Home Blog Page 260

యంగ్ క్రికెటర్ తో డేటింగ్ పై శ్రీలీల షాకింగ్ కామెంట్స్.. సినిమాలకు బ్రేక్..

Sreeleela dating rumors
Sreeleela dating rumors

Sreeleela dating rumors: నిన్నటి నుండి సోషల్ మీడియా లో శ్రీలీల ప్రముఖ యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ తో డేటింగ్ లో ఉన్నట్టు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. అందుకు కారణం డీసెంట్ గా ధర్మశాల క్రికెట్ స్టేడియం లో జరిగిన ముంబై ఇండియన్స్ వెర్సస్ పంజాబ్ కింగ్స్ IPL మ్యాచ్ లో ఆమె దర్శనం ఇవ్వడమే. ఎందుకంటే శ్రీలీల కర్ణాటక ప్రాంతానికి చెందిన అమ్మాయి, ఆమె సపోర్టు కేవలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం కి మాత్రమే ఉండాలి , అలాంటిది ముంబై ఇండియన్స్ కి సపోర్టు గా వచ్చిందంటే కచ్చితంగా తిలక్ వర్మ కోసమేనని , గతం లో కూడా అనేక ముంబై క్రికెట్ మ్యాచులకు ఆమె వచ్చిందని , తిలక్ వర్మ కూడా ప్రస్తుతం ప్రేమలో ఉన్నాడు కాబట్టి , ఆయన ప్రేయసి శ్రీలీల నే అయ్యి ఉంటుందని , ఇలా ఎన్నో రకాల విశ్లేషణలు సోషల్ మీడియా లో వచ్చాయి.

అయితే ఈ విషయం పై శ్రీలీల టీం కూడా వెంటనే స్పందించింది. సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం లో అసలు ఎలాంటి నిజం లేదని , ఇప్పటి వరకు శ్రీలీల , తిలక్ వర్మ లు కనీసం కలుసుకోలేదని చెప్పుకొచ్చారు. దీంతో తిలక్ వర్మ తో డేటింగ్ రూమర్స్ కి చెక్ పడినట్టు అయ్యింది. ఇదంతా పక్కన పెడితే శ్రీలీల జోరు ఈమధ్య టాలీవుడ్ లో బాగా తగ్గిపోయింది. ఆమె చివరి చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అంతకు ముందు విడుదలైన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఈమె కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చిన చిత్రాలు కేవలం రెండు మాత్రమే, అందులో ఒకటి ‘ధమాకా’ కాగా , మరొకటి ‘భగవంత్ కేసరి’.

ఇలా వరుసగా ఫ్లాప్స్ రావడం తో ఆమెకు టాలీవుడ్ అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు భయపడుతున్నారని, ఇక టాలీవుడ్ లో శ్రీలీల కెరీర్ ఖతం అయ్యినట్టే అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేశారు. కానీ శ్రీలీలకి ఇప్పటికీ అవకాశాలు క్యూలు కడుతూనే ఉన్నాయట , స్వయంగా ఆమెనే కాస్త బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు తెలుస్తోంది. ఎందుకంటే హడావడిగా సినిమాలు ఒప్పుకొని చేయడం వల్ల ఫ్లాప్స్ వస్తున్నాయి, అందుకే ఈసారి జాగ్రత్తగా స్క్రిప్ట్ సెలక్షన్ ఉండాలని నిర్ణయం తీసుకుందట. అంతే కాకుండా రీసెంట్ గానే ఈమె MBBS డిగ్రీ పొందింది , పై చదువులు కూడా చదవాలి అనుకుంటుందట , అందుకే కొంతకాలం చదువు మీద ద్రుష్టి పెట్టాలని అనుకుంటుందట , అందుకే కొంతకాలం టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కానీ తమిళం లో రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇవి మాత్రం పూర్తి చేస్తుందట.

'ఓజీ', 'దేవర' ఓపెనింగ్స్ ని అందుకోవడం 'పెద్ది' కి కష్టమేనా..? ప్రస్తుత అడ్వాన్స్ గ్రాస్ ఎంతంటే..

Peddi movie advance bookings
Peddi movie advance bookings

Peddi movie advance bookings: మరో 17 రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం అభిమానులు దాదాపుగా ఏడాది పాటు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఎందుకంటే గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చరణ్ ఫ్యాన్స్ ని తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయేలా చేసింది. అలాంటి సినిమా తర్వాత తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ‘పెద్ది’ పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు ఆ చిత్రం నుండి వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కూడా హిట్ అవ్వడంతో , రామ్ చరణ్ ఈసారి కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడని అందరూ ఫిక్స్ అయ్యారు.

అభిమానులు అయితే ఓజీ, దేవర రికార్డ్స్ ని అవలీలగా దాటేస్తాము అంటూ సోషల్ మీడియా లో సవాళ్లు కూడా విసిరారు. కానీ ప్రస్తుతానికి ఈ సినిమాకు జరుగుతున్న ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే, ఆ రేంజ్ కి వెళ్లడం చాలా కష్టమే అనిపిస్తోంది. ఓవర్సీస్ లో బుకింగ్స్ ని మొదలు పెట్టి దాదాపుగా 10 రోజులు కావొస్తుంది , కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం కేవలం బుకింగ్స్ ద్వారా కేవలం 4 లక్షల డాలర్లు మాత్రమే రాబట్టింది. అందులో కేవలం నార్త్ అమెరికా నుండి 3 లక్షల డాలర్లు వచ్చాయి. నార్త్ అమెరికా మన టాలీవుడ్ కి కంచుకోట లాంటిది. ఇక్కడ దేవర చిత్రం 2.6 మిలియన్ డాలర్ల గ్రాస్ ని ప్రీమియర్ షోస్ నుండి రాబడితే , ఓజీ చిత్రం 3.1 మిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ఓజీ చిత్రానికి దాదాపుగా 25 థియేటర్స్ లో ఆల్ టైం రికార్డ్స్ కూడా నమోదు అయ్యాయి.

