Home Blog Page 200

విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై తమిళనాడులో అలా జరుగుతుంది..

CM Vijay
CM Vijay

CM Vijay: ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని.. వాటిని అమల్లో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అలా చేసేవారెవరున్నారు.. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇస్తుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెడతారు. ప్రజల కోణంలో కాకుండా.. తమ కోణంలో ఆలోచిస్తుంటారు. అప్పుడు ఓట్లు వేసిన ప్రజలు చింతిస్తూ ఉంటారు. ఇటువంటి రాజకీయాలు మనదేశంలో చాలా సంవత్సరాల నుంచి సాగుతూనే ఉన్నాయి. ప్రత్యామ్నాయ పార్టీలు కూడా ఇలానే వ్యవహరిస్తూ ఉండడంతో జనాలు కూడా నమ్మకాన్ని కోల్పోయారు. ఏదో ఓట్లు వేసే పండుగ వచ్చినప్పుడు తమ హక్కును వినియోగించుకొని.. ఆ తర్వాత బాధపడుతున్నారు.

ఇటువంటి రాజకీయాలు సాగుతున్న దేశంలో అప్పుడప్పుడు దీప శిఖలాగా కొంతమంది వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయల స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. అంతేకాదు తాము ఒక టార్చ్ బేరర్ లాగా మారిపోతున్నారు. ఈ జాబితాలో టీవీకే అధినేత విజయ్ మొదటి స్థానంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. ప్రజలకు అమలు చేయగలిగే హామీలు మాత్రమే ఇచ్చారు. వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ కూడా రూపొందించారు. కొన్నింటిని ఆల్రెడీ అమల్లో పెడుతున్నారు కూడా.

ఫీజులు వసూలు చేయడం కుదరదు

ఇకపై తమిళనాడులో ప్రభుత్వేతర విద్యాలయాలు విద్యార్థుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం కుదరదు. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలో మాత్రమే ఫీజులు స్వీకరించాలి. అదనంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అవసరమైతే గుర్తింపు కూడా రద్దు చేస్తుంది. కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడదు. ప్రభుత్వ వెబ్ సైట్ లలో నమో చేసిన విధంగానే ప్రైవేట్ విద్యాలయాలు ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ప్రభుత్వం ఎటువంటి చర్యలైనా తీసుకుంటుంది.

అధిక ఫీజు వసూళ్లపై ఫిర్యాదు

తమిళనాడు ఇటీవల ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజు వసూళ్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ ఈ వ్యవహారం పై సీరియస్ అయ్యారు.వెంటనే కీలక ప్రకటన చేశారు. ప్రైవేట్ విద్యాలయాల నిర్వాహకులు అధికంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వం హయాంలో ప్రైవేట్ విద్యాలయాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసేవని, అధికార పార్టీకి చెందిన వారి విద్యాలయాలే ఇందులో అధికంగా ఉన్నాయని.. అందువల్లే ఇటీవల ప్రభుత్వానికి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని.. ముఖ్యమంత్రి విజయ్ నేరుగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ సమ్మర్ ను వాడుకాలేకపోయిన మేకర్స్... సినిమాల కళ లేకుండా పోయిందిగా...

Summer Releases
Summer Releases

Summer Releases: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు తమ హవాని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న మన స్టార్ హీరోలు ఇకమీదట కూడా అదే హవాని చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు… ఒక సినిమాని చేయడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన సమయంలో రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యం… అయితే సమ్మర్లో స్టూడెంట్స్ అందరికీ హాలిడేస్ ఉంటాయి. కాబట్టి సినిమాలను రిలీజ్ చేస్తే ఎక్కువ మంది చూడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ సమ్మర్ మాత్రం స్టార్ హీరోలు సినిమాలు ఏవి ప్రేక్షకులను అలరించలేదు. దానికి తోడుగా అసలు సినిమాలను రిలీజ్ చెయ్యలేదు. జూన్ 4వ తేదీన వస్తున్న ‘పెద్ది’ సినిమాను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమా కూడా ఈ సమ్మర్లో అయితే రాలేదు. మరి ఎందుకని ఈ సమ్మర్ ని అలా వృధాగా వదిలేశారు అంటూ కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలేవి ప్రేక్షకుల్ని అలరించడం లేదు. ఎందుకని అలాంటి సినిమాలను చేస్తున్నారు. మేకర్స్ కొంచెం శ్రద్ధ పెట్టి మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది కదా అనే ధోరణిలో కూడా మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఈ సమ్మర్ ను వృధాగా వదిలేశారు అంటూ ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తుండటం విశేషం… ఇకమీదటైనా భారీ విజయాలను సాధించాలంటే సినిమా రిలీజ్ కీలకం కాబట్టి వచ్చే ఏడాది సమ్మర్ వరకు అయిన సరే ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకుల అటెన్షన్ ను వాడుకోవాలని ప్రతి ఒక్కరు చెబుతున్నారు.

ఇక వచ్చే ఏడాది సమ్మర్ కి సందీప్ రెడ్డి వంగ చేసిన స్పిరిట్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలైతే రిలీజ్ అవుతున్నాయని అనౌన్స్ చేశారు. ఇక ఇప్పటికే ఆ సినిమా రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేశారు. కానీ ఈ డేట్స్ ను పోస్ట్ పోన్ చేయకుండా ఉంటే బాగుంటుందని మరి కొంతమంది భావిస్తున్నారు… ఇక వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

బాలీవుడ్ దర్శకులను డామినేట్ చేస్తున్న తెలుగు స్టార్ డైరెక్టర్స్...

