Home Blog Page 132

12 సంవత్సరాల బాలికపై ఘోరం జరిగితే.. సెటిల్మెంటా.. ఏం చేయాలి అసలు వీళ్లను..

Khammam child assault case

12 year old girl assault case : మన ఇంట్లో ఆడపిల్లలకు ఏదైనా జరిగితే మనం ఎలా రెస్పాండ్ అవుతాం.. చిన్నపాటి జ్వరం వస్తేనే ఇబ్బంది పడిపోతుంటాం కదా.. అటువంటిది ఒక 12 సంవత్సరాల బాలిక మీద ఓ 45 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తి మూర్ఖుడిలాగా.. మృగంలాగా మీద పడిపోయి దాడి చేస్తే.. పైగా భవనం నుంచి కింద పడేస్తే.. మనకు ఎలా ఉంటుంది.. మన ఇంట్లో ఆడపిల్ల పై అలా జరిగితే మనం ఎలా స్పందిస్తాం..

చదువుతుంటేనే రక్తం ఉడికిపోతుంది కదూ. కానీ భారత రాష్ట్ర సమితి నాయకులకు మాత్రం అలా ఉడికిపోలేదు. పైగా 12 సంవత్సరాల బాలిక మీద తమ పార్టీ నాయకుడు దారుణం చేస్తే వెనకేసుకొచ్చారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆ బాలిక శీలానికి వెలకట్టే ప్రయత్నం చేశారు. చివరికి మూడు లక్షల వరకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటపడడంతో ఆ గులాబీ పార్టీ నాయకుడి ఆగడాలు చెల్లలేదు. అక్కడి పోలీసు అధికారులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఉదయం లేస్తే నీతులు చెప్పే కేటీఆర్.. ఈ వ్యవహారం గురించి ఇంతవరకు మాట్లాడలేదు. హరీష్ రావు నిమ్స్ లో ఆ బాలికను పరామర్శించి.. జరిగిందంట్లో తమ పార్టీ నాయకుడి తప్పులేదు అన్నట్టుగా సీన్ క్రియేట్ చేశారు. పైగా తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత లేదని నిందను ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. అక్కడ బాలిక మీద దాడి చేసింది గులాబీ పార్టీ నాయకుడు. పైగా అతని మీద రౌడీషీట్ ఉంది. అటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం అతిపెద్ద తప్పు. పైగా అతడు ఆ బాలిక మీద అంతటి దారుణానికి పాల్పడితే కనీసం అతడిని ఇంతవరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. పైగా ప్రభుత్వం మీద నింద వేయడం గులాబీ పార్టీ నాయకులకు చెల్లింది.

ఆ బాలిక వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే మంత్రులు ఆ బాలికను పరామర్శించారు. ఎంతటి ఖర్చైనా సరే వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఎక్కడ ప్రజల నుంచి తమ మీద నిరసన వ్యక్తమౌతుందోనని తెలిసి గులాబీ పార్టీ నాయకులు భలే తెలివిగా కవర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంటే.. ముందుగా సెటిల్మెంట్ కు ప్రయత్నించిన నాయకుల మీద ఖచ్చితంగా కేసులు నమోదు అవుతాయి. అంతేకాదు, వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

కేరళలో ప్రభంజనం సృష్టిస్తున్న 'హ్యాపీ' రీ రిలీజ్.. ఏకంగా 'పెద్ది' వసూళ్లనే దాటేసిందిగా..

Happy movie

Happy re release Kerala : అల్లు అర్జున్ కి కేరళ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందరూ ఆయన్ని ‘మల్లు అర్జున్’ అని పిలుస్తుంటారు. యూత్ ఆడియన్స్ లో ఆ స్థాయి క్రేజ్ ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ అతను. అల్లు అర్జున్ కి కేరళ లో ఇలాంటి క్రేజ్ కి పునాది వేసిన చిత్రం ‘హ్యాపీ’. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘హ్యాపీ’ చిత్రం మన తెలుగు లో ఫ్లాప్ అయ్యింది. కానీ కొన్నాళ్ళకు ఇదే చిత్రాన్ని మలయాళం లో డబ్ చేసి కేరళలో విడుదల చేయగా , అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. మమ్మూటీ , మోహన్ లాల్ వంటి కేరళ సూపర్ స్టార్స్ తో సమానంగా ఈ చిత్రం ఆరోజుల్లో అత్యధిక సెంటర్స్ లో 100 రోజులు ఆడడం గమనార్హం.

ఆ చిత్రాన్ని ఇప్పుడు 4K కి మార్చి , డాళ్బీ అట్మాస్ సౌండ్ తో నిన్న గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. ఎంతలా అంటే , ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన మన స్టార్ హీరోల కొత్త చిత్రాలు ‘రాజా సాబ్’, ‘పెద్ది’ వంటి వాటికంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు అన్నమాట. కేరళ ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజున 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి అట. ‘పెద్ది’ చిత్రానికి మొదటి రోజు 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రాజా సాబ్ చిత్రానికి 19 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అంతే కాదు, ఈ చిత్రం గత ఏడాది భారీ లెవెల్ లో రీ రిలీజ్ అయినటువంటి ‘బాహుబలి ది ఎపిక్’ మొదటి రోజు వసూళ్లను కూడా కేరళలో దాటింది. ‘బాహుబలి ది ఎపిక్’ చిత్రానికి 26 లక్షల రూపాయిల గ్రాస్ మాత్రమే మొదటి రోజు వచ్చింది.

అల్లు అర్జున్ మరో అరుదైన రికార్డుని కూడా నెలకొల్పాడు. కేరళలో ఇప్పటి వరకు మోహన్ లాల్ మాత్రమే రీ రిలీజ్ లో 30 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాడు. మరో మలయాళం హీరో ఆయన దరిదాపుల్లో లేరు. అలాంటిది అల్లు అర్జున్ ఆయన తర్వాత స్థానం లో నిలవడం అనేది సాధారమైనది కాదు. ఇతర రాష్ట్రాల్లో మన టాలీవుడ్ నుండి రాజమౌళి తర్వాత , అంతటి బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న ఏకైక నటుడు అల్లు అర్జున్ అని ట్రేడ్ అంటూ ఉంటుంది. అలా ఎందుకు అంటుందో , ఈ ‘హ్యాపీ’ రీ రిలీజ్ ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.

భారీగా తగ్గిన 'పెద్ది' టిక్కెట్ రేట్లు.. మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఫలించేనా..?

