Home Blog Page 253

ఈ రాశుల వారి ఇంట్లోకి ఈరోజు డబ్బు ప్రవాహం..

Today 27 June 2026 Horoscope
Today 27 June 2026 Horoscope

Today 20 May 2026 Horoscope:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాసులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ధన లాభం ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి నిరుద్యోగులకు ఈరోజు అద్భుతమైన అవకాశాలు అందుతాయి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పెండింగు పనులను పూర్తి చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. పిల్లల కెరీర్ పై తల్లితండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు స్నేహితుల సలహా తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు . ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు రావడంతో వ్యాపారులు సంతోషంగా గడుపుతారు. అదనపు పెట్టుబడుల కోసం పెద్దలను సంప్రదిస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులు అన్ని పూర్తి చేస్తారు. దీంతో ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థికంగా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయం చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. స్నేహితుల మద్దతుతో అప్పుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పై చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల సపోర్టు ఉంటుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు అందుతాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. పోటీ పరీక్షలో రాణించడానికి తల్లిదండ్రుల మద్దతు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకోకుండా కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు అందుతాయి. చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఊహించిన దానికంటే అధికంగా ఇంట్లోకి డబ్బు వస్తుంది. నీతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఆదాయాన్ని పెంచుకునేందుకు శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండాలి.

చంద్రబాబు గరిట తిప్పారు.. ఫేమస్ నెల్లూరు చేపల కూర వండారు..

chandrababu

Chandrababu Naidu : చంద్రబాబు ను హైటెక్ ముఖ్యమంత్రి అంటారు. అని ఆయన ఊర మాస్ అనే పదానికి పర్యాయపదం. ఆయన ఎప్పుడు క్లాస్ గా ఉండాలని అనుకుంటారు. కానీ, తనలో ఉన్న మాస్ అప్పీయరెన్స్ చూస్తే పసుపు పార్టీ అభిమానులు ఈలల మీద ఈలలు వేస్తారు. ఇక గోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చంద్రబాబు 2024 లో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సరికొత్తగా కనిపిస్తున్నారు. హైటెక్ ముఖ్యమంత్రిగా తనకున్న పేరును.. సరికొత్తగా మార్చుకుంటున్నారు. ఊర మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. తాజాగా ఏపీలో నెల్లూరు జిల్లాలో తుమ్మలపెంట ప్రాంతంలో జరిగిన మత్స్యకారుల సేవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ వెళ్లి చేపలను కొనుగోలు చేశారు. ఆ తర్వాత గిరిబాబు అనే మత్స్యకారుడు ఇంటికి చంద్రబాబు వెళ్లారు. అతడు చేపల కూర వండుతుండగా.. చూశారు. తాను కూడా గరిట తిప్పి.. నెల్లూరు స్టైల్ చేపల కూరను అదిరిపోయే రేంజ్ లో వండారు.

కూర మొత్తం ఉడికిన తర్వాత గిరిబాబు కుటుంబ సభ్యులతో కలిసి చేపల కూరతో ఆహారం తిన్నారు. సాధారణంగా తినే తిండి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే చంద్రబాబు.. ఈసారి మాత్రం తన శైలికి భిన్నంగా ఆహారం తిన్నారు. చేపల కూరను ఆస్వాదించారు. “నెల్లూరులో చేపల కూర ఎలా వండుతారు.. పచ్చి మామిడి ముక్కలు వేస్తేనే ఆ రుచి వస్తుందా.. సముద్రంలో ఎన్ని రోజులు వేటకు వెళ్తారు.. ఎన్ని రకాల చేపలు వేటలో లభ్యమవుతాయి.. మార్కెట్లో ధర ఎలా ఉంటుంది” ఈ విషయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు సాధారణంగా భోజనం చేయరు. ఆయన ఉదయం పూట మిల్లెట్స్ తో తయారుచేసిన టిఫిన్ తింటారు. కొవ్వు తీసిన పాలతో తయారుచేసిన కాఫీని తాగుతారు. అందులో షుగర్ వేసుకోరు. మధ్యాహ్నం కొర్రలు లేదా సామలు తింటారు. అందులో గ్రిల్డ్ ఫిష్ ఒక ముక్క ఉండేలా చూసుకుంటారు. సాయంత్రం ఫ్రూట్ సలాడ్ తింటారు. రాత్రి ఉడికించిన శనిగలు, రెండు పుల్కాలు తింటారు. సంవత్సరాలుగా చంద్రబాబు ఇదే డైట్ పాటిస్తున్నారు. అందువల్లే ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. యువకుల కంటే వేగంగా పనిచేస్తున్నారు.

చీరలో అందాల మీనాక్షి.. సొగసులు చూడతరమా?

Meenakshi Chaudhary vintage look
Meenakshi Chaudhary vintage look

కుడిచేతి వాటం.. మన జీవన పరిణామంలో ఆసక్తికర రహస్యం!

Human Evolution
Human Evolution

Human Evolution: ప్రపంచం వ్యాప్తంగా 90 శాతం మంది కుడిచేతి వాటం కలిగి ఉంటారు. అయితే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మన పూర్వీకుల జీవన విధానం, ముఖ్యంగా రెండు కాళ్లపై నడక నేర్చుకున్న విధానంతో ముడిపడి ఉందని ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వాస్తవం మన శరీర నిర్మాణం, మెదడు పనితీరు, పరిణామాన్ని ఒకేసారి వెల్లడిస్తుంది.

రెండు కాళ్లపై నడక..
మన పూర్వీకులు చెట్ల నుంచి నేలపైకి దిగి, స్థిరంగా నడవడం నేర్చుకున్నప్పుడు శరీర బ్యాలెన్స్‌ ఒక పెద్ద సవాలుగా మారింది. నాలుగు కాళ్లతో నడిచినప్పుడు స్థిరత్వం సులభం, కానీ రెండు కాళ్లపై నిలబడి నడవడం అంటే చేతుల సహాయం అనివార్యమైంది. ఈ సమయంలో చేతుల కదలికలు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడ్డాయి. ఈ ప్రక్రియలో ఒక చేతి ఎక్కువగా ఉపయోగపడేలా మెదడు అభివృద్ధి చెందింది. ఫలితంగా, చాలా మందిలో ఒక వైపు చేతి ప్రాధాన్యత పొందింది. ఇది కేవలం అలవాటు కాకుండా, జీవ శాస్త్రపరమైన అనుసరణగా మారింది.

ఎడమ మెదడు.. కుడివైపు నియంత్రణ..
మన మెదడులోని ఎడమ భాగం కుడి చేతిని నియంత్రిస్తుంది. ఆసక్తికరమేమిటంటే, ఈ ఎడమ భాగమే భాషా నైపుణ్యం, సంక్లిష్టమైన పనులు, తర్కం వంటి ఉన్నత సామర్థ్యాలను కూడా నిర్వహిస్తుంది. జీవన పరిణామంలో ఈ ఎడమ మెదడు ప్రాధాన్యత పొందడం వల్ల కుడి చేతి సహజంగా ఎక్కువ ఉపయోగం పొందింది. ఫలితంగా, సాధారణ పనుల నుంచి సృజనాత్మక కార్యకలాపాల వరకు కుడి చేతి ఆధిపత్యం చెలాయించింది. ఇది మన జాతి జీవనశైలిని మార్చిన ముఖ్యమైన మైలురాయి.

ఎడమ చేతి వాటం ఎందుకు తక్కువ?
ప్రపంచంలో 10 శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటం కలిగి ఉండటం యాదృచ్ఛికం కాదు. ఇది మెదడు నిర్మాణంలోని వైవిధ్యం, పరిణామ ప్రక్రియలోని సౌకర్యాలను సూచిస్తుంది. కొంతమందిలో కుడి మెదడు ఎక్కువ ప్రాధాన్యత పొందడం వల్ల ఎడమ చేతి ఆధిపత్యం ఏర్పడుతుంది. అయితే, సమాజం చాలా కాలం పాటు కుడి చేతి వాటాన్ని ప్రోత్సహించడం వల్ల కూడా ఎడమ చేతి వాటం తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆధునిక జీవితంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు వంటి సాధనాలు రెండు చేతులనూ సమానంగా ఉపయోగించేలా ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ, మూల స్వభావం మాత్రం మన పూర్వీకుల నడక నుంచి వచ్చిన ఆ బ్యాలెన్స్‌ను ఇప్పటికీ ప్రతిబింబిస్తోంది. ఈ అధ్యయనం మనకు గుర్తు చేస్తుంది – మనల్ని ఏర్పరచిన ప్రతీ లక్షణానికి ఒక లోతైన చరిత్ర ఉంది. కుడి చేతి వాటం కేవలం అలవాటు కాదు, మన పరిణామ ప్రయాణంలోని ఒక అద్భుతమైన అధ్యాయం.

ప్రపంచ దేశాలపై పడి పీక్కుతిన్న మీరా భారత్ ను ప్రశ్నించేది.. తెల్లతోలు నాయాల్లారా..

India Vs Netherlands Controversy
India Vs Netherlands Controversy

India Vs Netherlands Controversy: నూరు గొడ్లను తిన్న రా బందు.. శాంతి వచనాలు వల్లిస్తే ఎలా ఉంటుంది.. మనుషులను దారుణంగా చంపేసే నేరస్థుడు.. ఉపదేశాలు చెబితే ఎలా ఉంటుంది.. ఇప్పుడు నెదర్లాండ్ వ్యవహార శైలి కూడా అలానే ఉంది. మనిషి ముందు ఒక మాట.. మనిషి వెనుక ఒక మాట మాట్లాడిన ఆ దేశం.. ఇప్పుడు భారత్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నది.

ప్రస్తుతం మోదీ నార్వే, నెదర్లాండ్స్ దేశాలలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు ముందుగానే ట్రేదర్ ల్యాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టన్ మతి లేని వ్యాఖ్యలు చేశారు. మనదేశంలో మైనారిటీల హక్కులు బాగోలేవట. పత్రికలకు స్వేచ్ఛ లేదట. చట్టబద్ధమైన పరిపాలన సాగడం లేదట. పైగా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలలో దీనిపై ఆందోళన ఉందట. ఈ వ్యాఖ్యలను ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెదర్లాండ్స్ లో పర్యటించడానికి ముందు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు నెదర్లాండ్స్ పర్యటన ను మోడీ ముగించుకున్న తర్వాత స్వీడన్ వెళ్లిన తర్వాత మీడియాలో కనిపించడం విశేషం. పైగా ముస్లింల మీద భారతదేశంలో తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని.. ముస్లింలు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారని నెదర్లాండ్ ప్రధాని చెప్పడం విశేషం.

నెదర్లాండ్ ఆర్థికంగా ఒకప్పుడు స్థితివంతమైన దేశం కాదు. యూరోపియన్ యూనియన్ లో దేశమైన నెదర్లాండ్ పత్రిక స్వేచ్ఛలో ఏ ర్యాంకులో ఉంది.. చట్టబద్ధమైన పరిపాలనలో ఏ స్థాయిలో ఉంది. నెదర్లాండ్ జనాభా ఎంత.. భారత్ జనాభా ఎంత.. నెదర్లాండ్ ప్రధాని చెప్పినట్టుగా భారతదేశంలో మైనారిటీల మీద ఆ స్థాయిలో దాడులు జరుగుతుంటే.. పాకిస్తాన్లో ముస్లింలు భారత్ వస్తామని ఎందుకంటారు.. బలూచిస్తాన్ ప్రాంతంలో ముస్లింలు తమను భారత దేశంలో కలపాలని ఎందుకు డిమాండ్ చేస్తారు.. అక్కడిదాకా ఎందుకు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. దానిని ఆపే సత్తా కేవలం మోడీకి మాత్రమే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్ స్కి అభిప్రాయపడ్డారు. యూరోపియన్ యూనియన్ లో సభ్య దేశమైనప్పటికీ నెదర్లాండ్స్ ను యుద్ధం ఆపాలని కోరలేదు. దీనిని బట్టి భారత్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

నెదర్లాండ్ యూరోపియన్ యూనియన్ లో భాగం. ఒకప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు భారత్ మీద పడి ఎలా దోచుకున్నాయో అందరికీ తెలుసు. వర్తకం పేరుతో దోపిడీకి పాల్పడి.. ఇప్పుడు భారతదేశానికి నీతులు చెబుతున్న నెదర్లాండ్ ప్రభుత్వం తీరు పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. భారతదేశ మీద పడి పీకుతున్న మీరా.. మమ్మల్ని ప్రశ్నించేది.. తెల్ల తులు నాయాల్లారా అంటూ సోషల్ మీడియాలో భారతీయులు నెదర్లాండ్ మీద విపరీతంగా విమర్శలు చేస్తున్నారు.. మరోవైపు నెదర్లాండ్ ప్రధాని భారత్ మీద చేసిన విమర్శలకు.. మన దేశ విదేశీ విభాగం గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నార్వే పర్యటనలో ఆ దేశ విలేకరి ప్రశ్నకు స్ట్రాంగ్ సమాధానం ఇచ్చింది..”అసలు మీరెవరు
.. మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం మాకు ఏంటి. మానవ హక్కులను మీరు కాపాడతారని హామీ ఇస్తారా.. ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. భారత్ అనే దేశాల కంటే ముందుగానే మహిళలకు ఓటు హక్కు కల్పించింది. మానవ హక్కుల పరిరక్షణకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది. మనుషులను కాల్చి చంపుతున్న దేశాల కంటే భారత్ తీసి పోలేదు. భారత దేశంలో ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది. అందువల్లే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ కొనసాగుతోంది. ఈ విషయం మర్చిపోతే ఎలా అంటూ” భారత విదేశాంగ శాఖ ప్రశ్నించింది.

వయోపరిమితి పెంచి ఏం లాభం.. నోటిఫికేషన్ల జాడేది రేవంతూ..?

Telangana Govt Jobs Age Limit
Telangana Govt Jobs Age Limit

Telangana Govt Jobs Age Limit: మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళణ చేస్తాం. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం.. ఇవీ ఎన్నికల సమయంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరింది. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. కానీ ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగులు కాదు అందులో పావు వంతు కూడా భార్తీ చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్ష నిర్వహించిన వాటి ఫలితాలు ప్రకటించారు. జాబ్‌ క్యాలెండర్‌ మొక్కుబడిగా విడుదల చేసినా దానిని పాటించేది లేదు. 2026 ప్రారంభమై ఆరు నెలలు కావస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ లేదు. కానీ తాజాగా నిరుద్యోగులకు శుభరవ్తా అంటు రేవంత్‌ సర్కార్‌ ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏడాదిపాటు అమలు..
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపు ఒక సంవత్సరంపాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. పోలీసు, యూనిఫాం సర్వీసులకు అయితే ఈ సౌకర్యం వర్తించదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటికే పదేళ్లుపాటు సడలింపు ఇచ్చి, మరో రెండేళ్లు పొడిగించిన తర్వాత ఇప్పుడు మరో ఏడాది అంతర్జాలం జోడించింది. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు వయోపరిమితి పెంచామని ప్రభుత్వం చెబుతుంది. మరి నిరుద్యోగులు జాబ్‌ నోటిఫికేషన్లు కావాలని అడుగుతున్నారు. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మరి నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వడం లేదు.

నిజమైన లాభం ఉందా?
గరిష్ఠ వయోపరిమితిని పెంచడం ద్వారా 35–40 ఏళ్ల మధ్య ఉన్న యువకులు ఇంకా కొంతకాలం అవకాశం కోసం వేచి ఉండవచ్చు. ఇది వారి ఆశలను కాపాడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఉద్యోగ నోటిఫికేషన్లే రాకపోతే వయోపరిమితి పెంచడం వల్ల ప్రయోజనం ఏమిటి? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సంవత్సరాలుగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. ఖాళీలు ఉన్నా, ప్రకటనలు ఆలస్యంగా వెలువడుతున్నాయి. ఈ పరిస్థితిలో వయసు పెంచి యువకులను మరో ఏడాది ఎదురుచూపు వరుసలో ఉంచడం మినహా ప్రయోజనం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజమైన పరిష్కారం ఉద్యోగాలు భర్తీ చేయడం, సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వడం.

పదేళ్ల సడలింపు తర్వాత కూడా ఎదురు చూపులే..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లపాటు సడలించడం ద్వారా ప్రభుత్వం నిరుద్యోగులకు పెద్ద ఉపశమనం ఇచ్చినట్లు చెప్పుకుంది. పెద్దగా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. తర్వాత మరో రెండేళ్లు పొడిగించింది. ఇప్పుడు మళ్లీ ఒక పొడిగించారు. ఇంతకాలం సడలింపు ఇచ్చినా, ఉద్యోగావకాశాలు తగినంతగా పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి యువతను నిరాశకు గురి చేస్తోంది. వయసు పెరిగేకొద్దీ ప్రైవేట్‌ రంగంలో కూడా అవకాశాలు తగ్గుతాయి. ఫలితంగా, చాలా మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయి, మధ్య వయసులో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. వయోపరిమితి సడలింపు ఈ సమస్యను పరిష్కరించడం లేదు, కేవలం కాలం గడపడానికి సహాయపడుతోంది. వయోపరిమితి పెంచడం ఒక్కటే పరిష్కారం కాదు. సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి. ఖాళీలను త్వరగా భర్తీ చేయాలి. పోటీ పరీక్షల ప్రక్రియను సులభతరం చేయాలి.యువతకు నైపుణ్యాభివద్ధి శిక్షణలు అందించి, ప్రైవేట్‌ రంగ అవకాశాలను కూడా పెంచాలి.

నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి తాత్కాలిక ఉపాయాలు కన్నా దీర్ఘకాలిక వ్యూహాలు అవసరం. వయసు పెంచడం ద్వారా ఆశలు కల్పించడం మంచిదే కానీ, ఆ ఆశలను నెరవేర్చే ఉద్యోగాలు లేకపోతే ఇది కేవలం రాజకీయ హామీగా మిగిలిపోతుంది. యువత భవిష్యత్తు ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకూడదు. అయినప్పటికీ, ప్రభుత్వ బాధ్యతగా సకాలంలో అవకాశాలు కల్పించడం తప్పనిసరి. వయోపరిమితి పెంపు ఒక్కటే కాకుండా, నిజమైన ఉద్యోగ సృష్టి వైపు ప్రభుత్వం దృష్టి సారించాలి.

24 గంటల్లో 101 మిలియన్ వ్యూస్.. గ్లోబల్ వైడ్ సెన్సేషన్ సృష్టించిన 'పెద్ది' ట్రైలర్..

Peddi Trailer 101 Million Views
Peddi Trailer 101 Million Views

Peddi Trailer 101 Million Views: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా నిన్న మేకర్స్ ముంబై లో భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేసి అన్ని భాషల్లోనూ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి నెటిజెన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది కానీ, సోషల్ మీడియా లో మాత్రం సెన్సేషనల్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. రామ్ చరణ్ కి ఉన్నటువంటి గ్లోబల్ క్రేజ్ కారణంగా ఈ రేంజ్ వ్యూస్ వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. కేవలం యూట్యూబ్ లో మాత్రమే కాదు , ఇన్ స్టాగ్రామ్ , ట్విట్టర్ , ఫేస్ బుక్ ఇలా అన్ని యాప్స్ లోనూ ఈ చిత్రానికి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. ఇలా అన్ని సోషల్ మీడియా నెట్ వర్క్స్ నుండి ఈ చిత్రానికి 101 మిలియన్ వ్యూస్ వచ్చాయట.

