Home Blog Page 276

హాలీవుడ్ లో ఫస్ట్ టైం.. టామ్ క్రూజ్ ను డైరెక్ట్ చేస్తున్న తెలుగు తేజం...ఇది మామూలు వండర్ కాదు...

Tom Cruise
Tom Cruise

Tom Cruise: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు వచ్చిన కూడా అవి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించి భారీ పాపులారిటిని సంపాదించుకుంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైతం హాలీవుడ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే వాళ్లు ప్రపంచ స్థాయి ప్రేక్షకుల్లో ఎలాంటి పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా టామ్ క్రూజ్ లాంటి నటుడుకి ప్రపంచ స్థాయి ఆదరణ లభిస్తుంది. అతనితో సినిమాలు చేయడానికి ఇతర దేశాల దర్శకులు సైతం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి దగ్గరైన ‘టామ్ క్రూజ్’ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ‘డూపెల్ గంగార్’ అనే స్పై థ్రిల్లర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి అనీష్ చాగంటి అనే తెలుగు మూలాలు ఉన్న ఒక యువ డైరెక్టర్ దర్శకుడిగా వ్యవహరించే అవకాశాలైతే ఉన్నాయి. 2018 వ సంవత్సరంలో ‘సెర్చింగ్’ అనే ఒక సినిమాతో మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు.

అందుకే ఇప్పుడు టామ్ క్రూజ్ ను సైతం డైరెక్షన్ చేసే స్థాయికి తను ఎదిగాడు. ఇక ఏది ఏమైనా కూడా హాలీవుడ్ లో దిగ్గజ హీరో అయిన టామ్ క్రూజ్ ను డైరెక్ట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

ప్రస్తుతం మన తెలుగు సినిమాలు సైతం ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో తెర్కెక్కుతున్నాయి. అయినప్పటికి ఒక తెలుగు దర్శకుడు ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతుండడం అనేది నిజంగా గొప్ప విషయం దానికి తెలుగు వాళ్ళమైన మనమందరం గర్వపడాల్సిన విషయమనే చెప్పాలి…

ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెసులు సాధించినా కూడా హాలీవుడ్ డైరెక్టర్లు సాధించిన విజయాలు అంత ఇంతా కాదనే చెప్పాలి… ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు హాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయాలనేది ఒక డ్రీమ్ గా పెట్టుకొని ఉంటారు. ఇక ఈ విషయంలో అనీష్ చాగంటి చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…

మా దేవుడు మా ఇష్టం.. మీకేంటి నొప్పి.. మన వీసా దేవుడిపై అమెరికా అక్కసు..!

Chilkur Balaji Temple
Chilkur Balaji Temple

Chilkur Balaji Temple: అగ్రరాజ్యం అమెరికాకు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఆ దేశంలో రాజకీయ నేతలు ట్రంప్‌లాగే మారిపోతున్నారు. ట్రంప్‌ అమెరికా ఫస్ట్‌ నినాదం ఒంట పట్టించుకుని అమెరికాలో ఉంటున్న విదేశీయులపై అక్కలు వెల్లగక్కుతున్నారు. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా.. నేతలు మాత్రం తాము ప్రజల కోసం ఏదో చేస్తున్నట్లు చెప్పుకోవడానికి భారత్‌ వంటి దేశాలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తాజాగా మన వీసా దేవుడిగా గుర్తింపు పొందిన చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనెటర్‌ ఎరిక్‌ ష్మిట్‌ తీవ్ర విమర్శ చేశారు. హెచ్‌–1బీ, ఎల్‌–1, ఎఫ్‌–1, ఓపీటీ వీసాల వ్యవస్థ అమెరికన్‌ మిడిల్‌ క్లాస్‌ను నాశనం చేస్తోందని ఆరోపించారు. ఆలయం చుట్టూ ’మోసపూరిత’ భక్తులు తిరుగుతున్నారని అక్కసు వెల్లగక్కారు.

చిలుకూరు ఆలయ చరిత్ర
1996లో ప్రారంభమైన చిలుకూరు బాలాజీ ఆలయం అమెరికా వీసా కోరుకున్నవారికి వస్తుందన్న నమ్మకం ప్రపంచవ్యాప్త భారతీయులను ఆకర్షిస్తోంది. 10 ఏళ్లలో 5 లక్షల మంది సందర్శకులు, వీసా మొక్కుకుని 80 శాతం మంది సాధించారని అంచనా. ఐటీ ప్రెఫెషనల్స్, ప్రధాన భక్తుల విశ్వాసం చిలుకూరు బాలాజీ. హెచ్‌–1బీ వీసాల్లో బారత ఆధిపత్యం కొనసాగుతోంది. 70 శాతం భారత ఐటీ వర్కర్లు టీసీఎస్, ఇన్‌ఫోసిస్, విప్రో కోటాలోనే 50 శాతం పొందుతున్నారు. తాజాగా మారిన వీసా నిబంధనలతో మిడిల్‌ క్లాస్‌ జాబ్స్‌ 20 శాతం తగ్గాయి.

టాలెంట్‌ వార్‌లో సంస్కృతికపై దాడి..
భారతీయులు ఐటీలో సూపర్‌ టాలెంటెడ్‌. తక్కువ వేతనాలతో ఎక్కువ పనిచేస్తారు. అమెరికన్లకు ఇది చేతకాదు. అందుకే అక్కడి కంపెనీలు భారతీయులపై ఆసక్తి చూపుతాయి. అయితే ట్రంప్‌ అమెరికా ఫస్ట్‌ నినాదం ఇటు విదేశీయులతోపాటు ముఖ్యంగా భారతీయులు, ఐటీ కంపెనీలపై పడింది. ట్రంప్‌ నిబంధనల కారణంగా చాలా మంది కెనడా, ఆస్ట్రేలియా, యూకేకే వెళ్తున్నారు. అయితే అమెరికా నేతలు మాత్రం తమ చేతగాని తనన్నా అంగీకరించకుండా మన దేవుళ్లపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.

వీసా దేవుడు వివాదం భారత–అమెరికా టాలెంట్‌ వార్‌కు సంకేతం. భారతదేశం స్వయం–నిర్భరతపై దృష్టి పెట్టి, గ్లోబల్‌ మొబిలిటీ అవకాశాలను విస్తరించాలి. అమెరికా మెరిట్‌–బేస్డ్‌ సిస్టమ్‌కు మారితే రెండు దేశాలకు ప్రయోజనం.

పెద్ది మూవీ రివ్యూ ఇచ్చేసిన సుకుమార్... అదేంటి అలా చెప్పాడు...

Sukumar Review On Peddi
Sukumar Review On Peddi

Sukumar Review On Peddi: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోలందరు ఎవరి పంథాలో వాళ్ళు ముందుకు దూసుకెళ్తుతూ వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ సైతం డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను గ్లోబల్ స్టార్ గా అవతరించిన తర్వాత ఆయనకు సరైన సక్సెస్ అయితే రాలేదు. గేమ్ చేంజర్ సినిమాతో ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేకపోయాడు. అయితే ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంతో ఉన్నాడు. జూన్ 4వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద డైరెక్టర్ సుకుమార్ తన మొదటి రివ్యూ ఇచ్చేశాడు.రీసెంట్ గా ఈ సినిమా చూసిన ఆయన ఈ మూవీ చాలా అద్భుతంగా ఉందని ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పాడు. అలాగే సెకండాఫ్ లో వచ్చే కుస్తీ ఫైట్ సినిమా మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలబోతుందట.

క్లైమాక్స్లో రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని కూడా చూడబోతున్నాం అంటు ఆయన తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడు. మొత్తానికైతే ఈ సినిమా మీద సుకుమార్ చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక బుచ్చిబాబు సైతం ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలని కూడా స్టార్ట్ అయినట్లు చేరిపోతారనే ఉద్దేశ్యంతో చాలా వరకు స్పెషల్ కేర్ తీసుకొని మరి ఈ సినిమాని చిత్రీకరించాడు…

ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో ఉన్న భారీ రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరొక 20 రోజులపాటు వేచి చూడాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ క్రేజ్ తార స్థాయిలో ఉంది. కాబట్టి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ను సాధిస్తే తను తాను ఇండియాలో నెంబర్ వన్ రేస్ లో మరింత ముందుకు వస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

'పెద్ది' చిత్రంలో నటించేందుకు ఒక్కొక్కరు తీసుకున్న రెమ్యూనరేషన్స్ లిస్ట్ ఇదే.

Peddi Movie
Peddi Movie

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం సరిగ్గా మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఎదో ఒక అప్డేట్ సోషల్ మీడియా లో లీక్ అవుతూ బాగా వైరల్ అవుతోంది. మేకర్స్ కూడా ఈ చిత్రం పై మరింత బజ్ పెంచడానికి రోజుకి ఒక అప్డేట్ విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా నిన్న ఈ చిత్రం లో ప్రధాన పాత్ర పోషించిన శివన్న క్యారెక్టర్ కి సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన గౌర్ నాయుడు అనే క్యారెక్టర్ చేశాడు. ఈ గ్లింప్స్ వీడియో కి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు కూడా ఎదో ఒక క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ , లేదా గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు మేకర్స్.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం కోసం దాదాపుగా 86 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నది టాక్. ‘గేమ్ చేంజర్ ‘ చిత్రానికి రామ్ చరణ్ దాదాపుగా 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం అయ్యింది. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం తో , ఈ చిత్రానికి రెమ్యూనరేషన్ తగ్గించినట్టు తెలుస్తోంది. ఒకవేళ పెద్ది హిట్ అయితే లాభాల్లో కొంత వాటాలు రావొచ్చు. అదే విధంగా ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుందట. అదే విధంగా ఈ చిత్రం లో ఐటెం సాంగ్ చేసిన శృతి హాసన్ దాదాపుగా 3 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

ఇకపోతే ఈ చిత్రం మీర్జాపూర్ ఫేమ్ దివ్యేన్దు కీలక పాత్ర పోషించాడు. ఈయన మున్నై భాయ్ గా యూత్ ఆడియన్స్ లో ఎంత మంచి క్రేజ్ తెచ్చుకున్నాడో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించినందుకు గాను ఆయన 3 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్. అదే విధంగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ చిత్రం లో రామ్ చరణ్ కి కుస్తీ కోచ్ గా కనిపించాడు. ఆయన దాదాపుగా 5 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం లో జగపతి బాబు అప్పలసూరి అనే కీలక పాత్ర పోషించాడు. అందుకు ఆయన రెండు కోట్ల రూపాయిలు తీసుకున్నట్టు టాక్. ఇక డైరెక్టర్ బుచ్చి బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు గాను 2 కోట్ల రూపాయిల అడ్వాన్స్ తీసుకున్నాడని , ఒకవేళ సినిమా హిట్ అయితే 10 కోట్ల వరకు ఆయనకు రెమ్యూనరేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ముందుగానే నైరుతి.. ఎల్ నినో ప్రభావం లేనట్టేనా..

Monsoon Update AP
Monsoon Update AP

Early Southwest Monsoon: దేశ ప్రజలకు చల్లటి కబురు. ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. రేపటికి అండమాన్ కు తాకనున్నాయి. క్రమేపి కేరళ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. సాధారణంగా మే 20 తర్వాత అండమాన్ కు.. జూన్ 1 నాటికి ఏపీకి రుతుపవనాలు వస్తుంటాయి. కానీ ఈ ఏడాది ముందుగానే రుతుపవనాల రాకతో వర్షాలు ప్రారంభం అవుతాయి. ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండవన్న హెచ్చరికల నేపథ్యంలో.. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడం ఉపశమనం కలిగించే విషయం. మరో రెండు మూడు రోజుల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

* అల్పపీడనంతో అనుకూలం..
ప్రస్తుతం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. గురువారం నాటికి ఈశాన్యంగా పయనించి కోస్తాంధ్ర, తమిళనాడు తీరాల వైపు మళ్ళింది. వచ్చే 36 గంటల్లో ఇది వాయుగుండం గా మారనుంది. తీవ్ర అల్పపీడన ప్రభావంతో భూమధ్య రేఖ మీదుగా బలమైన తేమగాలులు.. హిందూ మహాసముద్రం దిశగా వీస్తున్నాయి. ఈ అనుకూల పరిణామాలతోనే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ముందుగా కేరళను తాకి మిగతా ప్రాంతాలకు విస్తరించనున్నాయి.

* రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఎండల తీవ్రత అధికంగా ఉంది. నంద్యాల జిల్లా సంజామలలో 43.3°, కర్నూలు జిల్లా కౌతాళం లో 42.9, అనంతపురం జిల్లా తెరన్న పల్లి లో 42.8, చిత్తూరు జిల్లా రాయలపేట, కడప జిల్లా జమ్మలమడుగు లో 42.2, ప్రకాశం జిల్లా కొప్పెరపాడు లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 17 జిల్లాల్లోని 126 మండలాల్లో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదయింది. శుక్రవారం కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

దేశీయ రక్షణశక్తికి చిరునామాగా రాయలసీమ.. మోదీతో చంద్రబాబు చేస్తున్న యజ్ఞమిదీ

Rayalaseema Defence Hub
Rayalaseema Defence Hub

Rayalaseema Defence Hub: రాయలసీమ.. ఈ పేరు చెప్పగానే ఒక రకమైన అనుభూతి.. రతనాల సీమగా ఖ్యాతి. అయితే వాతావరణ దుర్భిక్ష పరిస్థితులు.. వర్షాభావ పరిస్థితులతో సరైన పంటలు పండడం లేదు. రాయలసీమ ప్రజల ఆకలి తీరడం లేదు. ఇటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం రాయలసీమ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వంతో కలిపి సంయుక్తంగా ఎన్నో పరిశ్రమలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా ఈరోజు రక్షణ రంగానికి సంబంధించి.. ఐదోతరం ఫైటర్ జెట్ ల తయారీ కేంద్రాన్ని పుట్టపర్తిలో ప్రారంభిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. రాయలసీమ చరిత్రలోనే ఇదో మైలురాయి. దేశంలోనే తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక ఐదోతరం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఇదే కావడం గమనార్హం. దేశంలో తొలి ఐదో తరం యుద్ధ విమానాల తయారీ ఇక్కడే కావడం విశేషం. ఈ భారీ ప్రాజెక్టు రాకతో ఏరోస్పేస్ హబ్ గా శ్రీ సత్య సాయి జిల్లా నిలవనుంది. అనుబంధ సంస్థల ఏర్పాటుతో భారీగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు చేస్తున్న యజ్ఞం ఇది. ఇకనుంచి రక్షణ శాఖ చిరునామాగా రాయలసీమ నిలవనుంది.

* ఐదోతరం యుద్ధ విమానాల తయారీ..
రక్షణ రంగంలోనే డిఆర్డివో, ఏడీఏలది కీలక పాత్ర. వాటి ఆధ్వర్యంలో 140 ఏఎంసీఏలను ఇక్కడ తయారు చేస్తారు. ఐదో తరం యుద్ధ విమానాల అసెంబ్లింగ్, అన్గ్రౌన్దింగ్ టెస్టింగ్ కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన రాగానే ఏపీ ప్రభుత్వం పుట్టపర్తిలో 600 ఎకరాలు కేటాయిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 7500 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా వచ్చే ఇతర యూనిట్ల ద్వారా లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే వీలుంది. వీటి కోసం మరో నాలుగు వందల ఎకరాల భూములను ప్రభుత్వం సిద్ధం చేసింది. రక్షణ రంగంలో శ్రీ సత్య సాయి జిల్లా పేరు మార్మోగనుంది.

* శ్రీ సత్యసాయి జిల్లాలో..
రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. ముఖ్యంగా శ్రీ సత్య సాయి జిల్లా ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే పాలసముద్రం వద్ద భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వెయ్యి ఎకరాల్లో.. డిఫెన్స్ సిస్టం ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఏర్పాటవుతుంది. 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇది నిర్మితం అవుతోంది. క్షిపణి వ్యవస్థలు, రాడార్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ, ఏరో స్పేస్ రంగానికి అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు.

* డ్రోన్స్ పరిశ్రమల సైతం..
కేవలం రక్షణ రంగ పరిశ్రమలు మాత్రమే కాదు.. వాటికి సంబంధించిన డ్రోన్ తయారీ సంస్థలు ఏర్పాటు కానున్నాయి రాయలసీమలో. మడకశిరలో కళ్యాణి స్ట్రాటజిక్ లిమిటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఆగ్నేయాస్త్ర ఎనర్జిటిక్ సంస్థ దాదాపు 1000 ఎకరాల్లో.. 200400 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను స్థాపించనుంది. భారత డైనమిక్స్ లిమిటెడ్ మిస్సైల్స్ సిస్టమ్స్ రంగంలో మరో 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. హెచ్ఎఫ్సీఎల్ సంస్థ మల్టీ మూడ్ హ్యాండ్ గ్రేనేడ్ తో పాటు ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీ కోసం… ఓ రక్షణ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిట ప్రోపెలెంట్స్ వార్ హెడ్స్ తయారీ లో మరో 500 రూపాయల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అయితే ఏకంగా డ్రోన్స్ ప్రాజెక్టులు భారీగా తరలిరావడం చూస్తుంటే.. రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయి అన్నమాట.

ఇది రాయలసీమ కాదు.. ఇక ’రక్షణ సీమ’.. మోదీ, చంద్రబాబు అలా మార్చేస్తున్నారు

Rayalaseema Defence Hub
Rayalaseema Defence Hub

Rayalaseema Defence Hub: ఒకప్పుడు రాయలసీమలో రత్నాలు పండేవంటారు. తరువాత ఆ స్థానాన్ని వాణిజ్య పంటలు దక్కించుకున్నాయి. కానీ కరువు సీమలో పంటలు పండాలంటే సాగునీరు అవసరం. ఆ అవసరాన్ని గుర్తించారు సీఎం చంద్రబాబు. సాగునీటిని రాయలసీమకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నదుల అనుసంధానం తో పాటు పట్టిసీమ ప్రాజెక్టు.. రాయలసీమ ప్రత్యేక ప్రాజెక్ట్.. గోదావరి,కృష్ణా జలాల తరలింపు వంటి ఆలోచనతో ఉన్నారు. ఒకవైపు ఆ ప్రయత్నం జరుగుతుండగానే.. పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చూస్తున్నారు రాయలసీమలో. తయారీ రంగ పరిశ్రమలు రాష్ట్రంలో రాయలసీమను అగ్రగామిగా నిలపాలని చూస్తున్నారు. అపారమైన భూ వనరులు ఉన్న రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచవచ్చని భావిస్తున్నారు.

* ఎందరో ముఖ్యమంత్రులు అయినా..
రాయలసీమ నుంచి ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ పరిశ్రమల స్థాపనకు ఎవరు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ చంద్రబాబు మాత్రం రాయలసీమపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తయారీ రంగ పరిశ్రమల హబ్ గా మార్చాలని చూసారు. తిరుపతిలోని శ్రీ సిటీకి పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. అదే స్ఫూర్తితో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం వెయ్యి ఎకరాల భూమిని సమీకరిస్తున్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి అనేది చేసి చూపించాలని చూస్తున్నారు.

* ఐటీ హబ్ గా విశాఖ..
విశాఖను ఇప్పటికే ఐటీ హబ్ గా మార్చే ప్రయత్నంలో కొంత సక్సెస్ అయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు అవుతోంది. మరోవైపు తాజాగా రిలయన్స్ గూగుల్ డేటా సెంటర్ కూడా విశాఖకు చెంతనే.. విజయనగరంలో ఏర్పాటు అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటికి భూములు కేటాయిస్తూ నిన్ననే క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. తద్వారా మరిన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయనేది ఒక అంచనా. ఉభయగోదావరి తో పాటు కృష్ణా గుంటూరు కలిపి కోస్తాంధ్రలో.. అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు మరిన్ని మౌలిక వసతుల కల్పన, విద్యాసంస్థలతో పాటు ఇతర సంస్థల ఏర్పాటుతో ఆ ప్రాంతానికి సైతం న్యాయం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ ప్రయత్నం కొంతవరకు వర్కౌట్ అయింది. అమరావతి కోస్తాంధ్రకు మణిహారంగా నిలవనుంది.

