Home Blog Page 159

ట్రంప్‌తో నెతన్యాహూ కటీఫ్‌.. ప్రమాదంలో పశ్చిమాసియా పరిస్థితి?

Trump and Netanyahu fallout
Trump and Netanyahu fallout

Trump and Netanyahu fallout: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు తన సామ్రాజ్యవాద కాంక్షతో ఇరాన్‌పై యుద్ధం ప్రకటించారు. దీనికి ఎప్పటి నుంచో ఇరాన్‌తో వైరం ఉన్న ఇజ్రాయెల్‌ సహాయం తీసుకున్నారు. రెండు దేశాలు కలిసి ఇరాన్‌పై భీకర దాడులు చేశాయి. దాదాపు 50 రోజులు ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించాయి. మరోవైపు ఇజ్రాయెల్‌ లెబనాన్‌ను టార్గెట్‌ చేసింది. హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగించింది. తర్వాత అమెరికా ఇరాన్‌ మధ్య తాత్కాలిక సీజ్‌ఫైర్‌ కుదిరింది. శాశ్వత ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించి లెబనాన్, ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తోంది. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు ఆపాలని ఆదేశించారు. అయినా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తోంది. అమెరికా మద్దతు ఉన్నా లేకపోయినా ఇరాన్‌పై దాడులు కొనసాగించాలని నెతన్యాహు నిర్ణయించారు. తాజా కేబినెట్‌ సమావేశంలో నెతన్యాహు ‘అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలి’ అని కేబినెట్‌ సభ్యులను హెచ్చరించినట్లు ఇజ్రాయెల్‌ మీడియా వెల్లడించింది. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి ధరలు చెల్లించాల్సి వచ్చినా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా ముందస్తు సమాచారం..
ఇదే సమయంలో మరికొన్ని గంటల్లో ఇరాన్‌పై దాడి చేయబోతున్నట్లు అమెరికా ఇజ్రాయెల్‌కు ముందుగానే సమాచారం అందించినట్లు సమాచారం వెలువడింది. ఇటీవల హర్ముజ్‌ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ కూల్చివేతకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌ దక్షిణ ప్రాంతాల్లోని జాస్క్, బందర్‌ అబ్బాస్, ఖెష్క్‌ దీవి ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసింది. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఈ దాడులు తమ ఆత్మరక్షణ చర్యల్లో భాగమని ప్రకటించింది.

ఇరాన్‌ ప్రతీకారం..
తాజా దాడులపై ఇరాన్‌ కూడా తీవ్రంగా స్పందించింది. అమెరికా స్థావరాలు ఉన్న బహ్రెయిన్‌లోని నౌకాదళంపై ఎదురుదాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్‌ప్స్‌ ఇంకా తీవ్రమైన ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించాయి. ఇదే సమయంలో లెబనాన్‌లో హెజ్బొల్లా పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను తీవ్రంగా అసంతృప్తి పరుస్తున్నాయి.

ఇజ్రాయెల్‌ ఆందోళన..
ఇజ్రాయెల్‌ సైన్యాధ్యక్షుడు ఎయాల్‌ జమీర్‌ అమెరికా–ఇరాన్‌ మధ్య ఏ ఒప్పందమైనా ఇజ్రాయెల్‌ భద్రతా ప్రయోజనాలకు ముప్పుగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరితే తమ సైనిక చర్యల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఇజ్రాయెల్‌–అమెరికా మధ్య కూడా విబేధాలను పెంచుతోంది. ఒకవైపు ట్రంప్‌ ఇరాన్‌తో డీల్‌ ద్వారా శాంతి ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు నెతన్యాహు తన సైనిక వ్యూహాలను కొనసాగించాలని పట్టుబట్టడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చేస్తోంది.

అమెరికా ఇజ్రాయెల్‌కు ముందస్తు సమాచారం ఇచ్చి దాడులు చేయడం ద్వారా రెండు దేశాల మధ్య ఇప్పటికీ ఉన్న భాగస్వామ్యం కనిపిస్తున్నా, నెతన్యాహు ఒంటరిగా కూడా యుద్ధం చేస్తామన్న సంకేతం పశ్చిమాసియాలో మరిన్ని పెద్ద ఘర్షణలకు దారి తీయవచ్చని ఆందోళనలు రేకెత్తుతున్నాయి. రాబోయే రోజులు ఈ ప్రాంత భద్రతా పరిస్థితిని ఎలా మార్చనున్నాయో చూడాలి.

హిందీ లో పుంజుకున్న 'పెద్ది' వసూళ్లు.. 6 రోజుల్లో వచ్చిన గ్రాస్ ఎంతో చూస్తే ఆశ్చర్యపోతారు..

Peddi Hindi box office collections
Peddi Hindi box office collections

Peddi Hindi box office collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల సునామీ గురించి ఎంత చెప్పిన తక్కువే. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు పబ్లిక్ లో టాక్ ఉంటే , కలెక్షన్స్ ఎక్కడ మొదలై , ఎక్కడ ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరని ట్రేడ్ విశ్లేషకులు అంటుంటారు. అందుకు ది బెస్ట్ ఉదాహరణ గా ‘పెద్ది’ చిత్రం నిల్చింది. 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 273 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో కేవలం తెలుగు వెర్షన్ వసూళ్లే 250 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అయితే ఈ చిత్రానికి మొదటి రోజు నుండి హిందీ వెర్షన్ లో ఆశించిన స్థాయి వసూళ్లు నమోదు అవ్వలేదు, కానీ 6 వ రోజున హిందీ వెర్షన్ వసూళ్లు కాస్త పికప్ అయ్యాయి. రోజులవారీగా ఈ చిత్రానికి హిందీ లో ఎంత నెట్ వసూళ్లు వచ్చిందో ఒకసారి చూద్దాం.

అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజున హిందీ వెర్షన్ నుండి 3 కోట్ల 25 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రెండవ రోజున 2 కోట్ల 50 లక్షలు , 3 వ రోజున 3 కోట్ల 10 లక్షలు , నాల్గవ రోజున 3 కోట్ల 65 లక్షలు , 5 వ రోజున 1 కోటి 30 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక నార్త్ ఇండియా లో మంగళవారం రోజున నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ రేట్స్ మీద ఆఫర్స్ ఇస్తుంటారు. ఆ కారణం చేత ఈ సినిమా కలెక్షన్స్ లో కాస్త జంప్ వచ్చింది. 6 వ రోజున దాదాపుగా 1 కోటి 55 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా ఈ చిత్రానికి 6 రోజుల్లో 15 కోట్ల 35 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు హిందీ వెర్షన్ నుండి వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 20 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. ఈ వీకెండ్ హిందీ కలెక్షన్స్ మరోసారి భారీ లెవెల్ లో పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని , ఫుల్ రన్ లో ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 32 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు కచ్చితంగా వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. హిందీ లో కాస్త మేకర్స్ ప్రొమోషన్స్ చేయడం మొదలు పెడితే, కలెక్షన్స్ ఇంకా పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, చూడాలి మరి ఈ సినిమా హిందీ వెర్షన్ వసూళ్లు ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

'పెద్ది ' 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. వర్కింగ్ డేస్ లో కూడా ఇదేమి కుమ్ముడు బాబోయ్..

Peddi 6 days worldwide collections
Peddi 6 days worldwide collections

Peddi 6 days worldwide collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం జోరు తగ్గకుండా, సెన్సేషనల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతోంది. మన టాలీవుడ్ మార్కెట్ ఈమధ్య కాలం లో కేవలం పండగ సీజన్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది. మామూలు పని దినాల్లో బాక్స్ ఆఫీస్ వెలవెలబోయే పరిస్థితి ఏర్పడింది. కానీ ‘పెద్ది’ చిత్రం మామూలు పని దినాల్లో కూడా సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ ఈమధ్య కాలం లో రాలేదనే చెప్పాలి. సరిగ్గా టాలీవుడ్ పరిస్థితి చక్కదిద్దే సినిమా కోసం ట్రేడ్ ఎంతగానో ఎదురు చూసింది. ఆ ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేయడం బయ్యర్స్ కి మామూలు ఆనందాన్ని ఇవ్వడం లేదు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే రాజమౌళి #RRR ని మించి కలెక్షన్స్ ఉన్నాయి.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి మాట్లాడుకోవాలి. మొదటి రోజు నుండి నేటి వరకు ఈ చిత్రం ఈ ప్రాంతం లో సృష్టిస్తున్న రికార్డ్స్ సాధారణమైనవి కాదు. #RRR చిత్రానికి 6 వ రోజున ఈ ప్రాంతం నుండి కేవలం 98 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. కానీ ‘పెద్ది’ చిత్రానికి ఏకంగా 1 కోటి 14 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టే చెప్పొచ్చు , ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ఓవరాల్ గా ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 6 రోజుల్లో ఎంత షేర్ వసూళ్లను రాబట్టింది , వరల్డ్ వైడ్ గా వచ్చిన గ్రాస్ ఎంత , ఇంకా ఎంత షేర్ వసూళ్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనేది చూడాలి. ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రం 6 రోజుల్లో 45 కోట్ల 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 6 రోజుల్లో దాదాపుగా 17 కోట్ల రూపాయిలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 17 కోట్ల 45 లక్షలు , తూర్పు గోదావరి జిల్లా నుండి 10 కోట్ల 52 లక్షలు , పశ్చిమ గోదావరి జిల్లా నుండి 7 కోట్ల 33 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 10 కోట్ల 89 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 8 కోట్ల 40 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 4 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 121 కోట్ల 69 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 180 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 12 కోట్ల 25 లక్షలు , తమిళనాడు + కేరళ కలిపి 1 కోటి 90 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 8 కోట్ల 85 లక్షలు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి అయితే దాదాపుగా 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 165 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 273 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, మరో 54 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే , ఈ సినిమా పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది.

భారత్‌పై పాకిస్తాన్‌ నిఘా.. సాయం చేస్తున్న చైనా!

Pakistan surveillance on India
Pakistan surveillance on India

Pakistan surveillance on India: దశాబ్దాలుగా స్తబ్దుగా ఉన్న తన అంతరిక్ష కార్యక్రమాన్ని పాకిస్తాన్‌ ఇటీవల హఠాత్తుగా ఉరకలెత్తిస్తోంది. చైనా సాయంతో శరవేగంగా ఉపగ్రహాలను ప్రయోగించి, భారత్‌ సరిహద్దులపై నిరంతర నిఘా ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. గత 16 నెలల్లోనే పాకిస్తాన్‌ ఏకంగా ఆరు భూపరిశీలన ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజింగ్, హైపర్‌స్పెక్ట్రల్, అధునాతన రిమోట్‌ సెన్సింగ్‌ సామర్థ్యాలు ఉన్న ఉపగ్రహాలు ఉన్నాయి.

సైనిక చర్యల కోసం..
పాక్‌ అధికారికంగా ఈ ఉపగ్రహాలను పౌర అవసరాలు (వ్యవసాయం, విపత్తు నిర్వహణ, నగరాభివృద్ధి) కోసం అని చెబుతున్నప్పటికీ, నిపుణులు వీటిని సైనిక ప్రయోజనాలకు కూడా వినియోగించే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. హైపర్‌స్పెక్ట్రల్‌ ఉపగ్రహం ఏ –1 సాధారణ కెమెరాలు పసిగట్టలేని వస్తువులు, క్యామోఫ్లాజ్‌ చేసిన సైనిక వాహనాలు, దాచిన స్థావరాలను కూడా గుర్తించగలదు. పీఆర్‌ఎస్‌సీ–ఈవో2, పీఆర్‌ఎస్‌సీ–ఈవో3 వంటి ఉపగ్రహాలు అధునాతన చిత్రీకరణ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డేటా విశ్లేషణ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి.
ఈ ఉపగ్రహాలు కలిసి పని చేయడం ద్వారా భారత్‌ సరిహద్దు ప్రాంతాలు, వ్యూహాత్మక స్థావరాలపై నిరంతరం నిఘా ఉంచడం సాధ్యపడుతుంది.

చైనా సహకారంతో..
పాక్‌ స్పేస్‌ ఏజెన్సీ గత దశాబ్దాల్లో చాలా నెమ్మదిగా ముందుకు సాగింది. కానీ ఇప్పుడు చైనా రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడం, టెక్నాలజీ బదలాయింపు, ఉమ్మడి అభివృద్ధి ద్వారా వేగం పెంచింది. రెండు దేశాల మధ్య డేటా షేరింగ్‌ కూడా జరుగుతోంది. ఈ సహకారం కేవలం అంతరిక్ష రంగానికి మాత్రమే కాకుండా, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

భారత సైనిక కదలికలపై నిఘా..
పాకిస్తాన్‌ ఈ ఉపగ్రహాల ద్వారా భారత్‌ సైనిక కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో మార్పులను నిరంతరం పర్యవేక్షించే సామర్థ్యం సాధించింది. ఇది భారత్‌కు కొత్త సవాలుగా మారనుంది. భారత్‌ తన స్వంత ఉపగ్రహ నెట్‌వర్క్‌ను మరింత వేగంగా విస్తరించి, కౌంటర్‌ సర్వైలెన్స్‌ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

దశాబ్దాల తర్వాత పాకిస్తాన్‌ అంతరిక్ష రంగంలో చూపుతున్న ఈ ఆకస్మిక చురుకుదనం సాధారణ సాంకేతిక పురోగతి కంటే ఎక్కువగా వ్యూహాత్మక ఉద్దేశ్యాలతో ముడిపడి ఉందని స్పష్టమవుతోంది. చైనా బలమైన టెక్నాలజీ మద్దతుతో పాక్‌ భారత్‌పై ఆకాశం నుంచి కన్ను వేసే సామర్థ్యం పెంచుకోవడం దక్షిణాసియా భద్రతా సమీకరణాలను మరింత క్లిష్టంగా మార్చనుంది.

నా అన్నయ్య రామ్ చరణ్ కి సెల్యూట్ చేస్తున్నాను అంటూ అక్కినేని అఖిల్ ఎమోషనల్ పోస్ట్..