Peddi Movie Collections
Peddi Movie Collections

Peddi ticket rates reduced : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఏమాత్రం తగ్గలేదు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 10 రోజుల్లో దాదాపుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ స్థాయి డ్రీం లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటున్న ఈ సినిమాకు ఓవర్సీస్ మరియు నార్త్ ఇండియా మార్కెట్ కలిసొచ్చి ఉండుంటే 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అవలీలగా నమోదు అయ్యి ఉండేది. కానీ ఆ ప్రాంతాల్లో ఈ చిత్రం డిజాస్టర్ గా నిల్చింది. మొదటి రోజే వస్తాయని భావించిన వసూళ్లు , 10 రోజులు దాటినా రాలేదు. ఇదొక్కటే మెగా ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేస్తున్న విషయం. అయితే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో 176 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 296 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 220 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , వంద కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు రావాలి. కానీ అంతటి లాంగ్ రన్ వస్తుందా లేదా అనే అనుమానం బయ్యర్స్ తో పాటు నిర్మాతల్లో కూడా ఉంది. అందుకే 11 రోజుల వరకు టిక్కెట్ రేట్స్ పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతించిన, కేవలం 10 రోజులకు మాత్రమే చాలు అని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. 11 వ రోజు నుండి , అనగా , రేపటి నుండి మామూలు రేట్స్ తోనే పెద్ది చిత్రాన్ని చూడొచ్చు. తగ్గినా టిక్కెట్ రేట్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బాగా పెరుగుతారని , అంతే కాకుండా, రిపీట్స్ లో ఈ చిత్రాన్ని చూడాలని అనుకున్న ఆడియన్స్ కూడా పెరుగుతారని నిర్మాతలు స్ట్రాటజీ వేశారు.

మరి ఈ స్ట్రాటజీ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. నేటి అడ్వాన్స్ బుకింగ్స్ , కరెంట్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి , కానీ రేపు వేరే లెవెల్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. పరిస్థితి చూస్తుంటే రెండవ రోజు తర్వాత ‘పెద్ది’ చిత్రానికి రేపు ది బెస్ట్ గా నిలిచే అవకాశం ఉందని , కొత్త సినిమాల తాకిడి కూడా పెద్దగా లేకపోవడం వల్ల, ఈ సినిమాకు రేపు తెలుగు రాష్ట్రాల నుండి 6 నుండి 7 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

నేను 'గే' కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ హీరోయిన్.. పాపం ఎలాంటి పరిస్థితి వచ్చింది..

Mouni Roy beige couture gown
Mouni Roy beige couture gown

Mouni Roy divorce : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి యంగ్ హీరోయిన్స్ లో ఒకరు మౌని రాయ్. ఈమె ఒక సీరియల్ హీరోయిన్ , ఈమెకు వచ్చిన ఫేమ్ , క్రేజ్ కారణంగా సినిమాల్లో కూడా వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా, అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘విశ్వంభర’ చిత్రం లో ఈమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఇదంతా పక్కన పెడితే , సోషల్ మీడియా లో ఈమె స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈమె అప్లోడ్ చేసే ఫోటోలు , వీడియోలకు కుర్రాళ్ళు మెంటలెక్కిపోతుంటారు.

అయితే ఈమధ్య కాలం లో ఈమె పై వస్తున్న రూమర్స్ మామూలివి కాదు. తన భర్త సూరజ్ నంబియార్ తో కొన్ని అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకోవడంతో , మౌని రాయ్ ఒక గే అని కొందరు , కాదు లెస్బియన్ అని కొందరు ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈమె ప్రముఖ హీరోయిన్ దిశా పటాని తో ప్రేమలో ఉందని , త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని రకరకాల రూమర్స్ వ్యాప్తి చెందేలా చేశారు. అందుకు కారణం వీళ్లిద్దరు చాలా క్లోజ్ గా వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలే అందుకు కారణం అని చెప్పొచ్చు. వాటిని చూస్తే ఎవరికైనా అలాంటి అనుమానాలు రావడం సహజమే అనుకోండి, అది వేరే విషయం. అయితే సోషల్ మీడియా లో తనపై జరుగుతున్న ఈ ప్రచారం గురించి మౌని రాయ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చాలా ఎమోషనల్ గా రెస్పాన్స్ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ ‘నేను గే అంటూ సోషల్ మీడియా లో కొంతమంది విస్తృతంగా ప్రచారం చేశారు. అవి చూసి నేను చాలా బాధపడ్డాను. అందులో ఎలాంటి నిజం లేదు. నేను నా మాజీ భర్త తో విడాకులు తీసుకున్నప్పుడు , ఎమోషనల్ గా చాలా కృంగిపోయాను. ఆ సమయం లో నాకు అండగా స్నేహితులు నిలిచారు. నన్ను బాధ నుండి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమం లో వాళ్ళతో నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. అలా వాళ్ళతో సరదాగా తీసుకున్న ఫోటోలను చూసి , నేను గే అంటూ ముద్ర వేశారు. ఇది అత్యంత శోచనీయం’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అక్షరాలా 2500 కోట్లు.. చిన్న సినిమాగా మొదలై ప్రభంజనం సృష్టించిన హాలీవుడ్ చిత్రం..

Obsession Hollywood movie

Obsession Hollywood movie box office : కొన్ని చిన్న సినిమాలు ఎవ్వరూ ఊహించనంత అద్భుతాలను బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తుంటాయి. వందల కోట్ల రూపాయిల ఖర్చు చేసిన తీసిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాలను నమోదు చేసుకోలేకపోతున్న రోజులివి. అలాంటిది కేవలం 2 నుండి 9 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఒక చిన్న హాలీవుడ్ చిత్రం , ఏకంగా 2500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటే ఆశ్చర్యం వెయ్యక తప్పదు. ఆ సినిమా పేరు ‘అబ్సెషన్’. తెలుగు లో దీని అర్థం పిచ్చి , మోజు , అమిత ప్రేమ వంటివి వస్తాయి. ఒక వ్యక్తిని లేదా వస్తువుని పిచ్చిగా ఇష్టపడడమే దీని అర్థం. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 244 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక్క ఇండియా నుండే ఈ చిత్రానికి 73 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అందులో మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే , ఆంధ్ర ప్రదేశ్ నుండి ఇప్పటి వరకు ఈ చిత్రానికి 1 కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, తెలంగాణ ప్రాంతం నుండి 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రానికి 9 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక రాష్ట్రంలో 14 కోట్ల 41 లక్షలు, తమిళనాడు నుండి 7 కోట్ల 56 లక్షలు , కేరళ నుండి 3 కోట్ల 18 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అయ్యాయి. అలా కేవలం సౌత్ ఇండియా నుండే ఈ చిత్రానికి 34 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక నార్త్ ఇండియా విషయానికి వస్తే ఢిల్లీ నుండి 9 కోట్ల 90 లక్షల రూపాయిలు , ఉత్తర ప్రదేశ్ నుండి 1 కోటి 34 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.

అదే విధంగా పంజాబ్ నుండి 1 కోటి 55 లక్షలు , ఉత్తర్ ఖండ్ నుండి 47 లక్షలు , హర్యానా నుండి 23 లక్షలు , రాజస్థాన్ నుండి 1 కోటి 16 లక్షలు , గుజరాత్ నుండి 2 కోట్ల 43 లక్షలు , మహారాష్ట్ర నుండి 15 కోట్ల 30 లక్షలు , గోవా నుండి 55 లక్షలు, మధ్య ప్రదేశ్ నుండి 1 కోటి 16 లక్షలు , ఛత్తీస్ ఘర్ నుండి 52 లక్షలు , వెస్ట్ బెంగాల్ నుండి 1 కోటి 82 లక్షలు , బీహార్ + ఝార్ఖండ్ నుండి 58 లక్షలు , ఒడిశా నుండి 75 లక్షలు , అస్సాం నుండి 46 లక్షలు , మిగిలిన రాష్ట్రాల నుండి 39 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా 9 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం గ్లోబల్ వైడ్ గా 2500 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.

