CM Vijay: ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని.. వాటిని అమల్లో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అలా చేసేవారెవరున్నారు.. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇస్తుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెడతారు. ప్రజల కోణంలో కాకుండా.. తమ కోణంలో ఆలోచిస్తుంటారు. అప్పుడు ఓట్లు వేసిన ప్రజలు చింతిస్తూ ఉంటారు. ఇటువంటి రాజకీయాలు మనదేశంలో చాలా సంవత్సరాల నుంచి సాగుతూనే ఉన్నాయి. ప్రత్యామ్నాయ పార్టీలు కూడా ఇలానే వ్యవహరిస్తూ ఉండడంతో జనాలు కూడా నమ్మకాన్ని కోల్పోయారు. ఏదో ఓట్లు వేసే పండుగ వచ్చినప్పుడు తమ హక్కును వినియోగించుకొని.. ఆ తర్వాత బాధపడుతున్నారు.
ఇటువంటి రాజకీయాలు సాగుతున్న దేశంలో అప్పుడప్పుడు దీప శిఖలాగా కొంతమంది వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయల స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. అంతేకాదు తాము ఒక టార్చ్ బేరర్ లాగా మారిపోతున్నారు. ఈ జాబితాలో టీవీకే అధినేత విజయ్ మొదటి స్థానంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. ప్రజలకు అమలు చేయగలిగే హామీలు మాత్రమే ఇచ్చారు. వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ కూడా రూపొందించారు. కొన్నింటిని ఆల్రెడీ అమల్లో పెడుతున్నారు కూడా.
ఫీజులు వసూలు చేయడం కుదరదు
ఇకపై తమిళనాడులో ప్రభుత్వేతర విద్యాలయాలు విద్యార్థుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం కుదరదు. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలో మాత్రమే ఫీజులు స్వీకరించాలి. అదనంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అవసరమైతే గుర్తింపు కూడా రద్దు చేస్తుంది. కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడదు. ప్రభుత్వ వెబ్ సైట్ లలో నమో చేసిన విధంగానే ప్రైవేట్ విద్యాలయాలు ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ప్రభుత్వం ఎటువంటి చర్యలైనా తీసుకుంటుంది.
అధిక ఫీజు వసూళ్లపై ఫిర్యాదు
తమిళనాడు ఇటీవల ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజు వసూళ్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ ఈ వ్యవహారం పై సీరియస్ అయ్యారు.వెంటనే కీలక ప్రకటన చేశారు. ప్రైవేట్ విద్యాలయాల నిర్వాహకులు అధికంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వం హయాంలో ప్రైవేట్ విద్యాలయాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసేవని, అధికార పార్టీకి చెందిన వారి విద్యాలయాలే ఇందులో అధికంగా ఉన్నాయని.. అందువల్లే ఇటీవల ప్రభుత్వానికి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని.. ముఖ్యమంత్రి విజయ్ నేరుగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
















నాకు ఆంధ్రా లోనే దిక్కులేదు.. తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానా..
Pawan Kalyan Telangana Politics: రాజకీయ నాయకులకు కొన్ని విషయాలు చెప్పాలంటే ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం రాజకీయ నాయకులు నేటి కాలంలో పెద్దగా కనిపించడం లేదు. కానీ ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి విభిన్నం. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా కంటే కూడా.. సామాజిక బాధ్యత ఉన్న పౌరుడిగా కనిపిస్తుంటారు. అందువల్లే ఆయన మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణలో తన ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడారు. తెలంగాణ పునర్ నిర్మాణ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం.. హైకోర్టులో కూడా సానుకూల తీర్పు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ నేరుగా తన ఇంటి నుంచి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ అంటేనే ఆవేశం ఉంటుంది. దాని వెనక ఆలోచన కూడా ఉంటుంది. ఈసారి ఆవేశాన్ని, ఆలోచనను ఏకకాలంలో మిలితం చేసి ఆయన మాట్లాడారు. తన మీద వస్తున్న ఆరోపణలకు.. విమర్శలకు సమర్థవంతంగా సమాధానం చెప్పారు. అంతేకాదు, తెలంగాణలో జనసేన పోటీ ఎందుకు చేయాలి.. ఎందుకు ప్రశ్నించాలి.. సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకోవాలి అనే విషయాలు మీద పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ ఇచ్చారు. విలేకరులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సావధానంగా సమాధానం చెప్పారు. అంతేకాదు నేషనల్ మీడియా కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే.. వాటికి కూడా సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశారు.
ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించడానికి కేవలం అధికారం కోసం మాత్రమే కాదని.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. కెసిఆర్ ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే తాము స్వాగతించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “అందరూ మహారాష్ట్ర వెళ్లొచ్చు. పంజాబ్ కూడా వెళ్ళవచ్చు. కానీ జనసేన తెలంగాణలో ఎందుకు అడుగు పెట్టకూడదు.. తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగిర.. తెలంగాణ ఏమైనా నిషిద్ధ ప్రాంతమా.. తెలంగాణలో ఏం కోరుకుంటాం.. నేను ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను.. నాకు ఆంధ్రాలోనే దిక్కులేదు.. ఇక్కడ నేను ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేస్తామని ఇక్కడి వారి బయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి లక్ష మంది కూడా లేరు. రెండువేల మందితో సభ పెట్టుకుంటే అనుమతి ఎందుకు ఇవ్వరు అంటూ” పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ప్రతి మాటలోనూ క్లారిటీ ఉంది.. కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేసింది.. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ. అని రాష్ట్రాలలో ఆ పార్టీ రాజకీయాలు చేస్తోంది. అలాంటప్పుడు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుపెడితే ఆ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి.. త్వరలో జరిగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారా.. అందువల్లే ఇలా జనసేన పార్టీ సభకు అడ్డంకులు సృష్టిస్తున్నారా.. అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పొన్నం ప్రభాకర్.. దానం నాగేందర్.. కల్వకుంట్ల కవిత.. పాశం యాదగిరి లాంటి వారంతా కూడా విమర్శలు చేయడం ఇక్కడ విశేషం. వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశం వేదికగా చెప్పేశారు.