్నీ పాలకవర్గాలు లేక ప్రత్యేక అధికారుల పాలనలోకి వచ్చాయి. అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది ప్రభుత్వం. ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ప్రారంభించింది.
*ఆ నిబంధనతో..
రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు సంబంధించిన పాలకవర్గాల పదవీకాలం గడువు మార్చి 17 తో ముగిసింది.. దీంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13వేల పంచాయితీలకు సైతం పాలకవర్గాల గడువు ఏప్రిల్ 2తో ముగిసింది. వచ్చే నెలలో జిల్లా పరిషత్తులతో పాటు మండల పరిషత్తుల పదవి కాలం కూడా ముగియనుంది. ఇప్పటికే పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులు వచ్చారు. జిల్లా పరిషత్తులకు సైతం ప్రత్యేక అధికారులు రానున్నారు. పాలకవర్గాల పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాలను ఎన్నుకోవాలన్న నిబంధన ఉంది. అందుకే సెప్టెంబర్ నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం గట్టి వ్యూహంతోనే ఉంది.
* ముందుగా పంచాయితీలకు..
ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. చివరిసారిగా 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా పంచాయితీలను గెలుచుకుంది. అప్పట్లో ఎన్నికలు జరిగిన తీరు కూడా అందరికీ తెలిసిన విషయమే. వాలంటీర్లతో పాటు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంచాయితీల్లో నెగ్గుకు వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొన్నటి వరకు స్థానిక సంస్థలన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉండేవి. ఆ పార్టీ యాక్టివ్ గా ఉండడానికి అదొకటి కారణం. ముందుగా పంచాయితీలకు, తరువాత మున్సిపాలిటీలకు, చివరిగా జిల్లా పరిషత్తులతో పాటు మండల పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. సెప్టెంబర్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఖాయం అని తెలుస్తోంది.
















బంగారం కొంటున్నారా.. నేటి అర్ధరాత్రి నుంచి కేంద్రం తీసుకొచ్చిన గోల్డ్ స్ట్రోక్ తెలుసా..
Gold Import Duty Hike: ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు బంగారాన్ని కొనుగోలు చేయాలని ఆలోచన పూర్తిగా విరమించుకోవాలని భారతీయులకు సూచించారు. ఆయన మాటలు బంగార పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవి పూర్తిగా నిజమైపోయాయి. ఎందుకంటే కేంద్రం ఒక్కసారిగా గోల్డెన్ స్ట్రోక్ ఇచ్చేసింది. బంగారం కొనుగోలు చేయాలని వారి ఆశలను ఒక్కసారిగా తుంచేసింది.
ఇటీవల హైదరాబాద్ సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఏడాది పాటు భారతీయులు బంగారం కొనుగోలు చేయొద్దని సూచించారు. ఆయన మాట్లాడిన రెండు రోజుల్లోనే కేంద్రం బంగారం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి, ప్లాటినం దిగుమతుల మీద సుంకం రెట్టింపు చేసింది. ఇప్పటిదాకా అది ఐదు శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా 10 శాతానికి పెరిగిపోయింది. ఇది మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఆభరణాల తయారీకి వాడే వస్తువులు.. ఇతర లోహాలు.. పారిశ్రామిక దిగుమతులకు కూడా ఇది వర్తిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.. ఇప్పటికే బంగారం ధర (24 క్యారెట్లు) 1,40,000 మించి ట్రేడ్ అవుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆ ధర మరింత పెరిగే అవకాశం ఉంది.
బంగారం దిగుమతులు పెరుగుతుండడం కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ధరలు పెరుగుతున్నప్పటికీ చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మార్కెట్ నిపుణులు కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలని సూచనల మీద సూచనలు చేస్తున్న నేపథ్యంలో.. చాలామంది ఇతర రంగాలను పక్కనపెట్టి.. కేవలం బంగారం మీద మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో.. ఇతర రంగాలలో కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆయా రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి అంతగా సాగడం లేదు. అందువల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని తెలుస్తోంది. బంగారం కొనుగోళ్లు ఏడాదిపాటు తగ్గిపోతే మన దేశానికి సంబంధించిన విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తోంది.
కేవలం బంగారం, ఇతర ఖరీదైన లోహాలు మాత్రమే కాదు.. ఆహార పదార్థాల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో ఏప్రిల్ నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా నాలుగు నెలల గరిష్టానికి చేరుకుంది. నాలుగు నెలల క్రితం ఇది 3.48 శాతంగా ఉండేది. జనవరిలో 2.74 శాతంగా ఉండేది. దీనికి ప్రధాన కారణం ఆహార ధరల పెరుగుదలే. వరుసగా ఆలు.. ఉల్లి.. టమాటా ధరలు క్రాష్ అయ్యాయి. మిగతా ఉత్పత్తుల ధరలు పెరిగాయి. దీంతో నాలుగు నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం గడిచిన నాలుగు నెలల్లో 2.13 శాతం నుంచి 4.2 శాతం వరకు పెరిగింది. జ్యువెలరీ, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై ఏప్రిల్ లో ద్రవ్యోల్బణం 53.61 శాతానికి చేరుకుంది.