తెలంగాణలో ఏమాత్రం రక్షణ లేదా.. దేశంలోనే నాలుగో స్థానమా.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు

POCSO cases in Telangana

POCSO cases in Telangana : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు ఓ బాలిక మీద దారుణానికి పాల్పడ్డాడు. ఫలితంగా పోలీసులు అతని మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నాడు. ఫోక్సో కేసు చాలా బలమైనది. అంత సులభంగా బెయిల్ దొరకదు. చివరికి బండి సంజయ్ కేంద్ర మంత్రి అయినప్పటికీ ఆయన కుమారుడిని కాపాడుకోలేకపోయాడు.

ఖమ్మం నగరానికి చెందిన గౌస్ భారత రాష్ట్ర సమితి నాయకుడు. ఇతడి మీద ఖమ్మం రెండవ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఓపెన్ అయి ఉంది. అనేక కేసులలో ఇతడు నిందితుడు. అయినప్పటికీ గులాబీ పార్టీ పెద్దలు ఇతడిని తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇతడు ఎన్నో రకాల దారుణాలకు పాల్పడ్డాడు. అధికారంలో ఉన్నప్పుడు సామాన్యులకు చుక్కలు చూపించాడు. తాను నివాసముండే ప్రాంతానికి దగ్గరలో ఉండే అపార్ట్మెంట్లో పనిచేసే ఓ బాలిక మీద కన్నేశాడు. ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో అపార్ట్మెంట్ పైనుంచి కింద పడేశాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆ బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ వ్యవహారం తెలిసిన తర్వాత పోలీసులు గౌస్ మీద ఫోక్సో యాక్ట్ కింద కేసు పెట్టారు.

ఈ రెండు ఘటనలు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఈ రెండు కూడా ఫోక్సో యాక్ట్ కింద నమోదైన కేసులు. కేవలం ఇవి రెండు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 5 ఫోక్సో కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో కేరళ మొదటి స్థానంలో, తమిళనాడు రెండవ స్థానంలో, అస్సాం మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగు స్థానంలో తెలంగాణ కొనసాగుతోంది. 2025లో తెలంగాణ రాష్ట్రంలో 568 ఫోక్సో కేసులు నమోదయ్యాయి. 2024తో పోల్చి చూస్తే 2025 లో ఏకంగా 27% అధికంగా ఫోక్సో కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఫోక్సో కేసుల రికార్డెడ్ శాతం 9 గా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో అది 19 శాతం గా ఉంది. దేశంలో ఎక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రాల్లోనే ఫోక్సో కేసులు అధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

కొన్ని కేసులు పోలీస్ స్టేషన్ దగ్గర దాకా రావడం లేదు. సెటిల్మెంట్లే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అంతర్గతంగా పోలీసులు అంగీకరిస్తున్నారు. బాలికల మీద పరస్పర సమ్మతితో చేసినప్పటికీ నేరం నేరమే. పైగా ఫోక్సో చట్టం అత్యంత కఠినంగా ఉంటుంది. ఫలితంగా నమోదయ్యే కేసుల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది. సాధ్యమైనంతవరకు పురుషులు బాలికల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ కేసులో బెయిల్ కూడా లభించదు. ఒకరకంగా చెప్పాలంటే ఒక ఉగ్రవాదిని ఏ విధంగానైతే ట్రీట్ చేస్తారో.. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిని పోలీసులు అలా ట్రీట్ చేస్తుంటారు.. నేటి టీనేజ్ పిల్లలు కలిగే ఆకర్షణను ప్రేమ అనుకుంటున్నారు. అదే క్రమంలో దారి తప్పుతున్నారు. చివరికి ఫోక్సో కేసులలో ఇరుక్కుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రతి ఏడాది కేసుల తీవ్రత పెరిగిపోవడం పోలీస్ శాఖను సైతం నివ్వెర పరుస్తోంది. అందువల్లే పోలీసులు యువకులకు అవగాహన కలిగిస్తున్నారు. బాలికల జోలికి వెళ్లకుండా నియంత్రణ పాటించాలని.. జీవితంలో స్థిరత్వం సాధించిన తర్వాత ప్రేమ లేదా పెళ్లి వ్యవహారాల జోలికి వెళ్లాలని చెబుతున్నారు.

బుచ్చి బాబు నెక్స్ట్ సినిమాను ఆ హీరోతో చేస్తున్నాడా..? ఈసారి హీరోకి ఏం కట్ అవ్వబోతుంది..?

Buchi Babu
Buchi Babu

Buchi Babu Sana next movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఇప్పటికే వాళ్ళందరు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఆయా దర్శకుల మధ్య ఉంది. ఇక ఇలాంటి దర్శకులు ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తారు. తద్వారా ప్రేక్షకులను ఎలా మెప్పించబోతున్నారనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇలాంటి క్రమంలోనే బుచ్చి బాబు లాంటి దర్శకుడు సైతం ఇప్పటికి రెండు సినిమాల్లో చేసి రెండింటితో మంచి విజయాలను సాధించాడు. ‘ఉప్పెన’ సినిమాతో భారీ క్రేజ్ ను మూటగట్టుకున్న ఆయన రామ్ చరణ్ తో చేసిన పెద్ది సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కొన్ని ఏరియాలో డివైడ్ టాక్స్ తెచ్చుకున్నప్పటికీ మరికొన్ని ఏరియాలో మాత్రమే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ తో ఒక డిఫరెంట్ ప్రయత్నం చేసిన ఘనత కూడా బుచ్చిబాబుకే దక్కుతుంది… బుచ్చిబాబు సినిమా అంటే హీరో ఏదో ఒక అంగవైకల్యాన్ని కలిగి ఉంటాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఉప్పెన సినిమాలో హీరో ప్రైవేట్ పార్ట్స్ కోసేస్తాడు. పెద్ది సినిమాలో సైతం అతని కాలును కోల్పోవడం అనేది నిజంగా ప్రేక్షకులను ఎమోషనల్ కి గురి చేసే సన్నివేశాలనే చెప్పాలి. ఇక తన తదుపరి సినిమాలో కూడా హీరోకి ఒక చెయ్యి కే అయిపోతుందట. ఇప్పటికే ఆయన కథను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. తొందర్లోనే ఈ సినిమాని ఒక స్టార్ హీరోకి చెప్పబోతున్నారట.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బుచ్చిబాబు ఈ కథను తమిళ హీరో అయిన సూర్య తో చేయాలనే సన్నాహాలు చేస్తున్నాడట. నిజానికి బుచ్చిబాబు కథలో రిక్వైర్ ఉండి హీరోలకు ఏదో ఒక అంగవైకల్యం పెడుతున్నాడా? లేదంటే అంగవైకల్యం ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన కథను రాసుకుంటున్నాడా లేదా అనే ధోరణిలో కూడా కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో బుచ్చిబాబు చేసే సినిమాలకు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక వాళ్ళందరిని మెప్పించే విధంగా ఈ సినిమాలు ఉండబోతున్నాయా? తదుపరి సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు? తద్వారా మరోసారి తన పేరు మారుమ్రోగిపోయేలా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

'లెనిన్' విడుదల వాయిదా.. కొత్త విడుదల తేదీని ప్రకటించిన నాగార్జున.. ట్వీట్ వైరల్..

Lenin Censor Review
Lenin Censor Review

Lenin release postponed : అక్కినేని అఖిల్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘లెనిన్’. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్య దేవర నాగవంశీ, అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. ముందుగా ఈ సినిమాని మే 1 న విడుదల చేద్దామని అనుకున్నారు, కానీ ‘పెద్ది’ చిత్రం కోసం జూన్ 25 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ చిత్రం ఆ తేదీన కూడా రావడం లేదట. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బ్యాలన్స్ ఉండడం వల్లే అట. ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చాడు. కొత్త విడుదల తేదీ జులై 10 అని కూడా చెప్పుకొచ్చారు. కానీ జూన్ 25 న ఈ సినిమా విడుదల అవుతుందని భారీ ఆశలు పెట్టుకున్న అక్కినేని ఫ్యాన్స్ మాత్రం , వాయిదా పడింది అనే వార్త విని చాలా బాధపడ్డారు.

విడుదల వాయిదా పై అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘లెనిన్ టీం ఈ చిత్రాన్ని వాయిదా వెయ్యాలని నన్ను రిక్వెస్ట్ చేశారు. కారణాలు ఏంటి అని అడగ్గా, కాస్త సమయం ఇస్తే, నూటికి నూరు శాతం అద్భుతమైన ఔట్పుట్ , అక్కినేని ఫ్యాన్స్ చిరస్థాయిగా గుతుంచుకునే విధమైన థియేట్రికల్ అనుభూతి ఇచ్చేలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తామని అన్నారు. సినిమా మీద వాళ్లకు ఉన్న ప్రేమ, కమిట్మెంట్ నన్ను ఈ చిత్రాన్ని వాయిదా వేయడానికి ఒప్పించేలా చేశాయి. మనోడు ఇప్పుడు జులై 10 న రాబోతున్నాడు. మళ్లీ మళ్లీ చెప్తున్నాను , సరికొత్త అఖిల్ ని మీరంతా చూడబోతున్నారు. లెనిన్ ని అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఈ చిత్రానికి మురళి కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహించాడు. ఆయనకు ఇదే మొదటి సినిమా. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ , అక్కినేని ఫ్యాన్స్ ని మాత్రమే కాదు , సాధారణ మూవీ లవర్స్ ని కూడా ప్రత్యేకంగా ఆకర్షించింది. అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అనే నమ్మకాన్ని ఇచ్చింది. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే నటించింది. నటనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇది. ముందుగా ఈ పాత్ర కోసం శ్రీలీల ని ఎంచుకొని కొంతవరకు షూటింగ్ చేశారు. కానీ ఆమె మధ్యలో తప్పుకోవడం తో భాగ్యశ్రీ ని తీసుకున్నారు మేకర్స్. ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం అవుతున్న వార్త ఏమిటంటే , ఈ చిత్రంలో అఖిల్ గుడ్డివాడిగా నటించాడని , ఇదే కనుక నిజమైతే , ఆయన నట విశ్వరూపాన్ని మనం ఆశించవచ్చు. చూడాలి మరి ఈ సినిమాతో అయినా అఖిల్ హిట్ కొడతాడా లేదా అనేది.

ఆ గౌస్ గాడు బీఆర్ఎస్ లీడర్.. రౌడీషీటర్.. సెటిల్మెంట్ వికటించి ఇలా దొరికాడు..

Khammam child assault case

Khammam child assault case : ఖమ్మం నగరంలో 12 సంవత్సరాల బాలిక మీద దారుణానికి పాల్పడిన గౌస్ మామూలోడు కాదు. వీడు ఖమ్మం నగరంలో గులాబీ పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. వీడి మీద ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉంది. భూ అక్రమాలు.. బెదిరింపులు.. వంటి వ్యవహారాలలో ఇతడి మీద చాలా కేసులు ఉన్నాయి. ఇటువంటి నేరగాడిని గులాబీ పార్టీ నాయకులు కండువా కప్పి చేర్చుకున్నారు.

వీడు సెటిల్మెంట్లు చేస్తూ.. దందాలు చేస్తూ భారీగా వెనకేసుకున్నాడు. వీడికి అమ్మాయిలు అంటే విపరీతమైన పిచ్చి. గతంలో కొంతమంది అమ్మాయిల మీద దారుణాలకు పాల్పడి చివరికి సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా గులాబీ పార్టీ నాయకులు ఇతడి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బండి సంజయ్ కుమారుడి వ్యవహారం తెరమీదకి రాగానే.. కేటీఆర్ నుంచి మొదలుపెడితే హరీష్ రావు వరకు ఇంత ఎత్తున ఎగిరిపడ్డారు. గౌస్ దారుణం వెలుగులోకి వచ్చినప్పటికీ గులాబీ పార్టీ నాయకులు కొంచెం కూడా మాట్లాడలేదంటే.. ఆ పార్టీలో పరిస్థితి ఇలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్క పార్టీ నాయకులు చేస్తే అన్యాయం.. మనం చేస్తే మాత్రం సంసారం అన్నట్టుగా ఉంది. పైగా హరీష్ రావు నిమ్స్ లో ఆ బాలికను పరామర్శించి.. తెలంగాణ రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించడం విశేషం.

వాస్తవానికి గౌస్ పాషా దారుణానికి పాల్పడిన ఆ బాలిక బంధువులది నెల్లూరు జిల్లా. పొట్టకూటి కోసం ఖమ్మం వచ్చారు. ఆ బాలిక తాత.. బంధువులు స్థానికంగా ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనంలో వాచ్మెన్ గా ఉంటున్నారు. ఆ బాలిక వేసవి సెలవుల కోసం ఖమ్మం వచ్చింది. ఆ బాలిక మీద కన్నేసిన గౌస్.. దారుణంగా ప్రవర్తించేవాడు. ఆమెను కావాలని తాకేవాడు.

ఈ విషయాన్ని ఆ బాలిక బయటికి చెప్పుకోలేకపోయింది. అతడు అపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడల్లా భయపడి పారిపోయేది. చివరికి ఆ బాలిక ఒకరోజు అపార్ట్మెంట్ పైకి వస్తే గమనించిన గౌస్.. దారుణానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో ఆమెను అక్కడి నుంచి కింద పడేశాడు. దీంతో ఆమె నడుము విరిగింది. తీవ్రంగా గాయపడింది. ఇంత జరిగినప్పటికీ గౌస్ పాషాలో కొంచెం కూడా అపరాధ భావం కనిపించలేదు. పైగా సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నించాడు.

వీడు చేసిందే లంగా పని అనుకుంటే.. గులాబీ పార్టీ సంబంచిన కొంతమంది మాజీ కార్పొరేటర్లు రంగంలోకి దిగి ఆ బాలిక బంధువులతో మాట్లాడుకున్నారు. మూడు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. చివరికి ఈ విషయం బయటికి తెలియడంతో పోలీసులు విచారణ నిర్వహించారు. బాలిక పరిస్థితి దారుణంగా ఉండడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత గౌస్ పాషా మీద ఫోక్సో యాక్ట్ కింద కేసు పెట్టారు.

