Dhurandhar 2 OTT: ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన చిత్రం ‘ధురంధర్ 2: ది రివెంజ్’. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం నార్త్ లోనే కాదు , సౌత్ స్టేట్స్ లో కూడా ప్రభంజనం సృష్టించింది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రం కేవలం సౌత్ ఇండియా నుండే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక్కడి సూపర్ స్టార్స్ కి కూడా సౌత్ స్టేట్స్ నుండి ఇప్పటి వరకు ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఒక హిందీ చిత్రానికి మన సౌత్ నుండి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టడం అంటే సాధారమైన విషయం కాదు. బాలీవుడ్ సినిమాకు ఇది ఒక అరుదైన రికార్డు అని చెప్పొచ్చు.
ఇదంతా పక్కన పెడితే నేడు అర్థరాత్రి నుండి ఈ చిత్రం ఓటీటీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనుంది. మొదటి భాగం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సంచలనాలను నమోదు చేసింది. దాదాపుగా 100 రోజుల పైన నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతోంది. అంటే ‘ధురంధర్ 2’ చిత్రం విడుదలకు నెల రోజుల ముందు నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే , ‘ధురంధర్ 2’ థియేటర్స్ లో అద్భుతాలు సృష్టించి , ఇప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చే వరకు అది నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది అన్నమాట. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా , ‘ధురంధర్ 2’ కి సంబంధించిన ఓటీటీ హక్కులను తమవద్దనే ఉంచుకున్నారు జియో స్టూడియోస్ సంస్థ.
అందుకే నేడు అర్థ రాత్రి నుండి ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ తో పాటు, తెలుగు తమిళం , మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో అద్భుతాలు సృష్టించి , ‘బాహుబలి 2’ గ్రాస్ వసూళ్లను కూడా దాటి 1830 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలన సృష్టించిన ఈ సినిమా, ఓటీటీ లో ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతుందో చూడాలి. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఆడియన్స్ కంటే , హాట్ స్టార్ లో ఉండే ఆడియన్స్ చాలా ఎక్కువ . ముఖ్యంగా మన ఇండియన్స్ అత్యధిక శాతం ఉపయోహించేది హాట్ స్టార్ , కాబట్టి , ఇక్కడ ఈ చిత్రం ఎన్ని వారాలు ట్రెండ్ అవ్వబోతుందో చూడాలి.















తమిళనాడు రాజకీయాల్లో 'పుష్ప 2' మేనియా.. సీఎం విజయ్ కి ఊహించని షాక్..
Pushpa 2 Dialogues In Politics: ‘పుష్ప’ సిరీస్ అనేది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక భారీ బ్లాక్ బస్టర్ సినిమా మాత్రమే కాదు , ఒక కల్చరల్ ఫినామినా అని చెప్పడం లో ఎలాంటి అతిశయం లేదు. ఈ చిత్రం లోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, డైలాగ్స్ , సన్నివేశాలు మన నిజ జీవితం పై ఎంతో ప్రభావం చూపించాయి. క్రీడాకారుల దగ్గర నుండి , రాజకీయ నాయకుల వరకు , ప్రతీ ఒక్కరు ఈ చిత్రం లోని మ్యానరిజమ్స్ ని , డైలాగ్స్ ని ఉపయోగించే వారే. అంతే కాకుండా ‘పుష్ప 2’ చిత్రం ప్రభావం తెలుగు రాజకీయాలపై ఏ రేంజ్ లో చూపించిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రం లోని ‘రప్పా రప్పా’ డైలాగ్ ని వైసీపీ నాయకులూ ఉపయోగించడం పెద్ద సంచలనం గా మారింది.
‘2029 ఎన్నికల్లో మా వైసీపీ పార్టీ అధికారం లోకి రాగానే , ఒక్కొక్కరిని గంగమ్మ తల్లి జాతర లో పొట్టేలు ని నరికినట్టు , రప్పా రప్పా నరుకుతాం’ అని ప్లకార్డులతో వైసీపీ కార్యకర్తలు ర్యాలీ చేయడం , అలా బెదిరింపుల చేసిన వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు వేయడం పెద్ద సంచనలం గా మారింది. ఇప్పుడు ‘రప్పా రప్పా’ అనే డైలాగ్ , వైసీపీ పార్టీ లేటెస్ట్ స్లోగన్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ ‘పుష్ప 2’ మేనియా తమిళనాడు రాజకీయాలను కూడా ఆవహించింది. రీసెంట్ గా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాల్లో , ప్రతిపక్ష నేత స్టాలిన్ , సీఎం విజయ్ పై కొన్ని ఘాటు విమర్శలు చేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికల్లో సీఎం విజయ్ టీవీకే పార్టీ కి సంపూర్ణమైన మెజారిటీ రాలేదని , 63 శాతం మంది తమిళ ప్రజలు విజయ్ కి వ్యతిరేకంగా ఓట్లు వేశారని, మెజారిటీ రాకపోయినప్పటికీ కూడా , ఆయన ‘పుష్ప 2′ సినిమాలో మాదిరిగా ప్రతీ పార్టీ ఇంటికి ఒక డబ్బుల సోఫా పంపించి, వాళ్ళని కొనేస్తున్నాడని , ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం కాబట్టి , మేము ఈ సభ నుండి వాకౌట్ చేస్తున్నాము’ అంటూ ఆయన అసెంబ్లీ నుండి తన పార్టీ నేతలతో కలిసి బయటకు వెళ్ళిపోయాడు. అయితే ఆయన వాడిన ఈ ‘పుష్ప 2′ సోఫాలు’ డైలాగ్ ఇప్పుడు తమిళనాడు లో పెద్ద చర్చకు దారి తీసింది. అలా ఒక పక్క తెలుగు రాజకీయాలను , మరో పక్క తమిళ రాజకీయాలను ‘పుష్ప 2’ చిత్రం తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.