ఆ చిత్రానికి ఉన్న డిమాండ్ కి తగ్గ షోస్ ని షెడ్యూల్ చేసుంటే 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టి ఉండేది , కానీ మేకర్స్ సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్ళకపోవడం వల్ల 3.1 మిలియన్ డాలర్ల వద్దనే ఆగిపోయింది. అయితే ‘పెద్ది’ కి ప్రస్తుతం నడుస్తున్న ఊపుని చూస్తుంటే , 2 మిలియన్ డాలర్ల గ్రాస్ కి ఒక్క రూపాయి కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఇది కూడా నేడు విడుదల అవ్వబోయే థియేట్రికల్ ట్రైలర్ ఆకట్టుకుంటేనే. ఇక ప్రస్తుతం ఉన్న డిమాండ్ ని బట్టి చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 120 నుండి 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చేలాగా అనిపిస్తున్నాయి. ఓజీ, దేవర చిత్రాలకు వరల్డ్ వైడ్ గా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ‘పెద్ది’ చిత్రం క్రేజ్ రాబోయే రోజుల్లో పెరగొచ్చు , తగ్గొచ్చు ఏదైనా జరగొచ్చు.

ప్రభాస్ మేక్ ఓవర్ అదుర్స్.. ఒక్కసారిగా 'మిర్చి' కాలానికి వెళ్లిపోయాడుగా.. వీడియో వైరల్..

Prabhas makeover viral video
Prabhas makeover viral video

Prabhas makeover viral video: రెబల్ స్టార్ ప్రభాస్ వింటేజ్ లుక్స్ ఎలా ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరో అంటే ఇలా ఉండాలిరా అని ప్రతీ మనిషి అనుకునే రేంజ్ లో ఉండేవాడు. హృతిక్ రోషన్ ని మించిన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఉండేవాడు. మాస్ మూవీస్ , లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ , యాక్షన్ స్టోరీస్ , హిస్టారికల్ స్టోరీస్ , ఇలా ప్రతీ జానర్ కి సూట్ అయ్యే ఏకైక ఇండియన్ సూపర్ స్టార్. అయితే ఈ రేంజ్ లుక్స్ బాహబలి వరకు మాత్రమే ఉండేది. కానీ ఆ తర్వాత మాత్రం ప్రభాస్ లుక్స్ లో వచ్చిన మార్పులు చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఎలా ఉండేవాడో ప్రభాస్, ఇలా ఐపోయాడేంటని ప్రతీ ఒకరు అనుకునేవారు. ‘రాజాసాబ్’ లో పర్వాలేదు అనే రేంజ్ లుక్స్ ఉన్నప్పటికీ, వింటేజ్ ప్రభాస్ లుక్స్ ని మిస్ అవుతున్నామే అనే ఫీలింగ్ ఉండేది ఫ్యాన్స్ లో.

కానీ ఇక నుండి వాళ్ళు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు , ఎందుకంటే ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ రేంజ్ లో లుక్స్ పరంగా కం బ్యాక్ ఇస్తాడని కలలో కూడా ఊహించలేదు అంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ మంత్రి మురళి మోహన్ కి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, TAGKC సన్మానం చేశారు. ఇది చాలా అరుదైన గౌరవం. దీనిపై ప్రభాస్ స్పందిస్తూ మురళి మోహన్ కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపాడు. ఆ వీడియో లో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించడం చూసి అభిమానులు మెంటలెక్కిపోతున్నారు. ఇలా కదా మేము ప్రభాస్ ని చూడాలని అనుకున్నది , ‘స్పిరిట్ ‘ మూవీ కోసం బాగానే మేకోవర్ అయ్యాడు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

డైరెక్టర్ సందీప్ వంగ ఈసారి ప్రభాస్ ని లుక్స్ దగ్గర నుండి యాక్షన్ వరకు వేరే లెవెల్ లో ఉండేలా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడని , అందుకు ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా , దానికి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూశాము . ముఖ్యంగా జెన్ జీ ఫ్యాన్స్ విపరీతంగా సంతృప్తి చెందారు. అదే విధంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5 న విడుదల చేయబోతున్నట్టు కూడా అధికారిక ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో , ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ కి వాయిదా వేసే అవకాశం ఉంది.

రామ్ చరణ్ పై అలిగిన బుచ్చి బాబు.. ప్రొమోషన్స్ సమయంలో షాకింగ్ ట్విస్ట్..

Ram Charan Suggestions To Buchi Bab
Ram Charan Suggestions To Buchi Bab

Buchi Babu upset with Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ వచ్చే నెల 4 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా , మేకర్స్ ప్రొమోషన్స్ తో దుమ్ము లేపేస్తున్నారు. నేడు ఈ చిత్రానికి అంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్ కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు , ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు, ఈరోజు విడుదల చేయబోయే థియేట్రికల్ ట్రైలర్ మీదనే బుకింగ్స్ ఆధారపడి ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే బుచ్చి బాబు ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , పెద్ది షూటింగ్ సమయంలో తన అనుభవాలను ఒక్కొక్కటిగా పంచుకున్నాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘పెద్ది షూటింగ్ సమయం లో నేను రామ్ చరణ్ గారి మీది ఒక సందర్భం లో అలిగాను , అది నేను ఇప్పటి వరకు చరణ్ గారికి కూడా చెప్పలేదు. చికిరి చికిరి పాట షూటింగ్ సమయంలో ఒక షాట్ లో కాస్ట్యూమ్ సరిగా వర్కౌట్ అవ్వలేదు. అది మానిటర్ లో చూసిన చరణ్ గారు , ఏంటి బుచ్చి ఇవన్నీ నువ్వు చూసుకోవాలి కదా అని సీరియస్ గా అన్నాడు, నాతో చరణ్ గారితో పరిచయమైనప్పటి నుండి అంత సీరియస్ గా ఎప్పుడూ మాట్లాడలేదు , ఒక్కసారిగా అలా మాట్లాడేసరికి తీసుకోవడం కాస్త కష్టమైంది , క్యారవాన్ లోకి వెళ్ళిపోయి ఒక 5 నిమిషాలు రామ్ చరణ్ గారి మీద అలిగి బాధపడ్డాను , ఏంటి ఈయన ఇంత సీరియస్ అవుతున్నాడు అనుకున్నాను , ఆ తర్వాత నాకు నేను సర్దిచెప్పుకొని సెట్స్ లోకి తిరిగి వచ్చేశాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు బుచ్చి బాబు.

అదే విధంగా తన వల్ల మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ ఎలా ఇబ్బంది పడ్డాడో కూడా చెప్పుకొచ్చాడు బుచ్చి బాబు. ఆయన మాట్లాడుతూ ‘ముందుగా రెహమాన్ గారు రెండు మ్యూజిక్ బిట్స్ ఇచ్చాడు , అందులో ‘మస్సా మస్సా’ బిట్ కూడా ఉంది. ఇది మొదట్లో నేను విన్నప్పుడు సార్ ఇది పెద్దగా బాగోలేదు , ఇంకా బెటర్ వెర్షన్ కావాలి అని అడిగాను , ఓకే చేద్దాం అని రెహమాన్ గారు అన్నారు, కానీ ఆయన తన అసిస్టెంట్స్ తో బాగానే ఉంది కదా మ్యూజిక్ , ఎందుకు డైరెక్టర్ వద్దు అంటున్నాడు? అని అంటూ ఉండేవాడట. తనకు ఇబ్బంది గా అనిపించినప్పటికీ నాకు చెప్పకుండా, నేను పూర్తిగా సంతృప్తి పడేంత వరకు మ్యూజిక్ ని అందించాడు’ అంటూ బుచ్చి రెహమాన్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు.

వెర్రిబాగులోడు.. వైసీపీ నేతకు ఇచ్చి పడేసిన అనుకూల విశ్లేషకుడు!

YSR Congress Survey
YSR Congress Survey

YCP leader facing criticism: గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో.. అందరికీ సుపరిచితులు అయ్యారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఆయన అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండేవారు. కానీ మంత్రులకు మించి పాపులారిటీ సాధించారు. ఇలాంటి ఎమ్మెల్యే తమకు ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడేవారు. అయితే ఆయన సైతం మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికలకు ముందు బిజెపి అభ్యర్థిగా ప్రకటించిన సత్య కుమార్ చేతిలో ఓడిపోయారు. ఇంతటి పాపులారిటీ సాధించిన తనకు.. ఓటమి ఏంటి అని తెగ బాధ పడిపోయారు కేతిరెడ్డి. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అదే కేతిరెడ్డిని వెర్రిబాగులోడు అంటూ తేల్చి చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకులు ఒకరు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో..
అప్పట్లో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కేతిరెడ్డి నియోజకవర్గం లో పర్యటించారు. అన్ని వర్గాల ప్రజలను పలకరించేవారు. వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేవారు. అయితే తన పాపులారిటీని పెంచేందుకే కేతిరెడ్డి ఈ తరహా ప్రయత్నం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఆయనతోపాటు అనుచరులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. అది బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకే అప్పట్లో అలా చేసేవారన్న కామెంట్స్ ఉన్నాయి. కానీ ఇది తెలుగు ప్రజలకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని దగ్గరకు చేర్చిన కార్యక్రమం మాత్రం గుడ్ మార్నింగ్ ధర్మవరం. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకుడిగా ముద్రపడిన కేఎస్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో ఏది జరగలేదు..
వాలంటీర్ వ్యవస్థతో సర్వనాశనం చేసేసారని.. అందుకు కేతిరెడ్డి లాంటివారు బాధితులని కె ఎస్ ప్రసాద్ తేల్చి చెప్పారు. ఉదయం కారులో బయలుదేరి వీధులన్నీ తిరిగి.. సమస్యలు తెలుసుకుని వాలంటీర్ను అడిగితే.. మా సార్ కాదని చెప్పారని చెప్పేవారని గుర్తు చేశారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వృధా ప్రయత్నం అని తేల్చి చెప్పారు కేఎస్ ప్రసాద్. ఇటీవల సాక్షి మీడియాకు ఆయన వెళ్లడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపాలను బయట పెడుతున్నారు. నాయకుల తీరును ఎండగడుతున్నారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై పడ్డారు.

అచ్చం జగన్ మాదిరిగా మమతా బెనర్జీ

Mamata Banerjee like Jagan
Mamata Banerjee like Jagan

Mamata Banerjee like Jagan: రాజకీయ పార్టీల నేతల దూకుడు ఒక్కోసారి అక్కరకు వస్తుంది.. రాజకీయ ప్రయోజనాలను చేకూర్చుతుంది. కానీ ఒక్కోసారి వికటిస్తుంది కూడా. అయితే రాజకీయాలను రాజకీయంలాగే చేయాలి. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన అందుకు మూల్యం తప్పదు. పశ్చిమబెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ చేసిన తప్పు కూడా అదే. 1998 వరకు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. బయటకు వచ్చి సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. దాదాపు పది సంవత్సరాలు పోరాడి అధికారంలోకి రాగలిగారు. రెండుసార్లు అధికారాన్ని నిలబెట్టుకున్న ఆమె మూడోసారి మాత్రం చతికిల పడ్డారు. అయితే అధికారంలో ఉన్న దూకుడును కనబరుస్తున్నారు. అందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు.

ఏపీలోనూ దూకుడు రాజకీయం..
మమతా బెనర్జీ మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు జగన్. దాదాపు ఏడు సంవత్సరాల పాటు పోరాటం చేసి ఏపీలో అధికారంలోకి వచ్చారు. అంతులేని ప్రజామోదంతో వచ్చిన ఆయన.. తరువాత ఎందుకో ఏకపక్షంగా వ్యవహరించడం ప్రారంభించారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ప్రయత్నం చేశారు. అది వికటించి ఆ పార్టీని అధికారం నుంచి దూరం చేసింది. దారుణ పరాజయం ఎదురయింది జగన్మోహన్ రెడ్డికి. అయినా సరే అదే ధోరణితో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా పార్టీ శ్రేణులకు భిన్నంగా సాగుతున్నారు. పార్టీలో ఇష్టం ఉంటే ఉండండి.. లేకుంటే వెళ్లిపోవచ్చు అనడంతో సీనియర్లు సైతం దూరమయ్యారు.

ఇష్టం లేకపోతే వెళ్లిపోండి..
బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఇప్పుడు అదే మాట చెబుతున్నారు. తనతో ఉన్నవారు ఉండొచ్చు.. లేకపోయిన వారు వెళ్ళిపోవచ్చు అని తేల్చి చెబుతున్నారు. ఆ పార్టీ నుంచి 80 మందికి పైగా ఎమ్మెల్యేలు గెలిచారు. కొందరు బిజెపి టచ్ లోకి వెళ్లినట్లు మమతా బెనర్జీ అనుమానిస్తున్నారు. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ప్రతీకార రాజకీయాలతో హత్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించాల్సింది పోయి దూకుడు మాటలు ఆడుతున్నారు మమత. అదే సమయంలో మమత పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కకూడదని బిజెపి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఓ 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ఈ విషయం మమతా బెనర్జీకి తెలియడంతో ఆమె సొంత పార్టీ వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉంటే ఉండండి లేకుంటే వెళ్లిపోండి అని అనడం దుమారానికి దారి తీస్తోంది. సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి మమతా బెనర్జీ. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే బెంగాల్లో మమత వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కింది!

YSR Congress Party
YSR Congress Party

YSR Congress Party protest: ఏ రాజకీయ పార్టీ కైనా ప్రజా పోరాటాలే ఊపిరి పోస్తాయి. అందులోనూ ప్రతిపక్ష పార్టీ ఈ విషయంలో ముందుండాలి. లేకుంటే వెనుకబడిపోతుంది. అయితే గత రెండేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలు అనుకున్న స్థాయిలో చేయలేకపోయింది. మధ్యలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై పోరాటం చేసింది కానీ.. అనుకున్న స్థాయిలో ఆ పార్టీకి మైలేజ్ రాలేదు. అన్నింటికీ మించి జగన్మోహన్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలకు ముందుకు రాకపోవడం ఆ పార్టీకి మైనస్. అయితే ఇప్పుడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళనలకు పిలుపునిచ్చింది వైసిపి నాయకత్వం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుపుతోంది. ఎట్టకేలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాల్లో భాగంగా రోడ్డు ఎక్కినట్లు అయ్యింది.

అంతర్జాతీయ పరిస్థితులతో..
పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరను పెంచాయి. మూడు రూపాయలకు పైగా లీటరు పెట్రోల్ డీజిల్ పై పెరిగింది. దీనిని సాకుగా తీసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. మొన్ననే పెట్రోల్ కొరతపై ఆ పార్టీ నేతలు ఆందోళనలు జరిపారు. కానీ ఆలస్యం జరిగింది. దీంతో అనుకున్న మైలేజీ సాధించలేకపోయారు. ఈసారి మాత్రం ముందే మేల్కొంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరపాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. దీంతో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డు ఎక్కారు.

ప్రజా పోరాటాలకు దూరం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రజా పోరాటాలు చేసింది లేదు. కేవలం ఆ పార్టీ నేతల అరెస్టులు, కేసులపైనే పోరాటం చేసింది తప్ప ప్రజల కోసం ఏమి చేయలేదన్న విమర్శ ఉంది. జగన్మోహన్ రెడ్డి సైతం ప్రజా పోరాటాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కేవలం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పై విమర్శలు చేయడం తప్ప.. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పెట్రోల్ ధరల పెంపు అనేది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ఎక్కువగా ఉంది ఈ పరిస్థితి. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే కొంత ఫలితం ఉంటుంది. కానీ చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ నేతలు యాక్టివ్ కావడం లేదు. ఆందోళనలు కూడా పరిమిత నియోజకవర్గాల్లోనే జరుగుతున్నాయి. దీంతో ఇది ఆ పార్టీకి సరైన మైలేజ్ ఇవ్వడంలేదు. పైగా అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొనడం లేదు. అదే ఎక్కువగా మైనస్ గా మారుతుంది. ప్రజల్లోకి వెళ్లడం లేదు.

జగన్ 'బెంతహై'.. లోకేష్ మాస్ టీజింగ్!

Nara Lokesh mass teasing
Nara Lokesh mass teasing

Nara Lokesh mass teasing: ఏపీ రాజధానికి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త హైలైట్ గా నిలుస్తూనే ఉంటుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతూ వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో రకాల విమర్శలు, ప్రచారాలు సర్వసాధారణం అయ్యాయి. వాటిని పట్టించుకునే స్థితిలో లేదు కూటమి ప్రభుత్వం. మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మావిగన్ అనే కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై ఆయన విపరీతంగా ట్రోల్స్ కు గురయ్యారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకులు సైతం దీనిని తప్పు పట్టారు. అది బుర్ర లేని ఆలోచనగా తేల్చేశారు. మావిగన్ ప్రతిపాదన తీవ్ర ప్రతికూలత రావడంతో దానిని మరిచిపోయేలా ఎత్తుగడవేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. టీవీ డిబేట్లో సైతం ఆ పార్టీ నేతలు ఆ ప్రస్తావన మరిచిపోయారు. అయితే తాజాగా మంత్రి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి పై సర్టైరికల్ పోస్ట్ చేశారు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆ మూడింటిని కలుపుతూ…
రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఆసక్తికర సూచన చేశారు. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు కారిడార్ను తీసుకొని రాజధానిగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని సూచించారు. మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో జియుఎన్ తీసుకొని మావిగన్ అని పేరు పెడితే బాగుంటుంది అని సూచించారు. దీంతో విపరీతంగా ట్రోల్స్ అయ్యారు. ఇప్పుడు దానిని గుర్తు చేశారు మంత్రి నారా లోకేష్. బెంతహై అంటూ ఆయన చేసిన సూచన జగన్ పై సాటిరికల్ గా ఉంది. బెంగళూరు- తాడేపల్లి- హైదరాబాద్ కు షటిల్ సర్వీసులు చేసే జగన్ ఇంగ్లీష్ అక్షరాలను కలుపుతూ బెంతహై అనే పేరు పెట్టుకోవాలని సూచించారు. ఇప్పుడు ఇది కూడా విపరీతంగా ట్రోల్ అవుతోంది జగన్ పై.

అడ్డంగా బుక్ అవుతూ..
జగన్ వారం వారం మీడియా ముందుకు వస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ నేతల పరామర్శలకు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆయన నోటి నుంచి వచ్చే మాటలు సైతం ట్రోల్స్ అవుతున్నాయి. ఆపై ఆయన ముఖ కవళికలను సైతం వదలడం లేదు. అదే పనిగా ట్రోల్స్ చేస్తున్నారు కొందరు. మావిగన్ ప్రతిపాదన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ గా మారింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా పరిగణించింది. దానిపై ముందుకు వెళితే తమకు ఇబ్బందులు వస్తాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. అందుకే టీవీ డిబేట్లో సైతం ప్రస్తావించడం లేదు. ఇటువంటి తరుణంలో మావిగన్ ను గుర్తుచేసి బెంతహై పేరుతో ఒక ఆట ఆడుకున్నారు మంత్రి నారా లోకేష్.