* ప్రధాని మోదీ సహకారం..
అయితే ఈ మొత్తం రాష్ట్రాభివృద్ధి విషయంలో సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ సహకారం అందుతోంది. గత అనుభవాల దృష్ట్యా ఇతర రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి.. రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సీఎం చంద్రబాబు సైతం.. ప్రధాని నరేంద్ర మోడీ సహకారం తీసుకుంటున్నారు. అయితే గతానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ సహకారం పుష్కలంగా అందుతోంది రాష్ట్ర ప్రభుత్వానికి. అంతర్జాతీయ సంస్థలు వచ్చేందుకు అవసరమైన అనుమతులతో పాటు కొన్ని రకాల మినహాయింపులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దక్కుతోంది. కేవలం కేంద్రం డేటా పాలసీని మార్చడం వల్లే ఏపీకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పుడు రక్షణ రంగం తో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల తాలూకా ప్రాజెక్టులు రాయలసీమలో కొలువు తీరుతున్నాయి. నిజంగా చంద్రబాబు, మోదీ కాంబో తోనే ఇది సాధ్యమవుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఉత్తర తెలంగాణకు గ్లోబల్‌ హబ్‌గా కరీంనగర్‌.. ఓఆర్‌ఆర్‌ కీలక మైలురాయి!

Karimnagar ORR
Karimnagar ORR

Karimnagar ORR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లకు ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మూడు ఓఆర్‌ఆర్‌లతో హైదరాబాద్‌ సులభంగా అనుసంధానం అవుతుంది. సుడా మాస్టర్‌ ప్లాన్‌లో కేఎన్‌ఆర్‌ ఓఆర్‌ఆర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఉత్తర తెలంగాణ అభివృద్ధికి చారిత్రక మలుపు. 120 కి.మీ. పొడవు, రూ.15 వేల కోట్ల బడ్జెట్‌తో 2028 నాటికి పూర్తి చేయాలని అంచనా. ఇప్పటికే రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది. కేఎన్‌ఆర్‌ సిటీ సెంటర్‌ను చుట్టిముట్టిన 8–లేన్‌ హైవే నిర్మిస్తారు.

ప్రాజెక్ట్‌ విశేషాలు
కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ ఐటర్‌ రింగ్‌రోడ్‌ హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ కారిడార్‌తో లింక్‌ అవుతుంది. వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు 45 నిమిషాల దూరం మాత్రేమ ఉంటుంది. ఆరు జంక్షన్లు, ఫ్లై ఓవర్లు, లాండ్‌ స్కేపింగ్‌తో రూపొందుతుంది. భూసేకరణ 70 శాతం పూర్తయింది. దీంతో హైవేలపై రద్దీ 40 శాతం తగ్గుతుంది. లాజిస్టిక్స్‌ ఖర్చు 20 శాతం తగ్గుతుంది. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్‌ హబ్‌గా కేఎన్‌ఆర్‌ లక్ష మందికిపైగా ఉద్యోగాలు వస్తాయి. ల్యాండ్‌ రేట్లు 25–40 శాతం పెరగడంతో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు వెలుస్తాయి.

హైదరాబాద్‌ కేంద్రీకృత అభివృద్ధికి ప్రత్యామ్నాయంగా కేఎన్‌ఆర్‌ ఉద్భవిస్తోంది. రాష్ట్ర జీడీపీ 12 శాతం ఉంది. యువతకు అవకాశాలు, మైగ్రేషన్‌ తగ్గుదల. అయితే, భూసేకరణ వివాదాలు, పర్యావరణ ప్రభావాలు, రైతుల పునరావాసం మేనేజ్‌ చేయాలి. రేవంత్‌ ప్రభుత్వం ఇది ’ఉత్తర తెలంగాణ రిసర్జెన్స్‌’గా చూపిస్తోంది.

బెంగాల్‌లో టీఎంసీ ‘టోల్‌’ తీస్తున్న సువేందు సర్కార్‌.. అజ్ఞాతంలోకి వెళ్తున్న బడా నేతలు!

West Bengal Politics
West Bengal Politics

West Bengal Politics: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ప్రజలు చిత్తుగా ఓడించారు. 205 స్థానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 15 ఏళ్ల నరకం నుంచి బయట పడాలన్న కసితో ప్రజలు ఓట్లు వేశారు. టీఎంసీ పాలనలో సహించిన అన్యాయాలు భూఆక్రమణలు, ఆలయ మూసివేతలు, బడులను పార్టీ కార్యాలయాలుగా మార్చడం వంటి ఘటనలపై ఇప్పుడు ప్రజల ప్రతీకారం తీర్చుకుంటున్నారు.

ప్రజల్లో తగ్గని కోపం..
ఎన్నికల్లో టీఎంసీని ఓడించినా ఆ పార్టీ, నేతలపై ప్రజల్లో కోపం ఇంకా తగ్గలేదు. దీంతో గతంలో తమను ఇబ్బంది పెట్టిన నేతలు, నాయకులు, లీడర్లపై ప్రజలు తిరగబడుతున్నారు. దాడులు చేస్తున్నారు. ‘కట్‌ మనీ’ వసూళ్లు చేసినవారిని గురిచేస్తున్నారు. బీజేపీ నేతలు ఇలాంటి ప్రజలకు మద్దతు ఇస్తూ, ’ప్రజల న్యాయం’గా చూపిస్తున్నారు. ఇది టీఎంసీ గ్రామ స్థాయి నెట్‌వర్క్‌ను బలహీనపరుస్తోంది.

బడా నేతలపై దాడులు..
ఇక బడా నేతలు అయిన బోస్, షమీమ్‌ అహ్మద్‌ ఇళ్లపై పోలీసులు, ఈడీ దాడులు చేశారు. పోలీసుల దాడుల్లో ఆయుధాలు దొరికాయి. షమీమ్‌ పరారీలో ఉన్నాడు. ఇక మమతా ’రైట్‌ హ్యాండ్‌’, ఫాల్టా ఎమ్మెల్యే. జహంగీర్‌ ఖాన్‌ పరిస్థితి దారుణంగా ఉంది. ఇతను ఎన్నికల సమయంలో బీజేపీ గుర్తుపై ప్లాస్టర్‌ వేసి మోసం చేశాడు. ఎన్నిక ఆలస్యమైంది. ఇప్పుడు ప్రచారం ఆపి, జెండా కూడా దాచాడు. జర్నలిస్టు, మేధావి అయిన గర్గ్‌ చటర్జీ ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన బాత్‌రూంలో దాక్కున్నాడు. మహిళ వేషధారణలో పారిపోయే ప్రయత్నం చేశాడు. రాజ్యసభ ఎంపీ కునాల్‌ ఘోష్‌ ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నాడు.

