Homeక్రైమ్‌Peddapalli: టెన్త్ క్లాస్ లో ప్రేమ.. ఇప్పుడేమో ఆ బంధం.. వీరి వ్యవహారం ఎక్కడిదాకా దారి...

Peddapalli: టెన్త్ క్లాస్ లో ప్రేమ.. ఇప్పుడేమో ఆ బంధం.. వీరి వ్యవహారం ఎక్కడిదాకా దారి తీసిందంటే

Peddapalli: ఏ వయసు లో జరగాల్సిన ముచ్చట.. ఆ వయసులో జరగాలి అంటారు. అలాగే ఏ వయసులో చేయాల్సిన పని.. ఆ వయసులోనే చేయాలి. ఎందుకంటే ఒక్కసారి వయసు అనేది దారి తప్పితే.. మనసు అనేది అదుపు తప్పితే ఆ తర్వాత చాలా దారుణం జరుగుతాయి.. అటువంటిదే ఇది కూడా ఆమె పేరు అలేఖ్య. అతని పేరు వంశీ. విరిద్దరి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి.. వీరు పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఆ […]

Peddapalli: ఏ వయసు లో జరగాల్సిన ముచ్చట.. ఆ వయసులో జరగాలి అంటారు. అలాగే ఏ వయసులో చేయాల్సిన పని.. ఆ వయసులోనే చేయాలి. ఎందుకంటే ఒక్కసారి వయసు అనేది దారి తప్పితే.. మనసు అనేది అదుపు తప్పితే ఆ తర్వాత చాలా దారుణం జరుగుతాయి.. అటువంటిదే ఇది కూడా

ఆమె పేరు అలేఖ్య. అతని పేరు వంశీ. విరిద్దరి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి.. వీరు పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. కానీ అది వారు అనుకున్నంత సులభంగా విజయవంతం కాలేదు. దీంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇటీవల కాలంలో అలేఖ్య, వంశీ, వారితో పదో తరగతి చదువుకున్న స్నేహితులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఆ సమయంలో అలేఖ్య, వంశీ గత జ్ఞాపకాలను తలుచుకున్నారు.. దానిని అక్కడితోనే ఆపివేస్తే బాగుండేది.. అయితే దానిని వారు వివాహేతర సంబంధం గా మార్చుకున్నారు.. ఆ తర్వాత వారిద్దరు కలవడం కామన్ అయిపోయింది.

ఈ విషయం అలేఖ్య భర్త నవీన్ కు తెలిసింది.. వంశీ హైదరాబాదులోనే ఉంటుండడం.. అలేఖ్య కూడా అక్కడే ఉండడంతో.. ఇద్దరు కలిసి తిరిగేవారు. ఈ విషయం నవీన్ కు తెలిసి అలేఖ్య మీద దృష్టిపెట్టాడు. ఆమె వ్యవహారం తెలుసుకున్నాడు. ఇంకేముంది తన ఫ్రెండ్ ద్వారా ఒకరోజు నవీన్ వంశీకి ఫోన్ చేయించాడు. వారు ఉంటున్న ప్రాంతానికి పిలిపించాడు. నవీన్ మరో స్నేహితుడు భాస్కర్ ను అక్కడ తీసుకొచ్చాడు. వంశీని మాటల్లో పెట్టాడు. నవీన్, భాస్కర్, వంశీ పీకలదాకా మద్యం తాగారు.. ఆ మత్తులో వంశీని ఏం చేయాలో అది చేశారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టారు. కారు డిక్కీ ప్రాంతంలో పెట్టుకున్నారు. హైదరాబాద్ నగరానికి దూరంగా ఉన్న మందని అనే ప్రాంతంలో పడేశారు.. ఆ తర్వాత అలేఖ్యతో నవీన్ మామూలుగానే ఉన్నాడు.

వంశీ కుటుంబ సభ్యులు అతడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వంశీ కాల్ డేటా పరిశీలించారు. అతడి సెల్ఫోన్ సిగ్నల్ కూడా పరిశీలించి చివరికి నవీన్, అలేఖ్యను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నవీన్ ను విచారించిన పోలీసులు.. అసలు విషయాన్ని వెలికి తీశారు. ఇప్పుడు నవీన్, అలేఖ్య, భాస్కర్ జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper