Today 20 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాసులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ధన లాభం ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి నిరుద్యోగులకు ఈరోజు అద్భుతమైన అవకాశాలు అందుతాయి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పెండింగు పనులను పూర్తి చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. పిల్లల కెరీర్ పై తల్లితండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు స్నేహితుల సలహా తీసుకుంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు . ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు రావడంతో వ్యాపారులు సంతోషంగా గడుపుతారు. అదనపు పెట్టుబడుల కోసం పెద్దలను సంప్రదిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులు అన్ని పూర్తి చేస్తారు. దీంతో ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థికంగా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయం చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. స్నేహితుల మద్దతుతో అప్పుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పై చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల సపోర్టు ఉంటుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు అందుతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. పోటీ పరీక్షలో రాణించడానికి తల్లిదండ్రుల మద్దతు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకోకుండా కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు అందుతాయి. చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఊహించిన దానికంటే అధికంగా ఇంట్లోకి డబ్బు వస్తుంది. నీతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఆదాయాన్ని పెంచుకునేందుకు శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండాలి.
















ప్రపంచ దేశాలపై పడి పీక్కుతిన్న మీరా భారత్ ను ప్రశ్నించేది.. తెల్లతోలు నాయాల్లారా..
India Vs Netherlands Controversy: నూరు గొడ్లను తిన్న రా బందు.. శాంతి వచనాలు వల్లిస్తే ఎలా ఉంటుంది.. మనుషులను దారుణంగా చంపేసే నేరస్థుడు.. ఉపదేశాలు చెబితే ఎలా ఉంటుంది.. ఇప్పుడు నెదర్లాండ్ వ్యవహార శైలి కూడా అలానే ఉంది. మనిషి ముందు ఒక మాట.. మనిషి వెనుక ఒక మాట మాట్లాడిన ఆ దేశం.. ఇప్పుడు భారత్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నది.
ప్రస్తుతం మోదీ నార్వే, నెదర్లాండ్స్ దేశాలలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు ముందుగానే ట్రేదర్ ల్యాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టన్ మతి లేని వ్యాఖ్యలు చేశారు. మనదేశంలో మైనారిటీల హక్కులు బాగోలేవట. పత్రికలకు స్వేచ్ఛ లేదట. చట్టబద్ధమైన పరిపాలన సాగడం లేదట. పైగా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలలో దీనిపై ఆందోళన ఉందట. ఈ వ్యాఖ్యలను ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెదర్లాండ్స్ లో పర్యటించడానికి ముందు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు నెదర్లాండ్స్ పర్యటన ను మోడీ ముగించుకున్న తర్వాత స్వీడన్ వెళ్లిన తర్వాత మీడియాలో కనిపించడం విశేషం. పైగా ముస్లింల మీద భారతదేశంలో తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని.. ముస్లింలు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారని నెదర్లాండ్ ప్రధాని చెప్పడం విశేషం.
నెదర్లాండ్ ఆర్థికంగా ఒకప్పుడు స్థితివంతమైన దేశం కాదు. యూరోపియన్ యూనియన్ లో దేశమైన నెదర్లాండ్ పత్రిక స్వేచ్ఛలో ఏ ర్యాంకులో ఉంది.. చట్టబద్ధమైన పరిపాలనలో ఏ స్థాయిలో ఉంది. నెదర్లాండ్ జనాభా ఎంత.. భారత్ జనాభా ఎంత.. నెదర్లాండ్ ప్రధాని చెప్పినట్టుగా భారతదేశంలో మైనారిటీల మీద ఆ స్థాయిలో దాడులు జరుగుతుంటే.. పాకిస్తాన్లో ముస్లింలు భారత్ వస్తామని ఎందుకంటారు.. బలూచిస్తాన్ ప్రాంతంలో ముస్లింలు తమను భారత దేశంలో కలపాలని ఎందుకు డిమాండ్ చేస్తారు.. అక్కడిదాకా ఎందుకు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. దానిని ఆపే సత్తా కేవలం మోడీకి మాత్రమే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్ స్కి అభిప్రాయపడ్డారు. యూరోపియన్ యూనియన్ లో సభ్య దేశమైనప్పటికీ నెదర్లాండ్స్ ను యుద్ధం ఆపాలని కోరలేదు. దీనిని బట్టి భారత్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
నెదర్లాండ్ యూరోపియన్ యూనియన్ లో భాగం. ఒకప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు భారత్ మీద పడి ఎలా దోచుకున్నాయో అందరికీ తెలుసు. వర్తకం పేరుతో దోపిడీకి పాల్పడి.. ఇప్పుడు భారతదేశానికి నీతులు చెబుతున్న నెదర్లాండ్ ప్రభుత్వం తీరు పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. భారతదేశ మీద పడి పీకుతున్న మీరా.. మమ్మల్ని ప్రశ్నించేది.. తెల్ల తులు నాయాల్లారా అంటూ సోషల్ మీడియాలో భారతీయులు నెదర్లాండ్ మీద విపరీతంగా విమర్శలు చేస్తున్నారు.. మరోవైపు నెదర్లాండ్ ప్రధాని భారత్ మీద చేసిన విమర్శలకు.. మన దేశ విదేశీ విభాగం గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నార్వే పర్యటనలో ఆ దేశ విలేకరి ప్రశ్నకు స్ట్రాంగ్ సమాధానం ఇచ్చింది..”అసలు మీరెవరు
.. మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం మాకు ఏంటి. మానవ హక్కులను మీరు కాపాడతారని హామీ ఇస్తారా.. ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. భారత్ అనే దేశాల కంటే ముందుగానే మహిళలకు ఓటు హక్కు కల్పించింది. మానవ హక్కుల పరిరక్షణకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది. మనుషులను కాల్చి చంపుతున్న దేశాల కంటే భారత్ తీసి పోలేదు. భారత దేశంలో ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది. అందువల్లే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ కొనసాగుతోంది. ఈ విషయం మర్చిపోతే ఎలా అంటూ” భారత విదేశాంగ శాఖ ప్రశ్నించింది.