ఆర్థిక మోసాలపై కఠిన చర్యలు
టీఎంసీ నేతలు గోవుల అక్రమ రవాణా (విలువ రూ.100 కోట్లు), టోల్‌గేట్‌లు, ఇష్టానుసార వసూళ్లతో పార్టీ ఖజానా నింపుకున్నారు. బీఎస్‌ఎస్‌ అలర్ట్‌తో 30కి పైగా గోవుల అక్రమ రవాణాలు గ్యాంగ్ లు ప ట్టుబడ్డాయి. సువేందు అధికారి ఇల్లీగల్‌ బారికేడ్‌లు, టోల్‌గేట్‌లు మూసివేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

బీజేపీ ప్రభుత్వం టీఎంసీ గ్రౌండ్‌లెవల్‌ స్ట్రక్చర్‌ను డీమాన్‌టిల్‌ చేస్తోంది. ప్రజల కోపం, ఏజెన్సీల చర్యలు కలిసి టీఎంసీను ఒత్తిడికి తీసుకువస్తున్నాయి. మమతా బెనర్జీ దగ్గరి నేతల పరారీతో టీఎంసీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోంది. సువేందు ప్రభుత్వం చట్టబద్ధ చర్యలు తీసుకుంటే, ఇది సానుకూల మార్పుగా మారవచ్చు. లేకపోతే అల్లర్లు మరింత పెరుగుతాయి.

కొడాలి నానిని రెడీ చేసిన జగన్!

Kodali Nani And YS Jagan
Kodali Nani And YS Jagan

Kodali Nani And YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అవకాశం ఉన్నంతవరకు కూటమి పార్టీల్లో చేరిపోయారు. అయితే ఆ ఛాన్స్ లేని వారంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు. కానీ చాలామంది నేతలు పెద్దగా యాక్టివ్ గా లేరు. గతంలో దూకుడుగా ఉన్న నేతలు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ పాటిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని అయితే రాజకీయాలకు దూరంగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు. కీలక చర్చలు జరిపారు. దీంతో పార్టీలో కొడాలి నాని యాక్టివ్ అవుతారు అన్న టాక్ వినిపిస్తోంది. గుడివాడలో మాత్రమే కాదు కృష్ణా జిల్లా పార్టీ బాధ్యతలను తీసుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే ఆయన మునుపటి మాదిరిగా దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది.

* ఎన్నికల్లో ఓటమి తర్వాత..
మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి ఐదోసారి పోటీ చేసిన కొడాలి నాని కి భారీ ఓటమి ఎదురయింది. అప్పటివరకు తనను ఓడించే నాయకుడు ఎవడు అంటూ బహిరంగంగానే సవాల్ విసురుతూ వచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు తో పాటు లోకేష్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చే బూతులు జుగుప్సాకరంగా ఉండేవి. ఆయన వ్యాఖ్యలను ఎక్కువ మంది తప్పు పట్టేవారు. అయితే ఏపీలో వైసిపి ఓడిపోయి కూటమి రావడంతో కొడాలి నాని కి షాక్ తప్పలేదు. ఆయన అరెస్టు కచ్చితంగా ఉంటుందన్న ప్రచారం నడిచింది. కానీ ఎంత లోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండె నొప్పితో ముంబైలోని ఓ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పొందారు. తరువాత కొద్ది రోజులపాటు హైదరాబాదులోని ఇంటికి పరిమితం అయ్యారు. కోలుకోవడంతో తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతారన్న టాక్ వినిపించింది. తాజాగా విదేశీ పర్యటన నుంచి తాడేపల్లి కి చేరుకున్న జగన్మోహన్ రెడ్డిని కలిశారు కొడాలి నాని. వారిద్దరి మధ్య కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

* కూటమిని అడ్డుకోవాలంటే..
ప్రస్తుతం కృష్ణా జిల్లాలో టిడిపి కూటమి బలంగా ఉంది. చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటువంటి సమయంలో సరైన నాయకత్వం అవసరం. అందుకే కొడాలి నానిని జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో క్రియాశీలకం కావడంతో పాటు కృష్ణాజిల్లా బాధ్యతలను తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించారట. మునుపటిలా దూకుడుగా వ్యవహరించాలని ఆదేశించారట. అయితే అందుకు నాని సరేనన్నారట. అయితే అరెస్టు ఉంటుందన్న భయంతో కొడాలి నాని ఉన్నారట. ఎందుకంటే ఆయన స్నేహితుడు వల్లభనేని వంశీ మోహన్ దాదాపు 150 రోజులపాటు జైలు జీవితం అనుభవించారు. అనారోగ్యానికి గురయ్యారు. తనకు అటువంటి పరిస్థితి వస్తుందని కొడాలి నాని కి తెలుసు. అందుకే అధినేత జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నట్టు యాక్టివ్ అవుతారా? లేదా? అనేది చూడాలి.

చంద్రబాబు,లోకేష్ కు రోజా సలహా!

Roja
Roja

Roja Comments On Lokesh: అమ్మ పెట్టదు.. అడుక్కొని తినివ్వదు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. దేశవ్యాప్తంగా పొదుపు మంత్రం పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు పాటించాలని సూచించారు. వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని ప్రత్యేక విమానాల్లో కాదు.. రైళ్లలో ప్రయాణం చేయాలని సూచించారు.అయితే దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది ఏంటి? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఏంటి?? అనేది పొలిటికల్ సర్కిల్లో ఒక హాట్ టాపిక్ అయ్యింది. నిన్ననే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు తమ కాన్వాయ్ లను తగ్గించుకున్నారు. గతం కంటే చాలా వాహన శ్రేణిని తగ్గించారు.

* కాన్వాయ్ ల తగ్గింపు పై
ఏదైనా మంచి పని చేస్తే అభినందించాలి. లేకుంటే మౌనంగా ఊరుకోవాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయడం లేదు. మాజీ మంత్రి రోజా స్పందించారు కాన్వాయ్ ల తగ్గింపు పై. మంచి విషయమే అయినా.. ఇప్పుడు ఆమె మరో సలహా ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు ను వాయిదా వేయాలని సూచిస్తున్నారు. వాయిదా వేసి పొదుపు పాటించవచ్చు కదా అని చంద్రబాబుతో పాటు లోకేష్ కు సలహా ఇస్తున్నారు. ప్రభుత్వపరంగా దుబారా ఖర్చు తగ్గించారు. పార్టీ కార్యక్రమంగా మహానాడు ను నిర్వహిస్తున్నారు. అది వారి సొంత పార్టీ నిర్ణయం. దానిని కూడా విమర్శిస్తే ఎలా? అనే ప్రశ్న వినిపిస్తోంది. అందులో కడుపు మంట తప్ప మరొకటి కనిపించడం లేదు.

* అదో సంప్రదాయంగా..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ జన్మదినం, జయంతి సందర్భంగా ఏటా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికలతో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది నెల్లూరులో మహానాడు నిర్వహిస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో తెలుగుదేశం పార్టీని ఫాలో అయ్యింది. టిడిపి మహానాడు మాదిరిగానే ప్రతి సంవత్సరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేస్తామన్నది అప్పట్లో ఆ పార్టీ నుంచి వచ్చిన ప్రకటన. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి నిర్వహించి వదిలేసారు. కానీ టిడిపి అలా కాదు. దానిని ఒక ఆనవాయితీగా కొనసాగిస్తోంది. తమ పార్టీ ప్లీనరీ విషయంలో రోజా అధినేత జగన్మోహన్ రెడ్డిని అడగలేరు కానీ.. టిడిపి మహానాడు ను వాయిదా వేయమని సూచిస్తున్నారు. దీనిపై టిడిపి శ్రేణులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నాయి రోజాపై.

రాయలసీమనూ వదలని చంద్రబాబు ప్రభుత్వం

Chandrababu Naidu Rajya Sabha Selectio
Chandrababu Naidu Rajya Sabha Selectio

Chandrababu Rayalaseema: రాయలసీమ సరికొత్త దిశగా ఆవిష్కృతం అవుతోంది. తయారీ రంగ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. పుట్టపర్తిలో రక్షణ శాఖకు సంబంధించి యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు నిర్మితం కానుంది. దేశంలోనే తొలి పరిశ్రమగా ఇది ఏర్పాటు కానుంది. వేలకోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమ ఏర్పాటు అవుతోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఏర్పాటు కానున్న పరిశ్రమలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు. నిజంగా ఇది రాయలసీమకు శుభపరిణామమే.

* తయారీ రంగ పరిశ్రమలు..
తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రను ఐటి హబ్ గా మార్చాలని చూస్తోంది. కోస్తాంధ్రకు సంబంధించి అమరావతి రాజధానిలో సైతం భారీగా పెట్టుబడులు పెట్టేలా రూపకల్పన చేస్తోంది. రాయలసీమకు సంబంధించి తయారీ రంగ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించింది. ఇప్పటికే తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. కర్నూలులో డ్రోన్ హబ్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రాయలసీమ జిల్లాలు అటు చెన్నైకు, ఇటు బెంగళూరుకు దగ్గరగా ఉండడంతో కలిసి వచ్చే అంశం. తయారీ రంగ పరిశ్రమలు రావడంతో అనుబంద పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం.

* అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం..
రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో వెళ్తోంది. మూడు ప్రాంతాలు సమాన అభివృద్ధి కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. విశాఖను ఐటి హబ్ గా మార్చాలని చూస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. మరోవైపు విజయనగరం జిల్లాలో లక్ష కోట్ల పెట్టుబడితో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్రవ్యాప్తంగా అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. అనకాపల్లి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు వడివడిగా సాగుతోంది. అయితే మధ్యలో కోస్తాంధ్రలో సైతం వీలైనంత పరిశ్రమల ఏర్పాటు జరుగుతోంది. అయితే రాయలసీమ విషయంలో మాత్రం తయారీ రంగ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. అక్కడ భూముల సేకరణతో పాటు ఆయా కంపెనీలకు ప్రోత్సాహకాలు, భూ సమీకరణ సులువుగా జరుగుతుండడంతో పరిశ్రమల ఏర్పాటుకు ఎటువంటి అడ్డంకులు ఉండడం లేదు. భవిష్యత్తులో సైతం మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

ఈ ఐదు రాశుల ఉద్యోగులకు గుడ్ న్యూస్..

Today 15 July 2026 Horoscope
Today 15 July 2026 Horoscope

Today 15 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా లాభాలు పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి వస్తుంది. ఒక పనిని పూర్తి చేయడానికి స్నేహితుల సహాయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగానికి కోసం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. అనుకోకుండా శుభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెద్దల సహాయంతో కొత్త పెట్టుబడులు పెడతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు విదేశాల నుంచి శుభవార్తను వింటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో ఆహ్లదంగా ఉండగలుగుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండాలి

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు తల్లిదండ్రులపై ప్రత్యేక దృష్టి పెడతారు. విద్యార్థులు అనుకోకుండా పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అధికారుల మద్దతుతో ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. వ్యాపారులు లాభాలు పొందాలంటే కష్టపడాల్సి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఒక శక్తివంతమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారంలో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకుంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కష్టమైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. గతంలో పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు. అనుకోకుండా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవం పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులనుంచి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అదనంగా జీతం పెరిగే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త అవకాశాలను పొందుతారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు అనుకోకుండా లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడి పెట్టే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు పదోన్నతులు పొందడంతో సంతృప్తిగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గతంలో మొదలు పెట్టిన పనులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో శుభవార్తను అందుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించడం మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి. స్నేహితులతో సరదాగా ఉంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం లభిస్తుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టే పెట్టుబడుల నుంచి అధిక ఆదాయం పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

రాకాసి గాలులు.. మనుషులను ఎత్తుకుపోయాయి.. 89 మంది ప్రాణాలు తీశాయి.. వైరల్ వీడియోలు

Uttar Pradesh Storms
Uttar Pradesh Storms

Uttar Pradesh Storms: సరిగ్గా కొంత కాలం క్రితం తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలోని మేడారంలో ప్రచండమైన గాలులు వీచాయి. వాటి తీవ్రతకు దట్టమైన అడవులు సైతం నేల కూలిపోయాయి. పెద్ద పెద్ద వృక్షాలు వేర్లతో సహా బయటికి వచ్చాయి. అసలు ఇలా ఎందుకు జరిగిందనేది ఇప్పటికీ తెలియ రాలేదు. దాని వెనుక కారణం తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేదు.