Akhil emotional post on Ram Charan
Akhil emotional post on Ram Charan

Akhil emotional post on Ram Charan: నిన్న మొన్నటి వరకు రామ్ చరణ్ అభిమానులు ‘పెద్ది’ చిత్రం లో తమ అభిమాన హీరో అంత అద్భుతంగా నటిస్తే , ఒక్క స్టార్ హీరో కానీ , డైరెక్టర్ కానీ ఆయన్ని మెచ్చుకుంటూ పోస్టులు వెయ్యలేదని, రామ్ చరణ్ అంటే కుళ్ళుకుంటున్నారు అంటూ సోషల్ మీడియా లో విచారం వ్యక్తం చేశారు. కానీ నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పెద్ది’ చిత్రం గురించి అద్భుతంగా స్పందిస్తూ , రామ్ చరణ్ పై పొగడ్తల వర్షం కురిపించడంతో అభిమానులు చాలా సంతోషించారు. ఇప్పుడు లేటెస్ట్ గా అక్కినేని నాగ చైతన్య కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. కాసేపటి క్రితమే ఆయన ‘పెద్ది’ చిత్రం లోని రామ్ చరణ్ నటన పై ప్రశంసలు కురిపిస్తూ వేసిన ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘మై డియర్ బ్రదర్ రామ్ చరణ్.. నీ కష్టం , డెడికేషన్ తో పెద్ది చిత్రాన్ని మొత్తం నడిపించావు. నీ అద్భుతమైన నటన గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు సరిపోవడం లేదు. ప్రతీ క్రాఫ్ట్ లోనూ నువ్వు చూపించిన డెడికేషన్ కి సెల్యూట్ చేస్తున్నాను. పెద్ది చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచినందుకు మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతే కాకుండా ఈ చిత్రం లో నటించిన నటీనటులకు , టెక్నీషియన్స్ కి కూడా శుభాకాంక్షలు. మీరు పడిన కష్టం ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించింది. మీ కష్టం తో ఇలాంటి క్వాలిటీ కంటెంట్ సినిమాని అందించి , మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ , అఖిల్ సొంత అన్నదమ్ములు లాగా ఉంటారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య బాండింగ్ అనేక సందర్భాల్లో బయటపడింది.

రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం తన ‘లెనిన్’ చిత్రాన్ని కూడా నిర్మాతలతో మాట్లాడి వాయిదా వేయించాడు అఖిల్. ఆ స్థాయి అనుబంధం వీళ్లిద్దరి మధ్య ఉంది. టాలీవుడ్ లో దిగ్గజ స్టార్ హీరోలకు వారసులుగా ఎంట్రీ ఇచ్చి , ఏ మాత్రం ఈగో లేకుండా సాగుతున్న వీళ్లిద్దరి రిలేషన్ ని చూసి సోషల్ మీడియా లో అభిమానులు మురిసిపోతున్నారు. ఇకపోతే ‘లెనిన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథి గా విచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. లెనిన్ ఈ చిత్రం ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అఖిల్ కెరీర్ లోనే ఈ చిత్రం ది బెస్ట్ గా నిలిచిపోతుందని అంటున్నారు, చూడాలి మరి అది ఎంత వరకు నిజం అనేది.

'దృశ్యం 3' వెంకటేష్ చేయకపోవడానికి కారణం అదేనా.. సంచలనం రేపుతున్న డైరెక్టర్ వ్యాఖ్యలు..

Venkatesh New Movie
Venkatesh New Movie

Director comments on Drishyam 3: ఇండియాలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ తీస్తే , అందులో కచ్చితంగా ‘దృశ్యం’ సిరీస్ టాప్ స్థానం లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా నటించిన , ‘దృశ్యం’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు , తమిళం , హిందీ భాషల్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ ఎంత అద్భుతంగా నటించాడో మన కళ్లారా చూశాము. ఇక ఆ తర్వాత సీక్వెల్ కేవలం మలయాళం తో పాటు తెలుగు హిందీ భాషల్లో కూడా తెరకెక్కింది. కరోనా లాక్ డౌన్ కారణంగా తెలుగు , మలయాళం వెర్షన్స్ డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదలయ్యాయి , కానీ హిందీ వెర్షన్ మాత్రం థియేటర్స్ లో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

రీసెంట్ గానే ‘దృశ్యం 3’ మలయాళం లో భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ అయితే డివైడ్ గానే వచ్చింది కానీ , సినిమాకు కూడా కలెక్షన్స్ వేరే లెవెల్ లో వచ్చాయి. కేవలం 30 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీన్ని బట్టీ ఏ రేంజ్ లో లాభాలు నిర్మాతకు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ ని చూసి , ‘దృశ్యం 4’ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని తెలుగు లో విక్టరీ వెంకటేష్ చేయకపోవడానికి గల కారణాన్ని ఆ చిత్ర డైరెక్టర్ జీతూ జోసఫ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా క్లైమాక్స్ ని వెంకటేష్ గారు నచ్చలేదు. తన మీద అలాంటి క్లైమాక్స్ వర్కౌట్ అవ్వడం కష్టమని అన్నారు. అంతే కాకుండా, ఇప్పటి మార్కెట్ పరిస్థితులు కూడా మారడం తో , ఈ రీమేక్ ని ఆయన రిజెక్ట్ చేసాడు. కానీ హిందీ లో అజయ్ దేవగన్ గారు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. షూటింగ్ కూడా చాలా వరకు అయిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు జీతూ జోసఫ్. ప్రస్తుతం మన టాలీవుడ్ లో రీమేక్ సినిమాల హవా బాగా తగ్గిపోయింది. పైగా విక్టరీ వెంకటేష్ ఇప్పుడు 300 కోట్ల గ్రాస్ సినిమాలో హీరో గా నటించి, తన రేంజ్ ని బాగా పెంచుకున్నాడు. కాబట్టి, ఇలాంటి సమయం లో ఈ చిత్రం లో నటించడం కరెక్ట్ కాదని ఆయన నిర్ణయం తీసుకున్నాడు అంటూ విక్టరీ వెంకటేష్ అభిమానులు చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ వదిలేసిన కథ ని పట్టుకున్న బాలయ్య.. సూపర్ హిట్ అందుకుంటాడా?

Balakrishna
Balakrishna

Balakrishna new movie story: పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదిలేసినా సందర్భాలు ఉన్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ గా పిలవబడే ప్రతీ ఒక్కరికి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చెయ్యాలని కోరిక ఉంటుంది. ఆయన్ని కలిసి ఒక కథ వినిపించాలనే ప్రయత్నాలు చాలానే చేశారు. కొన్ని కథలు విని రిజెక్ట్ చేశాడు , కొన్ని అయితే వినకుండానే రిజెక్ట్ చేశాడు . అలా రీసెంట్ గానే ఆయన ఒక క్రేజీ డైరెక్టర్ చెప్పిన కథని రిజెక్ట్ చేశాడు . ఆ డైరెక్టర్ మరెవరో కాదు , కొరటాల శివ. 6 నెలల క్రితం ఈయన పవన్ కళ్యాణ్ ని కలిసి ఒక పవర్ ఫుల్ కథ ని వినిపించాడట. సుమారుగా మూడు గంటల పాటు న్యారేషన్ ఇచ్చాడట. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ ఈ కథ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

తన ఇమేజ్ కి ఇలాంటి కథ సూట్ అవ్వదని , అభిమానులు తీసుకోలేరని చెప్పాడట. ఇప్పుడు ఆ కథని నందమూరి బాలకృష్ణ చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా ప్రకటించారు. త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతటి క్రేజ్ ప్రాజెక్ట్ ని పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్నందుకు అభిమానులు బాధపడుతున్నారు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి చూస్తే , ఈ చిత్రం కథ రీసెంట్ గా విడుదలైన అర్జున్ సూపర్ హిట్ మూవీ ‘బ్లాస్ట్’ తో పోలి ఉంటుందట. ఇలాంటి కథలు పవన్ కళ్యాణ్ కి సూట్ అవుతాయా అంటే అనుమానమే, ఆయన సినిమాల్లో కేవలం ఆయన మాత్రమే హైలైట్ అవ్వాలి , మిగిలిన నటీనటులు కనపడరు , అభిమానులు ఆ స్థాయిలో ఆయన్ని ఊహించుకుంటారు.

అలాంటి ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో , లేడీ క్యారెక్టర్స్ కి హీరో తో సమానమైన ఎలివేషన్స్ ఇస్తే , ఆడియన్స్ తీసుకోవడం కష్టమే , పవన్ కళ్యాణ్ ఈ చిత్రం రిజెక్ట్ చేసి మంచి పని చేశాడంటూ కొంతమంది అభిమానులు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసి మంచి పని చేశాడా లేదా అనేది సినిమా విడుదల వరకు చెప్పలేం. కనీసం టీజర్ విడుదలైనా ఒక అంచనా కి వచ్చేయొచ్చు. ఇకపోతే ఈ చిత్రం లో విలన్ గా సీనియర్ హీరో రాజశేఖర్ నటించబోతున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ , త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం సౌత్ లోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా నిలుస్తుందని అంటున్నారు , అందులో ఎంత వరకు నిజముందో చూడాలి.

అమెరికాలో ఐసిస్‌ కుట్ర భగ్నం.. దాడికి ముందే ముగ్గురి అరెస్ట్‌!

ISIS plot foiled in America
ISIS plot foiled in America

ISIS plot foiled in America: అగ్రరాజ్యం అమెరికాలో సైనికులు, వారి కుటుంబాలను టార్గెట్‌ చేసిన ముగ్గురు యువకుల అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాన్సస్, కాలిఫోర్నియా నగరాల్లో జాయింట్‌ ఆపరేషన్‌ ద్వారా ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూఐసిస్‌(ఇస్లామిక్‌ స్టేట్‌) సంస్థతో సంబంధాలు పెట్టుకుని, అమెరికా సైనికులు, వారి కుటుంబాలపై దాడులు చేయాలని కుట్ర చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడులు జరిగే ముందే అమెరికా ఫెడరల్‌ ఏజెన్సీలు వారిని అరెస్టు చేయడంతో పెద్ద సంక్షోభం నివారించబడింది.

ఆఫ్రికా దేశాల నుంచి వచ్చి..
అమెరికా పోలీసులు అరెస్టు చేసిన వారుమిషాన్‌ గఫూర్, శంశలుద్దీన్, బిరేన్‌ జాయి ముగ్గునూ 21 ఏళ్ల వయస్సు గల యువకులు. వీరంతా ఆఫ్రికన్‌ దేశాల నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడినవారు. ఐసిస్‌ సంస్థతో సంబంధాలు పెట్టుకుని, సోషల్‌ మీడియా, డిస్కార్డ్‌ చాట్‌ల ద్వారా కమ్యూనికేషన్‌ చేసుకుంటూ దాడి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారు అమెరికాలోని సైనిక స్థావరాలు, సైనికులు నివసించే ప్రాంతాలు, వారి కుటుంబ సభ్యులను టార్గెట్‌ చేసి దాడి చేయాలని భావించినట్లు తెలుస్తోంది.

కుట్రను బయటపెట్టిన అమెరికా భద్రతా ఏజెన్సీలు
సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ చాట్‌లపై నిఘా పెట్టడం ద్వారా ఈ కుట్రను గుర్తించి, సకాలంలో ఆపరేషన్‌ నిర్వహించి ముగ్గురినీ అరెస్టు చేశాయి. ఐసిస్‌ సంస్థ భౌతికంగా బలహీనపడినప్పటికీ, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దాడులు లేదా చిన్న సెల్‌ల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న వాస్తవాన్ని మరోసారి బయటపెడుతోంది. ఆఫ్రికన్‌ దేశాల నుంచి వలస వచ్చిన యువకులు ఆన్‌లైన్‌ ద్వారా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకోవడం ఇటీవలి కాలంలో పెరిగిన ట్రెండ్‌గా మారింది. అమెరికా భద్రతా సంస్థలు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటన అమెరికాలో ఉగ్రవాద బెదిరింపులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని మరోసారి గుర్తు చేస్తోంది. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా యువకులను సులభంగా రిక్రూట్‌ చేసే ఐసిస్‌ లాంటి సంస్థల వ్యూహాలకు భద్రతా ఏజెన్సీలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ కేసు హైలైట్‌ చేస్తోంది.

నాని 'ది ప్యారడైజ్' కి బంపర్ ఆఫర్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్ సంస్థ.. ఉపయోగించుకుంటారో లేదో చూడాలి..

Nani The Paradise Netflix deal
Nani The Paradise Netflix deal

Nani The Paradise Netflix deal: నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో ఏ స్థాయిలో మన టాలీవుడ్ లో ముందుకు దూసుకుపోతున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ‘దసరా’ చిత్రం నుండి నాని కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సినిమా సినిమాకు తన స్థాయి , మార్కెట్ ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో , ఈ చిత్రానికి కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంది. ‘దసరా’ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో నాని చేస్తున్న రెండవ చిత్రమిది. ఈమధ్యనే ఈ చిత్రం నుండి విడుదలైన ‘ఆయా షేర్’ పాటకు ఏ రేంజ్ బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే.

ఏ ఈవెంట్ కి వెళ్లినా ఇప్పుడు ఈ పాటనే వినిపిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ పట్ల చాలా జాప్యం జరుగుతోంది , ఇదే ఈ సినిమాపై హైప్ డైల్యూట్ అయ్యేలా చేస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చేద్దామని అనుకున్నారు , కానీ కుదర్లేదు. షూటింగ్ కార్యక్రమాలు చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఆగస్టు 21 కి వాయిదా వేశారు. ఎట్టిపరిస్థితిలోనే ఆగస్టు 21 న ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా , షెడ్యూల్స్ ని డిజైన్ చేశారు. కానీ కుదర్లేదు , ఇప్పుడే ఇదే ఆగస్టు 21 న రవితేజ ‘ఇరుముడి’ చిత్రం విడుదల కాబోతుంది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే , ఈ సినిమా ఆగస్టు నుండి డిసెంబర్ నెలకు వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి ఇంకా 60 రోజుల సమయం పడుతుందట, రీసెంట్ గానే ఆ లాంగ్ షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ మొదలైంది.

షూటింగ్ ని పూర్తి చేసి , ఎలా అయినా డిసెంబర్ నెలకు రావాలని చూస్తున్నారు. కానీ అది అంత తేలికైన విషయం కాదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు వాయిదా పడడంతో, మేకర్స్ పై ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో ఎలా అయినా విడుదల చేసేలా ప్లాన్ చేయమని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే సెప్టెంబర్ నెలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చాయట, అందుకే సెప్టెంబర్ లో విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటే , ముందుగా మాట్లాడుకున్న రేట్ కంటే డబుల్ ఇస్తామని నెట్ ఫ్లిక్స్ ఆఫర్ పెట్టినట్టు తెలుస్తోంది. ‘ప్యారడైజ్’ టీం కూడా సెప్టెంబర్ లో ఎలా అయినా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట , మరి అప్పటి లోపు షూటింగ్ అవుతుందో చూడాలి.

పీవోకేలో హింస.. అసలు కారణం ఇదే!

POK violence latest news
POK violence latest news

POK violence latest news: మన పొరుగున్న ఉన్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పాక్‌ ఆజాద్‌ జమ్మూ కశ్మీర్‌)లో కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక నిరసనలు, పోలీసు–ప్రజల మధ్య ఘర్షణలు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి ఒక్క సమస్య నుంచి పుట్టుకొచ్చాయని స్పష్టమవుతోంది. అది 12 రిఫ్యూజీ సీట్ల వివాదం. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అసెంబ్లీలో మొత్తం 45 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 12 సీట్లు 1947 తర్వాత భారతదేశ నుంచి వలస వచ్చి పాకిస్తాన్‌లో(కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి, పంజాబ్, సింధ్‌ తదితర ప్రాంతాల్లో) స్థిరపడిన కశ్మీరీ శరణార్థులకు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. ఈ 12 సీట్ల ఓటర్లు పీవోకేలో కాకుండా పాకిస్తాన్‌ మెయిన్‌ ల్యాండ్‌లోనే ఓటు వేస్తారు.

జేఏఏసీ ఆరోపణలు..
జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ (జేఏఏసీ) నేతృత్వంలోని స్థానికులు ఈ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి ప్రకారం ఈ 12 సీట్ల ద్వారా పాకిస్తాన్‌ జాతీయ రాజకీయ పార్టీలు(ముఖ్యంగా పంజాబ్‌ ఆధారిత పార్టీలు) పీవోకే రాజకీయాలను బయటి నుంచి నియంత్రిస్తున్నాయి.
స్థానిక పీవోకే ప్రజల ఆకాంక్షలు, సమస్యలు వెనక్కి నెట్టబడుతున్నాయి.
ఈ సీట్లు రాజకీయ ఆధిపత్యం కోసం ‘‘ఇంజనీర్డ్‌ టూల్‌’’గా మారాయి.
జేఏఏసీ గతంలో 38 సూచనల జాబితా ఇచ్చింది. పాక్‌ ప్రభుత్వం 36 డిమాండ్లను అంగీకరించినా, 12 రిఫ్యూజీ సీట్లను రద్దు చేయాలన్న డిమాండ్‌ మాత్రం మిగిలిపోయింది.

ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పుతో హింస..
ఈ వివాదం ఇటీవల మరింత రాజేసింది. పీవోకే సుప్రీం కోర్టు ఈ 12 సీట్లు రాజ్యాంగబద్ధమైనవని, వాటిని సాధారణ ఉత్తర్వు ద్వారా రద్దు చేయలేమని తీర్పు ఇచ్చింది. దీనికి నిరసనగా రావలకోట్‌లో జరిగిన ఘర్షణల్లో పలువురు మరణించారు. జేఏఏసీపై నిషేధం విధించడం, అరెస్టులు కూడా జరిగాయి. ఇది పీవోకేలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేసింది.

వివాదం ఎందుకు..
పీవోకే అసెంబ్లీలో దాదాపు 27 శాతం సీట్లు (12/45) స్థానికులకు కాకుండా బయటి శరణార్థుల ఓట్లపై ఆధారపడి ఉన్నాయి.
ఇది స్థానిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని, పాకిస్తాన్‌ రాజకీయ పార్టీలు పీవోకేను రిమోట్‌ కంట్రోల్‌తో నడుపుతున్నాయని ఆరోపణ. ఆర్థిక సమస్యలు (పిండి, విద్యుత్‌ ధరలు), అభివృద్ధి లోపం తదితర అంశాలతో కలిసి ఈ రాజకీయ అసమానత హింసాత్మక ఉద్యమంగా మారింది.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఇప్పుడు జరుగుతున్న హింస కేవలం ఆర్థిక సమస్యల వల్ల కాదు. అసెంబ్లీలోని 12 రిఫ్యూజీ సీట్ల వ్యవస్థ స్థానికుల్లో ఏర్పడిన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నుంచి ఉద్భవించింది. స్థానికులకు నిజమైన ప్రాతినిధ్యం కావాలి. ఈ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే, పీవోకేలో ఉద్రిక్తతలు మరింత పెరిగి, రాజకీయ పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉంది. జులై 27న జరగనున్న ఎన్నికల ముందు ఈ సమస్య పీవకే రాజకీయాలను ఎలా మార్చనుందనేది అందరూ గమనిస్తున్నారు.

సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ సృష్టించిన అర్జున్ 'బ్లాస్ట్' మూవీ.. ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Arjun Blast movie box office collections
Arjun Blast movie box office collections

Arjun Blast movie box office collections: ప్రస్తుత జనరేషన్ లో ఆడియన్స్ కంటెంట్ ఉన్న సినిమాలకు ఇస్తున్నటువంటి ఆదరణ అద్భుతం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ ఓటీటీ యుగం లో ఒక సినిమాకు థియేటర్ కి వెళ్లి ప్రేక్షకుడు చూడడం అనేది చాలా అరుదు. అంత తేలికైన విషయం కూడా కాదు , కానీ కచ్చితంగా థియేట్రికల్ అనుభూతి చెందాల్సిన సినిమా అని ప్రేక్షకుడికి అనిపిస్తే మాత్రం , హీరో ఎవరు అనేది అసలు పట్టించుకోవడం లేదు , వెంటనే టికెట్స్ తెంచేస్తున్నారు. అలా ఈమధ్య కాలం లో ఎంతమంది సీనియర్ హీరోలు కం బ్యాక్ ఇచ్చి , నేటి తరం స్టార్ హీరోలతో సరిసమానమైన కలెక్షన్స్ ని రాబట్టడం చాలానే చూశాము. రీసెంట్ గా సీనియర్ హీరో , యాక్షన్ కింగ్ అర్జున్ కూడా గ్రాండ్ గా కం బ్యాక్ ఇచ్చాడు.

ఈయన హీరో పాత్రలకు దూరమై , క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యి చాలా కాలం అయ్యింది. అలాంటి ఆయన , హీరో గా చాలా కాలం గ్యాప్ తర్వాత చేసిన చిత్రం ‘బ్లాస్ట్’. ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా మామూలుగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ కలెక్షన్స్ లో కూడా కనిపిస్తోంది. బుక్ మై షో యాప్ నుండి ఈ చిత్రానికి దాదాపుగా 1 మిలియన్ కి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 60 కోట్ల రూపాయిల వరకు వచ్చింది. తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిత్రం సైలెంట్ గా పికప్ అయ్యింది. చూస్తుంటే ఈ ఏడాది హీరోల కం బ్యాక్ కి బాగా కలిసొచ్చింది అనే చెప్పొచ్చు. చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న తమిళ స్టార్ హీరో సూర్య ‘కరుప్పు’ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇచ్చాడు.

అదే విధంగా రీసెంట్ గానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ‘పెద్ది’ చిత్రం తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ , హిస్టారికల్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు సీనియర్ హీరో అర్జున్ కూడా కం బ్యాక్ ఇవ్వడం ఆసక్తికరమైన విషయం. ఈ చిత్రం లో అభిరామి , ప్రీతీ ముకుందన్ హీరోయిన్స్ గా నటించారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమా ఈ రేంజ్ లో క్లిక్ అవుతుందని బహుశా అర్జున్ కూడా ఊహించి ఉండదు. రీసెంట్ గానే ఆయన తన కూతురు ఐశ్వర్య ని పెట్టి ‘సీత పయనం’ అనే చిత్రం తీసాడు. ఈ సినిమాకు దర్శకుడు , నిర్మాత ఆయనే. ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ‘బ్లాస్ట్ ‘ చిత్రం ఆ పరాజయాన్ని మర్చిపోయేలా చేసింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

చిన్న కార్లు కొనేవారికి బంపర్ ఆఫర్..

Maruti Suzuki bumper offer
Maruti Suzuki bumper offer

Maruti Suzuki bumper offer: Maruthi Suzuki కార్లు కొనేవారికి కంపెనీ ఊరటనిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా కార్ల ధరల పెంపు నుంచి ఉపశమనం కల్పించడంతో పాటు, కారు కొనుగోలును సులభతరం చేసేందుకు సరికొత్త ఆర్థిక పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేంటో చూద్దాం..

మారుతీ సుజుకీ తన పాపులర్ ఎంట్రీ లెవల్ మోడళ్లపై ప్రైస్ ప్రొటెక్షన్ ను ప్రకటించింది. ఈ కంపెనీకి చెందిన ఆల్టో కే10 , ఎస్‌-ప్రెస్సో , సెలేరియో, వ్యాగన్-ఆర్ కార్లపై త్వరలో అమలు కానున్న రూ.30,000 ధరల పెంపు నుంచి వినియోగదారులకు మినహాయింపునిచ్చింది. ఈ ప్రయోజనం పొందాలంటే, వినియోగదారులు జూన్ 14వ తేదీలోపు పైన పేర్కొన్న కార్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువులోపు బుక్ చేసుకున్న వారికి పాత ధరలకే వాహనాలను అందజేస్తామని సంస్థ స్పష్టం చేసింది.

‘సుహానా సఫర్’ పేరుతో సరికొత్త పథకం
కార్ల కొనుగోలును సామాన్యులకు మరింత చేరువ చేసేందుకు మారుతీ సుజుకీ ‘సుహానా సఫర్’ పేరుతో ఒక ప్రత్యేకమైన ఆర్‌డీ తరహా పథకాన్ని ప్రారంభించింది. కారు కొనాలనుకునే వారు ఈ పాలసీలో చేరి, నిర్ణీత కాల వ్యవధి (3 నుంచి 6 నెలల పాటు) ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

డౌన్ పేమెంట్‌గా వినియోగం
ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని మారుతీ సుజుకీ సంస్థ వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తుంది. ఇలా పొదుపు చేసిన మొత్తం (అసలు + వడ్డీ)ను వినియోగదారులు కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు ‘డౌన్ పేమెంట్’ (Down Payment) కింద వాడుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో అనువుగా ఉంటుందని, ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు చెల్లించాల్సిన భారం తగ్గుతుందని సంస్థ పేర్కొంది.

ప్రపంచ ఫుట్‌బాల్‌ సమరం.. 48 జట్లతో సరికొత్త చరిత్ర!

World Football Tournament
World Football Tournament

World Football Tournament: ప్రపంచవ్యాప్త ఫుట్‌బాల్‌ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌ కప్‌–2026 రేపు(జూన్‌ 11) నుంచి ప్రారంభం అవతుంది. జులై 19 వరకు పోటీలు జరుగుతాయి. 39 రోజుల సంరంభం ఫుట్‌బాల్‌ అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఈసారి వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే అతి పెద్ద టోర్నమెంట్‌. మొదటి సారి 48 జట్లు పాల్గొంటున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మెక్సికో, కెనడా కలిసి ఆతిథ్యం ఇవ్వడం కూడా ఇదే తొలిసారి. మొత్తం 104 మ్యాచులు 16 వేదికల్లో జరగనున్నాయి. గతంలో 32 జట్లతో జరిగిన టోర్నమెంట్‌ ఇప్పుడు 48కి పెరగడంతో గ్రూప్‌ స్టేజ్‌ నుంచి నాకౌట్‌ దశ వరకు ఉత్కంఠ మరింత పెరిగింది.

కొత్త ఫార్మాట్‌ ఇలా..
48 జట్లను 12 గ్రూపులుగా విభజించారు (ప్రతి గ్రూపులో 4 జట్లు). ప్రతీ జట్టు గ్రూప్‌ స్టేజ్‌లో 3 మ్యాచులు ఆడాలి. ప్రతీ గ్రూపు నుంచి టాప్‌–2 జట్లు + అన్ని గ్రూపుల నుంచి 8 ఉత్తమ 3వ స్థాన జట్లు మొత్తం 32 జట్లు నాకౌట్‌ దశకు (రౌండ్‌ ఆఫ్‌ 32) చేరుకుంటాయి. ఇది గత టోర్నమెంట్ల కంటే ఒక అదనపు నాకౌట్‌ రౌండ్‌ను తీసుకొచ్చింది. ఓపెనింగ్‌ మ్యాచ్‌ జూన్‌ 11న మెక్సికో సిటీలోని ప్రసిద్ధ ఎస్టాడియో అజ్టెకాలో మెక్సికో, సౌత్‌ ఆఫ్రికా మధ్య జరుగుతుంది. ఫైనల్‌ జులై 19న న్యూయార్క్‌ సమీపంలోని మెట్‌లైఫ్‌ స్టేడియం (న్యూయార్క్‌/న్యూజెర్సీ)లో జరగనుంది.

ఈసారి ఫేవరెట్లు ఎవరు?
ప్రస్తుత ఫామ్, యువ ఆటగాళ్ల సత్తా, గత ప్రదర్శనల ఆధారంగా విశ్లేషకులు, బెట్టింగ్‌ ఏజెన్సీలు స్పెయిన్‌ను టాప్‌ ఫేవరెట్‌గా ఉంది. తర్వాత ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌ జట్టు బలంగా ఉన్నాయి. బ్రెజిల్, పోర్చుగల్, డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా కూడా ఫేవరెట్‌ రేసులో ఉన్నాయి.

ఈ టోర్నమెంట్‌కు భారత్‌ అర్హత సాధించలేదు. ఏషియా క్వాలిఫయర్స్‌లోనే భారత జట్టు ముందస్తుగా నిష్క్రమించింది. అయినప్పటికీ భారతీయ ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌ ఈ టోర్నమెంట్‌ను టీవీల ద్వారా ఉత్సాహంగా వీక్షించనున్నారు. ఫిఫా వరల్డ్‌ కప్‌–2026 చరిత్రలో ఒక మైలురాయి. 48 జట్లు, మూడు దేశాల ఆతిథ్యం, 104 మ్యాచులు, కొత్త ఫార్మాట్‌… ఈ నాలుగు వారాలు ప్రపంచ ఫుట్‌బాల్‌ అభిమానులకు నిజమైన పండగగా మారనుంది.

జగన్ 'కాపు' రాజకీయం!

YS Jagan Politics
YS Jagan Politics

Jagan Kapu Politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికల లక్ష్యంగా చాలా రకాల వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా పార్టీ జనసేన పై ఫుల్ ఫోకస్ పెట్టింది. జనసేన ను దారుణంగా దెబ్బతీయాలని చూస్తోంది. కాపులను జనసేనకు దూరం చేస్తే ఆ ప్రభావం కూటమిపై పడుతుందని.. అదే జరిగితే ఇతర పక్షాల మద్దతుతో చాలా సులువుగా అధికారంలోకి రావచ్చని అంచనా వేస్తోంది. అయితే అది అంత తేలికైన విషయం మాత్రం కాదు. ముఖ్యంగా జనసేన నుంచి కాపులను ఇప్పట్లో వేరు చేయడం కుదిరే పని కాదు. ఎందుకంటే కాపులు పవన్ కళ్యాణ్ విషయంలో కొంత సంతృప్తితో అయితే మాత్రం ఉన్నారు. తమ వాడు డిప్యూటీ సీఎం పదవి వరకు వచ్చాడు అని.. ఏపీలో పాలనలో భాగస్వామ్యం అవుతున్నాడని.. ఆయన నిర్ణయాలకు గౌరవం లభిస్తుందని వారిలో సంతృప్తి ఉంది. అయినా సరే కాపులను విభజిస్తే తప్ప రాజకీయాలు చేయలేమని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కాపుల మద్దతు కోసం ఒకవైపు.. జనసేనకు దూరం చేసేందుకు మరోవైపు జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు.

* కాపు నేతలు ఉన్నా..
ప్రస్తుతం కాపులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. కాపు నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కురసాల కన్నబాబు.. ఇలా పేరు మోసిన నేతలంతా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. అయితే వీరి ద్వారా కాపులను ఆకర్షించే ప్రయత్నం చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వీరు ఆకర్షించే స్థితిలో లేరు. ఎంతవరకు పవన్ పై విమర్శలు చేయగలరే తప్పించి.. వీరికి మరో పని చేతకాదు. పోనీ ముద్రగడ పద్మనాభం, హరి రామ జోగయ్య లాంటి వారిని తిరిగి ప్రయోగిస్తామంటే కాపులు మరింతగా తిరస్కరిస్తారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు కూడా. అందుకే కొత్త కాపుల కోసం ఆయన అన్వేషిస్తున్నారు. అందుకే దాసరి రాము, వంగవీటి కుటుంబం వంటి వారిపై ఆశలు పెట్టుకున్నారు.

* అప్పుడు అలాంటి ప్రయత్నం..
పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పెట్టుకోకుండా హరిరామ జోగయ్య పేరు చెప్పుకొని చాలా ప్రయత్నాలు చేశారు అప్పట్లో. ఒకవేళ పొత్తు పెట్టుకున్న సగానికి పైగా సీట్లు కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ ను కోరమని చెప్పారు. లేకుంటే పొత్తు వద్దు అని తేల్చేయమని సలహా ఇచ్చారు. ఎప్పటికప్పుడు హరి రామ జోగయ్య పేరుతో లేఖలు రాసి పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం అయితే జనసేనలోకి వచ్చి.. తనదైన వైసీపీ ప్రయోజనాల కోసం కృషి చేయాలని చూశారు. దానిని ముందుగానే గ్రహించారు పవన్ కళ్యాణ్. అందుకే జనసేనలోకి ముద్రగడ ఎంట్రీని లేకుండా చేశారు. ఆ కోపంతోనే ముద్రగడ వైసీపీలోకి వెళ్లారు. పవన్ ను ఓడిస్తానని శపథం చేశారు. ఓడించలేక పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకున్నారు.

* కొత్త వారి కోసం ఆరాటం..
జగన్మోహన్ రెడ్డి ముందుగా హరి రామ జోగయ్యను వాడేసారు. తరువాత ముద్రగడ పద్మనాభంను వాడేసారు. ఇప్పుడు కొత్తగా వాడేందుకు దాసరి రాము కనిపిస్తున్నారు. అవసరం అనుకుంటే వంగవీటి కుటుంబంలో ఒకరిని తెచ్చి కాపు రాజకీయంతో కాక రేపాలని చూస్తున్నారు. కానీ వారు ముందుకు వస్తారా లేదా అన్నది చూడాలి.

విశాఖకు జగన్.. జరిగేది అదే కదా?!

Jagan Meets Steel Plant Victims Families
Jagan Meets Steel Plant Victims Families

Jagan Meets Steel Plant Victims Families: విశాఖ స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు . ఈపాటికే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో వెళ్తుందనేది చెప్పనవసరం లేదు. ఒకవైపు సీఎం సీఎం అనే నినాదాలు. మరోవైపు షక్కటి చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి చిద్విలాసాలు ఎన్నో కనిపిస్తాయి. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన పరామర్శల శైలి వేరుగా ఉంటుంది. సెంటిమెంట్ పాలిటిక్స్ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు విశాఖ వెళ్తారు. బాధితులకు పరామర్శిస్తారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతారు. ఎక్స్ గ్రేషియా ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోతుంది. కార్మిక సంఘాల నేతలు, వామపక్షాల ప్రతినిధులు సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ వీరిని ఉక్కుపాదంతో అణిచివేశారు. ఇప్పుడు ప్రతిపక్షం కాబట్టి వీరి ప్రశ్నించేందుకు ఏమీ ఉండదు.

* ఇచ్చేందుకు ఇష్టపడరు..
జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంది. ఎంతవరకు తన ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాను అంటారే తప్ప.. పార్టీ ఫండ్ నుంచి కానీ.. తన సొంత జేబులో నుంచి కానీ ఒక్క పైసా కూడా ఇచ్చేందుకు ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా పార్టీలో బడా నేత సాయం చేస్తే తన చేతుల మీదుగా అందించి ఆ క్రెడిట్ కొట్టేస్తారు. సొంత సొమ్ము అంటే ఆయనకు అంతలా ఇష్టం. ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇచ్చేందుకు ఇష్టపడరు. అంతులేని సంపద ఆయన వద్ద ఉందన్నది బహిరంగ రహస్యం. కానీ అందులో ఒక్క రూపాయి కూడా ఎప్పుడు ఎవరికీ ఇచ్చిన దాఖలాలు లేవు. చివరకు విపత్తుల సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అందించే నగదును కూడా తాను సొంతంగా అందిస్తానని చెప్పిన మహామేధావి నేత జగన్. ఇప్పుడు సాయం చేస్తారు అనుకుంటే మనం పొరపడినట్టే.

* అధికారంలోకి వస్తే..
ఎక్కడకు వెళ్ళు.. ఏ బాధితులను పరామర్శించు.. జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చే ఒకే ఒక్క మాట. ఇప్పుడు మన దగ్గర అధికారం లేదు. కళ్ళు మూసుకుని తెరిస్తే మరో మూడు సంవత్సరాలు ఇట్టే వచ్చేస్తాయి. మన ప్రభుత్వం వచ్చాక బోలెడంత ఇస్తాం. కొండలను పిండి చేసి మీ చేతుల్లో పెడతాం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెబుతుంటారు.. పదేపదే అబద్ధాలు చెబితే అవి విమర్శలుగా మారుతాయి. కానీ వాటిని వినిపించుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేరు. శవ రాజకీయాలు చేయడం.. ప్రభుత్వంపై బురద జల్లడం.. సాక్షి మీడియాతో ఫేక్ డ్రామాలు ఆడించినట్టుగా.. సీఎం సీఎం అని నినాదాలు చేయించడం అనేది వారికి అలవాటైన విద్య.

క్రికెట్‌లో కుల రాజకీయం.. సూర్యపై వేటుకు కారణం అదేనా?

Suryakumar Yadav Captaincy Removal
Suryakumar Yadav Captaincy Removal

Suryakumar Yadav Captaincy Removal: భారత క్రికెట్‌ రాజకీయాలు, అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో జరిగిన అక్రమాలపై సిట్‌ విచారణ జరుగుతోంది. ఇక రాజకీయ జోక్యం ఎప్పటి నుంచో ఉంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఆ పార్టీ అనుకూలులు ఉంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అమితషా కుమారుడు జైషా బీసీసీఐ చీఫ్‌గా ఎన్నికైన తర్వాత ఈ ఆరోపణలకు బలం చేకూరింది. అయితే క్రికెట్‌లో కుల రాజకీయాల ప్రస్తావన పెద్దగా ఉండదు. కానీ తాజాగా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్‌ యాదవ్‌ తప్పింపు వెనుక కుల వివక్ష, అమిత్‌ షా కుమారుడు జై షా ప్రమేయం అంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్‌ సిన్హా సంచలన ఆరోపణ చేశారు. ‘సూర్య కెప్టెన్సీలో భారత్‌ వరల్డ్‌ కప్‌ గెలిచింది. అయినా అకస్మాత్తుగా ఎందుకు తొలగించారు? అతను యాదవ్‌ కమ్యూనిటీకి చెందిన వాడు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక అమిత్‌ షా కుమారుడు జై షా ఉన్నారు. బీసీలు, దళితులు, మైనారిటీలపై అన్ని రంగాల్లో వివక్ష కొనసాగుతోంది’ అని ఆరోపించారు.

సూర్య కెప్టెన్సీలో భారత్‌ విజయాలు..
సూర్యకుమార్‌ యాదవ్‌ను గత సంవత్సరం టీ20 ఫార్మాట్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించిన తర్వాత భారత్‌ అనేక సిరీస్‌లలో ఆధిపత్యం చెలాయించింది. ముఖ్యంగా టీ20 వరల్డ్‌ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఆధ్వర్యంలో భారత జట్టు యువ ఆటగాళ్లను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లింది. అయినప్పటికీ ఇటీవలి కొన్ని సిరీస్‌లలో సూర్య వ్యక్తిగత ప్రదర్శన కాస్త తగ్గిన నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి శ్రేయస్‌ అయ్యర్‌ను బాధ్యతలు అప్పగించింది.

కులం ఆరోపణల్లో నిజమెంత?
అశుతోష్‌ సిన్హా ఆరోపణలు స్పష్టంగా రాజకీయ రంగును సంతరించుకున్నాయి. సూర్యకుమార్‌ యాదవ్‌ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాదవ్‌ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆటగాడు కావడం, బీజేపీ నాయకుడు అమిత్‌ షా కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉండటం వీటిని కలిపి చూసి ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో యాదవ్‌ వోట్‌ బ్యాంకు బలమైన సామాజిక సమీకరణం కావడంతో, సమాజ్‌వాదీ పార్టీ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

క్రికెట్‌లోకి కులం, రాజకీయాలు..
ఈ ఆరోపణలు క్రికెట్‌ రంగంలో కులం, రాజకీయాలు, సామాజిక సమీకరణాలు చొరబడుతున్నాయన్న చర్చను మరోసారి రేకెత్తించాయి. బీసీసీఐ అధికారులు మాత్రం ఈ నిర్ణయం పూర్తిగా ప్రదర్శన, జట్టు భవిష్యత్‌ ఆధారంగానే తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే సూర్యకుమార్‌ యాదవ్‌ భారత క్రికెట్‌కు చేసిన కృషి, అతని 360 డిగ్రీ బ్యాటింగ్‌ స్టైల్, టీ20లో అతని ఆధిపత్యం ఇవన్నీ దేశవ్యాప్తంగా అభిమానులు గుర్తుంచుకునే విషయాలు. ఇలాంటి ఆటగాడిని కులం ఆధారంగా తప్పించారన్న ఆరోపణలు క్రికెట్‌ ప్రేమికుల మధ్య కూడా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీ నుంచి తప్పించడం ఒక సాధారణ క్రికెట్‌ నిర్ణయంగా మిగిలిపోవాల్సింది. కానీ ఎస్పీ ఎమ్మెల్సీ అశుతోష్‌ సిన్హా చేసిన ఆరోపణలు దీన్ని కులం, రాజకీయాలు, వివక్ష అనే వివాదంగా మార్చేశాయి. ఈ సంఘటన క్రికెట్‌ను రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం సరైన విధానమా అన్న ప్రశ్నను దేశవ్యాప్తంగా రేకెత్తిస్తోంది.

పీవోకే ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం.. పాకిస్తాన్ కు లండన్ నుంచి సెగ

POK Freedom Movement
POK Freedom Movement

POK Freedom Movement: కశ్మీర్‌ సమస్యను అంతర్జాతీయంగా ప్రచారం చేసి, భారత్‌పై పాకిస్తాన్‌ నరేటివ్‌ను బలపరచడంలో కీలక పాత్ర పోషించిన మీర్‌పురి ముస్లింలు ఇప్పుడు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవకే)లో సైన్యం చేస్తున్న అత్యాచారాలు, ఇంటర్నెట్‌ నిషేధం, సామాన్య ప్రజలపై హింసను హైలైట్‌ చేస్తూ లండన్‌లోని పాకిస్తాన్‌ హైకమిషన్‌ ఎదుట తీవ్ర ఆందోళనలు చేశారు. ఇది పాకిస్తాన్‌కు పెద్ద షాక్‌గా మారింది.

ఎవరీ మీర్‌పురి ముస్లింలు..
1947లో కశ్మీర్‌ సమస్య మొదలు కావడానికి ఐదారేళ్ల ముందు నుంచే లండన్‌లో మీర్‌పూర్‌ నుంచి వచ్చిన శరణార్థులు(మీర్‌పురి ముస్లింలు) పాకిస్తాన్‌ అనుకూల, భారత వ్యతిరేక నరేటివ్‌ను బలపరుస్తూ వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ సైన్యంలో పనిచేసిన ఈ వారిని బ్రిటిషర్లు లండన్‌లో స్థిరపరచారు. గత దశాబ్దాలుగా వీరు పాకిస్తాన్‌ జెండాలు ఎగురవేసి భారత్‌ను తిట్టడం, భారత రాయబార కార్యాలయాలపై దాడులు, బ్రిటిష్‌ పార్లమెంట్‌లో కశ్మీర్‌ విషయం లేవనెత్తడం వంటి చర్యలతో పాకిస్తాన్‌కు అనుకూల వాతావరణం సృష్టించారు.

పీవోకేలో తిరుగుబాటు..
గిల్గిట్‌బల్టిస్తాన్, మీర్‌పూర్, పోక్‌ ప్రజలు 2020 నుంచి హక్కుల కోసం పోరాడుతున్నారు. గోధుమ పిండి, విద్యుత్‌ ధరలు, రోడ్లు, సాగునీరు, అభివృద్ధి పనులు వంటి సమస్యలతో మొదలైన ఉద్యమం 2023లో తీవ్రమైంది. 2024లో 6 రోజులు, 2025లో నెల రోజులు పూర్తి షట్‌డౌన్‌ చేశారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం చర్చలు జరిపి హామీలు ఇచ్చినా, కనీస హక్కులు కూడా అమలు చేయలేదు. ఇటీవలి ఘర్షణల్లో పోలీసు–సైన్యం కాల్పులు జరిపి పలువురు మరణించారు. ఇంటర్నెట్, కమ్యూనికేషన్‌ సేవలపై పూర్తి నిషేధం విధించడంతో పీవోకేలోని ప్రజలు బంధువులతో కూడా సంప్రదించలేకపోతున్నారు.

లండన్‌లో ఆందోళన..
ఇప్పటి వరకు భారత్‌పై ఆందోళనలు చేసిన మీర్‌పురి ముస్లింలు తాజాగా పాకిస్తాన్‌ హైకమిషన్‌ ఎదుట ‘పీవోకేను విముక్తం చేయాలి అంటూ నినాదాలు చేశారు. తమ బంధువుల సమాచారం తెలుసుకోలేకపోతున్నామని, సైన్యం అత్యాచారాలు చేస్తోందని ఆరోపించారు. ఈ కమ్యూనిటీ బ్రిటిష్‌ రాజకీయాల్లో బలమైన పట్టు కలిగి ఉంది. సుమారు 50 మంది ఎంపీల గెలుపు–ఓటముల్లో వీరి ఓట్లు కీలకం. ఇటీవల 50 మంది ఎంపీలకు మెమోరాండం సమర్పించి, పీవోకేలో జరుగుతున్న అత్యాచారాలను పార్లమెంట్‌లో లేవనెత్తి, ఇంటర్నెట్‌ నిషేధం ఎత్తివేయాలని ఒత్తిడి తెచ్చారు.

పాకిస్తాన్‌ దశాబ్దాలుగా కశ్మీర్‌ విషయంలో భారత్‌ను ఇరుకున పెట్టడానికి ఉపయోగించిన ఆయుధం(మీర్‌పురి డయాస్పోరా) ఇప్పుడు తనకే వ్యతిరేకంగా తిరగడం పాకిస్తాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ. పీవోకేలో తిరుగుబాటు, బలూచిస్తాన్‌ స్వాతంత్య్ర ఉద్యమం ఇవన్నీ కలిసి పాకిస్తాన్‌ను బహుముఖ సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. సొంత ఇంట్లోనే మండుతున్న అగ్ని ప్రపంచ వ్యాప్తంగా ధ్వనిస్తోంది.