Home Blog Page 133

రెండు స్క్రీన్లు..భారీ బ్యాటరీ.. ఈ ల్యాప్ టాప్ ధర ఎంతంటే..

Asus Zenbook Duo UX807 price
Asus Zenbook Duo UX807 price

Asus Zenbook Duo UX807 price: కొత్తగా ల్యాప్ టాప్ కొనాలని అనుకునేవారికి టెక్నాలజీ దిగ్గజం అసుస్ (Asus) మంచి డివైజ్ లా ఆదరణ పొందుతోంది. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అసుస్ జెన్‌బుక్ డుయో 2026 (Asus Zenbook Duo UX807) డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్ విభాగంలోనే అత్యంత ప్రాక్టికల్, పవర్‌ఫుల్ మోడల్‌గా పేరు తెచ్చుకుంది. ఇది సాధారణ ల్యాప్‌టాప్‌లా కనిపిస్తూనే.. అవసరమైనప్పుడు రెండు పూర్తి స్థాయి స్క్రీన్లుగా మారిపోయే ఈ అద్భుతమైన డివైజ్ గురించి పూర్తి వివరాలు మీకోసం..

అసుస్ జెన్‌బుక్ డుయో 2026 డిజైన్ ఎంతో మెరుగైంది. దీని బాడీని సిరామిక్, అల్యూమినియం కలిసిన మెటీరియల్‌తో తయారు చేశారు. దీనివల్ల ల్యాప్‌టాప్‌పై వేలిముద్రలు పడకుండా ఉంటాయి. అలాగే ఇది చూడటానికి చాలా ప్రీమియం లుక్‌తో పాటు గట్టిదనాన్ని ఇస్తుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే దీని సైజును 5 శాతం మేర తగ్గించారు. దీని బరువు దాదాపు 1.65 కేజీలు ఉంటుంది. ఇందులో అమర్చిన సరికొత్త ‘హైడ్‌అవే హింజ్’ వల్ల రెండు స్క్రీన్‌ల మధ్య ఉండే గ్యాప్ చాలా వరకు తగ్గిపోయి రెండు కలిపి ఒకే పెద్ద స్క్రీన్‌లా కనిపిస్తాయి.

ఈ ల్యాప్‌టాప్‌లో అత్యంత ప్రధానమైన ఆకర్షణ దీని రెండు 14 అంగుళాల టచ్ స్క్రీన్లు. ఈ రెండు స్క్రీన్లు కూడా 3K హై రిజల్యూషన్ తో అత్యంత స్మూత్ గా ఉంటాయి. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ చేస్తుండడంతో ఈ డిస్‌ప్లేలు డాల్బీ విజన్ , HDR True Black 1000 సర్టిఫికేషన్‌ కలిగి ఉన్నాయి. 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందించే ఇవి క్రియేటర్లు, ఎడిటర్లు, మల్టీటాస్కింగ్ చేసేవారికి ఈ రెండు స్క్రీన్లు ఒకే నాణ్యతతో అద్భుతమైన విజువల్స్ ను అందిస్తాయి.

Asus Zenbook Duo UX807ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. అయస్కాంతాల సహాయంతో కింద ఉండే రెండవ స్క్రీన్‌కు ‘పోగో పిన్స్’ ద్వారా అతుక్కుంటుంది. కీబోర్డ్‌ను స్క్రీన్ మీద పెట్టినప్పుడు ఇది సాధారణ ల్యాప్‌టాప్‌లా పనిచేస్తుంది ఒకవేళ మనకు రెండు స్క్రీన్లు కావాలనుకుంటే, ఆ కీబోర్డ్‌ను విడదీసి పక్కన పెట్టుకుని బ్లూటూత్ ద్వారా వాడుకోవచ్చు. రెండు స్క్రీన్లు ఉన్నప్పటికీ బ్యాటరీ లైఫ్ విషయంలో అసుస్ ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో 99 W భారీ బ్యాటరీని అమర్చారు. కేవలం ఒకే స్క్రీన్ వాడుకున్నప్పుడు ఇది దాదాపు 22 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్‌ను, రెండు స్క్రీన్లను కలిపి వాడుకున్నప్పుడు కూడా దాదాపు 13 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. ఈ బ్యాటరీ 100W టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ కు సపోర్టు చేస్తుంది. భారతదేశంలో దీని ప్రారంభ ధర దాదాపు రూ. 2,99,990 గా ఉంది.

'పెద్ది' 9 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే..

Peddi Success Meet
Peddi Success Meet

Peddi 9 days worldwide collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 12 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఒక స్టార్ హీరో సినిమాకు వారం రోజులు దాటిన తర్వాత కూడా బుక్ మై షో యాప్ లో ఇలాంటి ట్రెండ్ ఉండడం చివరిసారిగా ‘ఓజీ’ చిత్రానికి చూశాము , మళ్లీ ఈ సినిమాకే చూస్తున్నాము. ఇకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద దిగ్విజయంగా ఈ చిత్రం 9 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకొని 10 వ రోజు లోకి అడుగుపెట్టింది. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 296 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా ఈ సినిమాకు ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.

నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 48 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, 9 రోజుల్లో 48 కోట్ల 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి లాభాల్లోకి అడుగుపెట్టింది. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా 18 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు ఈ 9 రోజుల్లో వచ్చాయి. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో అయితే ఈ సినిమా మొదటి రోజు నుండి ఏ మాత్రం జోరు తగ్గకుండా సంచలనాత్మక రికార్డులను నమోదు చేసుకుంది. ట్రేడ్ వర్గాలు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 9 రోజుల్లో 19 కోట్ల 51 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు ఈ ప్రాంతం లో ప్రతితాత్మక 20 కోట్ల క్లబ్ లోకి చేరనుంది.

ఇక తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే 9 రోజుల్లో దాదాపుగా ఈ చిత్రానికి 11 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది ఈ చిత్రం. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 8 కోట్ల రూపాయిలు , గుంటూరు జిల్లాలో 11 కోట్ల 48 లక్షల రూపాయిలు , కృష్ణా జిల్లాలో 9 కోట్ల రూపాయిలు, నెల్లూరు జిల్లా లో 5 కోట్ల 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 131 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 196 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 13 కోట్ల 10 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 3 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 10 కోట్ల 10 లక్షల రూపాయిలు ఓవర్సీస్ నుండి 21 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి , ఓవరాల్ గా 178 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 296 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 41 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

అమెరికాకు యాక్సెస్ ఇవ్వలేదు.. ట్రంప్ కు కోపమొచ్చింది.. ఏఐ ఆంథ్రోపిక్ కు ఎసరు వచ్చింది..

US access denied Anthropic AI
US access denied Anthropic AI

US access denied Anthropic AI: పొరుగు దేశాల మీద మాత్రమే కాదు.. చివరికి సొంత దేశంలో సంస్థలను కూడా వదిలిపెట్టడం లేదు ట్రంప్. తన ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థలకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నాడు. ఈ జాబితాలో ఇప్పుడు ఆంథ్రోపిక్ వచ్చి చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అత్యంత ఆధునికమైన టూల్స్ తయారు చేస్తోంది ఈ కంపెనీ. ఈ కంపెనీ తయారు చేసిన ఫ్యాబిల్ 5, మితోస్ 5 సేవలు అమెరికాలో నిలిచిపోయాయి.

విడుదల చేసిన మూడు రోజులకే
ఆంథ్రోపిక్ సంస్థ ఫ్యాబిల్ 5 సేవలను మూడు రోజుల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఈ సేవలను అమెరికా నిలిపివేసింది.. మితోస్ 5 సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. భద్రతాపరమైన ఆందోళనల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.. ఫ్యాబిల్ 5, మితోస్ 5 టూల్స్ లోపాలను హ్యాకర్లు అత్యంత పటిష్టమైన సాఫ్ట్ వేర్ ద్వారా గుర్తిస్తారని.. అందువల్ల వీటిపై ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ ఆంథ్రోపిక్ సంస్థకు లేఖ రాశారు.

అప్పుడు వెలుగులోకి
ప్రాజెక్టు గ్లాస్ వింగ్ లో భాగంగా ఆంథ్రోపిక్ క్లౌడ్ మితోస్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఇది అత్యంత అధునాతన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. ఆయా సంస్థలలో ఉన్న సాఫ్ట్వేర్ లోపాలను గుర్తిస్తుంది. ఆంథ్రోపిక్ రూపొందించిన ఫ్యా బిల్ 5, మితోస్ 5 టూల్స్ లో యాక్సెస్ ఇతర వ్యక్తులకు ఇవ్వడం అమెరికా ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. అమెరికా ప్రభుత్వానికి యాక్సెస్ ఇవ్వకపోవడం వల్లే ఆంథ్రోపిక్ మీద ట్రంప్ ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేసింది.

వాస్తవానికి ప్రస్తమా అందుబాటులో ఉన్న అనేక కమర్షియల్ టూల్స్ లో లోపాలు ఉన్నాయి. సులువుగా హాకింగ్ చేయవచ్చు. అయితే అమెరికా ప్రభుత్వం తీసుకున్న పనికిమాలిన నిర్ణయం వల్ల ఆంథ్రోపిక్ కు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఏ ఐ టూల్స్ మీద కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. రీసెర్చ్ వింగ్ లో అనేక రకాల ప్రయోగాలు చేసిన తర్వాతే.. టెస్టింగ్ దశలు విజయవంతంగా పూర్తయిన తర్వాతే టూల్స్ ను బయటికి తీసుకొస్తారు. కమర్షియల్ టూల్స్ ను ఆయా కంపెనీలు భారీ ధరకు అమ్ముతుంటాయి. కానీ అమెరికా ప్రభుత్వం అత్యుత్సాహం వల్ల ఆంథ్రోపిక్ రూపొందించిన ఏఐ కమర్షియల్ టూల్స్ రీ కాల్ చేసుకోవాల్సి వచ్చింది.

ఆంథ్రోపిక్ సంస్థ మనదేశంలో కొన్ని కంపెనీలకు గతంలో రూపొందించిన ఏఐ టూల్స్ కు యాక్సెస్ ఇచ్చింది. ఇది అమెరికా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. చివరికి ఈ రూపంలో రివెంజ్ తీర్చుకుంది. ఇది ఆంథ్రోపిక్ కంపెనీకి తీవ్రమైన నష్టం కలగజేసింది. ఈ నష్టాన్ని ఆంథ్రోపిక్ ఎలా భర్తీ చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

ఐఫోన్ 18 Pro Maxపై కొత్త అప్డేట్.. వెంటనే తెలుసుకోండి..

iPhone 18 Pro Max update news
iPhone 18 Pro Max update news

iPhone 18 Pro Max update news: ఐ ఫోన్ అంటే ఎవరికైనా ఇష్టమే. యాపిల్ కంపెనీ నుంచి ప్రతీ ఏడాది సెప్టెంబర్ లో కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తూ ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 ప్రో మాక్స్ (iPhone 18 Pro Max) రాబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది. అయితే ఈ ఫోన్ కు సంబంధించిన లీక్‌లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ ఫోన్ కు సంబంధించిన కొన్ని చిత్రాలు బయటకు రావడంతో ఇది ఎలా ఉంటుందో అంచనా వేస్తున్నారు. ఇది ఎలా ఉండబోతుందంటే..?

ఐఫోన్ 18 ప్రో మాక్స్ డిజైన్ పరంగా మునుపటి మోడల్స్ లాగే ప్రీమియం లుక్‌ను కలిగి ఉన్నప్పటికీ.. డిస్‌ప్లే భాగంలో కీలక మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రీన్ పైభాగంలో ఉండే ‘డైనమిక్ ఐలాండ్’ సైజును ఈసారి దాదాపు 35 శాతం మేర తగ్గించినట్లు తెలుస్తోంది. ఫేస్ ఐడీకి సంబంధించిన కొన్ని సెన్సార్లను స్క్రీన్ లోపల అమర్చడం ద్వారా ఈ మార్పు సాధ్యమైందని సమాచారం. ఇక స్క్రీన్ సైజ్ ఎప్పటిలాగే 6.9 అంగుళాల LTPO OLED ప్యానెల్‌ ఉండనుంది.

ఈసారి కొత్త ఐఫోన్ లో అతిపెద్ద అప్‌గ్రేడ్ కెమెరా వి ఉండబోతోంది. ఆపిల్ చరిత్రలోనే మొదటిసారిగా మెయిన్ కెమెరాకు వేరియబుల్ అపెర్చర్ టెక్నాలజీని పరిచయం చేయనున్నారు. దీనివల్ల కాంతి తక్కువగా ఉన్నప్పుడు లేదా ఎక్కువగా ఉన్నప్పుడు లెన్స్ ఎంత కాంతిని తీసుకోవాలో యూజర్లే మాన్యువల్‌గా లేదా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు టెలిఫోటో లెన్స్ అపెర్చర్‌ను కూడా పెంచినట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఆపిల్ యొక్క నెక్స్ట్ జనరేషన్ A20 ప్రో ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన TSMC 2 నానోమీటర్ ప్రాసెస్ టెక్నాలజీతో ఈ చిప్‌ను తయారు చేస్తున్నారు. దీనివల్ల మునుపటి ప్రాసెసర్లతో పోలిస్తే ఇది 15 శాతం వేగవంతమైన పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. దీంతో 30 శాతం మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని ఇస్తుంది.

ఈ ఫోన్ లో సరికొత్త బ్యాటరీ ఉన్నట్లు తెలుస్తోంది. 5,100mAh నుంచి 5,200mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాటరీ 2nm ప్రాసెసర్ల కాంబినేషన్ వల్ల ఈ ఫోన్ సింగిల్ ఛార్జ్‌తో సుదీర్ఘ కాలం పాటు ఉంటుంది. అయితే ఈ భారీ బ్యాటరీకి అధునాతన కెమెరా సెటప్ వల్ల ఫోన్ బరువు కొద్దిగా పెరిగి, దాదాపు 240 గ్రాములకు పైగా ఉండే అవకాశం ఉంది.

ఈసారి ఆపిల్ కొత్త ఫోన్ డార్క్ చెర్రీ కలర్ లో రానుంది. ఇది ఒక రకమైన డీప్ రెడ్ పర్పుల్ షేడ్స్ కలయికతో లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. దీనితో పాటు క్లౌడ్ బ్లూ, సిల్వర్ , డార్క్ గ్రే కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో కనెక్టివిటీ కోసం ఆపిల్ సొంతంగా అభివృద్ధి చేసిన ‘C2 మోడెమ్’ను ఇందులో వాడుతున్నారు. దీంతో మెరుగైన 5G స్పీడ్‌తో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ ఫీచర్లకు కూడా సపోర్ట్ చేయగలదని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇజ్రాయెల్, అమెరికా.. తర్వాత భారతే.. ఇక శత్రుదుర్భేద్యం

DRDO next generation weapons
DRDO next generation weapons

DRDO next generation weapons: యుద్ధాల తీరు మారుతోంది. యుద్ధంలో ఇప్పుడు ఆయుధాలతోపాటు టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. దీంతో శత్రు భయాలు ఉన్న దేశాలు టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ దేశ రక్షణకు ఐరన్‌ డోమ్‌ తయారు చేసింది. తర్వాత అమెరికా బంగారు డోమ్‌ తయారీపై దృష్టి పెట్టింది. ఈ రెండు దేశాల సరసన ఇప్పుడు భారత్‌ చేరబోతోంది. డీఆర్డీవో జూన్‌ 10, 11 తేదీల్లో ఒడిశాలోని చాందీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి జరిపిన మూడు వరుస పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ పరీక్షలు బాలిస్టిక్‌ మిసైల్‌ ముప్పులను అడ్డుకునే బహుళస్థాయి రక్షణ వ్యవస్థను ప్రదర్శించాయి. రెండు అధునాతన ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులు నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా చేధించగలిగాయి. ఈ వ్యవస్థ 2 వేల నుంచి 5 వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న బాలిస్టిక్‌ మిసైల్‌ ముప్పులను గుర్తించి, ట్రాక్‌ చేసి నాశనం చేయగలదు.

ఎండో–ఎక్సో వాతావరణాల్లో పనిచేసే సామర్థ్యం..
ఈ ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులు భూమి వాతావరణం(ఎండో–అట్మాస్ఫెరిక్‌), అంతరిక్ష ప్రాంతం(ఎక్సో–అట్మాస్ఫెరిక్‌) రెండింటిలోనూ పనిచేస్తాయి. లాంగ్‌ రేంజ్‌ రాడార్లు, తక్కువ సమయం తీసుకునే కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, మిషన్‌ కంట్రోల్‌ సెంటర్లు వంటి అధునాతన సాంకేతికతలతో నెట్‌వర్క్‌ సెంట్రిక్‌ వార్‌ఫేర్‌ సామర్థ్యం కలిగి ఉంది. ఈ పరీక్షలు పేజ్‌ 2 బాలిస్టిక్‌ మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థ అభివృద్ధిని పూర్తి చేశాయి.

నౌకా రక్షణలో మొదటి విజయం..
నేవల్‌ యాంటీ–షిప్‌ మిసైల్‌–మీడియం రేంజ్‌ మొదటి ఫ్లైట్‌ టెస్ట్‌ విజయవంతమైంది. ఈ క్షిపణి నౌకల నుంచి ప్రయోగించబడి, సముద్ర లక్ష్యాలపై కచ్చితమైన దిశానిర్దేశం, తక్కువ ఎత్తులో సముద్ర ఉపరితలం దగ్గరగా ప్రయాణించడం, టార్గెట్‌ను కచ్చితంగా చేధించడం వంటి సామర్థ్యాలను ప్రదర్శించింది. ఇది అన్ని వాతావరణాల్లో పనిచేసే, సముద్ర రక్షణను బలపరిచే ముఖ్యమైన అడుగు.

ఎలైట్‌ దేశాల సరసన..
ఈ విజయాలతో భారత్‌ అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్‌ వంటి కొన్ని దేశాలతో సమానంగా బాలిస్టిక్‌ మిసైల్‌ ముప్పులను అడ్డుకునే సామర్థ్యం సాధించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డీఆర్డీవోను అభినందించారు. డీఆర్డీవో చైర్మన్‌ రాజేశ్‌కుమార్‌ సింగ్‌ కూడా ఈ పరీక్షలను సన్నిహితంగా పర్యవేక్షించి, డీఆర్డీవో, పరిశ్రమల సంయుక్త ప్రయత్నాలను ప్రశంసించారు. ఇది ఆత్మనిర్భర భారత్‌ కార్యక్రమంలో మరో మైలురాయి.

ఈ బహుళస్థాయి రక్షణ వ్యవస్థ రాడార్లు, కమాండ్‌ సెంటర్లు, ఇంటర్‌సెప్టర్‌ క్షిపణుల నెట్‌వర్క్‌తో దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. ఇది వైమానిక, సముద్ర రంగాల్లో ముప్పులను సమగ్రంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందించి, భారత్‌ రక్షణ స్వావలంబనను మరింత ముందుకు తీసుకెళ్తుంది.

దృఢం రివ్యూ : క్రైమ్ మిస్టరీ అంటే ఇదీ.. నరాల్ కట్ అయ్యాయి.. క్లైమాక్స్ వేరే లెవల్ అంతే..

Dridam movie review

Dridam movie review : మలయాళ థ్రిల్లర్స్ అంటేనే ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. అదే అంచనాలతో ఓటీటీలోకి వచ్చిన ‘దృఢం’ ఆ అంచనాలను దాదాపు అందుకుంటుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రారంభంలో సాధారణ పోలీస్ కథలా కనిపించినా, కథ ముందుకు వెళ్లేకొద్దీ ఉత్కంఠను పెంచుతూ చివర్లో ఊహించని మలుపులతో షాక్ ఇస్తుంది.

ప్రశాంతమైన ఊరిలో మొదలైన భయంకర మిస్టరీ

కొత్తగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన విజయ్ (షేన్ నిగమ్) ప్రశాంతమైన కుజినీలం పోలీస్ స్టేషన్‌కి వస్తాడు. మొదట్లో చిన్న చిన్న కేసులతో సరదాగా సాగిన అతని విధుల్లో ఒక్కసారిగా గుర్తు తెలియని యువకుడి హత్య కేసు చేరుతుంది. దానితోపాటు ఫైనాన్స్ కంపెనీ దోపిడీ, డ్యామ్‌లో మరో శవం బయటపడటం… ఇలా వరుస ఘటనలు ఊరిని కుదిపేస్తాయి. వారంలో కేసులను ఛేదించాలన్న ఒత్తిడిలో విజయ్ చేసిన దర్యాప్తే కథను ముందుకు నడిపిస్తుంది.

విశ్లేషణ

మొదటి భాగం నెమ్మదిగా సాగినా, సెకండాఫ్‌లో కథ వేగం అందుకుంటుంది. ప్రతి కొత్త క్లూ కథను మరో దిశగా తీసుకెళ్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే ట్విస్టులు ఈ సినిమాకి ప్రధాన బలం. హంతకుడు ఎవరు అనే విషయంలో ప్రేక్షకుడిని పూర్తిగా తప్పుదారి పట్టిస్తుంది. చివరి 15-20 నిమిషాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. థ్రిల్లర్ అభిమానులు ప్రత్యేకంగా ఆస్వాదించే భాగం ఇదే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లో టెన్షన్‌ను బాగా పెంచింది. మొదటి అరగంట కథ సాధారణ పోలీస్ డ్రామా మాదిరిగా అనిపిస్తుంది. కొంతమందికి ఇది నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది. షేన్ నిగమ్ తప్ప మిగతా నటీనటులు పెద్దగా పరిచయం లేకపోవడం వల్ల ప్రారంభంలో కనెక్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఎస్సై విజయ్ పాత్రలో షేన్ నిగమ్ చక్కగా నటించాడు. ఒక కొత్త పోలీస్ అధికారిగా కనిపించే అమాయకత్వం, తర్వాత కేసు ఒత్తిడిలో పడే తీవ్రత రెండింటినీ సమతూకంగా చూపించాడు.

‘దృఢం’ ఒక స్లో బర్న్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఓపికగా చూస్తే సెకండాఫ్‌లో కథ బలంగా పట్టేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఈ సినిమాను గుర్తుండిపోయేలా చేస్తాయి. మలయాళ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి ఎంపిక.

ఓకేతెలుగు రేటింగ్ 3/5

జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం.. జీపీఎస్ కట్టిన కుక్క మృతి.. కేసులో ఏం జరుగుతోంది..

Gnaneshwari Missing Case
Gnaneshwari Missing Case

Gnaneshwari missing case update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠకు దారితీసిన జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మరో మలుపుతీసుకుంది. తప్పిపోయిన పాప కేసులో పురోగతి సాధించాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎంతో కీలకమైన కుక్క అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చింది.

జ్ఞానేశ్వరి తప్పిపోయినప్పుడు.. ఆమె వెంట పెంపుడు కుక్క కూడా వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆ కుక్క ద్వారా పాప ఆచూకీ కనిపెట్టాలని పోలీసులు ప్రయత్నాలు చేశారు. కుక్క మెడలో జిపిఎస్ ట్రాకర్ ఏర్పాటు చేశారు. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోకి పంపించారు. మనుషులు హడావిడి ఎక్కువగా ఉండడంతో ఆ కుక్క విపరీతంగా భయపడుతోంది. దీంతో ఆ కుక్కను బోనులో ఉంచారు. జ్ఞానేశ్వరి బయటికి వెళ్తున్నప్పుడు ఎవరూ చూడలేదు. పైగా ఆమె వెంట కుక్క మాత్రమే ఉంది. దీంతో పోలీసులు అత్యంత జాగ్రత్తగా దానిని చూసుకుంటున్నారు.

జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి గుండెలు పగిలే విధంగా రోదిస్తోంది. దీనికి తోడు ఆ కుక్కతో..”జానును తీసుకొస్తావా” అని అడిగింది. ఆ వీడియోలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. అయితే ఆ కుక్క ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా చనిపోయింది. దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కుక్క కూడా గడిచిన రెండు రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసును పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో ఎంతో కీలకమైన కుక్కను కావాలని కొంతమంది చంపేశారా.. లేదా అడవిలో తిరగడం వల్ల అలసటకు గురై చనిపోయిందా.. అనే కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజులైనప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఇది కుటుంబ సభ్యులను తీవ్రమైన కలవర పాటుకు గురి చేస్తోంది. పోలీసులు ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం మొదలుపెట్టారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. జ్ఞానేశ్వరి బంధుమిత్రుల ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. చిన్నారి వారం క్రితం తప్పిపోవడం.. కేసులో కీలకమైన కుక్క చనిపోవడం.. అది కూడా అనుమానాస్పదంగా కన్నుమూయడంతో.. ఈ కేసును మరింత జటిలం చేస్తున్నాయి.

విదేశాల్లో ఉన్న వదిలేదేలే.. మరోసారి వేరే దేశం వెళ్లి మరీ లేపేసిన అమెరికా

Tren de Aragua leader
Tren de Aragua leader

Tren de Aragua leader: వెనెజువెలాపై ఇటీవలే సంచలన ఆపరేషన్‌ నిర్వహించిన అమెరికా, దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో, అతడి భార్యను అదుపులోకి తీసుకుంది. న్యూయార్క్‌ కోర్టులో దోషిగా నిలబెట్టింది. ప్రస్తుతం దంపతులు అమెరికా జైలులో ఉన్నారు. ఈ ఘటన మరువక ముందే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెనిజులాలోని ఒక ప్రమాదకర డ్రగ్స్‌ ముఠా నాయకుడిని మట్టు పెట్టామని ప్రకటించారు. ట్రెన్‌ డి ఆరాగ్వా అనే గ్యాంగ్‌ కాంపౌండ్‌పై బాంబులతో దాడి చేసినట్లు, దానికి సంబంధించిన వీడియోను వైట్‌ హౌస్‌ విడుదల చేసినట్లు వార్తలు వచ్చాయి. హంతకులు, డ్రగ్‌ లార్డ్స్‌ ఎక్కడున్నా వెంటాడి చంపుతామని ట్రంప్‌ హెచ్చరించారు.

డ్రగ్స్‌ నియంత్రణలో కఠిన విధానం
ట్రంప్‌ పరిపాలనలో డ్రగ్స్‌ ముఠాలు, ముఖ్యంగా వెనిజులా మూలాలున్న గ్యాంగ్‌లపై దృష్టి పెంచడం కొత్త కాదు. ఈ ఘటన ద్వారా అమెరికా తన సరిహద్దుల్లోకి డ్రగ్స్‌ ప్రవేశించకుండా, మూలాల వద్దే అడ్డుకోవాలనే విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టమవుతుంది. బాంబు దాడి వంటి సైనిక చర్యలు డ్రగ్‌ నెట్‌వర్క్‌లను త్వరగా అంతం చేయడానికి సహాయపడతాయని అమెరికా వాదన. అయితే ఇలాంటి చర్యలు ఎంతవరకు సుస్థిర ఫలితాలు ఇస్తాయో చర్చనీయాంశం. ఒక నాయకుడిని అంతం చేయడం వల్ల ముఠా పూర్తిగా నాశనం కాదు. కొత్త నాయకులు ఉద్భవించవచ్చు, డ్రగ్‌ వ్యాపారం మరింత రహస్యంగా మారవచ్చు.

వెనిజువెలా–అమెరికా సంబంధాలు..
వెనిజువెలాతో అమెరికా సంబంధాలు ఎప్పటి నుంచో ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ దాడి వెనిజులా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లు విమర్శలు రావచ్చు. వెనిజులా ప్రభుత్వం ఇలాంటి చర్యలను దాడిగా భావించి, ప్రతీకార చర్యలు తీసుకోవచ్చు లేదా అంతర్జాతీయ వేదికలపై అమెరికాను నిందించవచ్చు. అదే సమయంలో, డ్రగ్స్‌ ముఠాలు వెనిజులా నుంచి అమెరికాకు, ఇతర దేశాలకు విస్తరించడం వల్ల ఈ చర్యను కొందరు అవసరమైనదిగా చూడవచ్చు. డ్రగ్‌ వ్యాపారం వల్ల ఆర్థిక నష్టాలు, సామాజిక సమస్యలు (మాదకద్రవ్యాల బానిసత్వం, నేరాలు) పెరుగుతున్నాయి. అమెరికా తన పౌరుల రక్షణ కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని వాదన.

అంతర్జాతీయ చట్టాలు, విమర్శలు
ఒక సార్వభౌమ దేశంలో బాంబు దాడి చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం సంక్లిష్టమైన విషయం. అమెరికా దీనిని డ్రగ్‌ ముఠాలపై యుద్ధంగా చూస్తుంది, కానీ విమర్శకులు దీనిని ఏకపక్ష చర్యగా భావించవచ్చు. రాజకీయ ఒత్తిళ్లు, దౌత్యపరమైన పరిణామాలు రావచ్చు. అలాగే, ఇలాంటి చర్యలు దీర్ఘకాలికంగా డ్రగ్‌ సమస్యను పరిష్కరించలేవు. డ్రగ్‌ వ్యాపారం వెనుక ఉన్న ఆర్థిక కారణాలు, డిమాండ్, కరప్షన్‌ వంటి అంశాలను కూడా పరిష్కరించాలి. సైనిక చర్యలతోపాటు, అంతర్జాతీయ సహకారం, డ్రగ్‌ నియంత్రణ కార్యక్రమాలు అవసరం.

సరికొత్త డిస్ ప్లే..పవర్ ఫుల్ ప్రాసెసర్.. Samsung ఫోల్డబుల్ వివరాలు లీక్..

Samsung Foldable Phone Leak
Samsung Foldable Phone Leak

Samsung Foldable Phone Leak: మొబైల్ వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకునే శామ్‌సంగ్ (Samsung) కంపెనీ నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఇందులో భాగంగా లేటెస్ట్గా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ ను తీసుకురానుంది. త్వరలోనే జరగబోయే ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్‌లో కంపెనీ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 , జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా జెడ్ ఫ్లిప్ అనే మూడు మోడళ్లను పరిచయం చేయనుంది. అయితే, లాంచ్‌కు ముందే వీటికి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఫోన్లు ఎలా ఉంటాయంటే?

శాంసంగ్ కంపెనీ నుంచి మార్కెట్లోకి సరికొత్త డిజైన్‌తో బేస్ మోడల్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 రాబోతుంది. ఇప్పటివరకు వచ్చిన శామ్‌సంగ్ ఫోల్డ్ ఫోన్‌లు మూసి ఉన్నప్పుడు చాలా పొడవుగా, ఇరుగ్గా ఉండేవి. కానీ ఈసారి రాబోయే జెడ్ ఫోల్డ్ 8 మోడల్‌ను శామ్‌సంగ్ ‘వైడ్ డిజైన్’తో కనిపిస్తుంది. 5.4 అంగుళాల లోపలి డిస్‌ప్లేను కలిగి ఉండి.. ఓపెన్ చేసినప్పుడు 7.6 అంగుళాల వరకు పెరుగుతుంది. దీంతో వీడియోలు చూసేవారికి, టైపింగ్ చేసేవారికి అనుగుణంగా ఉంటుంది.

అలాగే ప్రీమియం లుక్ కోరుకునేవారికి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా పాత క్లాసిక్ డిజైన్‌ను మరింత మెరుగుపరిచి తీసుకువస్తున్నారు. ఇది 6.5-ఇంచుల భారీ కవర్ డిస్‌ప్లే ఉండి ఓపెన్ చేస్తే 8.0-ఇంచుల అతిపెద్ద మెయిన్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీని అంచులు చాలా సన్నగా ఉంటాయి.. ఇందులో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5 ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీఉంటుంది. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది.

స్టైలిష్ లుక్‌తో రానుంది గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8. దీని డిస్‌ప్లేలో శామ్‌సంగ్ కీలక మార్పులు చేసింది. ఈసారి కవర్ స్క్రీన్‌పై కెమెరాల కోసం పొడవాటి సింగిల్ కటౌట్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తంది. అంతేకాకుండా, స్క్రీన్‌ను మడతబెట్టినప్పుడు ముడత కనిపించకుండా ఉండేలా ‘క్రీజ్-ఫ్రీ’ టెక్నాలజీని ఇందులో వాడుతున్నట్లు సమాచారం. ఈ మోడల్ శామ్‌సంగ్ సొంత ఎక్సినోస్ 2600 చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. సరికొత్త షేప్స్, అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో రాబోతున్న ఈ మూడు ఫోన్‌లు ఫోల్డబుల్ మార్కెట్లో శామ్‌సంగ్ హవాను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

టెన్త్, ఐటీఐ, బీటెక్‌తో 11 వేల ఉద్యోగాలు.. రేపే లాస్ట డేట్‌!

Indian Railway Jobs 2026
Indian Railway Jobs 2026

Indian Railway Jobs 2026: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి ఉద్యోగాల భర్తీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రైల్వే, బ్యాంకు, పోస్టల్, ఆర్మీ తదితర రంగాల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు ఇస్తోంది. తాజాగా టెన్త్, ఐటీఐ, బీటెక్‌ అర్హతతో ఇండియన్‌ రేల్వేలో 11,127 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇందులో అసిస్టెంట్‌ లోకో పైలట్, పోస్టులు ట్రైన్‌ ఆపరేషన్‌లో కీలకమైనవి. ఈ ఉద్యోగాలు స్టేబుల్‌ కెరీర్, మంచి జీతం, ప్రమోషన్‌ అవకాశాలు కలిగి ఉంటాయి. రైల్వేలో సేఫ్టీ, టైమింగ్‌ నిర్వహణ వంటి బాధ్యతలు ఉంటాయి కాబట్టి, శ్రద్ధగల అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

అర్హతలు..
పదో తరగతి లేదా సమాన అర్హత, ఐటీఐ (ట్రేడ్‌ సర్టిఫికేట్‌), డిప్లొమా లేదా బీటెక్‌/ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ వర్గాలకు వయసు సడలింపు వర్తిస్తుంది. రైల్వే నిబంధనల ప్రకారం శారీరక ఆరోగ్యం, దృష్టి సామర్థ్యం తప్పనిసరి.

ఎంపిక విధానం…
ఎంపిక బహుళ దశల్లో జరుగుతుంది.. మొదట సీబీటీ–1 (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) నిర్వహిస్తారు. తర్వాత సీబీటీ–2 – మరింత వివరణాత్మక పరీక్ష ఉంటుంది. తర్వాత సీబీఏటీ(కంప్యూటర్‌ బేస్డ్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌) – రియాక్షన్‌ టైమ్, ఏప్టిట్యూడ్‌ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటాయి. ప్రతీ దశలో మార్కులు, మెరిట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

జీతం, సౌకర్యాలు..
ఈ పోస్టులు 7వ వేతన సంఘం ప్రకారం లెవల్‌–2 వేతనం (రూ.19,900 – రూ.63,200)లో ఉంటాయి. ప్రారంభ జీతం సుమారు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు (భత్యాలతో సహా) వస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్, మెడికల్‌ ఫెసిలిటీలు, పెన్షన్, లీవ్‌ సౌకర్యాలు ఉంటాయి. కెరీర్‌ ప్రోగ్రెషన్‌లో లోకో పైలట్, సీనియర్‌ లోకో పైలట్‌ వంటి పోస్టులకు ప్రమోషన్‌ అవకాశాలు ఉన్నాయి.

దరఖాస్తు చివరి తేదీ..
ఆదివారం(జూన్‌ 14)తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ఈ తేదీలోపు పూర్తి చేయాలి. పరీక్ష తేదీలు, అడ్మిట్‌ కార్డు విడుదల తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించబడతాయి. ఏదైనా మార్పులు ఉంటే వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోండి.

ఎలా దరఖాస్తు చేయాలి..
అధికారిక రైల్వే వెబ్‌సైట్‌ (indianrailways.gov.in లేదా సంబంధిత RRB వెబ్‌సైట్‌) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్లు) అప్‌లోడ్‌ చేయాలి. ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీకి ఉచితం. ఇతరులకు నామినల్‌. ఒకసారి సమర్పించిన తర్వాత వివరాలు మార్చలేరు.

సిలబస్, ప్రిపరేషన్‌ టిప్స్‌..
సీబీటీ–1లో మ్యాథమెటిక్స్, జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ సైన్స్, జనరల్‌ అవేర్‌నెస్‌ ఉంటాయి. సీబీటీ–2లో టెక్నికల్‌ సబ్జెక్టులు(మెకానికల్, ఎలక్ట్రికల్‌) ఉంటాయి. సీబీఏటీలో ఏప్టిట్యూడ్‌ టెస్ట్‌లు ఉంటాయి. మునుపటి పేపర్లు, మాక్‌ టెస్టులు ప్రాక్టీస్‌ చేయండి.

అలాంటి పాత్ర కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ కీర్తి సురేష్ హాట్ కామెంట్స్..

Keerthy Suresh
Keerthy Suresh

Keerthy Suresh Sensational Comments: ప్రస్తుత తరం లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అందాలను ఆరబోసే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఈ విషయం లో కొంతమంది అయితే హద్దులు కూడా దాటేశారు. అయితే అందాల ఆరబోత తో పాటు అద్భుతంగా నటించగల టాలెంట్ ఉన్న హీరోయిన్లు కూడా ఉన్నారు. వారిలో ఒకరే కీర్తి సురేష్. నేటి తరం హీరోయిన్స్ లో నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్న ఘనత కేవలం ఒక్క కీర్తి సురేష్ కి మాత్రమే సొంతం. ‘మహానటి’ చిత్రం లో ఆమె పోషించిన పాత్రకు కరగని హృదయం అంటూ ఉండదు. అంత అద్భుతంగా నటించింది. అయితే ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కి అదే తరహా పాత్రలు మాత్రం దొరకడం లేదు. ఈమధ్య కాలం లో ఆమె చేసిన ప్రతీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలుస్తూ వచ్చింది.

అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తాను ఎలాంటి పాత్రలు కావాలని కోరుకుంటుందో చెప్పుకొచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘నా కెరీర్ ఎన్ని సినిమాలు చేసినా , మహానటి లాంటి పాత్ర మాత్రం మరొకటి లేదు. చాలా ఛాలెంజింగ్ గా అనిపించినా ఈ పాత్రకు నాకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇలాంటి పాత్ర కోసమే నేను మళ్లీ ఎదురు చూస్తున్నాను. కానీ ఈమధ్య కాలం లో నాకు ఇలాంటి పాటలు రానందుకు కాస్త బాధగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆమెకు ఒక పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ కూడా చెయ్యాలని ఉందట. గతంలో జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే ప్రోగ్రాం కి వచ్చినప్పుడు ఈ కోరిక ని చెప్పుకొచ్చింది. వాస్తవానికి కీర్తి సురేష్ కెరీర్ విలన్ రోల్ తోనే మొదలైంది.

మలయాళం లో ఆమె ‘గీతాంజలి’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె డ్యూయల్ రోల్ లో కనిపించింది , ఒక పాత్ర లో విలన్ గా కనిపించింది. ఇదే సినిమాని తెలుగు లో ప్రియమణి ‘చారులత’ పేరుతో రీమేక్ చేయగా, హిందీ లో బిపాసా బసు ‘ఎలోన్’ అనే పేరుతో రీమేక్ చేసింది. కానీ వీళ్ళెవ్వరూ కూడా కీర్తి సురేష్ యాక్టింగ్ ని మ్యాచ్ చేయలేకపోయారు. ఆ రేంజ్ లో ఆమె విలన్ క్యారెక్టర్ లో రెచ్చిపోయింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ , కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టార్రర్ లో వెంకటేష్ కి జోడీగా నటించబోతుంది. వచ్చే నెల నుండి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.

తక్కువ ధరకే AMT కారు.. డస్టర్ తో కొత్త ప్రయోగం.. ఏం చేస్తారంటే..

Renault Duster AMT Variant
Renault Duster AMT Variant

Renault Duster AMT Variant: కార్లు కొనాలని అనుకునేవారు అప్ గ్రేడ్ అయిన వాటిపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే AMTకార్ల ధరలు ఎక్కువగా ఉండడంతో కొన్ని కంపెనీలు తక్కువ ధరకే వీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెనాల్ట్ (Renault) కంపెనీ నుంచి డస్టర్ (Duster) భారత్‌లో సరికొత్త అవతారంలో మళ్లీ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే కస్టమర్ల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని, రెనాల్ట్ సంస్థ డస్టర్‌లో సరికొత్త ‘ఎంట్రీ-లెవల్ ఆటోమేటిక్’ వేరియంట్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు ఎలా ఉండబోతుందంటే?

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న కొత్త డస్టర్ బేస్ మోడల్ ధర రూ.10.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఆటోమేటిక్ డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకునే వారు 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ‘ఎవల్యూషన్’ వేరియంట్‌ను ఎంచుకోవాల్సి వస్తోంది. దీని ధర రూ.14.49 లక్షలుగా ఉంది. అంటే మాన్యువల్ బేస్ వేరియంట్‌కు, ప్రస్తుత ఆటోమేటిక్ వేరియంట్‌కు మధ్య దాదాపు రూ. 4 లక్షల భారీ వ్యత్యాసం ఉంది. ఈ పెద్ద గ్యాప్‌ లేకుండా మధ్యతరగతి కొనుగోలుదారులకు అందుబాటు ధరలో కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌ను తీసుకురావడమే రెనాల్ట్ ప్రధాన లక్ష్యం.

ఇందులో భాగంగా తక్కువ ధరలోనే ఆటోమేటిక్ వేరియంట్ కోసం కంపెనీ రెండు రకాల వ్యూహాలను పరిశీలిస్తోంది. వీటిలో మొదటిది ప్రస్తుతం ఉన్న 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌కు CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేయడం. రెండో ఆప్షన్‌గా ప్రస్తుతం ఉన్న 1.3-లీటర్ టర్బో పెట్రోల్ DCT ఆటోమేటిక్ సెటప్‌ను మరింత తక్కువ ఫీచర్లు ఉండే బేస్ ‘ఆథెంటిక్’ ట్రిమ్‌లో ప్రవేశపెట్టడం. ఈ రెండింటిలో ఏది వచ్చినా ఆటోమేటిక్ కార్లు కావాలనుకునే వారికి ఇదొక మంచి బడ్జెట్ ఆప్షన్ కానుంది.

ఇక ప్రస్తుత డస్టర్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది రగ్గడ్ డిజైన్ ను కలిగి ఉంది. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ తో పాటు అధునాతన సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు 17 రకాల ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లతో వస్తోంది. ఈ పండుగ సీజన్ నాటికి డస్టర్‌లో సరికొత్త 1.8-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేయాలని రెనాల్ట్ ప్లాన్ చేస్తోంది. ఈ లో బడ్జెట్ ఆటోమేటిక్ వేరియంట్ కనుక మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి గట్టి పోటీదారులకు డస్టర్ మరింత గట్టి పోటీనివ్వడం ఖాయం అని ఆటోమోబైల్ ప్రతినిధులు అంటున్నారు.

'ఓజీ 2' షూటింగ్ అప్డేట్ వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్ కి ఇక ప్రతి రోజు పండగే..

OG 2 Shooting Update
OG 2 Shooting Update

OG 2 Shooting Update: పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆక్సిజన్ లాంటి చిత్రం ‘ఓజీ’. వరుస రీమేక్ సినిమాల కారణంగా పవన్ కళ్యాణ్ మూవీస్ అంటే ఆడియన్స్ కి మాత్రమే కాదు , ఫ్యాన్స్ కి ఆసక్తి తగ్గే ప్రమాదం నెలకొన్న సమయం లో విడుదలైన ఈ ‘ఓజీ’ సినిమా ఇచ్చిన ఊపు సాధారణమైనది కాదు. నేటి తరం జెన్ జీ ఆడియన్స్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మార్చేసిన సినిమా ఇది. ఇందులో పవన్ కళ్యాణ్ యాక్షన్ , యాటిట్యూడ్ , స్టైల్ , స్వాగ్ ని నచ్చనోళ్లు అంటూ ఎవ్వరూ ఉండరు. అందుకే డివైడ్ టాక్ వచ్చినా , సినిమాలో స్టోరీ బలంగా లేకపోయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం తెలుగు వెర్షన్ నుండి 321 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓపెనింగ్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కేవలం ప్రీ సేల్స్ నుండే వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవర్సీస్ లో కేవలం ప్రీమియర్ షోస్ నుండే 5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, పవన్ కళ్యాణ్ పవర్ ఎలాంటిదో అందరికీ అర్థం అయ్యేలా చేసింది ఈ చిత్రం. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు మాత్రమే కాదు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీ గా ఉండడం వల్ల, ఈ సినిమా ఉంటుందో లేదో అనే భయం అభిమానుల్లో ఉండేది. అయితే స్వయంగా మొన్న పవన్ కళ్యాణ్ టీం ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ చర్చ సుజిత్ ఇండియా కి రాగానే జరుగుతుందని అనడంతో ఫ్యాన్స్ లో ఆనందం ఆకాశాన్ని అంటింది.

ఇప్పుడు అందుతున్న మరో లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే , ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక ప్రత్యేకమైన పోస్టర్ తో , పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు , అనగా సెప్టెంబర్ 2న విడుదల చేయబోతున్నారని, నవంబర్ 27, 2026 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందని అంటున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి , ఆయన కోరిన విధంగా జపాన్ షెడ్యూల్స్ లో కూడా పాల్గొనడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ షెడ్యూల్స్ తన రాజకీయ కార్యక్రమాలకు ఏ మాత్రం అడ్డు ఉండకుండా చూసుకోవాల్సిందిగా కోరాడట పవన్ కళ్యాణ్. అంటే సెప్టెంబర్ 2 నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరోసారి ఓజీ మేనియా లో మునిగి తేలబోతున్నారు అన్నమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని వండర్స్ ని క్రియేట్ చేస్తుంది అనేది.

వరల్డ్‌ వార్‌ను మించిన యుద్ధం.. 1,569 రోజులుగా మారణ హోమం!

Longest ongoing war 1569 days
Longest ongoing war 1569 days

Longest ongoing war 1569 days: ప్రస్తుతం యుద్ధాల కాలం కాదని చాలా మంది విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని చరిత్ర కూడా చెబుతుంది. చివరకు ప్రపంచ యుద్ధాలు కూడా చర్చలతోనే ముగిశాయి. కానీ 2022 ఫిబ్రవరి నుంచి సాగుతున్న ఈ ఘర్షణ నాలుగేళ్లకు పైగా కొనసాగుతోంది. ఇది మొదటి ప్రపంచ యుద్ధం కాలం కంటే ఎక్కువగా మారింది. మొదట్లో రష్యా వేగంగా విజయం సాధించాలని భావించినా, ఆ ఆశలు నెరవేరలేదు. ఐరోపాలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతకాలం నిరంతర రక్తపాతం జరగడం ఇదే మొదటిసారి. ఈ వ్యవధి రెండు దేశాల మధ్య సంబంధాలను ఎంతగా దెబ్బతీసిందో చూపిస్తుంది.

యుద్ధ వ్యూహాల మార్పు..
పాతకాలపు యుద్ధాల్లో ట్రెంచీలు, భారీ ఆయుధాలు ప్రధానంగా ఉండేవి. నేడు డ్రోన్లు, కచ్చితమైన క్షిపణులు, ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలు రణరంగాన్ని మార్చేశాయి. రెండు దేశాల మధ్యే జరుగుతున్నా, ఈ సాంకేతికత ఘర్షణను మరింత తీవ్రం చేసింది. ఒకవైపు డిజిటల్‌ నిఘా, మరోవైపు భూభాగాల కోసం జరుగుతున్న పోరు పాత యుద్ధాలను గుర్తుకు తెస్తుంది. ఉక్రెయిన్‌ ఏ శక్తివంతమైన సంకలనంలో సభ్యత్వం లేకుండా, అణ్వాయుధాలు లేకుండా ఇంతకాలం ప్రతిఘటించడం ఆశ్చర్యకరం.

శాంతి చర్చలు, అంతర్జాతీయ ప్రయత్నాలు
అలాస్కాలో రెండు దేశాల అధినేతల మధ్య జరిగిన చర్చలు దశాబ్దాల తర్వాత మొదటిసారి అమెరికా నేలపై జరిగాయి. అయినప్పటికీ శాంతి ఒప్పందం ఇంకా దూరంగానే ఉంది. ఉక్రెయిన్‌ నాయకుడు పాశ్చాత్య దేశాల నుంచి సహాయం కోరుతూ నిరంతరం కృషి చేస్తున్నారు. రష్యా నాయకుడు చర్చలకు సిద్ధంగా లేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రయత్నాలు తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేయడానికి సరిపోవు.

చారిత్రక పాఠాలు..
ఒకటో ప్రపంచ యుద్ధం ముగింపు తర్వాత వచ్చిన ఒప్పందం తర్వాతి యుద్ధానికి దారితీసింది. ఇప్పుడు కూడా కేవలం యుద్ధాన్ని ఆపడం కాకుండా, దీర్ఘకాలిక భద్రతకు హామీ ఇచ్చే ఒప్పందాలు అవసరం. డ్రోన్లతో రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతున్న ఉక్రెయిన్‌ బలాన్ని చూపిస్తోంది. అయితే యుద్ధాలు ఎప్పుడూ ఊహించిన సమయంలో ముగియవు. రెండు దేశాల మధ్య సరిహద్దులు, భద్రతా హామీలు వంటి సంక్లిష్ట అంశాలు శాంతి ప్రక్రియను కష్టతరం చేస్తున్నాయి.

ఈ ఘర్షణ చరిత్రలోని పాత యుద్ధాలను గుర్తుకు తెస్తూ, ఆధునిక సాంకేతికత ఎలా ప్రభావం చూపుతుందో చూపిస్తుంది. శాంతి కోసం చేసే ప్రయత్నాలు వేగంగా ఫలించాలంటే, తాత్కాలిక పరిష్కారాలు కాకుండా రెండు వైపుల అవసరాలను పరిగణనలోకి తీసుకున్న ఒప్పందాలు అవసరం. యుద్ధం ఎంత సుదీర్ఘంగా సాగుతుందో, దాని ముగింపు కూడా అంత సంక్లిష్టంగా మారుతుంది.