Telugu star directors
Telugu star directors

Telugu Star Directors: బాహుబలి సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి తెలుగు సినిమాల హవా ఇండియా వైడ్ గా కొనసాగుతుంది. ఇప్పటికే మన దర్శకులు భారీ పాపులారిటిని సంపాదించుకున్నారు. ఒకప్పుడు ఇండియాలో స్టార్ డైరెక్టర్లు ఎవరు అంటే బాలీవుడ్ దర్శకుల పేర్లు చెప్పారు. కానీ ఆయా దర్శకులకు ఒక్కొక్కరికి మన ఒక్కొక్క దర్శకుడు చెక్ పెడుతూ వచ్చాడు. ముఖ్యంగా రాజ్ కుమార్ హిరానీ లాంటి స్టార్ డైరెక్టర్ కి వరుస సక్సెస్ లను సాధిస్తూ తనకెదురుగా ఎవరు లేరు అనేంతలా పేరును సంపాదించుకున్నాడు. కానీ అతనికి రాజమౌళి బాహుబలి సినిమాతో చెక్ పెట్టాడు. ఇక బాహుబలి 2 సినిమాతో బాలీవుడ్ దర్శకులందరిని ఒకేసారి పక్కన పెట్టేసిన రాజమౌళి ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారాడు…

కమర్షియల్ సినిమాలతో సక్సెస్ ను సాధించే రోహిత్ శెట్టికి సుకుమార్ చెక్ పెట్టాడు. ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి తెలుగు దర్శకులు కమర్షియల్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో వాళ్లందరికి చూపించాడు…ఇక బాలీవుడ్ హీరో తోనే అనిమల్ సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

ఆయన సైతం బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన సంజయ్ లీలా భన్సాలీ కి చెక్ పెట్టాడు… ఇక నాగ్ అశ్విన్ లాంటి దర్శకుడు సైతం ఇండస్ట్రీలో ఉన్న మిగతా దర్శకులందరికి చెక్ పెట్టాడు. ఇలా మన దర్శకుల హవా కొనసాగడమే కాకుండా బాలీవుడ్ దర్శకులను సైతం డామినేట్ చేస్తూ మనవాళ్ళు ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని ఆనందానికి గురిచేస్తుంది.

ఇక అలాంటి దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మరింత మంది రావాలని బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయ్యేలా మనవాళ్లు సినిమా చేయాలని బాలీవుడ్ హీరోలు సైతం మనవాళ్ళతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

ఇక మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు టాప్ పొజిషన్లో కొనసాగడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి వెళ్ళిపోయింది… ఇప్పటికే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో సైతం మన తెలుగు దర్శకుడైన వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తున్నాడు. అమీర్ ఖాన్ సైతం తెలుగు దర్శకుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. కానీ అతనితో సినిమా చేయడానికి పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ ని చూపించడం లేదు…

డేటా సెంటర్ మీద వైసిపి కేసులు.. నారా లోకేష్ చెప్పిన నీళ్ల లెక్కలు.. ఇప్పటికైనా జగన్ పార్టీ మూసుకుంటుందా..

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: వినాశనం లేకుండా వికాసం సాధ్యం కాదు. కాకపోతే వినాశనం స్థాయి తక్కువగా ఉండాలి. వికాసం పరిధి ఎక్కువగా ఉండాలి అంటారు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో వికాసం జరుగుతుంటే కొంతమంది వ్యక్తులు జీర్ణించుకోవడం లేదు. ముఖ్యంగా కొన్ని పార్టీలు ప్రతీప శక్తుల మాదిరిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఏపీ విషయంలో ఈ దారుణం మరింత ఎక్కువగా ఉంది. ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తోంది. ముఖ్యంగా ఏపీ పురోగమనంలో ప్రతి సందర్భంలో అడ్డు తగులుతోంది.

వైజాగ్ నగరాన్ని గ్లోబల్ హబ్ గా మార్చేందుకు ఏపీ సర్కారు పని చేస్తోంది. ఇందులో భాగంగానే అనేక సంస్థలను వైజాగ్ లో ఇన్వెస్ట్ చేసేలా అనుకూల వాతావరణం కల్పిస్తోంది. ఇప్పటికే టిసిఎస్ లాంటి అగ్రశ్రేణి ఐటి కంపెనీలు విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇక గూగుల్ కూడా డేటా సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఈ డేటా సెంటర్ అమెరికా వెలుపల తర్వాత అంతటి స్థాయిలో గూగుల్ ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం. అయితే దీనిని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. మొదట్లో ఈ డేటా సెంటర్ ఘనత తనదేనని జగన్ చెప్పుకున్నారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పారు.

కొద్దిరోజులకు వైసిపి గూగుల్ డాటా సెంటర్ మీద నెగిటివ్ స్టాండ్ తీసుకుంది. ఆ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులతో కేసులు వేయించింది. దీంతో డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు అవుతుందా.. ఈ విషయంలో న్యాయస్థానాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి అనే ప్రశ్నలు సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యక్తమయ్యాయి. చివరికి వైసీపీ పాచికలు పారలేదు. ఫలితంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.

ప్రధానంగా గూగుల్ డేటా సెంటర్ మీద వైసిపి చేస్తున్న ఆరోపణ నీటి వినియోగం.. ఎక్కడ విదేశాలలో ఏదో జరిగితే.. ఇక్కడ కూడా అటువంటి సంఘటనలు జరుగుతాయని వైసీపీ మీడియా చెప్పడం గమనార్హం. అయితే దీనిపై నారా లోకేష్ ముంబై వేదికగా జరిగిన ఒక సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. “గోదావరికి ప్రతి ఏడాది వరదలు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో 3000 టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తూ ఉంటుంది. విశాఖపట్నంలో 6.5 గిగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్వహణకు శతకోటి ఘనపుటడుగుల(టీఎంసీ) నీరు సరిపోతుంది..ఒక గిగా వాట్ థర్మల్ ప్లాంట్ ఒక డేటా సెంటర్ కంటే ఏడు రెట్లు ఎక్కువగా నీటిని ఉపయోగించుకుంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరో ఏదో ప్రచారం చేస్తున్నారని దానిని నమ్మొద్దు. అభివృద్ధిని సానుకూల కోణంలో చూడాలి. అభివృద్ధి జరిగితేనే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుందని” నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. దీంతో వైసిపి నోరు మూసుకుంది. ఇన్నాళ్లు చేసిన విష ప్రచారానికి ఇకనైనా అడ్డుకట్ట వేస్తుందో చూడాల్సి ఉంది.

సీనియర్ హీరోలకు ఈ తరం దర్శకులలో ఎవరంటే ఇష్టమో తెలుసా..?

Senior Heroes Favorite Directors
Senior Heroes Favorite Directors

Senior Heroes Favorite Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య బాబు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున మొదటి స్థానంలో ఉంటారు. వీళ్ళందరు అప్పటి నుంచి ఇప్పటివరకు భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు… ఈ నలుగురు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా కొనసాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒకప్పుడు వాళ్ళు చేసిన సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. ఈ సీనియర్ హీరోలకు ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లలో ఎవరంటే బాగా ఇష్టం అనే విషయం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో స్పందించారు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి రాజమౌళి అంటే చాలా ఇష్టమని తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటిగా ముందుకు తీసుకుపోతున్నాడని ఈ తరం దర్శకులలోనే కాదు తర్వాత తరంలో కూడా రాజమౌళిని బీట్ చేసే దర్శకుడు ఎవరు లేరంటూ ఆయన ఒకానొక సందర్భంలో తెలియజేశాడు… నటసింహం బాలయ్య బాబు సైతం ఈ జనరేషన్లో ఉన్న దర్శకులలో తనకు కూడా రాజమౌళి అంటేనే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు. విక్టరీ వెంకటేష్ మాత్రం అనిల్ రావిపూడి అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పాడు.

ఎందుకంటే అంతరించిపోతున్న కామెడీని తన సినిమాలతో మరోసారి తీసుకువచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని థియేటర్ కి రప్పించాడు. అందుకే అనిల్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పాడు… నాగార్జున సైతం ఈ జనరేషన్ లో ఉన్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.

ఎందుకంటే అతని సినిమాలో పెద్దగా కథ లేకపోయిన కూడా తన మేకింగ్ తో డైలాగులతో ప్రేక్షకుడిని స్టడీగా కూర్చోబెడతాడు. అలాగే యూత్ కి కావాల్సిన అంశాలు మొత్తం అతని సినిమాలో ఉంటాయి. కాబట్టి అతనంటే చాలా ఇష్టమని తెలియజేశాడు. అయితే ఈ హీరోలందరు వాళ్లకు ఇష్టమైన దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…

రామ్ చరణ్ బాడీ గార్డ్ రేంజ్ ఏంటో తెలుసా..? స్టార్ హీరోలకు కూడా ఇలాంటి హిస్టరీ లేదు..

Ram Charan Bodyguard Kevin Kunt
Ram Charan Bodyguard Kevin Kunt

Ram Charan Bodyguard Kevin Kunt: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో విస్తృతంగా వినిపిస్తున్న పేరు కెవిన్ కుంట. ఈయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి వ్యక్తిగత బాడీ గార్డ్. ‘పెద్ది’ మూవీ మరో రెండు రోజుల్లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో రామ్ చరణ్ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ సందర్భంగా ప్రతీ ఈవెంట్ లోనూ రామ్ చరణ్ కి సెక్యూరిటీ ఇస్తూ బాగా హైలైట్ అయ్యాడు కెవిన్. ముఖ్యంగా అభిమానుల పట్ల ఆయన నడుచుకునే తీరుకి సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ ని కెవిన్ గురించి అడగ్గా, అందుకు ఆయన సమాధానం చెప్తూ ‘కెవిన్ గొప్ప నైపుణ్యం ఉన్న మనిషి , మంచి మనసు ఉన్నోడు , అతను నాకు మాత్రమే బాడీ గార్డ్ కాదు , మా కుటుంబం మొత్తానికి బాడీ గార్డ్ గా వ్యవహరిస్తూ రక్షణ కల్పిస్తున్నాడు, అందుకు నేను కృతజ్ఞుడిని’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

ఇంతకీ ఈ కెవిన్ మరెవరో కాదు , ఇటలీ దేశం లో ప్రొఫెషనల్ MMA ఫైటర్, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నో పోటీలలో కూడా ఆయన పాల్గొన్నాడు. అంతే కాదు , కెవిన్ కి సైతం ప్రత్యేకంగా బాడీ గార్డ్స్ ఉన్నారు. ఆయన్ని నిరంతరం వాళ్ళు బయటకి వచ్చినప్పుడల్లా రక్షిస్తూనే ఉంటారు. ఇటలీ లో ఆ స్థాయి సెలబ్రిటీ కెవిన్. అలాంటి వ్యక్తి ఇప్పుడు రామ్ చరణ్ కి , ఆయన కుటుంబానికి బాడీ గార్డ్ గా వ్యవహరిస్తున్నాడంటే, అతనికి ఏ రేంజ్ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా లో కెవిన్ మీద ప్రచారం అవుతున్న ఈ కథనాలు చూసి , రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా గర్విస్తున్నారు. ఇతని ఫిజిక్ చూస్తుంటే సినిమాల్లో కూడా నటించొచ్చు కదా అని అనిపిస్తోంది అంటూ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ‘పెద్ది’ విషయానికి వస్తే , ఈ చిత్రం రేపు ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాల్లో మొదలు కాబోతుంది. ఈ ప్రీమియర్ షోస్ కి ఆంధ్ర ప్రదేశ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా జరిగాయి. కాసేపట్లో తెలంగాణ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ లో బుకింగ్స్ మొదలు అవ్వకముందే , ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయిల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. పూర్తి స్థాయిలో బుకింగ్స్ మొదలయ్యాక 50 కోట్ల రూపాయలకు పైగానే అడ్వాన్స్ బుకింగ్స్ జరగొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

చిరంజీవి,బాలయ్య, వెంకటేష్ , నాగార్జున లను కలిపి రాజమౌళి సినిమా చేయబోతున్నాడా..?

Chiranjeevi And Balakrishna
Chiranjeevi And Balakrishna

Chiranjeevi And Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు చాలా మంచి రెస్పెక్ట్ అయితే ఉంది. వాళ్ళు చేసే సినిమాలను ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారు. నిజానికి వాళ్లు ఒకప్పుడు తెలుగు సినిమా ఇస్త్రీ కి టార్చ్ బేరర్లు గా మారారు. అందుకే వాళ్ళ హవా కొనసాగుతుంది. ఇక అలాంటి సందర్భంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు ఈ మధ్యకాలంలో వరుస సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశా మార్చిన హీరోలు కూడా వీళ్లే కావడం విశేషం…డిఫరెంట్ సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపిన నటులు కూడా వీళ్లే కావడం విశేషం… ఇక ఇలాంటి క్రమంలోనే ఈ నలుగురు హీరోలు కలిసి ఒక్క సినిమాలో నటిస్తే చూడాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ఇది సాధ్యం కాలేదు. రీసెంట్ గా చిరంజీవి, వెంకటేష్ ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో కలిసి నటించారు. ఇక ఇప్పుడు వీళ్ళు నలుగురు కలిసి నటిస్తే చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు రాజమౌళి వీళ్ళ నలుగురిని కలిపే సాహసం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఇక దాని తర్వాత ఆయన ‘మహాభారతం’ సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ మహాభారతం సినిమా కనక చేసినట్లయితే అందులో ఈ నలుగురు హీరోలు కీలకపాత్ర వహించబోతున్నారట.