మేడారంలో వీచిన ప్రచండ గాలుల మాదిరిగానే ఉత్తరప్రదేశ్లో కూడా భారీగా గాలులు వీచాయి. అంతేకాదు పెను బీభత్సం అనే స్థాయిలో వర్షాలు కురిసాయి. ఫలితంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఒక్కరోజే 89 మంది చనిపోయారు. వాస్తవానికి మే నెలలో ఉత్తర ప్రదేశ్ లో అంతగా వర్షాలు కురిసే అవకాశం లేదు. కాకపోతే ఈదురుగాలులు మాత్రం వీస్తాయి.. కానీ ఎన్నడూ లేనంతగా పలు జిల్లాలలో విపరీతంగా గాలి వీచింది. వర్షాలు కూడా అదే స్థాయిలో కురిశాయి. పిడుగులు పడ్డాయి. వడగండ్లు చెప్పనలవి కాకుండా పడ్డాయి. దీంతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైంది. ఏకంగా 89 మంది చనిపోయారు. 53 మంది గాయపడ్డారు. 114 పశువులు చనిపోయాయి. 87 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి.

ప్రయాగ్ రాజ్ జిల్లాలో 21 మంది.. బదోహి ప్రాంతంలో 16.. ఫతేపూర్ లో 11 మంది.. సంత్ రవిదాస్ నగర్ 14 మంది.. మీర్జాపూర్ లో పదిమంది చనిపోయారు.. విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడే విరిగిపోయాయి. పెద్ద పెద్ద వృక్షాలు నేల కూలిపోయాయి.

మే నెలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. చాలా ప్రాంతాలలో 40 కి మించి టెంపరేచర్ ఉంటుంది. అయితే ఈ టెంపరేచర్ ఇటీవల కాలంలో పెరిగిపోయింది.. ఆ టెంపరేచర్ అలా పెరిగిపోవడంతో భూమి ఉపరితలంపై ఉన్న గాలి విపరీతంగా వేడెక్కింది. అది వేగంగా కదిలింది. అనేక దిశలలో వ్యాపించింది. తడి గాలిని పూర్తిగా లాగేసుకుంది. దీంతో ఇవి రెండు కలిసిపోయి ఆకాశంలో చాలా ఎత్తుకు చేరుకున్నాయి. సరదాగా అకస్మాత్తుగా మేఘాలు ఏర్పడ్డాయి. అవి ఆకాశము మొత్తం విస్తరించిపోయాయి. వెంటనే వర్షాలు కురవడం మొదలైంది. గాలులు విపరీతంగా వీయడంతో వడగండ్లపడ్డాయి. పిడుగులు కూడా పడ్డాయి.

యూపీలో ఇటువంటి వాతావరణం గతంలో ఎప్పుడు చూడలేదని అధికారులు అంటున్నారు. దీనిని బట్టి ప్రకృతి ఏదో ప్రమాదకరమైన సంకేతాలు ఇస్తున్నట్టు అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బరేలి జిల్లా ప్రాంతంలో గాలుల తీవ్రతకు ఒక వ్యక్తి అమాంతం ఎగిరిపడ్డాడు. గాలి విపరీతంగా రావడంతో అతడు రేకుల షెడ్డుని పట్టుకున్నాడు. అయితే గాలి తీవ్రతకు రేకులతో సహా అతడు ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గా ఉందని ఉత్తరప్రదేశ్ అధికారులు చెబుతున్నారు.

ఐటీ ఉద్యోగుల మీద పగబట్టిన అమెరికన్ కంపెనీలు.. మరీ ఇంత కర్కశత్వమా..

US IT Layoffs
US IT Layoffs

US IT Layoffs: ఇన్నాళ్లపాటు పనిచేయించుకున్నాయి. పని గంటలను పెంచి మరీ పని చేయించుకున్నాయి. ఇప్పుడు మెడ పట్టుకొని బయటికి గెంటి వేస్తున్నాయి. పని చేయించుకున్న సంస్థలు.. పనిలేదని దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ముందస్తు హెచ్చరిక లేకుండా.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా.. దయచేసి మీరు వెళ్ళండి అంటూ నిర్దయగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లపాటు పనిచేసిన ఉద్యోగులు కన్నీళ్ల పర్యంతమవుతూ సంస్థలను వదిలి వెళ్తున్నారు.

కొంతకాలంగా అమెరికన్ ఐటీ కంపెనీలు ఉద్యోగుల మీద ఎటువంటి దయ చూపించడం లేదు. పైగా దారుణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. గడిచిన ఐదు సంవత్సరాలుగా లక్షల మంది ఉద్యోగాలను తొలగించాయి కంపెనీలు. అది సరిపోదు అన్నట్టు తాజాగా 4,000 మంది ఉద్యోగులను తొలగించాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అమెరికన్ ఐటీ కంపెనీల మీద ఐటి ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి.. మొత్తంగా ఉద్యోగులు లేకుండా పనిచేసే విధంగా అమెరికన్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయని ఐటి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా కేంద్రంగా పనిచేసే ప్రముఖ నెట్వర్కింగ్ సంస్థ సిస్కో మరోసారి ఉద్యోగుల కోతలను మొదలుపెట్టింది. ఈ త్రైమాసికల్లో ఏకంగా 4000 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది ఆ కంపెనీ మొత్తం సిబ్బందిలో ఐదు శాతం కంటే తక్కువ. దీర్ఘకాలంలో వృద్ధిని సాధించాలని.. అనేక రంగాలపై పెట్టుబడులు పెట్టాలని ఆ కంపెనీ భావిస్తోంది. అందువల్లే ఉద్యోగుల మెడ మీద కత్తి పెట్టింది. ఈ కంపెనీకి మూడవ త్రైమాసికంలో 12 శాతం వృద్ధి లభించింది. అంతేకాదు 15.8 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. అయినప్పటికీ ఈ కంపెనీ ఉద్యోగుల విషయంలో కోతలను కొనసాగిస్తూనే ఉంది.

సిస్కో వ్యవహారం ఇలా ఉంటే.. మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో పనిచేసే లింక్డ్ ఇన్ కూడా వందల సంఖ్యలో ఉద్యోగులను బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా కంపెనీ ఉద్యోగుల్లో ఐదు శాతం మందిని బయటికి పంపించాలని ప్లాన్ రూపొందించింది. ఈ లెక్కన 875 మంది ఉద్యోగులు తమ కొలువులను కోల్పోతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని.. సంస్థ గతంగా బలోపేతం అవ్వడానికి ఈ మార్పులు చేస్తున్నట్టు లింక్డ్ ఇన్ ప్రకటించింది. మరోవైపు వాల్ మార్ట్ కూడా 1000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం కనిపిస్తోంది.

ఒకవేళ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవడానికి ఇష్టపడకపోతే.. వారిని వేరే విభాగాలకు బదిలీ చేసే అవకాశం ఉంది. అమెరికాలో పరిస్థితులో ఏమాత్రం బాగోలేకపోవడం.. భవిష్యత్తు లక్ష్యాలను దృఢంగా నిర్ణయించుకోవడం.. మ్యాన్ పవర్ ను సాధ్యమైనంతవరకు తగ్గించుకోవడానికి అమెరికన్ కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్ల ఈ స్థాయిలో కోతలు అమలు చేస్తున్నాయి. అయితే ఈ కోతలు ఇక్కడితోనే ఆగవని.. వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది.

తమిళనాడు రాజకీయాల్లో 'పుష్ప 2' మేనియా.. సీఎం విజయ్ కి ఊహించని షాక్..

Pushpa 2 Dialogues In Politics
Pushpa 2 Dialogues In Politics

Pushpa 2 Dialogues In Politics: ‘పుష్ప’ సిరీస్ అనేది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక భారీ బ్లాక్ బస్టర్ సినిమా మాత్రమే కాదు , ఒక కల్చరల్ ఫినామినా అని చెప్పడం లో ఎలాంటి అతిశయం లేదు. ఈ చిత్రం లోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, డైలాగ్స్ , సన్నివేశాలు మన నిజ జీవితం పై ఎంతో ప్రభావం చూపించాయి. క్రీడాకారుల దగ్గర నుండి , రాజకీయ నాయకుల వరకు , ప్రతీ ఒక్కరు ఈ చిత్రం లోని మ్యానరిజమ్స్ ని , డైలాగ్స్ ని ఉపయోగించే వారే. అంతే కాకుండా ‘పుష్ప 2’ చిత్రం ప్రభావం తెలుగు రాజకీయాలపై ఏ రేంజ్ లో చూపించిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రం లోని ‘రప్పా రప్పా’ డైలాగ్ ని వైసీపీ నాయకులూ ఉపయోగించడం పెద్ద సంచలనం గా మారింది.

‘2029 ఎన్నికల్లో మా వైసీపీ పార్టీ అధికారం లోకి రాగానే , ఒక్కొక్కరిని గంగమ్మ తల్లి జాతర లో పొట్టేలు ని నరికినట్టు , రప్పా రప్పా నరుకుతాం’ అని ప్లకార్డులతో వైసీపీ కార్యకర్తలు ర్యాలీ చేయడం , అలా బెదిరింపుల చేసిన వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు వేయడం పెద్ద సంచనలం గా మారింది. ఇప్పుడు ‘రప్పా రప్పా’ అనే డైలాగ్ , వైసీపీ పార్టీ లేటెస్ట్ స్లోగన్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ ‘పుష్ప 2’ మేనియా తమిళనాడు రాజకీయాలను కూడా ఆవహించింది. రీసెంట్ గా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాల్లో , ప్రతిపక్ష నేత స్టాలిన్ , సీఎం విజయ్ పై కొన్ని ఘాటు విమర్శలు చేసాడు.

ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికల్లో సీఎం విజయ్ టీవీకే పార్టీ కి సంపూర్ణమైన మెజారిటీ రాలేదని , 63 శాతం మంది తమిళ ప్రజలు విజయ్ కి వ్యతిరేకంగా ఓట్లు వేశారని, మెజారిటీ రాకపోయినప్పటికీ కూడా , ఆయన ‘పుష్ప 2′ సినిమాలో మాదిరిగా ప్రతీ పార్టీ ఇంటికి ఒక డబ్బుల సోఫా పంపించి, వాళ్ళని కొనేస్తున్నాడని , ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం కాబట్టి , మేము ఈ సభ నుండి వాకౌట్ చేస్తున్నాము’ అంటూ ఆయన అసెంబ్లీ నుండి తన పార్టీ నేతలతో కలిసి బయటకు వెళ్ళిపోయాడు. అయితే ఆయన వాడిన ఈ ‘పుష్ప 2′ సోఫాలు’ డైలాగ్ ఇప్పుడు తమిళనాడు లో పెద్ద చర్చకు దారి తీసింది. అలా ఒక పక్క తెలుగు రాజకీయాలను , మరో పక్క తమిళ రాజకీయాలను ‘పుష్ప 2’ చిత్రం తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నేటి అర్థ రాత్రి నుండే OTT లోకి 'ధురంధర్ 2' గ్రాండ్ ఎంట్రీ.. ఎందులో చూడాలంటే..

Dhurandhar 2 OTT
Dhurandhar 2 OTT

Dhurandhar 2 OTT: ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన చిత్రం ‘ధురంధర్ 2: ది రివెంజ్’. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం నార్త్ లోనే కాదు , సౌత్ స్టేట్స్ లో కూడా ప్రభంజనం సృష్టించింది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రం కేవలం సౌత్ ఇండియా నుండే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక్కడి సూపర్ స్టార్స్ కి కూడా సౌత్ స్టేట్స్ నుండి ఇప్పటి వరకు ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఒక హిందీ చిత్రానికి మన సౌత్ నుండి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టడం అంటే సాధారమైన విషయం కాదు. బాలీవుడ్ సినిమాకు ఇది ఒక అరుదైన రికార్డు అని చెప్పొచ్చు.

ఇదంతా పక్కన పెడితే నేడు అర్థరాత్రి నుండి ఈ చిత్రం ఓటీటీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనుంది. మొదటి భాగం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సంచలనాలను నమోదు చేసింది. దాదాపుగా 100 రోజుల పైన నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతోంది. అంటే ‘ధురంధర్ 2’ చిత్రం విడుదలకు నెల రోజుల ముందు నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే , ‘ధురంధర్ 2’ థియేటర్స్ లో అద్భుతాలు సృష్టించి , ఇప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చే వరకు అది నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది అన్నమాట. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా , ‘ధురంధర్ 2’ కి సంబంధించిన ఓటీటీ హక్కులను తమవద్దనే ఉంచుకున్నారు జియో స్టూడియోస్ సంస్థ.

అందుకే నేడు అర్థ రాత్రి నుండి ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ తో పాటు, తెలుగు తమిళం , మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో అద్భుతాలు సృష్టించి , ‘బాహుబలి 2’ గ్రాస్ వసూళ్లను కూడా దాటి 1830 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలన సృష్టించిన ఈ సినిమా, ఓటీటీ లో ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతుందో చూడాలి. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఆడియన్స్ కంటే , హాట్ స్టార్ లో ఉండే ఆడియన్స్ చాలా ఎక్కువ . ముఖ్యంగా మన ఇండియన్స్ అత్యధిక శాతం ఉపయోహించేది హాట్ స్టార్ , కాబట్టి , ఇక్కడ ఈ చిత్రం ఎన్ని వారాలు ట్రెండ్ అవ్వబోతుందో చూడాలి.