Peddi Movie Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు ప్రతీ రోజు ట్రేడ్ పండితులను విస్మయానికి గురి చేస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర లో ఒక సంక్రాంతి సూపర్ హిట్ సినిమాకు ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో , అంతకు మించిన కలెక్షన్స్ ఈ చిత్రానికి వస్తున్నాయి. ఇదే తరహా ఊపు ని కొనసాగిస్తే ముందుకు వెళ్తే, ఈ చిత్రం కేవలం కోస్తాంధ్ర నుండే 100 కోట్ల షేర్ ని రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదనై అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. పెద్ది చిత్రానికి కోస్తాంధ్ర నుండి 6 రోజుల్లో 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రేపటి తో ‘ఓజీ’, ఎల్లుండి తో ‘దేవర’ ఫుల్ రన్ కలెక్షన్స్ ని ఈ ప్రాంతం లో దాటనుంది ఈ చిత్రం. అయితే కోస్తాంధ్ర లో ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లను చూసి , ఇది కలనా ?, నిజమా? అని ఆశ్చర్యపోతున్నారు ట్రేడ్ పండితులు.
ఎందుకంటే ఈ చిత్రానికి 6 వ రోజున 1 కోటి 15 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. రాజమౌళి గతం లో రామ్ చరణ్ తో తీసిన #RRR చిత్రానికి 6 వ రోజున కేవలం 98 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. కేవలం 6 రోజుల్లోనే ఈ ప్రాంతం నుండి 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి ఫుల్ రన్ లో పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చేలా ఉందని , #RRR రికార్డు ని అవలీల గా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా వరల్డ్ వైడ్ గా కచ్చితంగా ఈ చిత్రం 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను ఈ వీకెండ్ తోనే దాటేస్తుందని, ఫుల్ రన్ లో 220 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందో లేదో చూడాలి. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందనే బలమైన నమ్మకం తో ఉన్నారు రామ్ చరణ్ అభిమానులు. నార్త్ ఇండియా కలెక్షన్స్ ఈమధ్యనే పుంజుకుంది , కానీ ఓవర్సీస్ ఏ మాత్రం సహకరించడం లేదు. అక్కడ ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ చిత్రాన్ని 7 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు , ఇప్పటి వరకు కేవలం 3 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చింది. అంటే అక్షరాలా 4 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లబోతుంది అన్నమాట. ఈ రేంజ్ డిజాస్టర్ గా నిలుస్తుందని ఓవర్సీస్ బయ్యర్స్ అసలు ఊహించలేదు.
















తెలంగాణ మీ అయ్య జాగీరా.. పవన్ ప్రశ్నించింది అందుకే..
Pawan Kalyan Telangana Comments: తెలంగాణ రాష్ట్రంలో ఆమధ్య పవన్ కళ్యాణ్ సృష్టించిన రాజకీయ అలజడి కలకలం రేపింది. ప్రధాన మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల చుట్టూ తిరిగింది. కొంతమంది తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు..
పవన్ కళ్యాణ్ నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలోకి ఎందుకు వద్దని అంటున్నారు.. తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు.. భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కొంతమంది నాయకులు.. టిఆర్ఎస్ అధినాయకురాలు కవిత, ఇతర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యవహారశూరి సరైనది కాదని మండిపడ్డారు.
నాడు తెలంగాణ మీ అయ్య జాగీరా అని తాను ఎందుకన్నాను.. దానికి దారి తీసిన పరిస్థితులను పవన్ కళ్యాణ్ వివరించారు. “నన్ను హైదరాబాద్ రాకూడదని కాంగ్రెస్ నాయకులు పదే పదే బెదిరించారు. తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. 13 నెలలుగా టార్గెట్ చేశారు. నాకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది కాబట్టి నేను తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెట్టారు. మీ అయ్య జాగీరా అంటూ ప్రశ్నించాను. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఈ వైఖరి లేదని.. నన్ను రావద్దు అంటే రాహుల్ గాంధీ సౌత్ ఇండియాతో తనకు సంబంధం లేదని చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ తో పోటీ వల్లే తెలంగాణ మీద ఫోకస్ పెట్టడం అనేది అబద్ధమని” పవన్ పేర్కొన్నారు.
“నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ కళ్యాణ్ కుమార్ అని పేరు పెట్టారు. స్కూల్ రికార్డ్స్ లో శ్రీ అనే పదం తొలగించి కే కళ్యాణ్ కుమార్ అనే పేరు నమోదు చేశారు. మార్షల్ ఆర్ట్స్ టీచర్స్ నా పేరుకు ముందు పవన్ అని పేరు పెట్టారు. నా చాతి భాగం మీద 450 కిలోల స్టోన్ స్లాబ్స్ బ్రేక్ చేసేవారు. నన్ను హనుమంతుడితో పోల్చుతూ ఆ పేరు పెట్టారని” పవన్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ నేతలు ఇంతవరకు స్పందించలేదు. చూడాలి మరి వారు ఏం మాట్లాడతారో.. గతంలో పవన్ కళ్యాణ్ మీద అనిరుధ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.