కేవలం రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి ఈ సినిమా ట్రైలర్ కి 20 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే విధంగా యూట్యూబ్ లో ఈ ట్రైలర్ తెలుగు వెర్షన్ కి 38 మిలియన్ వ్యూస్ రాగా, హిందీ వెర్షన్ ట్రైలర్ కి 33 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మిగిలిన వెర్షన్స్ కి కలిపి యూట్యూబ్ లోనే 81 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకు ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ట్రైలర్ ఉండుంటే వేరే లెవెల్ లో ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగేవని , కానీ బ్యాడ్ లక్ అని అంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మూడవ పాటని ఈ నెల 22 న విడుదల చేయబోతున్నారు. భోపాల్ లో ఒక మ్యూజికల్ నైట్ ని నిర్వహించి , AR రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్ ద్వారా ఈ సాంగ్ రిలీజ్ కాబోతుంది.

అదే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రెండు ప్రాంతాల్లో నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ సినిమా నేపథ్యం విజయనగరం జిల్లాలో ఉంటుంది కాబట్టి, మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 2 న అక్కడే ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా రెండవ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో , ఎదో ఒక ఈవెంట్ లో రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేస్తారట. అదే విధంగా హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు సమాచారం.

మీరు మునిగింది కాక.. మిగతా జట్లను ముంచేస్తారా? ఐపీఎల్ లో ‘కొస’ మెరుపులు

Mumbai Indians
Mumbai Indians

Mumbai Indians: ఎలాగూ ప్లే ఆఫ్ అవకాశం లేదు. గెలిస్తే బోనస్. ఓడిపోతే మైనస్. విజయమో వీర స్వర్గమో.. ఇదిగో ఇలా సాగిపోతోంది ఆ జట్ల ఆట తీరు. అందువల్లే ఐపీఎల్ లో గడిచిన మ్యాచ్ లు చూసే వాళ్లకు విపరీతమైన ఆనందాన్ని పంచుతున్నాయి. దీంతో ఐపీఎల్ చివరి మ్యాచులు ఊహకు అందకుండా సాగుతున్నాయి.

ఐపీఎల్ లో గ్రూప్ సమరం దాదాపుగా ముగిసినట్టే. బెంగళూరు, హైదరాబాద్, గుజరాత్ ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి. మరో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంది. ఆ పోటీలో గెలవాలని చాలా జట్లు ఆరాటపడుతున్నాయి. టాప్ 2 స్థానంలో నిలిచే జట్టు గురించి కూడా విపరీతమైన ఉత్కంఠ ఏర్పడింది..

ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి తప్పకున్న జట్లు.. తదుపరి ముందడుగు వేసే అవకాశం దాదాపుగా కష్టం. అయితే ఈ జట్లు తమకంటే పై స్థానంలో ఉన్న జట్లతో ఒక ఆట ఆడుకుంటున్నాయి. అందువల్లే మ్యాచ్ ల స్వరూపం పూర్తిగా మారిపోతుంది. ఈ సీజన్లో ముంబై జట్టు, లక్నో ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్నాయి. అయితే ఈ జట్లు ఇటీవల మ్యాచులలో మాత్రం అదరగొట్టాయి. అనితర సాధ్యమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాయి. దీంతో ప్లే ఆఫ్ రేసు లో దూసుకుపోతున్న జట్లకు ముకుతాడు వేశాయి.

ఈ ఐపీఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన పంజాబ్ జట్టు.. ముంబై చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు బెంగళూరు చేతిలో గెలిచినా సరే పంజాబ్ ప్లే ఆఫ్ వెళుతుందనే నమ్మకం లేదు. లక్నో జట్టు కూడా చెన్నై జట్టును ఓడించింది. ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టతరం చేసింది. అంతేకాదు హైదరాబాద్ చేతిలో కూడా చెన్నై ఓడిపోయింది. తద్వారా తదుపరి మ్యాచ్లో గెలిచి.. మిగతా జట్ల సమీకరణాలు కలిసి వస్తేనే చెన్నై ప్లే ఆఫ్ వెళ్తుంది..

కోల్కతా ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే ఆ జట్టు గుజరాత్ మీద విజయం సాధించింది. 248 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ జట్టు చెన్నైని ఓడించడం ద్వారా గుజరాత్ ముందడుగు వేసింది. లేకుంటే ఆ జట్టుకు కూడా ఇబ్బందిగా ఉండేది. ఢిల్లీ క్యాపిటల్స్ సాంకేతికంగా మాత్రమే ప్లే ఆఫ్ రేసు లో ఉంది. అయితే ఈ జట్టు రాజస్థాన్ జట్టుకు షాక్ ఇచ్చింది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ముంబై, లక్నో జట్లు తమ తదుపరి మ్యాచ్లలో గౌరవప్రదమైన పోటీ ఇచ్చి.. విజయాలతో ఈ సీజన్ ముగించాలని భావిస్తున్నాయి. ఎందుకంటే విజయాల వల్లే జట్ల బ్రాండ్ విలువ పెరుగుతుంది. కాబట్టి లక్నో, ముంబై నుంచి రాయల్స్ జట్టుకు ఇబ్బంది తప్పదు. సాంకేతికంగా మాత్రమే ప్లే ఆఫ్ జాబితాలో ఉన్న కోల్కతా.. చివరి వరకు పోరాడాలని చూస్తోంది. మరో వైపు పంజాబ్ జట్టు లక్నోను ఎదుర్కోబోతోంది. ఈ విజయం పంజాబ్ జట్టుకు అత్యంత అవసరం. ప్రతి జట్టు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చివరి మ్యాచ్ లు అత్యంత రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.

నాకూ అతడి గతే పడుతుందేమో.. ఎవరీ పాస్టర్ అభినయ దర్శన్.. ప్రవీణ్ పగడాల కేసుతో ఏం సంబంధం.

Pastor Abhinaya Darshan Attack
Pastor Abhinaya Darshan Attack

Pastor Abhinaya Darshan Attack: ఏపీలో ఆ మధ్య రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల దారుణమైన స్థితిలో చనిపోయారు.. ఆయన మరణాన్ని చాలామంది హత్య అని పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో రోడ్డు ప్రమాదంలో చనిపోయారని తేలింది. పైగా ఆయన మద్యం కూడా తాగారని.. ఆ మత్తులోనే రోడ్డు ప్రమాదానికి గురై ఉంటారని ఏపీ పోలీసులు ప్రకటించారు. ప్రవీణ్ పగడాల మరణాన్ని కొంతమంది తమ రాజకీయానికి అనుకూలంగా మార్చుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తోందని.. ఆరోపించారు. చివరికి పోలీసులు విచారణ జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రవీణ్ కేసును మర్చిపోకముందే ఇప్పుడు ఏపీలో మరో పాస్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాస్టర్ మీద దాడి జరిగింది. గూడెం కొత్త వీధి మండలం మొండిగడ్డ పంచాయతీ నీరు తోటపాలెం దగ్గర ఓ పాస్టర్ మీద ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడికి గురైన పాస్టర్ పేరు అభినయ దర్శన్.. ఇతడు భరోసా పేరుతో ఒక పార్టీ పెట్టారు. కొద్దిరోజులుగా మన్యం ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు. పర్యటన ముగించుకొని మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆయన కారులో వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు ఆయన మీద దాడి చేశారు. ఈ ఘటనలో అభినయ దర్శన్ తీవ్రంగా గాయపడ్డారు.

పార్టీ పేరుతో అన్యమత ప్రచారం చేస్తున్నారని ఆ గుర్తు తెలియని వ్యక్తులు అభినయ దర్శన్ తో గొడవపడ్డారు. మొదట ఆయన వాహనం మీద గుడ్లు విసిరేశారు. ఆ తర్వాత కత్తులు.. ఇతర ఆయుధలతో అతని మీద దాడి చేశారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కిరణ్ జార్జ్, సుదర్శన్ అనే వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. పాస్టర్ అభినయ్ మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. గాయాల తాకిడికి ఆయన రోడ్డు పక్కన పడిపోయారు.. ప్రస్తుత వీరంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాము ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చామని.. మమ్మల్ని దాడి చేసి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉందని ప్రశ్నించారు. ఈ ఘటన తర్వాత జిల్లా ఎస్పీ అమిత్ సంఘటన స్థలానికి వెళ్లారు. స్థానిక పోలీసులనుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకోడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు తనలో పాస్టర్ ప్రవీణ్ మాదిరిగానే చంపడానికి కొంతమంది వ్యక్తులు వచ్చారని.. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని అభినయ దర్శన్ పేర్కొన్నారు. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది.

డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఏఐ.. ఈ ఉద్యోగాలు కాలగర్భంలో కలిసిపోయినట్టే..

AI Job Losses
AI Job Losses

AI Job Losses: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఆర్థిక మాంద్యం.. ఇంకా అనేక రకాల పరిణామాలు ప్రపంచ జాబ్ మార్కెట్ మొత్తాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో అన్ని రంగాలలో ఉన్న ఉద్యోగులను పక్కన పెడుతున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ నిరాటంకంగా సాగిపోతోంది. భారీ స్థాయిలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఏడాదికి కోట్లల్లో ప్యాకేజీలు తీసుకునే వారు కూడా భయపడిపోతున్నారు. జాబ్ గ్యారంటీ లేక దినదిన గండంగా జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ సులేమాన్ హెచ్చరికలు ఇప్పుడు ఐటి ఇండస్ట్రీని మరింత భయపెడుతున్నాయి.

సులేమాన్ చెప్పిన మాటల ప్రకారం వచ్చే 12 నుంచి 18 నెలల్లో వైట్ కాలర్ విభాగంలో చాలావరకు ఉద్యోగాలు కాలగర్భంలో కలిసిపోతాయని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా అకౌంటింగ్, లీగల్ వర్క్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, మార్కెటింగ్ వంటి రంగాలలో పనిచేసే వారంతా ఉద్యోగాలు కోల్పోతారని తెలుస్తోంది. కంప్యూటర్ల ముందు కూర్చొని చేసే ఉద్యోగాలు మొత్తం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా భర్తీ అవుతాయని సులేమాన్ హెచ్చరిస్తున్నారు.

మనుషుల స్థాయిని ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అందుకుంటున్న నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మార్కెటింగ్, అకౌంటింగ్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ వంటి కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలు కాలగర్భంలో కలిసిపోతాయని సులేమాన్ హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఈ విభాగాలలో 15 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇంకా తొలగింపుల ప్రక్రియ నిత్యం కొనసాగుతూ ఉంటుందని పేరు మోసిన ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే ఈ విభాగాలలో పని చేసేవారు వేరే మార్గాలు చూసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గెలుపు కోసం మమత పెద్ద స్కెచ్చే వేసింది.. బాప్ రే బీజేపీ గెలిచింది కాబట్టి సరిపోయింది..

Mamata Banerjee
Mamata Banerjee

Mamata Banerjee: అరాచకం నుంచి మొదలు పెడితే అన్యాయం వరకు.. అక్రమం నుంచి మొదలుపెడితే దుర్మార్గం వరకు.. దౌర్జన్యం నుంచి మొదలుపెడితే హింస వరకు.. ఇలా ఎన్ని పదాలుంటే అన్ని పదాలు.. వెస్ట్ బెంగాల్లో మమతా పరిపాలనకు సరిపోవు. గుండా రాజ్ దర్జాగా సాగింది. రక్తపాతం అడ్డు లేకుండా నడిచింది. 15 సంవత్సరాలు పాటు వెస్ట్ బెంగాల్ రావణకాష్టం లాగా రగిలిపోయింది.

చివరికి ప్రజలకు ఆగ్రహం కలిగి. మమత పరిపాలనకు ఎండ్ కార్డు పడింది. అయితే ఇక్కడే ఆమె అక్రమ పరిపాలనకు సంబంధించిన ఒక్కొక్క అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత బెంగాల్ రాష్ట్రంలో టిఎంసి కార్యాలయాలు మూతపడ్డాయి. మొన్నటిదాకా ఒక వెలుగు వెలిగిన ఆ కార్యాలయాలు ఇప్పుడు అమావాస్య చీకటిని తలపిస్తున్నాయి. ఇటీవల కోల్కతా నగరంలోని బిధాన్ నగర్ పరిధిలోని డివిజన్ కార్యాలయాన్ని తెరిచారు. అందులో కుప్పలుగా ఆధార్ కార్డులు బయటపడ్డాయి.

అవన్నీ కూడా పోస్టల్ శాఖ ద్వారా ప్రజలకు అందాల్సి ఉంది. వాటిని అందకుండా టీఎంసీ కార్యకర్తలు తమ వద్ద ఉంచుకున్నారు. ఆ ఆధార్ కార్డులు మొత్తం బిజెపి కార్యకర్తలవి. పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ సర్ అనే విధానాన్ని అవలంబించింది. అందులో ఆధార్ కార్డును కూడా స్వీకరించింది. ఆధార్ కార్డును అందకుండా చేసి బిజెపి కార్యకర్తల ఓట్లను దూరం చేయాలని మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలు భావించారు. ఎన్నికల్లో బిజెపి అధికారం సాధించిన తర్వాత.. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్పడిన అన్యాయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది కేవలం ఒక వార్డు పరిధిలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉందని అక్కడి బిజెపి నాయకులు చెబుతున్నారు.