విజయ్.. సంగీత కలిసి పోయారా..విడాకుల ముందు ఇదేం ట్విస్ట్ సామీ

Vijay Sangeetha reunion
Vijay Sangeetha reunion

Vijay Sangeetha reunion: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. తన భార్య సంగీతతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. విజయ్ త్రిషతో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నారని తమిళనాడు మీడియాలో కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వాటికి బలం చేకూర్చే విధంగా త్రిష, విజయ్ అనేక సందర్భాలలో కనిపించారు. లియో, గోట్ సినిమాలో వారిద్దరు కలిసి నటించారు. అంతకుముందు త్రిషతో విజయ్ కలిసి నటించిన గిల్లి సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది.

విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి త్రిష వచ్చింది. త్రిషను ఆయన తల్లి సాదరంగా ఆహ్వానించింది.. విజయ్ తండ్రి కూడా ఆమెను ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు. విజయ్ ఎన్నికల ఫలితాలలో ఎక్కువ సీట్లు సాధించిన తర్వాత.. తిరుపతి వెళ్ళిన త్రిష.. నేరుగా ఆయన ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసింది. ఆ సమయంలో గంటపాటు త్రిష విజయ్ తో కలిసి ఉంది. ఇటీవల అజిత్ మాతృమూర్తి చనిపోయినప్పుడు త్రిష విజయ్ తో కలిసి వచ్చింది. అంతకుముందు ఓ వేడుకకు విజయ్ తోనే కలిసి కనిపించింది త్రిష.

సంగీత ఎన్నికలకు ముందే విజయ్ తో తనకు విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ వాయిదాలో ఉంది. త్వరలో వారిద్దరి విడాకులకు సంబంధించి కోర్టు కీలకని తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగానే విజయ్, సంగీత మళ్లీ కలిసిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడంతో వారిద్దరు కలిసి జంటగా జీవించడానికి అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా విజయ్ తల్లి శోభ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నించినట్టు సమాచారం. అయితే ఇంతవరకు అధికారికంగా ఈ విషయంపై ప్రకటన రాలేదు. ఒకవేళ విజయ్, సంగీత కలిసిపోతే త్రిష పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా నడుస్తోంది. వచ్చే రోజుల్లో వీరిద్దరి వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాలి.

విజయ్ సీఎం అయిన తర్వాత భార్య సంగీత శుభాకాంక్షలు తెలియజేయలేదు. కుమారుడు జేసన్, కుమార్తె కూడా సోషల్ మీడియాలో కనీసం విషస్ కూడా చెప్పలేదు. కుమారుడు ఏకంగా తన పేరు నుంచి విజయ్ పేరు ని తొలగించుకోవడం విశేషం. అతడు సందీప్ కిషన్ తో సిగ్మా పేరుతో ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్.

పాలమ్మిండు.. పూలమ్మిండు.. తెలంగాణలోనే అంబానీ అయ్యిండు.. మల్లారెడ్డి సార్ తోని అట్లుంటది మరి..

Malla Reddy viral speech
Malla Reddy viral speech

Malla Reddy viral speech: పబ్లిక్ రిలేషన్ టీం ఉండదు. జాకీలు పెట్టి లేపడానికి పెయింట్ యూట్యూబ్ ఛానల్స్ ఉండవు. సొంతంగా మీడియా సంస్థ కూడా ఉండదు. అయినప్పటికీ మల్లారెడ్డి సార్ ఎంట్రీ ఇచ్చాడు అంటే మీడియా షేక్ అవుతుంది. సోషల్ మీడియా బద్దలవుతుంది. ఆయన మాట్లాడితే మంటలు. అడుగుపెడితే పూనకాలు.. ఇలా ఉంటుంది మల్లారెడ్డి సార్ తోని.

మల్లారెడ్డి సార్ పాలు అమ్మి.. పూలు అమ్మి.. బోర్లు వేసి ఇక్కడ దాకా వచ్చిండు. దాదాపు ఆయన ఆధ్వర్యంలో 70 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 500 ఎకరాలలో ఆయన విద్యాసంస్థలు ఉన్నాయి. బయటికి మాత్రమే ఇవి చెప్పిండు. చెప్పని ఆస్తులు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు.. విద్యా వ్యాపారం ద్వారా.. రాజకీయాల్లోకి రావడం ద్వారా మల్లారెడ్డి సార్ భారీగా సంపాదించిండు. ఆయన సంపాదన ఏ రేంజ్ లో ఉందంటే.. తెలంగాణలో ఎవరికి లేని ఆస్తులు ఆయనకు మాత్రమే ఉన్నాయి. ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయనను అంబానీ అని పిలుచుకోవచ్చు.

మల్కాజ్గిరి స్థానం నుంచి ఎంపీగా గెలిచిండు. రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఒకసారి మంత్రిగా కూడా పని చేసిండు. గులాబీ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ.. తను మాత్రమే మంత్రి అయ్యిండు అంటే మామూలు విషయం కాదు. వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి సార్ తన కోడలు ప్రీతి రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుండు. ఈ క్రమంలోనే ప్రీతి రెడ్డి సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నారు. మీడియాలో కూడా ప్రముఖంగా దర్శనమిస్తున్నారు. ఈ లెక్కన ఇద్దరు కొడుకులు విద్యా వ్యాపారం.. పెద్ద కోడలు కూడా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటారు. ఆయనకు రాజకీయ వారసురాలిగా ప్రీతి రెడ్డి ఉంటారు. ఈ మాట మేము అంటున్నది కాదు.. స్వయంగా మల్లారెడ్డి సరే చెబుతున్నాడు.

అన్నట్టు ఇన్ని ఆస్తులున్నప్పటికీ.. మల్లారెడ్డి సార్ 300 గజాల చిన్న ఇంట్లో ఉంటున్నాడు. అదే కాదు ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి కాపాడుకోవాలని చెబుతున్నాడు. ఎదుటివారిని చూసి ఈర్ష పడదని సూచిస్తున్నాడు. ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందంగా ఉంటామని ఆయన చెబుతున్నాడు. ఇటీవల కాలంలో వ్యక్తిత్వ పాఠాలను చెబుతున్నాడు మల్లారెడ్డి. అంతేకాదు టీవీ షోలలో కూడా కనిపిస్తున్నాడు. ఏడు పదుల వయసు దాటినా మల్లారెడ్డి ఇప్పటికీ ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపిస్తున్నాడంటే దానంతటికి కారణం ప్రశాంతతనే కావచ్చు. కానీ ఇంతటి ప్రశాంతమైన వ్యక్తి రేవంత్ రెడ్డి మీద అప్పట్లో అంతగా ఎందుకు ఫైర్ అయ్యాడు.. ఐటీ అధికారులు దాడులు చేస్తే ఎందుకు బిపి తెచ్చుకున్నాడు.. ఇవి సమాధానం లేని ప్రశ్నలు.. మల్లారెడ్డి సమాధానం చెప్పలేని క్వశ్చన్లు.