ఇటీవల బండి సంజయ్ కుమారుడి మీద అంత ఎత్తున కేటీఆర్ లేచాడు. హరీష్ రావు లేచాడు. గులాబీ కరపత్రం పిచ్చిపిచ్చిగా వార్తలను ప్రసారం చేసింది. కానీ గౌస్ విషయంలో మాత్రం నోరు మూసుకుంది. అంటే వాళ్ల పార్టీ వాడు కాబట్టి సైలెంట్ అయిపోయింది అనుకోవాలా.. అంటూ తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారు. హరీష్ రావు ఆ పాపను పరామర్శించి.. తెలంగాణలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించడం విశేషం.

వాళ్ల పార్టీ వాళ్లే ఇంతటి దారుణాలకు పాల్పడుతుంటే ఇక బాలికలకు రక్షణ ఎక్కడ ఉంటుంది.. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి హరీష్ రావు బాగానే మాట్లాడారు గాని.. గౌస్ పాషా లాంటి వ్యక్తులను పార్టీలోకి చేర్చుకోడానికి ముందు ఆలోచించాలి. నేటి కాలంలో సోషల్ మీడియా బలంగా ఉంది. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తూ ఉంటుంది. బయటపడుతూ ఉంటుంది. హరీష్ రావు చెప్పినంత మాత్రాన గౌస్ శుద్ధ పూస అయిపోడు.

భారత్‌పై యుద్ధం ప్రకటించిన బంగ్లాదేశ్‌.. సరిహద్దులో ఉద్రిక్తతలు!

Bangladesh India border tensions

Bangladesh India border tensions : భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి, వారిని స్వదేశానికి పంపడం గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్య. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఢిల్లీ, సూరత్‌ వంటి ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఆధునిక సాంకేతికత (ఐరిస్‌ స్కానింగ్, బయోమెట్రిక్‌ డేటా) ఉపయోగించి విదేశీయులను గుర్తించడం వల్ల ఈ ప్రక్రియ వేగవంతమైంది. గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అక్రమ వలసలను ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నకిలీ పత్రాలు (ఆధార్, ఓటర్‌ కార్డులు) జారీ చేయడం, అక్రమ కార్యకలాపాలు వంటి సమస్యలు ఉన్నాయని కేంద్రం పేర్కొంటోంది. ఇప్పుడు ఈ చర్యలు తీవ్రతరం కావడంతో బంగ్లాదేశీయులు స్వచ్ఛందంగా తిరిగి వెళ్తున్నారు.

యుద్ధం ప్రకటించిన రాజకీయ, మతోన్మాద శక్తులు..
బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత రాజకీయ అస్థిరత పెరిగింది. ఈ నేపథ్యంలో జమాతే ఇస్లామీ వంటి సంస్థలు, కొన్ని విపక్ష శక్తులు మరింత చురుకుగా మారాయి. భారత్‌ డిపోర్టేషన్‌ చర్యలను వ్యతిరేకిస్తూ, సరిహద్దు ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రకటనలు చేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. అయితే యుద్ధం ప్రకటించడం, కత్తులు, ఆయుధాలతో సిద్ధం కావడం వంటి ప్రకటనలు అధికారిక ప్రభుత్వ స్థాయిలో కాకుండా, విపక్షాలు, మతోన్మాద సంస్థల నుంచి వస్తున్నాయి. ఇవి రాజకీయ ఒత్తిడి సృష్టించడానికి లేదా తమ మద్దతు దారులను రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రకటనలుగా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఇలాంటి హింసాత్మక పిలుపులను మద్దతు ఇవ్వడం లేదు.

సరిహద్దు భద్రత, సైనిక సంసిద్ధత
భారత్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దు (పశ్చిమ బెంగాల్, అస్సాం, బిహార్, త్రిపుర, మేఘాలయ) చాలా సున్నితమైనది. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) ఇక్కడ బలంగా మోహరించి ఉంది. గతంలో బంగ్లాదేశ్‌ రైఫిల్స్‌ (ఇప్పుడు బార్డర్‌ గార్డ్స్‌ బంగ్లాదేశ్‌)తో కొన్ని ఘర్షణలు జరిగాయి. ప్రస్తుతం భారత్‌ వైపు నుంచి భద్రత చర్యలు బలంగా ఉన్నాయి. అక్రమ రవాణా, ఆయుధాలు, మాదకద్రవ్యాలు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్‌ వైపు నుంచి రాజకీయ ప్రకటనలు వచ్చినప్పటికీ, వాటిని అమలు చేయడం సాధ్యం కాదని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌–బంగ్లాదేశ్‌ సంబంధాలపై ప్రభావం..
భారత్‌–బంగ్లాదేశ్‌ సంబంధాలు చారిత్రకంగా మంచివి. వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి, నీటి వనరులు వంటి అంశాల్లో సహకారం ఉంది. అయితే అక్రమ వలసలు, సరిహద్దు భద్రత, రాజకీయ మార్పులు వంటి సమస్యలు ఉద్రిక్తతలను సష్టిస్తున్నాయి.బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత పెరిగిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. భారత్‌ డిపోర్టేషన్‌ చర్యలను మానవత్వ వ్యతిరేకంగా చిత్రీకరించి, దేశీయంగా మద్దతు సేకరించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

అసలు సమస్య ఏంటి..
అక్రమ వలసలు నిజమైన సమస్య. ఇవి భద్రతా సవాళ్లు, ఆర్థిక భారం, సామాజిక ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయి. రాజకీయ ప్రకటనలు అధికారిక యుద్ధ ప్రకటనలు కావు. వీటిని రాజకీయ లేదా మతోన్మాద శక్తులు తమ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాయి. సరిహద్దు నియంత్రణ రెండు దేశాలు కలిసి మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ద్వైపాక్షిక చర్చలు ద్వారా సమస్యలను పరిష్కరించడం మంచిది. హింసాత్మక ప్రకటనలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయి.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని కొన్ని విపక్ష, మతోన్మాద సంస్థలు చేస్తున్న ‘‘యుద్ధం’’ ప్రకటనలు అధికారిక స్థాయిలో లేవు. అయితే అక్రమ వలసలు, సరిహద్దు భద్రత సమస్యలు నిజమైనవి. రెండు దేశాలు దౌత్య మార్గాల ద్వారా సంభాషణలు జరపడం ద్వారా ఈ ఉద్రిక్తతలను తగ్గించవచ్చు. హింసాత్మక ప్రకటనలు ఎవరికీ మేలు చేయవు.

'అగ్ని పరీక్ష 2' షోకి దరఖాస్తు చేసుకోవడం ఎలా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Bigg Boss 10 Telugu, Agni Pariksha 2

Bigg Boss 10 Telugu Agni Pariksha 2 : భారీ అంచనాల నడుమ ఈ ఏడాది ‘బిగ్ బాస్ 10’ ని నిర్వహించడానికి మేకర్స్ అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. గత సీజన్ లో ‘అగ్నిపరీక్ష’ అనే కాన్సెప్ట్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ గా నిలిచాడు, డిమోన్ పవన్ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు. మిగిలిన కంటెస్టెంట్స్ శ్రీజా , మర్యాద మనీష్ , మాస్క్ మ్యాన్ హరీష్ , ప్రియా , దివ్య వంటి వారు , ఈ షోలో బలమైన ప్రభావం చూపించారు. సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చి టాప్ సెలబ్రిటీలుగా మారిపోయారు. మీరు కూడా అలా సామాన్యులుగా ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇచ్చి మీ తలరాతని మార్చుకోవాలని అనుకుంటున్నారా?, అయితే త్వరలోనే మొదలు కాబోయే ‘అగ్నిపరీక్ష 2’ కి దరఖాస్తు చేసుకోండి.

నిన్నటి నుండి అప్లికేషన్స్ మొదలయ్యాయి, జూన్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఈ షో లో పాల్గొనాలని అనుకోవాళ్ళు bbtelugu.jiostar.com అని గూగుల్ లో కొట్టండి , వెబ్ సైట్ ఓపెన్ అవ్వగానే అందులో మీ వివరాలను పొందుపరిచి , మీ టాలెంట్ కి సంబంధించి 3 నిమిషాల వీడియో ని రికార్డు చేసి , అప్లోడ్ చేసి పంపండి. ఈ వీడియో సైజు 50 MB మించి ఉండకూడదు. MP4 మరియు MOV ఫార్మటు లో ఈ వీడియో ని షూట్ చెయ్యాలి. ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే పంపించండి , మరో వారం రోజులు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు, ఈ దరఖాస్తు కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. మీ టాలెంట్ ని, మీ అదృష్టాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి. మరో కళ్యాణ్ పడాల , డిమోన్ పవన్ లాగా అయ్యే అవకాశాన్ని వదులుకోకండి.

లక్షల మంది ఈ అగ్నిపరీక్ష షో కి దరఖాస్తులు చేసుకుంటారు , అంత మందిలో మనకి అవకాశం ఏమొస్తుందిలే అని తేలికగా తీసుకోకండి, మీకు అదృష్టం కలిసొచ్చి వాళ్ళ వైపు నుండి ఫోన్ కాల్ రావొచ్చు కదా. అలా ‘అగ్నిపరీక్ష 2’ షో లో పాల్గొని , టాస్కులు బాగా ఆడి , బిగ్ బాస్ 10 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంటే , ఒక సామాన్యుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అరుదైన అవకాశం మీకు దక్కొచ్చు కదా?, కాబట్టి ఈ అరుదైన అవకాశాన్ని వదులుకోకండి, వెంటనే దరఖాస్తు చేసుకోండి.

heart attack death mystery : గుండెపోటుతో వ్యక్తి మృతి.. అతడి కుమార్తెకు వాట్సప్ మెసేజ్.. పోలీసుల విచారణలో ఏం తేలిందంటే..

heart attack death mystery

heart attack death mystery : ఏడాది మార్చి.. 13వ తేదీ.. కాకినాడలోని సర్పవరంలో ఓ ఆసుపత్రికి తన భర్తను భార్య తీసుకొచ్చింది. గుండెపోటుతో ఇబ్బంది పడుతున్నాడని.. అపస్మారక స్థితికి చేరుకున్నాడని కన్నీరు మున్నీరయింది. ఆస్పత్రి వైద్యులు అతనికి చికిత్స మొదలుపెట్టారు. అప్పటికే అతడు చనిపోయాడని నిర్ధారించారు. భర్త చనిపోవడంతో భార్య గుండెలు పగిలేలా ఏడ్చింది.. ఆ తర్వాత అతడికి అంత్యక్రియలు జరిగాయి. సరిగ్గా మూడు నెలల తర్వాత మృతుడి కూతురి ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కథ మొత్తం మారిపోయింది.

ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం..

ఆమె పేరు దేవి.. ఈమెకు సర్పవరం మండపం కాలనీకి చెందిన పుల్లా దుర్గాప్రసాద్ (38) తో చాలా సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. దేవి, దుర్గాప్రసాద్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. దుర్గాప్రసాద్ ఆటో తోలుకుంటూ జీవించేవాడు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం దుర్గాప్రసాద్ అనారోగ్యానికి గురయ్యాడు. ఆ సమయంలో వైద్యులు అతడి గుండెకు రెండు స్టంట్ లు వేశారు. అప్పటినుంచి దుర్గాప్రసాద్ ఇంటి వద్ద ఉంటున్నాడు. దేవి పనులకు వెళ్తోంది. దేవికి ఇన్ స్టా గ్రామ్ లో గోపి సాయి అనే యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.

బాపట్ల నుంచి వచ్చేవాడు

గోపి సాయి బాపట్ల నుంచి వచ్చేవాడు. సర్పవరం లో దేవిని ఎక్కించుకొని.. విజయవాడ, రామచంద్రపురం ప్రాంతాలకు తీసుకెళ్ళేవాడు. దేవి వ్యవహారం అనుమానం కలిగించడంతో దుర్గాప్రసాద్ నిలదీశాడు. భార్యను ఫోన్ వాడకుండా అడ్డుకున్నాడు. దీంతో అడ్డుగా ఉన్నాడని భావించిన అతడిని అంతం చేయాలని దేవి నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని గోపి సాయితో చెప్పింది. దీంతో అతడు ఈ ఏడాది మార్చి 13న 15 నిద్ర మాత్రలు ఆమెకు ఇచ్చాడు. వాటిని ఆమె ఖర్జూర రసంలో వేసి భర్తకి ఇచ్చింది. ఆ రసాన్ని అతడు తాగి నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత గోపి సాయి దిండుతో అతడి ముఖం మీద అదిమి పట్టుకున్నాడు. ఊపిరి ఆడకుండా చేసి అంతం చేశాడు. ఈ నేపథ్యంలో తన భర్తకు గుండెపోటు వచ్చిందని దేవి కుటుంబ సభ్యులకు చెప్పింది. అప్పటికే వారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అతడు చనిపోయాడు.

ప్రియురాలిని పట్టించాడు

ఈ ఘటన జరిగిన తర్వాత దేవి గోపి సాయితో మాట్లాడడం తగ్గించింది. అతడిని పూర్తిగా పక్కన పెట్టింది. అయితే ఆమె వేరొక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో గోపి సాయి ఈ నెల 9న దేవి కుమార్తెకు మెసేజ్ చేశాడు. “మీ తండ్రి గుండెపోటుతో చనిపోలేదు..నేను, మీ అమ్మ కలిసి చంపేశాం. ఖర్జూర రసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాం” అని మెసేజ్ చేశాడు. దీంతో దేవి కుమార్తె ఈ విషయాన్ని దుర్గాప్రసాద్ తమ్ముడికి చెప్పింది. అతడు ఈ నెల 9న సర్పవరం పోలీసులకు విషయాన్ని చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దేవి, గోపి సాయిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని విచారించగా అసలు విషయం చెప్పారు. వారిద్దరిని అరెస్ట్ చేసి.. రిమాండ్ కు పంపించారు.

'ఓజీ 2' వచ్చేస్తోంది.. మరి 'దేవర 2', 'సలార్ 2' సంగతేంటి..? పూర్తి వివరాలు మీకోసం..

OG 2 Devara 2 Salaar 2
OG 2 Devara 2 Salaar 2

OG 2 Devara 2 Salaar 2: టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు సీక్వెల్ అవసరం , కొన్ని సినిమాలకు అసలు అవసరం లేదు. కానీ ఈమధ్య కాలం లో కొంతమంది మేకర్స్ కేవలం హైప్ కోసం సినిమా ఎండింగ్ లో సీక్వెల్ ఉంటున్నట్టు ప్రకటిస్తున్నారు. వాటికి ఎలాంటి క్రేజ్ రాదు అనుకోండి , కానీ కొన్ని సినిమాలకు మాత్రం సీక్వెల్స్ కచ్చితంగా కావాలి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘ఓజీ’. జపాన్ లోని సమురాయ్ వర్గానికి చెందిన ఒక యువకుడు , తన వర్గానికి చెందిన వాళ్లంతా చనిపోవడం తో , ముంబై కి సత్యా దాదా అనే వ్యక్తి కి అండగా నిలిచి అతనితో పాటు ముంబై కి వెళ్తాడు. అక్కడ సత్య దాదా పోర్ట్ ని నిర్మించాలనే సంకల్పానికి ఓజీ అండగా నిలుస్తాడు. ఒకరోజు ఆ పోర్ట్ లోకి పెద్ద కంటైనర్ వస్తుంది , ఆ కంటైనర్ లో ముంబై ని పేల్చేయడానికి అవసరమయ్యే బాంబులు ఉంటాయి.

వీటిని సత్య దాదా దాచేస్తాడు, అనంతరం విలన్ గ్యాంగ్ సత్య దాదా ని ఎలా అయినా టార్చర్ చేసి కంటైనర్ ని సొంతం చేసుకోవాలని అనుకోవడం, ఓజీ వాళ్ళ కుట్రలను భగ్నం చేయడం వంటివి మొదటి భాగం లో చూపించారు. అయితే ‘ఓజీ’ సత్య దాదా కొడుకు ని చంపాను అనే నిండని వేసుకొని ముంబై వదిలి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జపాన్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఓజీ, మాస్టర్ ఓరోచీ గెంషిన్ గా ఎలా మారాడు?, యాకూజా సైన్యాన్ని మొత్తం ఎలా చంపాడు?, ఓజీ తండ్రి గతం ఏంటి?, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో ఉన్న కనెక్షన్ ఏంటి? వంటి అంశాలు ఓజీ ప్రీక్వెల్ లో చూపిస్తారు. అందుకే ఈ సినిమాకు ఈ రేంజ్ క్రేజ్ ఉంది. ఈ చిత్రానికి సీక్వెల్, ప్రీక్వెల్ ఎంత అవసరమో , ‘సలార్’ కి కూడా అంతే అవసరం.

ఈ రెండు చిత్రాలకు యూత్ ఆడియన్స్ లో ఉన్నటువంటి క్రేజ్ సాధారమైనది కాదు. అయితే ‘సలార్ 2’ ఉంటుందా అంటే అనుమానమే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘డ్రాగన్’ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఈ ‘డ్రాగన్ ‘ సిరీస్ పూర్తి అయ్యాక , ఆయన ఈ జానర్ సినిమాలకు ఎండ్ కార్డు వేస్తానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. దీంతో ‘సలార్ 2’ ఉంటుందా లేదా అనే అనుమానం ప్రేక్షకుల్లో కలిగింది. ఈ రెండు సినిమాలతో పాటు, నందమూరి అభిమానులు ‘దేవర 2’ కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ కి నందమూరి ఫ్యాన్స్ లో క్రేజ్ ఉండొచ్చేమో కానీ, నార్మల్ ఆడియన్స్ లో మాత్రం ఎలాంటి క్రేజ్ లేదు. కానీ ‘దేవర’ కథ ముగియలేదని మొదటి భాగం లోనే స్పష్టంగా చెప్పేసాడు కొరటాల శివ. మరి ఇప్పుడు ఆయన బాలయ్య సినిమాకు షిఫ్ట్ అయ్యాడు, ఎన్టీఆర్ కూడా డ్రాగన్ సిరీస్ తర్వాత ‘గాడ్ ఆఫ్ వార్’ చేయబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యం లో ‘దేవర 2’ ఉంటుందా అంటే అనుమానమే.

డైరెక్ట్ గా ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనున్న 'జన నాయగన్'.. ఎందులో చూడాలంటే..

Jana Nayagan OTT release
Jana Nayagan OTT release

Jana Nayagan OTT release: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ చిత్రం థియేటర్స్ లో విడుదల అవ్వడం ఇక దాదాపుగా కష్టమేనా అంటే, అవుననే అంటున్నాయి తమిళ వర్గాలు. నేడే ఈ చిత్రం పైరసీ చేసిన ప్రధాన నిందితుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది , కానీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ మాత్రం రావడం లేదు. నిర్మాతలు సెన్సార్ సభ్యులు చెప్పిన మార్పులు చేర్పులు చేసి, ఫైనల్ ఎడిట్ ని వాళ్లకు పంపినప్పటికీ కూడా, వాళ్ళు సెన్సార్ చేయడం లేదు. ఇందులో కచ్చితంగా రాజకీయ కుట్ర దాగి ఉందని అంటున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇప్పుడు విజయ్ ఏకంగా తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి , ఆయన తలుచుకుంటే సెన్సార్ చేయించడం ఎంత పని అని కొందరు అంటుంటారు కానీ, సెన్సార్ బోర్డు రాష్ట్ర పరిధి లోకి రాదు.

కేంద్ర ప్రభుత్వ పరిధి లోకి వస్తుంది. తమిళనాడు లో ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ , టీవీకే ని పొత్తుకు ఆహ్వానించిందని , కానీ టీవీకే అందుకు ఒప్పుకోలేదని , ఎన్ని రకాల ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా, విజయ్ ఒప్పుకోకపోవడం తో , ఆయన్ని ఆర్థికంగా దెబ్బ తీసేందుకే ‘జన నాయగన్ ‘ చిత్రాన్ని ఈ విధంగా సెన్సార్ ద్వారా అడ్డుకున్నారని విజయ్ ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్న వాదన. వాళ్ళ వాదనలో కూడా లాజిక్ ఉంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నామని, సెన్సార్ ఇక్కట్లు తొలగిపోతాయని ఆ చిత్ర నిర్మాతలు చాలా ధీమాగా ఉన్నారు. కానీ సెన్సార్ మొండితనం చూస్తుంటే , ఈ చిత్రానికి క్లియరెన్స్ ఇవ్వడానికి అసలు ఆసక్తి చూపుతున్నట్టుగా అనిపించడం లేదు. అందుకే మేకర్స్ ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ లోకి విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు.

