Homeజాతీయ వార్తలుSuvendu Adhikari: బెంగాల్‌లో బీజేపీ యాక్షన్‌ మొదలు.. సువేందు కీలక ఆదేశాలు!

Suvendu Adhikari: బెంగాల్‌లో బీజేపీ యాక్షన్‌ మొదలు.. సువేందు కీలక ఆదేశాలు!

Suvendu Adhikari: బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తక్షణమే యాక్షన్‌ మొదలు పెట్టింది. నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల హామీలు అమలు చేసే దిశగా పావులు కదుపుతోంది. ఈమేరకు ఆదేశాలు జారీ చేస్తోంది. రెడ్‌ రోడ్‌పై నమాజ్‌ నిషేధం మొదటిది కోల్‌కతాలో రోడ్లపై నమాజ్‌ చేయడం నిషేధించింది. కోల్‌కతా పట్టణంలో ఇరుకు రోడ్ల కారణంగా ట్రాఫిక్‌ సమస్య ఉంది. అయినా కోల్‌కతాలో రోడ్లపై ముస్లింలు నమాజ్‌ చేయడంతో మరింత సమస్య ఎదురవుతోంది. ట్రైన్‌కు వెళ్లేవారు 2 […]

Suvendu Adhikari: బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తక్షణమే యాక్షన్‌ మొదలు పెట్టింది. నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల హామీలు అమలు చేసే దిశగా పావులు కదుపుతోంది. ఈమేరకు ఆదేశాలు జారీ చేస్తోంది.

రెడ్‌ రోడ్‌పై నమాజ్‌ నిషేధం
మొదటిది కోల్‌కతాలో రోడ్లపై నమాజ్‌ చేయడం నిషేధించింది. కోల్‌కతా పట్టణంలో ఇరుకు రోడ్ల కారణంగా ట్రాఫిక్‌ సమస్య ఉంది. అయినా కోల్‌కతాలో రోడ్లపై ముస్లింలు నమాజ్‌ చేయడంతో మరింత సమస్య ఎదురవుతోంది. ట్రైన్‌కు వెళ్లేవారు 2 గంటల ముందు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం సువేందు అధికారి కోల్‌కతా రెడ్‌ రోడ్‌పై నమాజ్‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఎందుకు నిషేధం?
రెడ్‌ రోడ్డు ఫోర్టు విలియంకు వెళ్లే రోడ్డు. నేతాజా విగ్రహం ఉంటుంది. మన సైన్యంకు సంబంధించిన హెడ్‌ క్వార్టర్స్‌ విలియంలో ఉంటాయి. అందుకే నమాజ్‌ నిషేధించింది. తక్షణం ఆదేశాలు అమలులోకి వచ్చాయి. మిగతా రోడ్లపైనా క్రమేపీ మిగతా వాటికి కూడా ఇది విస్తరిస్తుంది.

గోవుల స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు
గోవులను బంగ్లాదేశ్‌కు స్మగ్లింగ్‌ చేయడం జరుగుతుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అనుప్రద మండల్‌ మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. ఇతను ఆవుల స్మగ్లింగ్‌ వ్యాపారంలో కీలకం. ఏటా 3 లక్షల గోవులను సరిహద్దు దాటించడం జరుగుతంది. ఇది తృణమూల్‌ నేతలకు ఆదాయంగా మారింది. తాజాగా సువేందు అధికారి ప్రభుత్వం నిషేధించింది.

రాళ్లు విసరడంపై నిషేధం
రాళ్లు విసరడంపైనా బెంగాల్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. బెంగాలీలు, బంగ్లాదేశీయులు ఎవరైనా రాళ్లు విసిరితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బంగ్లాదేశ్‌ సరిహద్దులో నిఘా పెంచాలని నిర్ణయించింది.

స్మగ్లింగ్‌ వ్యాపారం వివరాలు
2006–07లో ఖమ్మం జిల్లాలో నిఖెల్‌తో చేసిన రూపాయి ఇస్తే రెండు రూపాయలు ఇస్తామని తెలిపారు. దీంతో బంగ్లాదేశ్‌కు తరలించి ప్లేట్లు తయారు చేసేవారు. ఇలా అనేక రకాల స్మగ్లింగ్‌ జరిగేది. స్మగ్లింగ్‌ పూర్తిగా నిలిపివేసేందుకు సరిహద్దు భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం..
కోల్‌కతా పట్టణంలో ఇరుకు రోడ్ల కారణంగా ట్రాఫిక్‌ సమస్య ఉంది. నమాజ్‌ చేయడంతో మరింత సమస్య ఎదురవుతోంది. ట్రైన్‌కు వెళ్లేవారు 2 గంటల ముందు వెళ్లాల్సిన పరిస్థితి. నమాజ్‌ నిషేధంతో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది. ప్రజలకు సౌకర్యం కల్పిస్తుంది.

బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం తక్షణమే యాక్షన్‌ మొదలు పెట్టింది. నమాజ్‌ నిషేధం, గోవుల స్మగ్లింగ్‌ నిలపడం, రాళ్లు విసరడం నిషేధం, సరిహద్దు భద్రత పెంచడం – ఇవన్నీ బీజేపీ యాక్షన్‌ ప్లాన్‌ భాగం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper