Xiaomi 17T new smartphone launch: Xiaomi తన సరికొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ సిరీస్లో భాగంగా Xiaomi 17Tని భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు ఈ షియోమీ నుంచి వినియోగదారులను ఆకట్టుకునే మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు లేటేస్ట్ టెక్నాలజీతోవస్తున్న దీనిపై అంచనాలు ఎక్కువవయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితె..
Xiaomi 17T స్మార్ట్ఫోన్ 6.59-అంగుళాల AMOLED డిస్ప్లేతో రానుంది. ఇది 1.5K రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్గా ఉంటుంది. దీనికి TÜV రీన్ల్యాండ్ ఐ-కేర్ సర్టిఫికేషన్ కూడా లభించింది. దీంతో ఇది కళ్ళపై ఒత్తిడిని తగ్గిస్తుంది.ఈ ఫోన్ మీడియాటెక్ యొక్క శక్తివంతమైన Dimensity 8500 Ultra ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్ , హై-ఎండ్ పర్ఫార్మెన్స్ను సులభతరం చేస్తుంది. సాఫ్ట్వేర్ పరంగా, ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ఓఎస్ పై పనిచేయనుంది.
ఈ స్మార్ట్ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ ఇందులో ఉండే Leica-tuned ట్రిపుల్ కెమెరా సెటప్. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ , 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ పనిచేస్తుంది. ఇది 120x వరకు డిజిటల్ జూమ్ను సపోర్ట్ చేస్తుందని, తద్వారా ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది ఒక ‘టెలిఫోటో మాస్టర్’గా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది. Xiaomi 17Tలో 6,500 mAh సామర్థ్యం గల భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించనున్నారు. ఇది సుదీర్ఘ కాలం పాటు ఫోన్ ఛార్జింగ్ నిలిచి ఉండేలా చేస్తుంది. దీనికి తోడు, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా ఇందులో చేర్చారు. దీనివల్ల తక్కువ సమయంలోనే ఫోన్ ఛార్జ్ అవుతుంది.
షియోమీ 17T స్మార్ట్ఫోన్ భారత్లో జూన్ 04, 2026న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. చాలా కాలం తర్వాత షియోమీ తన ‘T’ సిరీస్ ఫోన్ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకువస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది.















తెలంగాణ జనసేన నాయకులు ఇచ్చి పడేశారు.. ప్రొ. నాగేశ్వర్ అభిమానులు ష్ గప్ చుప్
Telangana Janasena leaders: అనవసరం ఏపీ రాజకీయాలలో వేలుపెట్టి.. అనవసరమైన మాటలు మాట్లాడి.. పైగా యుద్దం ప్రారంభం.. ముగింపు అంటూ వ్యాఖ్యలు చేసింది ప్రొఫెసర్ నాగేశ్వర్. అంతే కాదు, కొంతమంది జర్నలిస్టులను వెంట పెట్టుకుని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ కూడా పెట్టారు ప్రొఫెసర్ నాగేశ్వర్.
అక్కడ తనకు జరగుతున్న ఇబ్బందుల మీద, నమోదైన కేసుల మీద, ఇంకా తనకు ఎదురవుతున్న వేధింపుల మీద మాట్లాడాల్సిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. తనను విక్టిమ్ గా అక్కడ పరిచయం చేసుకున్నారు. తన మీదకు ఆంధ్రా పోలీసులు వస్తున్నట్టు.. వారు దాడులు చేస్తున్నట్టు ప్రచారం చేసుకున్నారు. ఇక ఆయనకు వంత పాడే వారంతా స్థాయి మరిచి విమర్శలు చేశారు.
బక్కా జడ్సన్ , ప్రథ్వీ రాజ్ లాంటి వాళ్లయితే ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుట్ర చేశారని, వారికి రేవంత్ వంత పాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వాళ్ల మీద ఆంధ్రా వాళ్లు కుట్ర చేస్తున్నారని, నాగేశ్వర్ భుజం మీద తుపాకీ పెట్టి తమ మీద ఫైరింగ్ చేస్తున్నారని.. ఇలా అడ్డగోలుగా మాట్లాడారు. చివరికి ఈ వ్యహారానికి ఆంధ్రా , తెలంగాణ సెంటిమెంట్ కూడా పూసేందుకు వెనుకాడ లేదు.
బక్కా జడ్సన్, ప్రథ్వీరాజ్ లాంటి వాళ్లు తమ స్థాయి మరిచి పవన్ కల్యాణ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో తెలంగాణ జనసేన నాయకులు తెరమీదకు వచ్చారు. ఎక్కడయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ విలేకరుల సమావేశం పెట్టి జనసేన, టీడీపీ నాయకుల మీద విమర్శలు చేశాడో.. అక్కడే వారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అనుచరుల కంటే ఎక్కువ స్వరంతో విమర్శించారు.
‘మేమంతా ఎస్సీలమే, దళితులమే. తెలంగాణ ఉద్యమంలో ముందుభాగంలో నిలిచినవాళ్లమే. నిన్న ఏమో మాట్లాడిర్రు కదరా.. ఇప్పుడు మేమొచ్చినం. తెలంగాణ మీ సొత్తా, మీ జాగీరా, తొక్కి నార తీస్తం. ఏమోపీకుతామని అడ్డంపొడువు మాటలు మాట్లాడిర్రు కదరా.. ఇప్పుడు రండి’ అంటూ తీవ్రస్వరంతో మాట్లాడారు. జన సేన నాయకులు కూడా సాలిడ్ కౌంటర్ ఇవ్వడంతో ఏం చేయలేని పరిస్థితి ప్రొఫెసర్ నాగేశ్వర్ అనుచరులకు ఏర్పడిందని, గత్యంతరం లేక వారు సైలెంట్ అయిపోయారని జనసేన నాయకులు అంటున్నారు.