Today 3 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అద్భుతమైన అవకాశాలు ఉండలున్నాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఉద్యోగులు అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చేముందు ఆలోచించాలి. దీర్ఘ కాలిక దృష్టిని పెట్టుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే ఈ సమయంలో పెద్దలను సంప్రదించడం మంచిది. ఉద్యోగులకు అనుకోకుండా అపారమైన ప్రయోజనాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికపరమైన విషయాల్లో అన్ని విజయాలు సాధిస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. గ్రహాల అనుకూలతతో అన్నిట్లోనూ విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి ఇంట్లో ఈరోజు శుభప్రదం గా ఉంటుంది. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్తగా వస్తువులు కొనే సమయంలో నాణ్యతను దృష్టిలో ఉంచుకోవాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అపారమైన అవకాశాలు అందుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకునే వారికి కీలక సమాచారం అందుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారు ఈరోజు ఆర్థికంగా ప్రణాళికతో ముందుకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. శుక్రుడి అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. ఆసక్తిని బట్టి అవకాశాలు ఉంటాయి. ఇతరులకు దానధర్మాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు తోటి వారి నుంచి మద్దతు ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. అనుకోకుండా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. బంధువులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఏర్పడతాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కొత్త అవకాశాలు వస్తాయి. అధికారుల నుంచి మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అపారమైన అవకాశాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించడానికి కష్టపడాల్సి వస్తుంది కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. బంధువుల నుంచి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసికంగా గందరగోళం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
వైయస్సార్ పై పవన్ ద్వేషం.. మధ్యలో జగన్!
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో వైరం ఉందనే చెప్పాలి. నిన్న హైదరాబాద్ ప్రెస్మీట్లో కూడా రాజశేఖర్ రెడ్డి విషయాన్ని ప్రస్తావించారు. ఆయన మూలంగానే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆయన తమను ఇబ్బంది పెట్టారని.. అందుకే ఇంతటి వ్యతిరేకత అన్నట్టు సంకేతాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. 2004 నుంచి 2010 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు మెగాస్టార్ చిరంజీవి. అయితే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆ సమయంలో చిరంజీవి కుటుంబానికి బెదిరింపులు వచ్చి ఉంటాయి. అదే సమయంలో కొన్ని రకాల కుటుంబ వివాదాలు కూడా జరిగాయి. తప్పకుండా ఆ సమయంలోనే ఏదో జరిగి ఉంటుంది. దానిని ప్రస్తావించిన పవన్ రాజశేఖర్ రెడ్డి తీరు వల్లే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
* బెదిరింపుల పర్వం..
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం 25 సంవత్సరాల పాటు వేచి చూశారు. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటివరకు ఒక ఎత్తు.. అప్పటినుంచి ఒక ఎత్తు అన్నట్టు పరిస్థితి మారింది. విపరీతమైన సంక్షేమ పథకాలతో ఆయన ప్రజామోదం పొందారు. అయితే ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులను బెదిరించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో కొన్ని రకాల బెదిరింపులు వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత.. ఎన్నికల్లో 70 లక్షల ఓట్లు సాధించిన పిఆర్పి కాంగ్రెస్లో విలీనం వెనుక కూడా రాజశేఖర్ రెడ్డి కుటిల ప్రయత్నాలు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ లో ఒక అనుమానం ఉంది. పైగా సంక్షేమాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యవహారంపై కూడా పవన్ సీరియస్ గా ఉన్నారు. దాని పర్యవసానమే జగన్మోహన్ రెడ్డి పై ఆయన కోపం.
* అడ్డగోలు దోపిడీపై..
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు అనేది పవన్ కళ్యాణ్ లో ఉన్న అనుమానం. వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ద్వేషం జగన్మోహన్ రెడ్డి పై కూడా కొనసాగించారు పవన్. అందుకే 2014 ఎన్నికల్లో పార్టీని స్థాపించి టిడిపికి మద్దతు తెలిపారు. 2019లో ప్రత్యేక పరిస్థితుల్లోనే ఒంటరి పోరాటానికి మొగ్గు చూపారు. 2024 లో మాత్రం పొత్తు కోసం అహర్నిశలు శ్రమించారు. ఇప్పుడు కూటమి 15 ఏళ్ల పాటు ఏపీలో కొనసాగుతుందని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. వైయస్ పై ఉన్న ద్వేషం జగన్మోహన్ రెడ్డి పై కొనసాగిస్తున్న పవన్.. కూటమి విచ్చిన్నానికి జరుగుతున్న ప్రయత్నాన్ని కూడా అడ్డుకుంటున్నారు. మొత్తానికైతే పవన్ ద్వేషం ఈనాటిది కాదన్నమాట జగన్ పై.