ఇక దానికి తోడుగా వీళ్ళు నలుగురు కలిసి ఒకే స్క్రీన్ లో కనిపించేటట్టుగా కూడా ఆయన ఏర్పాట్లు చేయబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇందులో ఎవరెవరు ఏ క్యారెక్టర్ని పోషిస్తారు అనే విషయంలో సరైన క్లారిటి ఇవ్వలేదు.

కానీ మొత్తానికైతే వీళ్ళ నలుగురిని ఒక స్క్రీన్ మీద కనబడేలా చేసి తెలుగు ప్రేక్షకుల ఎమోషన్ ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. మరి వీళ్ళతో ఆయన ఎలాంటి సాహసం చేయబోతున్నాడు. ఈ నలుగురిని స్క్రీన్ మీద ఎలా చూపిస్తాడు ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ ను రాబడతాడు అనేది తెలియాల్సి ఉంది…

అఖిరానందన్ కోసం కథ రెడీ చేసిన సుజీత్... హీరో క్యారెక్టర్ ఏంటి ఇంత వైల్డ్ గా ఉంది...

Sujeeth And Akira Nandan
Sujeeth And Akira Nandan

Sujeeth And Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా తెరకెక్కింది. గత సంవత్సరం రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదించుకుంది. అలాంటి దర్శకుడు ఇప్పుడు నానితో ‘బ్లడీ రొమియో’ అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ‘ఓజీ 2’ సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ గ్యాప్ లోనే సుజీత్ పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అఖీరా నందన్ కోసం ఒక అదిరిపోయే కథను కూడా రెడీ చేశారట. ఇక ఈ కథలో హీరో స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడు. అలాగే అతను ఎదురుకునే కొన్ని ఇబ్బందుల వల్ల తను ఎలా ఫైట్ చేశాడు. సొసైటీకి వ్యతిరేకంగా జరుగుతున్న కొన్ని ఇల్లీగల్ పనులను ఎలా పట్టించాడు అనే దాని మీదనే ఆ కథ ఉంటుందట.

అకిరా నందన్ మొదటి సినిమా కోసం ఎలాంటి కథ కావాలని చూస్తున్నారో అచ్చం అలాంటి కథ నే సుజిత్ చెప్పాడట. ఆ కథకి పవన్ కళ్యాణ్ కూడా ఇంప్రెస్ అయినట్టుగా తెలుస్తుంది. అకీరా కి ఇది పెర్ఫెక్ట్ గా సరిపోతుందని పవన్ కళ్యాణ్ కూడా అనుకుంటున్నాడట.

ప్రస్తుతం అకీరా యాక్టింగ్ సంబంధించిన శిక్షణను తీసుకుంటున్నాడు. కాబట్టి తొందర్లోనే అతను ఇండస్ట్రీకి పరిచయం అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక తనని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను కూడా సుజీత్ కి అప్పజేప్తారా? లేదంటే ఇంకెవరైనా దర్శకుడి చేతిలో పెట్టే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసి అతన్ని కూడా స్టార్ హీరోగా మార్చాలని ప్రయత్నంలో ఉన్నాడు. అతను అనుకున్నట్టుగానే తన అభిమానులకు సైతం పవన్ కళ్యాణ్ లేని లోటు తీర్చాలంటే అఖీరానందనైతేనే కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడట…

తెలంగాణ లో కూడా 'పెద్ది' కి ఇక్కట్లు తొలగినట్టే.. టిక్కెట్ రేట్స్ పెంపుకు ప్రభుత్వం అనుమతి..

Peddi Movie Success
Peddi Movie Success

Peddi Movie Ticket Rates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డు స్థాయి లో జరిగింది. తెలుగు , తమిళం , హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషలకు కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అక్షరాలా 220 కోట్ల రూపాయిలు. అంటే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 430 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు సాధిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం కష్టం. అందుకే నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్స్ పెంచుకోవడం కోసం ప్రభుత్వాలను అనుమతి కోరారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి చాలా తేలికగా అనుమతి వచ్చింది , కానీ తెలంగాణ లో వస్తుందో లేదో అనే అనుమానం ఉండేది.

ఎందుకంటే తెలంగాణ లో ప్రీమియర్ షోస్ కి భారీ టికెట్ రేట్స్ ని పెంచడం , అదే విధంగా రెగ్యులర్ షోస్ కి కూడా టికెట్ రేట్స్ పెంచడం పై హై కోర్టు నుండి అనుమతి లేదు. ఈ కారణం చేత తెలంగాణ లో టికెట్ రేట్స్ పెంపు అసాధ్యమని అంతా అనుకున్నారు. కానీ టికెట్ రేట్స్ పెంపు కి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్టుగానే , 600 రూపాయిల వరకు ఉంటుంది. అదే విధంగా రెగ్యులర్ షోస్ కి గానూ 100 రూపాయిలు , అదే విధంగా మల్టీప్లెక్స్ షోస్ కి గానూ 150 రూపాయిలు పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 11 రోజుల వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. కాసేపట్లో అధికారికంగా జీవో ని కూడా విడుదల చేయబోతున్నారు.

ప్రభుత్వం అనుమతించిన టికెట్ రేట్స్ పెంపు ప్రకారం అయితే సింగల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ రేట్ 275 రూపాయిలు ఉంటుంది , అదే విధంగా మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో ఒక్క టికెట్ రేట్ 445 రూపాయిలు ఉండనుంది. మరి ఈ టికెట్ రేట్స్ ప్రభావం కారణంగా పెద్ది సినిమాకు మేలు జరుగుతుందా?, లేదంటే నష్టం జరుగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే తెలంగాణ లో అన్ని ప్రాంతాలు లాగా టికెట్ రేట్స్ ఎక్కువ పెంచితే జనాలు చూసేందుకు సిద్ధంగా లేరు. హైదరాబాద్ లో చూస్తున్నారు కానీ , తెలంగాణ జిల్లాల్లో మాత్రం టికెట్ హైక్స్ భారీ ప్రభావం చూపిస్తోంది , సినిమాని చూసే ఆడియన్స్ సంఖ్య ఈ కారణం చేత బాగా తగ్గిపోయింది , చూడాలి మరి పెద్ది కి ఏమి జరగబోతుంది అనేది.

స్పిరిట్ మూవీలో ప్రభాస్ కి వివేక్ ఒబెరాయ్ మధ్య గొడవేంటి..?

Prabhas Spirit Movie
Prabhas Spirit Movie

Prabhas Spirit Movie: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషల్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన మూడు సినిమాలే అయినప్పటికి ఆ మూడు కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి. అలాంటి సందీప్ రెడ్డివంగా ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. తన నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో చేసిన ‘స్పిరిట్’ సినిమాలో కూడా ఆయన డిఫరెంట్ మేకింగ్ స్టైల్ ని వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫిషర్ గా కనిపించబోతున్నాడు.

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ప్రభాస్ కి వివేక్ ఒబెరాయ్ కి మధ్య ఉండే సంబంధం ఏంటి? వీళ్లిద్దరి మధ్య గొడవలు ఏంటి అనే విషయం మీదనే ఈ సినిమా మొత్తం నడుస్తుందట. నిజానికి వివేక్ ఒబెరాయ్ ఒక డ్రగ్ సప్లై చేసే కంపెనీకి ఓనర్ గా ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రభాస్ వస్తాడు.

అతన్ని ఎలా పట్టుకున్నాడు. వీళ్లిద్దరు ఎవరికి వాళ్ళు ఎలాంటి ఎత్తులు వేసుకున్నారు. ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు అనేది కూడా ఈ సినిమాలో చాలా బలంగా చూపించబోతున్నారట. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేనట్టుగా చూపించినప్పటికి ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళిద్దరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్ గా ఉంటారనే ఒక న్యూస్ బయటికి వినిపిస్తుంది.

ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలీదు గానీ మొత్తానికైతే సోషల్ మీడియాలో స్పిరిట్ సినిమాకు సంబంధించిన ఒక కథతో పాటు ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ లకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనే దాని మీద కూడా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది…ఇక వీటన్నింటికి ఒక క్లారిటి దొరకాలంటే మాత్రం ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

పెద్ది మూవీ రిజల్ట్ వచ్చేసింది... ఫస్టాఫ్ ఓకే...మరి సెకండాఫ్ పరిస్థితి ఏంటి..?

Peddi 28 Days Collections
Peddi 28 Days Collections

Peddi First Half Report: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ కి వచ్చిన రామ్ చరణ్ సూపర్ హిట్స్ అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుండడం విశేషం…మరి కొద్ది గంటల్లో పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలకి ఈ సినిమా స్పెషల్ షో అయితే వేశారు. అది చూసిన ప్రతి ఒక్కరు సినిమా బాగుందని చెప్తున్నారు. మొత్తానికైతే సినిమా ఫస్టాఫ్ బాగున్నప్పటికి సెకండ్ హాఫ్ విషయంలోనే కొంతవరకు డల్ అయిందనే విషయం తెలుస్తుంది. సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయట. కానీ క్లైమాక్స్ విషయంలోనే ప్రేక్షకులు ఎలా జీర్ణించుకుంటారు. ఒక కమర్షియల్ స్టార్ హీరో కి ఒక వైకల్యాన్ని పెట్టి గేమ్ ఆడించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే ధోరణిలోనే ఇప్పుడు ఆలోచనలైతే సాగుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు ఈ సబ్జెక్టు ను చాలా బాగా హ్యాండిల్ చేశారని కొంతమంది అంటుంటే మరి కొంత మంది మాత్రం రామ్ చరణ్ అతని అభిమానులు ఎలా చూస్తారు అనే దాని మీదనే ఈ సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉందని మరి కొంతమంది చెబుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుందని రామ్ చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. కాబట్టి వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లకుండా ఉంటే బాగుంటుందని మరి కొంత మంది చెబుతున్నారు. ఈ సినిమాని చూసిన కొంతమంది సినిమా సెలబ్రిటీలు సైతం సినిమా మీద కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఇది ఎంతవరకు పర్ఫెక్ట్ గా కుదిరింది సినిమా అనుకున్న రేంజ్ లో వచ్చిందా లేదా ఫైనల్ గా ఈ మూవీ చూసి ప్రేక్షకుడు ఏం చెబుతాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిందే. ఇక రేపు నైట్ నుంచి ఈ సినిమా కి సంబంధించిన ప్రీమియర్స్ పడబోతున్నట్టుగా తెలుస్తుంది…

ప్రభాస్ ఆ ఇద్దరిని డైరెక్టర్లతో లైఫ్ లో సినిమా చేయడా..? కారణమేంటంటే..?

Prabhas Directors
Prabhas Directors

Prabhas Directors: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ముఖ్యంగా పాన్ ఇండియాలో వరుస సక్సెస్ లను సాధిస్తున్న హీరో కూడా తనే కావడం విశేషం…ఇక ప్రస్తుతం ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో ఎక్కువ పాన్ ఇండియా సినిమాలను చేసిన హీరోగా కూడా పేరు సంపాదించుకున్నాడు. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఆయన మరో సినిమా కూడా చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండడం విశేషం… ఇక ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే కెరియర్ మొదట్లో ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తిని చూపించారు. కానీ కొంతమందితో మాత్రం ప్రభాస్ సినిమా చేయలేకపోయాడు. ఇక ఇప్పటికి ఆ దర్శకులతో తను సినిమా చేయలేనని చెప్పడం విశేషం… భద్ర సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత బోయపాటి శ్రీను ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత సైతం బోయపాటి శ్రీను చెప్పిన కథ ప్రభాస్ కి నచ్చకపోవడంతో ఆయనను పలుసార్లు రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే బోయపాటి శ్రీను సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నప్పటికి ఆయన సినిమాలు రొటీన్ కాన్సెప్ట్ తో ఉంటాయనే ఉద్దేశ్యంతోనే ప్రభాస్ అతన్ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా బోయపాటి లాంటి ఒక దర్శకుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించిన కూడా ప్రభాస్ అతనితో సినిమా చేయకపోవచ్చు. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ రేంజ్ మారిపోయింది. 2000 కోట్ల కలెక్షన్స్ ను ఈజీగా రాబట్టగలిగే కెపాసిటి ఉన్న ప్రభాస్ రొటీన్ సినిమాలను చేయగలిగే బోయపాటి శ్రీనుతో సినిమా చేయలేకపోవచ్చు.

ఇక దానికి తోడుగా ఆయన మరో దర్శకుడితో కూడా సినిమాలు చేసే అవకాశాలైతే లేవు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే సుకుమార్ కావడం విశేషం…

‘ఆర్య 2’ సినిమా తర్వాత సుకుమార్ ప్రభాస్ కోసం ఒక కథనైతే రాసుకున్నాడు. కానీ ప్రభాస్ అప్పుడు బిజీగా ఉండడంవల్ల అతనితో సినిమా చేయలేదు. ఆ తర్వాత కూడా ప్రభాస్ ఒకసారి సుకుమార్ తో సినిమా చేద్దామని అడిగాడట. కానీ సుకుమార్ అప్పుడు బిజీగా ఉండడం వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదు.

ఇక ఇప్పుడు సుకుమార్ ఒక కథ చెప్పిన కూడా ప్రభాస్ అతనితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ అడిగినప్పుడు తను సినిమా చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి అంటూ కొంతమంది సినిమా మేధావులైతే చెబుతున్నారు…

సూపర్ కృష్ణ వల్లే నేను ఇండస్ట్రీ లో ఉన్నానంటున్న టాప్ యాక్టర్...

Super Krishna Support Actors
Super Krishna Support Actors

Super Krishna Support Actors: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు కొంతమంది అప్ కమింగ్ నటులకు సహాయం చేస్తుంటారు. అలా హీరోల నుంచి సాయం పొందిన నటులు ఇండస్ట్రీలో రాణిస్తూ ముందుకు దూసుకెళ్తుంటారు. ఇతర నటులకు, టెక్నీషియన్స్ కి హెల్ప్ చేసేవాళ్లలో సూపర్ స్టార్ కృష్ణ ముందు వరుసలో ఉండేవారు. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లను ఆర్టిస్టులను కాపాడుకుంటూ వచ్చాడు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే చాలు ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ వాళ్లకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ఇంట్రెస్ట్ చూపించేవారు. తనతో సినిమ్ చేసి ప్రొడ్యూసర్లు నష్టపోయిన కూడా కృష్ణ ఎంతో కొంత నష్టాన్ని భర్తీ చేసేవాడు. అలాగే వాళ్లకు ఇంకో సినిమా చేసుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పించేవాడు.

అలాంటి కృష్ణ ఒక నటుడి విషయంలో సైతం అతనికి హెల్ప్ చేయడం వల్లే ఆ నటుడు ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాను అంటూ కృష్ణ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కావడం విశేషం… ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ తో ప్రేక్షకులందరిని మెప్పించాడు.

ఇక ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమాలో తనకంటూ సపరేట్ క్యారెక్టర్స్ ని ఎంచుకొని అందులో తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. అలాంటి నటుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తను ఎక్కడ ఉండాలో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు పద్మాలయ స్టూడియోలో కృష్ణను కలిశారట.

ఇక కృష్ణ అతని బాధలను విని ఆ స్టూడియోలోనే ఒక రూమ్ ఇచ్చి అందులోనే ఉండమని చెప్పారట. తనకి అవకాశాలు దొరికేంత వరకు అక్కడే ఉండమని చెప్పడంతో పృథ్వి అక్కడ ఉంటూనే అవకాశాల కోసం ఎదురు చూశారంట. ఇక అలాంటి క్రమంలోనే ఇప్పుడు నేను తింటున్న ప్రతి మెతుకు కూడా కృష్ణ గారు పెట్టిన బిక్ష అంటూ ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…

తెలంగాణ గడ్డమీద నుంచి వైయస్సార్ ద్వారా వైసీపీని దెబ్బ కొట్టిన పవన్..

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: ఇప్పుడంటే జగన్ గులాబీ పార్టీకి దగ్గర మిత్రుడు అయిపోయాడు. 2024లో జరిగే ఎన్నికల్లో ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని కెసిఆర్ కూడా చెప్పారు. అక్కడిదాకా ఎందుకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ కార్యక్రమానికి కేసీఆర్ కూడా వెళ్లారు. ఆయనను ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. అప్పట్లో కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి జగన్ ను కెసిఆర్ ఆహ్వానించారు.

జగన్ మీడియాలో కేసీఆర్ గురించి.. కెసిఆర్ మీడియాలో జగన్ గురించి ఒక్క నెగిటివ్ వార్త కూడా రాదు. పైగా ఆ మధ్య బెంగళూరులో కేటీఆర్.. జగన్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కలుసుకున్నారు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో కూడా గులాబీ పార్టీకి వైసిపి.. వైసీపీకి గులాబీ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ సహకరిస్తుంటాయి. పైగా ఒకరి ఫీడ్ మరొకరు షేర్ చేసుకుంటారు. సయామి కవలల మాదిరిగా సాగిపోతున్న గులాబీ పార్టీ, వైసిపి బంధానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డ మీద నుంచి గట్టి షాక్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ను ఆంధ్ర నేత అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని మంగళవారం పబ్లిష్ చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఔత్సాహికులు పవన్ కళ్యాణ్.. కేటీఆర్ గతంలో దిగిన ఫోటోలను.. వారిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో గులాబీ పార్టీ మీడియా అసలు రంగు బయటపడింది. ఇక పవన్ కళ్యాణ్ తన ఇంటి వద్ద నుంచి జరిగిన విలేకరుల సమావేశంలో ఆవేశంగా మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ విషయంలో వైఎస్ఆర్ పోషించిన పాత్ర గురించి స్పష్టంగా చెప్పేశారు. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ గురించి గులాబీ మీడియా.. గులాబీ పార్టీ నాయకులు సానుకూలంగా మాట్లాడుతున్నారు. అంతకుముందు కేసీఆర్ కూడా వైఎస్ఆర్ గురించి గొప్పగానే మాట్లాడారు. తెలంగాణకు బద్ధ శత్రువు వైఎస్ఆర్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

వైయస్ బతికున్నప్పుడు చాలామంది తెలంగాణవాదులు నోరు మెదపలేదని.. నాడు తెలంగాణని వ్యతిరేకించిన వాళ్లంతా ఇప్పుడు పదవుల్లో ఉన్నారని.. వైయస్సార్ బతికి ఉన్నప్పుడు వారంతా తెలంగాణ నినాదాన్ని కూడా సహించేవారు కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ మీద విష ప్రచారం చేస్తున్న వైసీపీకి.. వైసిపి మీడియాకు జనసేన అధినేత షాకిచ్చారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు వైయస్సార్ ఎలా వ్యవహరించారు.. ఎలా ఉద్యమాన్ని తొక్కిపెట్టారు అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గట్టిగానే ఉదహరించారు.. దీంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది. అంతేకాదు ఇటీవల ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన భూ కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ఏదో హంగామా చేద్దామని అనుకున్న వైసీపీ మీడియాకు.. వైసిపి నాయకులకు ఆదిలోనే బ్రేక్ వేశారు పవన్ కళ్యాణ్. అదే కాదు తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్న నమస్తే తెలంగాణకు కూడా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

నాకు ఆంధ్రా లోనే దిక్కులేదు.. తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానా..

Pawan Kalyan Telangana Politics
Pawan Kalyan Telangana Politics

Pawan Kalyan Telangana Politics: రాజకీయ నాయకులకు కొన్ని విషయాలు చెప్పాలంటే ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం రాజకీయ నాయకులు నేటి కాలంలో పెద్దగా కనిపించడం లేదు. కానీ ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి విభిన్నం. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా కంటే కూడా.. సామాజిక బాధ్యత ఉన్న పౌరుడిగా కనిపిస్తుంటారు. అందువల్లే ఆయన మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణలో తన ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడారు. తెలంగాణ పునర్ నిర్మాణ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం.. హైకోర్టులో కూడా సానుకూల తీర్పు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ నేరుగా తన ఇంటి నుంచి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ అంటేనే ఆవేశం ఉంటుంది. దాని వెనక ఆలోచన కూడా ఉంటుంది. ఈసారి ఆవేశాన్ని, ఆలోచనను ఏకకాలంలో మిలితం చేసి ఆయన మాట్లాడారు. తన మీద వస్తున్న ఆరోపణలకు.. విమర్శలకు సమర్థవంతంగా సమాధానం చెప్పారు. అంతేకాదు, తెలంగాణలో జనసేన పోటీ ఎందుకు చేయాలి.. ఎందుకు ప్రశ్నించాలి.. సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకోవాలి అనే విషయాలు మీద పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ ఇచ్చారు. విలేకరులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సావధానంగా సమాధానం చెప్పారు. అంతేకాదు నేషనల్ మీడియా కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే.. వాటికి కూడా సాలిడ్ ఆన్సర్ ఇచ్చేశారు.

ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించడానికి కేవలం అధికారం కోసం మాత్రమే కాదని.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. కెసిఆర్ ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే తాము స్వాగతించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “అందరూ మహారాష్ట్ర వెళ్లొచ్చు. పంజాబ్ కూడా వెళ్ళవచ్చు. కానీ జనసేన తెలంగాణలో ఎందుకు అడుగు పెట్టకూడదు.. తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగిర.. తెలంగాణ ఏమైనా నిషిద్ధ ప్రాంతమా.. తెలంగాణలో ఏం కోరుకుంటాం.. నేను ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను.. నాకు ఆంధ్రాలోనే దిక్కులేదు.. ఇక్కడ నేను ముఖ్యమంత్రి ఎందుకు అవుతాను. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేస్తామని ఇక్కడి వారి బయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి లక్ష మంది కూడా లేరు. రెండువేల మందితో సభ పెట్టుకుంటే అనుమతి ఎందుకు ఇవ్వరు అంటూ” పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ప్రతి మాటలోనూ క్లారిటీ ఉంది.. కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేసింది.. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ. అని రాష్ట్రాలలో ఆ పార్టీ రాజకీయాలు చేస్తోంది. అలాంటప్పుడు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుపెడితే ఆ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి.. త్వరలో జరిగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే తమకు ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారా.. అందువల్లే ఇలా జనసేన పార్టీ సభకు అడ్డంకులు సృష్టిస్తున్నారా.. అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పొన్నం ప్రభాకర్.. దానం నాగేందర్.. కల్వకుంట్ల కవిత.. పాశం యాదగిరి లాంటి వారంతా కూడా విమర్శలు చేయడం ఇక్కడ విశేషం. వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశం వేదికగా చెప్పేశారు.

మీ అయ్య జాగిరా.. నా ఇల్లుని తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తా తీసుకోండి - పవన్ కళ్యాణ్

Pawan Kalyan Fans
Pawan Kalyan Fans

Pawan Kalyan house controversy: గత కొద్దిరోజులుగా తెలంగాణ లో పవన్ కళ్యాణ్ పై జరుగుతున్నా ముప్పేట దాడి ని మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ప్రొఫెస్సర్ నాగేశ్వర రావు, ఎలాంటి ఆధారాలు లేకుండా, సోషల్ మీడియా లో వైసీపీ పార్టీ నాయకులూ ప్రచారం చేసే వార్తలను తీసుకొచ్చి , పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో రీసెంట్ గా అమిత్ షా ని కలవడానికి వెళ్ళడానికి ముఖ్య కారణం జగన్ ని అరెస్ట్ చెయ్యమని అడగడానికి అని చెప్పడం , అందుకు అమిత్ షా పవన్ కళ్యాణ్ ని మందలించి పంపాడని అనడం, వీటిని జనసేన పార్టీ చాలా తీవ్రస్థాయిలో ఖండించడం వంటివి జరిగాయి. ఈ సమస్యని మరింత తీవ్రవతం చేస్తూ ప్రొఫెస్సర్ నాగేశ్వర్ రావు తన తోటి జర్నలిస్టులతో కలిసి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి తెలంగాణ వాదం లేవనెత్తడం వంటివి చేయడం రాజకీయాల్లో తీవ్రమైన హీట్ వాతావరణం ని తలపించాయి.

ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ నవనిర్మాణ సభ ని ఏర్పాటు చేసాడు. 2 వేలమంది జనసేన కార్యకర్తలతో గచ్చిబౌలి లో ప్లాన్ చేసిన ఈ మీటింగ్ కి ప్రభుత్వం నుండి అనుమతి రాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి వద్దనే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేస్తున్నట్టు నేడు ఉదయం ఒక ప్రకటన చేసాడు. కాసేపటి క్రితమే ఈ ప్రెస్ మీట్ ని నిర్వహించగా, పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కీలమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ లో నన్ను అడుగుపెట్టనివ్వం అని కొందరు కాంగ్రెస్ నాయకులూ మాట్లాడుతున్నారు. తెలంగాణ మీ అయ్యా జాగీరు అనుకుంటున్నారా?, ఇప్పుడు చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి , తెలంగాణ లో జనసేన పార్టీ ఉంటుంది , ప్రతీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది , ప్రతీ సమస్య పై గొంతెత్తి మాట్లాడుతుంది, ఏమి చేస్తారో చేసుకోండి’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘కొంతమంది నేను తెలంగాణ లో భూమి ని కబ్జా చేసి ఇల్లు ని నిర్మించుకున్నానని అంటున్నారు. నేను నిజంగా అలా చేసానని నిరూపిస్తే , రేవంత్ గారికి ఒక్కటే చెప్తున్న, నా ఇల్లు ని తెలంగాణ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా రాసి ఇచ్చేస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడానికి కానీ, విభజన కి కానీ నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు , విభజించిన తీరుకి వ్యతిరేకం అని మొదటి నుండి చెప్తూనే వస్తున్నామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా, యువత కి ఉపాధి కలిపించలేక పోయారని , ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పిన వాళ్ళు నేడు కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యే లుగా కొనసాగుతున్నారని , ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు నా మీద మాట్లాడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నెటిజెన్స్ అమితంగా ఆకట్టుకున్నాయి . అంతే కాకుండా గద్దర్ తో తనకు ఉన్నటువంటి గొప్ప అనుబంధాన్ని , ఆయన ఉద్యమ స్ఫూర్తిని కూడా పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడడం గమనార్హం. ఇంకా ఆయన ఈ ప్రెస్ మీట్ లో ఏమేమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.

ఆస్పత్రిలో ఆపరేషన్ లో ఉండగా వైఎస్ఆర్ బెదిరించాడు.. బెదరలా.. అసలు నిజం చెప్పిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan YSR incident truth
Pawan Kalyan YSR incident truth

Pawan Kalyan YSR incident truth: గచ్చిబౌలిలో నిర్వహించే సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఉపయోగం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఆలోచించుకున్నారు. తన ఇంటి దగ్గర నుంచే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడడం మొదలుపెట్టారు. సహజంగానే ఆవేశపూరితమైన వ్యక్తిత్వంతో కనిపించే పవన్ కళ్యాణ్.. చాలా లోతైన విషయాలు మాట్లాడారు. ఇన్ని రోజులపాటు తన మీద వస్తున్న ఆరోపణలకు అత్యంత ఘాటు భాషలో సమాధానం ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ కు సమాజ సేవ అంటే చాలా ఇష్టం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలను ఆయన చాలావరకు పరిష్కరించారు. చాలామందికి ఆయన సహాయం కూడా చేశారు. ఈ విషయాలను ఆయన స్వయంగా చెప్పుకోలేదు. కొంతమంది వ్యక్తుల ద్వారా అది కూడా చాలా కాలం తర్వాత బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఏపీ రాష్ట్రంలో పర్యావరణ శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. తన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేస్తూనే.. పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల యాజమాన్యాలకు చుక్కలు చూపిస్తున్నారు.. ముక్కు సూటి స్వభావాన్ని కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ ఏ విషయమైనా సరే ఓపెన్ గానే చెబుతారు. జూబ్లీహిల్స్ లో తన ఇంటి వద్ద జరుగుతున్న విలేకరుల సమావేశంలో కూడా తన రాజకీయ ప్రవేశం గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. బహుశా తెలంగాణ నేతలు తన మీద చేస్తున్న ఆరోపణలకు ఈ విధంగా కౌంటర్ ఇవ్వడానికి ఆయన ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం అంత ఈజీగా జరగలేదు. బాలు సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత.. 2005 -06 కాలంలో ఆయనకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్నారు.. ఒక పోలీసు అధికారి ఆయన దగ్గరికి వచ్చారు..

“మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా.. మిమ్మల్ని వదిలిపెట్టారు. మీ అన్నయ్యగారు ఏమైనా పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉందా.. ఆయనను కూడా వదిలిపెట్టరు. కేసులు పెడతారు.. రకరకాలుగా ఇబ్బందులు పెడతారు.. జాగ్రత్త” అంటూ ఆ పోలీసు అధికారి పవన్ కళ్యాణ్తో చెప్పారు.. దానికి పవన్ కళ్యాణ్ “లేదు సార్ మేము రాజకీయాల్లోకి ఎందుకు వస్తాం. రాజకీయాలలోకి రావాల్సిన అవసరం మాకు ఏముంది” అని బదులిచ్చారు. “లేదు లేదు మీరు చూస్తూ ఉండండి.. మీరు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా చంపేస్తారు అని” ఆ పోలీసు అధికారి పవన్ కళ్యాణ్ తో చెప్పారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్నారు. ఇప్పుడైతే చంపేస్తారు అనే మాట పవన్ కళ్యాణ్ కు వినిపించిందో ఆయన అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత తన సోదరుడితో ఈ విషయాలను చెప్పుకొని బాధపడ్డారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రజారాజ్యం పార్టీ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. చిరంజీవి అధికారంలోకి రాలేకపోయినప్పటికీ.. ముఖ్యమంత్రి కలను సాకారం చేసుకోలేకపోయినప్పటికీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మాత్రం తనకంటూ ఒక మార్క్ సృష్టించుకున్నారు.
https://x.com/i/broadcasts/1wxWjjmRjQjJQ