ట్రంప్ 'అంతిమ' హెచ్చరిక.. రణమా.. శరణమా!

Trump final warning
Trump final warning

Trump final warning: ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలు కీలక మలుపు తీసుకున్నాయి. యుద్ధాన్ని ముగించి దీర్ఘకాలిక ఒప్పందం కోసం అమెరికా ఐదు ముఖ్యమైన అంశాలను ఇరాన్ ప్రతిపాదించింది. వాటిని ఇరాన్ తిరస్కరించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిపిన చర్చల అనంతరం ఈ పరిణామాలు జరగడం గమనార్హం.

అమెరికా ప్రతిపాదనలు ఇవీ..
అమెరికా తాజా ప్రతిపాదనలు చాలా కఠినంగా ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి యుద్ధం వల్ల జరిగిన నష్టాలకు ఎలాంటి పరిహారం చెల్లించవద్దు.సుమారు 400 కిలోల ఎన్‌రిచ్డ్ యురేనియం అమెరికాకు అప్పగించాలి. ఇరాన్‌లో ఒక్క న్యూక్లియర్ ఫెసిలిటీ మాత్రమే నడపాలి. ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల్లో 25 శాతం కూడా విడుదల చేయకుండా నిలిపివేయాలి. లెబనాన్‌తో సహా ప్రాంతీయ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.

ఈ షరతులు ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని తీవ్రంగా పరిమితం చేస్తాయి. ఆర్థికంగా కూడా ఒత్తిడి పెంచుతాయి. ఇరాన్ తన ప్రతిపాదనల్లో యురేనియం కొంత భాగాన్ని మూడవ దేశానికి బదిలీ చేయడం, కానీ ఫెసిలిటీలను పూర్తిగా నిర్మూలించడాన్ని నిరాకరించింది.

సమయం అయిపోతోంది..
ఇరాన్ తిరస్కరణ అనంతరం ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో బలమైన మాటలు వాడారు. “ఇరాన్‌కు సమయం మించిపోతోంది. వేగంగా స్పందించాలి. లేదంటే వారికి ఏమీ మిగలదు. సమయం ఎంతో విలువైనది” అని హెచ్చరించారు. ఇలాంటి హెచ్చరికలు గతంలో కూడా ట్రంప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇజ్రాయెల్‌తో చర్చలు జరిపిన తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చడం, సైనిక ఒత్తిడి కొనసాగుతుందని సంకేతం ఇస్తోంది.

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ న్యూక్లియర్ సామర్థ్యాన్ని పూర్తిగా అణచివేయాలని చూస్తున్నాయి. తన ప్రాంతీయ ప్రభావం (లెబనాన్, ఇతర ప్రాక్సీలు), న్యూక్లియర్ కార్యక్రమం రక్షణే ప్రధాన లక్ష్యం. ఫ్రీజ్ చేసిన ఆస్తులతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి.లెబనాన్‌లో ఇజ్రాయెల్ చర్యలు చర్చలను క్లిష్టతరం చేస్తున్నాయి. ఎన్‌రిచ్డ్ యురేనియం బదిలీ ఇరాన్‌కు భద్రతా హామీలు లేకుండా అంగీకరించడం కష్టం.

అయినప్పటికీ, రెండు వైపులా యుద్ధం కొనసాగించడం ఖర్చుతో కూడుకున్నది. ఆయిల్ ధరలు పెరగడం, హార్ముజ్ స్ట్రెయిట్ సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్ సమగ్ర ఒప్పందం కోసం సిద్ధంగా ఉందని చెబుతోంది, కానీ అమెరికా షరతులు మారాలని డిమాండ్ చేస్తోంది.

దీపావళి తర్వాత దరువే.. ఈ లోన్లు అన్నీ భారమే..

Loan burden after Diwali
Loan burden after Diwali

Loan burden after Diwali: పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను కూడా కలవరపెడుతున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం నెమ్మదిగా మన దేశంపై పడటం ప్రారంభమైంది. ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు స్వల్పంగా పెరుగుతుండగా, రాబోయే దీపావళి పండుగ సీజన్‌ నాటికి బ్యాంకు వడ్డీ రేట్లు కూడా పెరిగి.. సామాన్యుడి జేబుకు భారీగా చిల్లు పెట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా మార్కెట్లో ఏర్పడే అనిశ్చితిని తట్టుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కఠిన చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే దీపావళి నాటికి ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను (రెపో రేట్) పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే గనుక జరిగితే, బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫలితంగా సామాన్యులు తీసుకున్న హోం లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్లపై ఈఎంఐల (EMI) భారం భారీగా పెరిగి, నెలవారీ బడ్జెట్‌ తలకిందులయ్యే ప్రమాదం ఉంది.

పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ముందు దేశంలో ధరల సూచి 5.5 శాతంగా ఉండేది. కానీ 2026 ఏప్రిల్ నాటికి ఇది ఏకంగా 8.30 శాతానికి చేరుకుంది. ముడిచమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు భారంగా మారనున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. రవాణా ఛార్జీలు, ఎరువుల కొరత ప్రభావం నేరుగా వ్యవసాయంపై పడి, రాబోయే రోజుల్లో నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.

ఆర్థిక ఇబ్బందుల ప్రభావం ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాలపై స్పష్టంగా కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ, అక్కడి ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఉన్నతాధికారుల జీతాల్లో కోతలు విధించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు కూడా ముందస్తు పొదుపు చర్యలు చేపట్టాయి. దేశ ఆర్థిక పరిస్థితిని గమనించిన ప్రధానమంత్రి సైతం అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని, పొదుపు పాటించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు.

కొన్ని తాజా నివేదికల ప్రకారం.. దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) రేటులో తెలంగాణ రాష్ట్రం 5.18 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి 4.41 శాతంతో, ఆంధ్రప్రదేశ్ 4.20 శాతంతో కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి ద్రవ్యోల్బణం నమోదు కావడం స్థానిక మార్కెట్లపై ధరల ఒత్తిడిని స్పష్టం చేస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందడం కంటే ఆర్థికంగా అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటూ, పొదుపు వైపు అడుగులు వేయడం మంచిది. అయితే, గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు గనుక తగ్గితే, ద్రవ్యోల్బణం మళ్లీ అదుపులోకి వచ్చి దేశ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునే అవకాశం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

స్పిరిట్ లో ప్రభాస్ తాత గా నటిస్తున్న స్టార్ హీరో...

Prabhas Spirit latest updates
Prabhas Spirit latest updates

Prabhas Spirit latest updates: సందీప్ రెడ్డి వంగ – ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ పాత్రలో ప్రభాస్ చాలా పవర్ ఫుల్ గా నటించబోతున్నారట. ఇప్పటివరకు ప్రేక్షకులు అతన్ని చూడని విధంగా సందీప్ చూపిస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అతని తాత క్యారెక్టర్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించబోతుందట. తాత పాత్రకి కూడా ఒక స్పెషల్ ఎలివేషన్ సీన్స్ అయితే ఉన్నాయట. ఇంతకీ ఆ తాత పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయంలోనే సరైన క్లారిటీ రావడం లేదంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తాత గా ఒక బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్ననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తాత క్యారెక్టర్ ను పోషించే హీరో ఎవరు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అమితాబచ్చన్ ఈ సినిమాలో ప్రభాస్ తాత క్యారెక్టర్ ని పోషిస్తున్నారంటూ కొంతమంది చెబుతున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలీదు కానీ మొత్తానికైతే ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. తాత నుంచి వచ్చిన జీన్స్ తోనే తను పవర్ ఫుల్ గా తయారయ్యాడు అంటూ చెప్పే ఒక సన్నివేశం కూడా ఈ సినిమాలో ఉందట.

అందుకోసం మొదటగా అతని వీరత్వాన్ని చూపించి ఆ తర్వాత తనని ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రభాస్ ని చాలా గ్రాండీయర్ గా చూపించబోతున్నారట. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే స్పిరిట్ మూవీ సూపర్ సక్సెస్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ప్రభాస్ - హను రాఘవపూడి మధ్య గొడవ జరిగిందా...అసలు ఆ మూవీ అప్డేట్ ఏంటి..?

Prabhas Hanu Raghavapudi controversy
Prabhas Hanu Raghavapudi controversy

Prabhas Hanu Raghavapudi controversy: ‘ఈశ్వర్’ సినిమా తో తన కెరియర్ ని మొదలుపెట్టిన నటుడు ప్రభాస్…మొదటి సినిమాతోనే హీరోగా మెప్పించాడు. ఈ మూవీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించకపోయిన కూడా తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ‘రాఘవేంద్ర’ అనే సినిమా చేశాడు. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా బాగా ఎలివేట్ అయ్యాడు. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత చేసిన ‘వర్షం ‘, ‘ఛత్రపతి’ లాంటి సినిమాలతో అతను స్టార్ హీరోగా మారిపోయాడు. అలాంటి నటుడు ఇప్పుడు పాన్ ఇండియాను శాసించే స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతం ప్రభాస్ తన పరిధిని విస్తరించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. పాన్ వరల్డ్ లోకి సైతం ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఈ సంవత్సరం మారుతి డైరెక్షన్ లో చేసిన రాజాసాబ్ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన ఎక్కడ డీలా పడకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి ఫౌజీ, అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమాల మీదనే తను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఈ క్రమంలోనే ఫౌజీ సినిమా స్టార్ట్ అయి సంవత్సర అవుతున్న కూడా ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులకు ఇవ్వడం లేదు. కారణం ఏంటనేది ఎవరికి తెలియదు. అసలు ఈ సినిమా షూటింగ్ నడుస్తుందా? లేదా అనే విషయంలో కూడా చాలావరకు కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. హను రాఘవ పూడి ప్రభాస్ మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయని అందువల్లే ఈ సినిమాని కొద్ది రోజులపాటు ఆపారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.

ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం తెలియదు గానీ, ప్రభాస్ మాత్రం ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇతను అనుకున్నట్టుగానే ఈ సినిమాని హను రాఘవపూడి టాప్ లెవల్లో చిత్రీకరిస్తున్నాడా? ఈ మూవీతో అటు ప్రభాస్ కి, ఇటు హను రాఘవపూడి కి భారీ సక్సెస్ లు దక్కుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…

 

శ్రీకాంత్ ఓదెల బడ్జెట్ ను ఎస్టిమేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడా.. నాని కోపానికి కారణం ఏంటి..

Nani angry on Srikanth Odela
Nani angry on Srikanth Odela

Nani angry on Srikanth Odela: దసర సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ‘శ్రీకాంత్ ఓదెల’ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని సాధించాడు. ప్రస్తుతం నానిని హీరోగా పెట్టి ‘ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 150 కోట్లలో పూర్తవుతుందని స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటికే ఈ సినిమాకి 200 కోట్లకు పైన బడ్జెట్ అయింది. ఇంకో 15 రోజులపాటు షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో సినిమా ఫస్ట్ కాపీ వచ్చేసరికి ఈ బడ్జెట్ మరో 50 కోట్ల వరకు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇక ఓవరాల్ గా ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు దాటుతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ సైతం ఈ సినిమా విషయంలో కొంతవరకు కంగారు పడుతున్నారట. ఓవర్ బడ్జెట్ కారణంగా ఈ సినిమా ఏదైనా తేడా కొడితే మాత్రం ప్రొడ్యూసర్ తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

నిజానికి శ్రీకాంత్ ఎందుకని ఇలా చేస్తున్నాడు. దసర సినిమాని సైతం 30 కోట్లలో పూర్తి చేస్తానని చెప్పి దానిని 60 కోట్ల బడ్జెట్ కి తీసుకెళ్లాడు. ఇక లక్కీగా సినిమా సక్సెస్ అయి 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది కాబట్టి ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. ప్యారడైజ్ సినిమా విషయంలో కూడా మొదట ఒక బడ్జెట్ అనుకొని ఇప్పుడు బడ్జెట్ ను విపరీతంగా పెంచేయడం పట్ల ప్రొడ్యూసర్ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

నాని సైతం శ్రీకాంత్ ఓదెల మీద కొంతవరకు కోపంతో ఉన్నారట. ఇక నాని సినిమాలు సూపర్ హిట్ అయిన కూడా అతనికి 100 కోట్ల కలెక్షన్స్ రావడమే చాలా కష్టతరం అవుతున్న రోజుల్లో 250 కోట్ల వరకు బడ్జెట్ ని పెట్టిస్తున్నారు అంటే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించాల్సి ఉంటుంది.

ముందు ఒక బడ్జెట్ ని ఎస్టిమేషన్ వేసి దాన్ని కంట్రోల్ చేయగలిగేతేనే దర్శకుడు సక్సెస్ అవుతాడు. లేకపోతే మాత్రం చాలా వరకు విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా విషయంలో ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

రాజ్యసభకు ఆ మాజీ ముఖ్యమంత్రి!

Kiran Kumar Reddy Rajya Sabha
Kiran Kumar Reddy Rajya Sabha

Kiran Kumar Reddy Rajya Sabha: ఏపీ రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. కనీసం మీడియా ముందుకు కూడా ఆయన రావడం లేదు. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పొత్తులో భాగంగా బిజెపి తరఫున పోటీ చేసిన ఆయనకు ఓటమి తప్పలేదు. అప్పటినుంచి అప్పుడప్పుడు కనిపిస్తున్నారే తప్ప.. బయటకు మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి వచ్చింది లేదు. బిజెపి కార్యక్రమాలకు సైతం ఆయన హాజరు కావడం లేదు. ఇప్పుడు తాజాగా రాజ్యసభ పదవి కోసం ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బిజెపికి పదవి ఇస్తే ఆయనకే అని తెలుస్తోంది. కానీ మధ్యలో తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏపీ నుంచి ఆయనకు రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సైతం ప్రయత్నం లో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక నేపథ్యం..
చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబానికి ప్రత్యేక రాజకీయ ప్రస్థానం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అయితే ఆయన అకాల మరణంతో కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1994లో ఓడిపోయారు. 1999, 2004, 2009లో గెలిచారు కిరణ్ కుమార్ రెడ్డి. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కిరణ్ కుమార్ రెడ్డికి చీఫ్ విప్ గా అవకాశం కల్పించారు రాజశేఖర్ రెడ్డి. 2009లో మాత్రం అసెంబ్లీ స్పీకర్ గా ఛాన్స్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి మరణంతో కాంగ్రెస్ హై కమాండ్.. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే రాష్ట్ర విభజన ఒకవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మరోవైపు.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసాయి. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి.. సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసి పోటీ చేశారు. ప్రజలు ఆదరించకపోయేసరికి తిరిగి కాంగ్రెస్ లోకి చేరారు. అక్కడ నుంచి బిజెపిలోకి వచ్చారు.

ఆ హామీతో..
రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువ. ప్రధానంగా రాజంపేట పార్లమెంటు సీటు తెలుగుదేశం పార్టీకి అస్సలు చిక్కడం లేదు. అందుకే పొత్తులో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించారు చంద్రబాబు. అయితే అది ఓడిపోయే సీటు అని తెలిసి ఏ నేత కూడా ముందుకు రాలేదు. అటువంటి చోట కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఆ సమయంలో ఆయనకు హామీ లభించినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు చంద్రబాబుతో రాజకీయంగా విభేదించిన కిరణ్ కుమార్ రెడ్డి.. తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు కిరణ్ ప్రయత్నాలకు చంద్రబాబు సాయం కూడా తోడవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాజ్యసభకు ఈ మాజీ ముఖ్యమంత్రికి లైన్ క్లియర్ అయినట్టే..

రష్యన్ ఆయిల్ కు బ్రేక్.. మళ్లీ పెట్రో మంట!

Russian oil supply issue
Russian oil supply issue

Russian oil supply issue: రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే ముడిచమురుకు అమెరికా ఇచ్చిన మినహాయింపు ఆదివారం ముగిసింది. మరోవైపి ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. హార్ముజ్ లో ప్రమాదకర పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. రష్యన్ ఆయిల్ గత కాలంలో భారత ఇంధన అవసరాలకు తగినంత సరఫరా అందించింది. ఇప్పుడు దిగుమతి ఆగిపోవడంతో జాతీయ ఇంధన మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

పునరుద్ధరించకపోతే..
రష్యన్ ఆయిల్ దిగుమతి పునరుద్ధరణ చేయకుంటే రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. మనకు రోజుకు సుమారు 2.3 మిలియన్ల బ్యారెల్ల మేర న్యూట్ సప్లయ్ లో తేడా ఏర్పడే అవకాశముంది. విదేశీ మార్కెట్లలో ప్రత్యామ్నాయ సరఫరా సంపాదించడం తక్షణంలో సులభం కాదు.

పెరుగుతున్న క్రూడ్ ధరలు..
అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న స్థితిలో చమురు ధరలు పెరిగాయి. యూఏఈ లోని అను విద్యుత్ కేంద్రంపై డ్రైన్ దాడి జరగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. కొత్తగా ఐదు షరతులను ప్రతిపాదించాడు. ఈ షరతులను ఇరాన్ తిరస్కరించింది. నేనే పద్యంలో చమరుదరులు మరింత పెరుగుతాయన్న సంకేతాలు వస్తున్నాయి.

భారత్ పై ప్రభావం..
రష్యా ఆయిల్ దిగు మరి నిలిచిపోవడం, హర్ముజ్ దిగ్బంధం కొనసాగుతుండడంతో సమర్ధరణం మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే చమరుద్ధరణ కేంద్రం పెంచింది. కమర్షియల్ గ్యాస్ ధర కూడా పెరిగింది. త్వరలో గృహవినియోగ గ్యాస్ ధరను కూడా పెంచే అవకాశం ఉంది. ఈ నెలాఖరు వరకు మళ్లీ ఆయిల్ ధరలను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా లేదా లేటిన్‍ అమెరికా మార్కెట్లతో తాత్కాలిక ఒప్పందాలు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్గత రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచడం, నౌకల మార్గాల భద్రతపై ఎక్కువ పెట్టుబడులు పెట్టడం దీర్ఘకాలిక పరిష్కారంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు.

రష్యన్ మినహాయింపుల ముగింపుతో భారత ఇంధన సరఫరాలో తాత్కాలిక ఆందోళన కలగవచ్చు. వెంటనే ప్రత్యామ్నాయ సరఫరా సమాదానం లేదా స్ట్రాటజిక్ నిల్వలు ఉపయోగించకపోతే, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల జరగే అవకాశం ఎక్కువ. దీర్ఘకాలికంగా, దేశం సరఫరా భాగస్వామ్యాల వైవిధ్యాన్ని పెంచటం, రిఫైనింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచటం, సముద్ర మార్గ భద్రతపై పెట్టుబడులు పెంచటం అత్యవసర చర్యలుగా కనిపిస్తున్నాయి.

సందీప్ రెడ్డి వంగ విషయంలో జాగ్రత్తగా ఉంటున్న బాలీవుడ్ ఇండస్ట్రీ..

Bollywood cautious about Sandeep Reddy
Bollywood cautious about Sandeep Reddy

Bollywood cautious about Sandeep Reddy: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…’అనిమల్’ సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేశాడనే చెప్పాలి. బాలీవుడ్ మాఫియా ఆయన సినిమాను తొక్కెయాలనే ప్రయత్నం చేసింది. కానీ ఆయన కౌంటర్లను ఇస్తూ తన సినిమాని సక్సెస్ఫుల్ దిశగా ముందుకు తీసుకెళ్లాడు. ఈ సినిమా 900 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ మాఫియాను ఒక్కడే ఒంటరిగా ఎదుర్కొన్నాడు. వారికి కౌంటర్లను ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లను పెడుతూ సినిమాని సక్సెస్ ఫుల్ గా ఎలా మార్చుకోవాలి అనేది కూడా తనే స్వయంగా చేసి చూపించాడు. ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డివంగకి చాలా ఘట్స్ ఉంటాయనే విషయం మనందరికి తెలిసిందే. ఇక బాలీవుడ్ మాఫియా సందీప్ రెడ్డి వంగ తో పెట్టుకోవడం కంటే అతనితో మనం జాగ్రత్తగా ఉంటే మంచిది అని అనుకుంటున్నాట్టుగా తెలుస్తుంది.

ఇక ఏదేమైనా ఇప్పుడు తన నుంచి రాబోతున్న స్పిరిట్ సినిమా విషయంలో కూడా ఆయన అదే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే గొప్ప విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో సందీప్ రెడ్డివంగా ఉన్నాడు.

ఈ మూవీ అన్ని రికార్డు లను బ్రేక్ చేసి టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికైతే ఆయన ఈ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలనుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని సైతం టాప్ లెవల్లో నిలుపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…

ప్రభాస్ కెరియర్ లోనే ఇదొక డిఫరెంట్ సినిమాగా మిగులుతుందంటు సందీప్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగితే మాత్రం ఈ సినిమాతో 3000 కోట్ల వరకు కలెక్షన్స్ ను ఈజీగా వసూలు చేస్తారని మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…

బిజెపి పై రగిలిపోతున్న టిడిపి సీనియర్లు!

TDP
TDP

TDP seniors angry on BJP: ఏపీలో కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తోంది తెలుగుదేశం. కేంద్ర ప్రభుత్వంలో సైతం కీలక భాగస్వామి. అందుకే రాష్ట్ర ప్రయోజనాల తో పాటు రాజకీయ ప్రయోజనాల విషయంలో రాష్ట్రానికి పెద్ద పీట వేస్తోంది కేంద్రం. అయితే అదే స్థాయిలో ఏపీ నుంచి బిజెపి ప్రాతినిధ్యం కోరడం తెలుగుదేశం పార్టీకి లోటు. తాజాగా రాజ్యసభ పదవులకు సంబంధించిన ఎంపిక విషయంలో బిజెపి పట్టుబడుతుండడంతో టిడిపి సీనియర్లు మదన పడుతున్నారు. మరోసారి ఏపీ నుంచి రాజ్యసభ పదవి కోరుతోంది బిజెపి. కానీ ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం సీనియర్లు పెదవి విరుస్తున్నారు. ఎన్ని రోజులపాటు పార్టీ కోసం కష్టపడితే.. తమకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుందని.. తమకు వచ్చే అవకాశాలను బిజెపి తన్నుకుపోతోందని ఆవేదనతో ఉన్నారు.

పదవుల కోసం ఎదురుచూపు..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. టిడిపి సీనియర్లు చాలామంది పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారు ఉన్నారు. అయితే ఈ రెండేళ్ల కాలంలో రెండుసార్లు రాజ్యసభ, అదే స్థాయిలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరిగింది. ఆ సమయంలో బిజెపి ఎంట్రీ ఇస్తోంది. పదవులను తీసుకుంటోంది. రెండుసార్లు రాజ్యసభ పదవి అలానే తీసుకుంది. ఎమ్మెల్సీ పదవులను సైతం కూటమి ఖాతాలో పొందింది. ఇప్పుడు మరోసారి రాజ్యసభ పదవి కోరుతుండడంపై టిడిపి సీనియర్లలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

కేంద్ర పెద్దలతో సఖ్యత..
ఒకసారి బిజెపితో చెడి చాలా రకాలు ఇబ్బందులు పడ్డారు చంద్రబాబు. అందుకే కేంద్ర పెద్దలతో సఖ్యత గా గడుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఆ పదవులన్నీ టిడిపి కూటమికి దక్కనున్నాయి. అయితే ఇప్పుడు ఆ నాలుగింటిలో ఒక పదవిని కోరుతోంది బిజెపి. జనసేనకు ఒకటి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. అందుకే కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బిజెపితో పాటు జనసేనకు రెండు పోతే టిడిపికి మిగిలేది కేవలం రెండు మాత్రమే. ఆ రెండింటిలో పదవీ విరమణ చేస్తున్న సానా సతీష్ కు కొనసాగింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మిగిలింది ఒకటే. దానికోసం చాలామంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. బిజెపి పోటీలో లేకపోతే.. టిడిపి కి మూడు, జనసేనకు ఒకటి తేలిపోయేది. అలా కాకుండా బిజెపి సైతం ఒక పదవి కోరుతుండడం పై టీడీపీ సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సర్దుబాటు చేసుకోవాల్సిందని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన తమ పరిస్థితి ఏంటి అని టిడిపి సీనియర్లు మదనపడుతున్నారు.