ఆధార్ కార్డులను దగ్గర పెట్టుకొని బిజెపి కి ఓట్లు పడకుండా చేసేందుకు టీఎంసీ కార్యకర్తలు అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడ్డారు. చివరికి పోస్టల్ శాఖను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆధార్ కార్డులను అందకుండా చేశారు.. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తల దుర్మార్గాలు సాగలేదు. చివరికి ప్రజాస్వామ్యంలో అణిచివేతకు అవకాశం లేదని బెంగాల్ ప్రజలు తీర్పు చెప్పారు. దీంతో బిజెపి అధికారంలోకి వచ్చింది. 15 సంవత్సరాల టీఎంసీ దుర్మార్గ పరిపాలనకు చరమగీతం లభించింది.

గ్లోబల్ డాన్ గా పవన్ కళ్యాణ్.. 'ఓజీ 2' స్టోరీ ని వేరే లెవెల్ కి తీసుకెళ్తున్న సుజిత్..

Pawan Kalyan OG 2
Pawan Kalyan OG 2

Pawan Kalyan OG 2 Story: గడిచిన 12 ఏళ్లలో పవన్ కళ్యాణ్ అభిమానులకు గూస్ బంప్స్ రప్పించిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది ‘ఓజీ’ నే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం , ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినప్పటికీ, పర్వాలేదు అనే రేంజ్ టాక్ రావడం తో , ఓపెనింగ్స్ నుండి క్లోజింగ్ వరకు సేసెన్షనల్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. ప్రస్తుతం సోషల్ మీడియా లో మీమర్స్ కి ఓజీ ఒక ఆయుధం లాగా మారిపోయింది. ఏదైనా ఒక సందర్భాన్ని ఎలివేట్ చెయ్యాలంటే ఓజీ చిత్రం లోని సన్నివేశాలను ఉపయోగిస్తున్నారు. జెన్ జీ ఆడియన్స్ లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ అలాంటిది మరీ. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది , అదే విధంగా ప్రీక్వెల్ కూడా ఉంటుందని సుజిత్ ఇది వరకే అధికారిక ప్రకటన చేశాడు.

రీసెంట్ గానే ఆయన ప్రీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేశాడు. ప్రస్తుతం సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ప్రీక్వెల్ లో ముంబై ని వదిలి , తన సొంత గూటి అయినటువంటి జపాన్ కి వెళ్లిన ‘ఓజాస్ గంభీర’ అక్కడ మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడు? , మాస్టర్ ఓరొచ్చి గెంషిన్ గా తన సమురాయ్ సైన్యాన్ని ఎలా నిర్మించుకున్నాడు? , సమురాయ్ లను అంతం చెయ్యాలని చూసిన ‘యాకూజా’ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేశాడు? వంటి సంఘటనలు ప్రీక్వెల్ లో చూపిస్తారట. అదే విధంగా ఓజాస్ గంభీర్ బాల్యం, అతని తండ్రి ఆజాద్ హింద్ ఫోజ్ హిస్టరీ, ఆజాద్ కి సుభాష్ చంద్రబోస్ తో ఉన్న కనెక్షన్ వంటివి ప్రీక్వెల్ లో చూపించబోతున్నారు.

ఇక సీక్వెల్ లో అయితే ‘ఓజాస్ గంభీర’ ఈ ప్రపంచాన్ని వణికించే డాన్ గా చూపించబోతున్నారట. జపాన్ , ముంబై లో ఓజాస్ గంభీర సృష్టించిన ప్రకంపనలు , ప్రపంచం మొత్తం పాకడం , ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ లో ఆయా సృష్టించే భీభత్సాన్ని చూసి , ప్రపంచం లోని డాన్స్ , రాజకీయ నాయకులూ మొత్తం ఓజాస్ గంభీర కంట్రోల్ లోకి రావడం వంటివి సీక్వెల్ లో చూపిస్తారట. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని అభిమానులు కలలో కూడా ఊహించనంత పవర్ ఫుల్ గా చూపించేలా స్క్రిప్ట్ ని డిజైన్ చేస్తున్నాడట సుజిత్. ఈ ఏడాది లోనే ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తపు కార్యక్రమాలు జరుగుతాయని , వచ్చే ఏడాది జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందని అంటున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ లో 'కోర్ట్' ఫేమ్ శ్రీదేవి.. బంపర్ ఛాన్స్ కొట్టేసిందిగా..

Rajinikanth New Movie Heroine
Rajinikanth New Movie Heroine

Rajinikanth New Movie Heroine: అదృష్టం అంటే ఇదేనేమో.. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ పాపులారిటీ ని సంపాదించిన శ్రీదేవి , ఏకంగా నేచురల్ స్టార్ నాని దృష్టిలో పడడం , ఆయన నిర్మాతగా వ్యవహరించబోయే ‘కోర్ట్’ చిత్రం లో ఆమెని హీరోయిన్ గా తీసుకోవడం , అది విడుదలై సంచలన విజయం సాధించడం వంటివి శ్రీదేవి కి జాక్ పాట్ అనే చెప్పొచ్చు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో , ఆమెకు అవకాశాలు క్యూలు కట్టాయి. అలా శ్రీదేవి నుండి విడుదలైన రెండవ చిత్రం ‘బ్యాండ్ మేళం’ కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆమెకు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ విషయాన్నీ ఆమె పరోక్షంగా చెప్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

1991 వ సంవత్సరం లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన తలపతి చిత్రం లోని ఒక ఐకానిక్ ఫోజుని ఇమిటేట్ చేస్తూ స్టైల్ గా నిలబడి శ్రీదేవి ఒక ఫోటో దిగింది. దీన్ని చూసిన నెటిజెన్స్ తావరలోనే కమల్ హాసన్ నిర్మాణం లో రజినీకాంత్ హీరో గా నటిస్తున్న సినిమాలో శ్రీదేవి ఒక కీలక పాత్ర పోషిస్తుందని , ఆ కారణం చేతనే ఆమె ఇలా పరోక్షంగా స్టోరీ ని అప్లోడ్ చేసిందని అంటున్నారు విశ్లేషకులు. ఈమధ్య కాలం లో హీరోయిన్స్ ఇలా క్రియేటివిటీ ని జోడించి పరోక్షంగా హింట్స్ ఇస్తున్నారు. శ్రీదేవి కూడా అలాగే ఇచ్చిందని అంటున్నారు. మరి ఈ విషయం పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇప్పటికే శ్రీదేవి కోలీవుడ్ లో బాగా బిజీ అయ్యింది. కేజీఆర్ సరసన ఆమె ఒక చిత్రం లో నటిస్తోంది.

ఇంతలోపే ఈ క్రేజీ ఆఫర్ ఆమెకు దక్కడం ఆమె లైఫ్ లో సాధించిన పెద్ద అఛీవ్మెంట్ గా చెప్పొచ్చు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ కి అయినా రజినీకాంత్ సినిమాలో చిన్న రోల్ దొరికితే చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే రజినీకాంత్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది , విదేశాల్లో ఆయన సినిమాలను ఆడియన్స్ ఎగబడి చూస్తుంటారు, అలాంటి సూపర్ స్టార్ సినిమాలో చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు, ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ కి పరిచయం అవుతాము అనే ఉద్దేశ్యం తో , ప్రతీ ఒక్కరు రజిని సినిమాలో నటించాలని కోరుకుంటారు , అలాంటి అవకాశం శ్రీదేవి కి కెరీర్ ప్రారంభం లోనే రావడం చిన్న విశేషం కాదు , దీన్ని ఆమె ఎంత వరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.

15 ఏళ్లుగా మమత అడ్డుకుంది.. సుబేందు 15 నిమిషాల్లో చేసేశాడు..

Suvendu Adhikari
Suvendu Adhikari

Suvendu Adhikari: 15 సంవత్సరాలుగా అడ్డుకుంటూనే ఉంది.. జాతి ప్రయోజనాలు ఆమెకు అవసరం లేదు. దేశ ప్రయోజనాలు అవసరం లేదు. ఆమెకు కావాల్సింది ఓటు బ్యాంకు రాజకీయాలు. తన అధికారం కోసం.. ఆ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం ఏకంగా దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది. చివరికి 15 సంవత్సరాల పాటు దేశ భద్రతతో ఆడుకుంది. చివరికి పాపం పండి ఓడిపోయింది.

15 సంవత్సరాల పరిపాలన కాలంలో వెస్ట్ బెంగాల్లో మమత బెనర్జీ సృష్టించిన అరాచకాలు మామూలువి కావు. చివరికి తన అధికారాన్ని పదిలం చేసుకోవడానికి బంగ్లాదేశ్ మంచి వచ్చిన వారికి ఓటు హక్కు.. ఆధార్ కార్డు వంటి సదుపాయాలు కల్పించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక మతం వారికి విపరీతమైన ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బెంగాల్ రాష్ట్రం పూర్తిగా అదుపు తప్పిపోయింది. కేంద్రం పాటు లేకుండా పోయింది. దేశ భద్రతపరంగా అత్యంత సున్నితమైన ఈ రాష్ట్రంలో అక్రమ చొర బాట్లు నిత్యం జరగడం మొదలుపెట్టాయి. చివరికి మమత ఆగడాలు తట్టుకోలేక అక్కడి ప్రజలు ఇటీవల ఎన్నికల్లో బిజెపికి అధికారాన్ని కట్టబెట్టారు. ఫలితంగా అక్కడ విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

బెంగాల్ రాష్ట్రంలో చికెన్ నెక్ రహదారి అత్యంత ముఖ్యమైనది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలకు ఇది సరిహద్దుగా ఉంది. ఈ రహదారి పొడవు 122 కిలోమీటర్లు ఉంటుంది. 22 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దీని భద్రతను ఇకపై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చూసుకుంటుంది.. ఈ కారిడార్ చుట్టూ బిఎస్ఎఫ్ కంచె నిర్మిస్తుంది. దీనివల్ల సరిహద్దు దేశాల నుంచి చొరబాట్లు రాకుండా ఉంటాయి.. కేవలం చైనా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మాత్రమే కాకుండా.. మనదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ పెంచడంలో చికెన్ నెక్ రహదారి అత్యంత కీలకం.. ఈ రహదారికి సంబంధించిన 120 ఎకరాలను వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సుబేందు అధికారి బిఎస్ఎఫ్ కు అప్పగించారు. 15 సంవత్సరాల పాటు ఇలా ఇవ్వకుండా మమతా బెనర్జీ కేంద్రాన్ని ఇబ్బంది పెట్టింది. సుబేందు మాత్రం కేవలం 15 నిమిషాల్లోనే దీనిని బిఎస్ఎఫ్ కు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారిడార్ పరిధిలో ఉన్న ఏడు ప్రాంతాలలో రోడ్లను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అత్యంత ఆధునిక పద్ధతిలో నిర్మిస్తుంది.

ఈ ప్రాంతంలో వర్షాలు పడటం వల్ల కొండ చరియలు విరిగిపడేవి. దీంతో ఈశాన్య రాష్ట్రాలకు రాకపోకలు అంతగా ఉండేవి కాదు. ఈ రహదారిని అప్పగించాలని కేంద్రం అనేక సందర్భాలలో విజ్ఞప్తి చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మమత ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. చివరికి బెంగాల్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో చికెన్ నెక్ రహదారి బిఎస్ఎఫ్ ఆధీనంలోకి వచ్చేసింది. తద్వారా ఇక్కడ కంచె నిర్మాణం వేగవంతం కానుంది. అంతేకాదు ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుంది.

కొత్త కెప్టెన్ అన్నారు.. గిల్ వైపే మొగ్గు చూపించారు.. ఏం జరిగి ఉంటుంది..

Shubman Gill IND vs AFG
Shubman Gill IND vs AFG

Shubman Gill IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఒక టెస్ట్, 3 వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మన దేశం వేదికగా జూన్ నెలలో ఈ సిరీస్ లు జరుగుతాయి. టెస్ట్, వన్డేలకు టీమిండియా సారధిగా గిల్ వ్యవహరిస్తాడు.

గిల్ సారధిగా ఉంటాడని కోచ్ అజిత్ చెప్పడం స్పోర్ట్స్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే టీమిండియా వన్డే సారధిగా గిల్ ను తప్పించి అయ్యర్ ను నియమిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వన్డేలలో గిల్ నాయకత్వంలో టీమిండియా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. దీనికి తోడు గిల్ వ్యక్తిగత ప్రదర్శన కూడా అంత గొప్పగా లేదు. టెస్టులలో కూడా గిల్ అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. దీంతో అతని స్థానంలో అయ్యర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది.

సారధి మార్పుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.. పరోక్షంగా అదేవిధమైన సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ ఐపీఎల్ ప్రారంభంలో పంజాబ్ జట్టు సారధిగా ఉన్న అయ్యర్.. జట్టుకు వరుస విజయాలు సాధించి పెట్టాడు. ఆ తర్వాత వరుస ఓటములతో పంజాబ్ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. వరుస విజయాలు సాధించిన ఆ జట్టు.. ఇప్పుడు వరుస ఓటములతో ఇబ్బంది పడుతోంది. చివరికి ప్లే ఆఫ్ వెళ్లడానికి ఇతర జట్ల గెలుపుల మీద ఆధార పడాల్సిన దుస్థితి నెలకొంది.

పంజాబ్ జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోయాడనే కారణంతో అయ్యర్ ను సారధిగా ఎంపిక చేయలేదని తెలుస్తోంది. అందువల్లే అతనికి వన్డే జట్టులో అవకాశం కల్పించారు. ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో వన్డే సిరీస్ లో ఆడుతున్నప్పుడు అయ్యర్ గాయపడ్డాడు. చాలా రోజుల వరకు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లో సత్తా చూపిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగే సిరీస్లో కాకున్నా.. వచ్చే సిరీస్ లో నైనా అతడికి సారధిగా అవకాశం లభించవచ్చని స్పోర్ట్స్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

నెలకు 40 లక్షలు ఇస్తేనే విడాకులు ఇస్తానంటూ స్టార్ హీరో టార్చర్ పెడుతున్న సతీమణి..

Jayam Ravi wife demands alimony
Jayam Ravi wife demands alimony

Jayam Ravi wife demands alimony: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో జయం రవి విడాకులకు సంబంధించిన విషయం పై ఏ రేంజ్ లో చర్చలు నడుస్తున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం. దశాబ్దాల నుండి తమిళనాడు లో టాప్ హీరో గా కొనసాగుతున్న జయం రవి , తన భార్య ఆర్తి పెట్టే మానసిక క్షోభ ని తట్టుకోలేక మీడియా ముందుకొచ్చి బాధ పడడం ఆయన అభిమానులకు మాత్రమే కాదు , ఇతరులకు కూడా చాలా బాధగా అనిపించింది. మనకే ఇలా ఉంటే , ఇక జయం రవి పిల్లలకు తన తండ్రి అలా మీడియా ముందుకొచ్చి ఏడుస్తుంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇద్దరు పిల్లలకు జయం రవి అంటే చాలా ఇష్టం , జయం రవి కి కూడా తన పిల్లలు అంటే ప్రాణం. కానీ ఆర్తి వీళ్ళని కలవనివ్వకుండా చేస్తుంది, అందుకు బాడీ గార్డ్స్ ని కూడా పెట్టుకోవడం గమనార్హం.

ఇవన్నీ మీడియా ముందు చెప్పుకొని బోరుమని ఏడ్చాడు జయం రవి. అంతే కాదు , ఆమెని పెళ్లి చేసుకున్న రోజు నుండి నాకంటూ ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ లేదని, నా భార్య ఆర్తి తో కలిపి జాయింట్ అకౌంట్ మాత్రమే ఉందని , ఒక్క పైసా తీసుకోవాలన్నా ఆమె అనుమతి ఉండాలని , పొరపాటున ఆమెకు తెలియకుండా చిన్న అమౌంట్ డ్రా చేసి తీసుకున్నా పెద్ద గొడవ చేస్తుందని ఆయన మీడియా ముందుకొచ్చి చెప్పుకున్న మాటలు అందరినీ కదిలించేశాయి. ఆర్తి తో విడాకులు తీసుకునే వరకు నేను సినిమాలు చెయ్యనని , చేసిన సినిమాలను కూడా నిలిపిస్తున్నాని జయం రవి సంచలన నిర్ణయం కూడా తీసుకున్నాడు. అయితే ఈ అంశం ఇప్పుడు కోర్టు లో ఉంది. విడాకులు ఇవ్వాలంటే ఆర్తి పెట్టిన కండీషన్స్ ని చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోవాల్సిందే.

విడాకులు ఇవ్వాలంటే , జీవితాంతం జయం రవి నాకు నెలకు 40 లక్షల రూపాయిలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుంది. నెలకు 40 లక్షలు అంటే సంవత్సరానికి 4.8 కోట్లు రూపాయిలు. జయం రవి ఒక్క సినిమా చేయడానికి ఏడాది సమయం తీసుకుంటాడు , ఆయన రెమ్యూనరేషన్ 5 నుండి 6 కోట్ల రూపాయలకు మించి కూడా ఉండదు , ఒక్కోసారి ఆయన ఏడాది మొత్తం సినిమాలు చేయకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి . ఇలా నెలకు 40 లక్షల రూపాయిలు అంటే , జయం రవి ఆస్తులు అమ్ముకున్నా ఆమెని మైంటైన్ చేయడానికి సరిపోదు , పాపం నీ బాధ పగోడికి కూడా రాకూడదు అంటూ సోషల్ మీడియా లో జయం రవి పై జాలి చూపిస్తున్నారు నెటిజెన్స్.

టూరిజం శాఖలో జనసేన మార్క్.. చరిత్ర తిరగరాసిన కందుల దుర్గేష్..

Kandula Durgesh tourism reforms
Kandula Durgesh tourism reforms

Kandula Durgesh tourism reforms: కూటమి ప్రభుత్వం లో జనసేన పార్టీ తన మార్క్ పాలన ని చూపిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖలో సృష్టిస్తున్న అద్భుతాలు చూస్తూనే ఉన్నాం. 2 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వకముందే, ఈ శాఖని దేశం లోనే నెంబర్ 1 గా నిలిపి , 19 నేషనల్ అవార్డ్స్ ని దక్కించేలా చేశాడు, ఇది నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో గర్వకారణమైన విషయం. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు , ఆ పార్టీ కి ఇచ్చిన మిగతా మంత్రిత్వ శాఖలు కూడా బలంగా పని చేస్తున్నాయి , సమాజం లో మార్పులు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా టూరిజం శాఖని అభివృద్ధి చేయడం కోసం కందుల దుర్గేష్ అహర్నిశలు కృషి చేస్తున్నాడు.

రీసెంట్ గానే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖకు 8 టూరిజం ప్రాజెక్ట్స్ కి గానూ 428 కోట్ల రూపాయిలు కేటాయించింది. ఈ నిధులతో సూర్యలంక బీచ్ , బొర్రా కేవ్స్ , అఖండ గోదావరి, గండికోట , అన్నవరం , సింహాచలం, అహోబిలం , శ్రీ క్షేత్ర అహోబిలం ప్రాంతాలను అభివృద్ధి చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో కందుల దుర్గేష్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పవన్ కళ్యాణ్ తన శాఖల మీద మాత్రమే కాకుండా, ఇతర శాఖల మీద కూడా ద్రుష్టి పెట్టడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని, రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ పాలనలో తన అద్భుతమైన మార్కుని చూపించి , తమ శాఖలను దేశం లోనే ది బెస్ట్ గా నిలుపుతారని సోషల్ మీడియా లో అభిమానులు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ అంశం పై సోషల్ మీడియా లో జనసేన , తెలుగు దేశం పార్టీ అభిమానుల మధ్య గొడవలు చెలరేగేలా చేశాయి. తెలుగు దేశం పార్టీ హ్యాండిల్ నుండి శుభాకాంక్షలు తెలుపుతూ , టూరిజం శాఖకు సంబంధించిన కందుల దుర్గేష్ ని కాకుండా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ని ఫోటో లో చేర్చడం పై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.