ఓటీటీ కి ఎలాంటి సెన్సార్ అవసరం లేదు కాబట్టి , ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఫైనాన్షియర్స్ వద్ద తీసుకున్న డబ్బులకు వడ్డీలు నెలనెల విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి , డైరెక్ట్ ఓటీటీ లోనే విడుదల చేసేందుకు నిర్మాతలు చూస్తున్నారని టాక్. ఇందుకోసం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తో చర్చలు కూడా మొదలు పెట్టారట. నిర్మాతలు దాదాపుగా అమెజాన్ ప్రైమ్ సంస్థ నుండి 275 కోట్ల రూపాయిలు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం అయ్యాక విజయ్ నుండి వస్తున్న మొదటి చిత్రం , ఇదే ఆయన చివరి చిత్రం కూడా అవ్వడంతో , వేరే లెవెల్ లో లాభాలు వస్తాయి కాబట్టే, ఈ రేంజ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

'దృశ్యం 3' వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. డివైడ్ టాక్ తో ఈ గ్రాస్ కలలో కూడా ఊహించలేదు..

Drishyam 3 closing collections
Drishyam 3 closing collections

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దృశ్యం 3’ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘దృశ్యం’ చిత్రం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సృష్టించిన సునామీ సాధారణమైనది కాదు , అన్ని భాషల్లోనూ సెన్సేషన్ సృష్టించింది. ఈ సిరీస్ లోని ట్విస్టులు మూవీ లవర్స్ కి ఇచ్చిన థియేట్రికల్ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అలాంటి సిరీస్ నుండి వస్తున్న సినిమా కాబట్టి, ఈ సినిమాలో కూడా అదే రేంజ్ ట్విస్టులు , థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయని ఆశించారు ఆడియన్స్. కానీ ఆ రేంజ్ లో లేవు , అయినప్పటికీ క్రేజీ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన సినిమా కాబట్టి , ఈ చిత్రానికి వసూళ్లు కళ్ళు చెదిరే రేంజ్ లోనే వచ్చాయి.

ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , ఒక్క కేరళ ప్రాంతం నుండే ఈ చిత్రానికి 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి 9 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , తమిళ నాడు ప్రాంతం నుండి 9 కోట్లు , కర్ణాటక ప్రాంతం నుండి 14 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 6 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి ప్రాంతం అయితే ఈ చిత్రానికి క్లోజింగ్ లో 121 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం గమనార్హం. సూపర్ హిట్ టాలీవుడ్ చిత్రాలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు ఓవర్సీస్ నుండి నమోదు అవ్వడం కష్టం అవుతున్న ఈ రోజుల్లో , డివైడ్ టాక్ వచ్చిన చిత్రానికి ఈ రేంజ్ గ్రాస్ నమోదు అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు.

ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 240 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు 106 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కేవలం 30 కోట్ల రూపాయలకు మాత్రమే. అంటే దాదాపుగా 76 కోట్ల రూపాయిల లాభాలు ఈ చిత్రానికి వచ్చాయి. ఈమధ్య కాలం లో డివైడ్ టాక్ వచ్చిన ఒక చిత్రానికి ఈ రేంజ్ లాభాలు రావడం అనేది ఎక్కడా జరగలేదు. థియేటర్స్ లో ఈ రేంజ్ సునామీ సృష్టించిన ఈ సినిమాకు ఓటీటీ లో విడుదలయ్యాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.

రెండు స్క్రీన్లు..భారీ బ్యాటరీ.. ఈ ల్యాప్ టాప్ ధర ఎంతంటే..

Asus Zenbook Duo UX807 price
Asus Zenbook Duo UX807 price

Asus Zenbook Duo UX807 price: కొత్తగా ల్యాప్ టాప్ కొనాలని అనుకునేవారికి టెక్నాలజీ దిగ్గజం అసుస్ (Asus) మంచి డివైజ్ లా ఆదరణ పొందుతోంది. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అసుస్ జెన్‌బుక్ డుయో 2026 (Asus Zenbook Duo UX807) డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్ విభాగంలోనే అత్యంత ప్రాక్టికల్, పవర్‌ఫుల్ మోడల్‌గా పేరు తెచ్చుకుంది. ఇది సాధారణ ల్యాప్‌టాప్‌లా కనిపిస్తూనే.. అవసరమైనప్పుడు రెండు పూర్తి స్థాయి స్క్రీన్లుగా మారిపోయే ఈ అద్భుతమైన డివైజ్ గురించి పూర్తి వివరాలు మీకోసం..

అసుస్ జెన్‌బుక్ డుయో 2026 డిజైన్ ఎంతో మెరుగైంది. దీని బాడీని సిరామిక్, అల్యూమినియం కలిసిన మెటీరియల్‌తో తయారు చేశారు. దీనివల్ల ల్యాప్‌టాప్‌పై వేలిముద్రలు పడకుండా ఉంటాయి. అలాగే ఇది చూడటానికి చాలా ప్రీమియం లుక్‌తో పాటు గట్టిదనాన్ని ఇస్తుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే దీని సైజును 5 శాతం మేర తగ్గించారు. దీని బరువు దాదాపు 1.65 కేజీలు ఉంటుంది. ఇందులో అమర్చిన సరికొత్త ‘హైడ్‌అవే హింజ్’ వల్ల రెండు స్క్రీన్‌ల మధ్య ఉండే గ్యాప్ చాలా వరకు తగ్గిపోయి రెండు కలిపి ఒకే పెద్ద స్క్రీన్‌లా కనిపిస్తాయి.

ఈ ల్యాప్‌టాప్‌లో అత్యంత ప్రధానమైన ఆకర్షణ దీని రెండు 14 అంగుళాల టచ్ స్క్రీన్లు. ఈ రెండు స్క్రీన్లు కూడా 3K హై రిజల్యూషన్ తో అత్యంత స్మూత్ గా ఉంటాయి. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ చేస్తుండడంతో ఈ డిస్‌ప్లేలు డాల్బీ విజన్ , HDR True Black 1000 సర్టిఫికేషన్‌ కలిగి ఉన్నాయి. 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందించే ఇవి క్రియేటర్లు, ఎడిటర్లు, మల్టీటాస్కింగ్ చేసేవారికి ఈ రెండు స్క్రీన్లు ఒకే నాణ్యతతో అద్భుతమైన విజువల్స్ ను అందిస్తాయి.

Asus Zenbook Duo UX807ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. అయస్కాంతాల సహాయంతో కింద ఉండే రెండవ స్క్రీన్‌కు ‘పోగో పిన్స్’ ద్వారా అతుక్కుంటుంది. కీబోర్డ్‌ను స్క్రీన్ మీద పెట్టినప్పుడు ఇది సాధారణ ల్యాప్‌టాప్‌లా పనిచేస్తుంది ఒకవేళ మనకు రెండు స్క్రీన్లు కావాలనుకుంటే, ఆ కీబోర్డ్‌ను విడదీసి పక్కన పెట్టుకుని బ్లూటూత్ ద్వారా వాడుకోవచ్చు. రెండు స్క్రీన్లు ఉన్నప్పటికీ బ్యాటరీ లైఫ్ విషయంలో అసుస్ ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో 99 W భారీ బ్యాటరీని అమర్చారు. కేవలం ఒకే స్క్రీన్ వాడుకున్నప్పుడు ఇది దాదాపు 22 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్‌ను, రెండు స్క్రీన్లను కలిపి వాడుకున్నప్పుడు కూడా దాదాపు 13 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. ఈ బ్యాటరీ 100W టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ కు సపోర్టు చేస్తుంది. భారతదేశంలో దీని ప్రారంభ ధర దాదాపు రూ. 2,99,990 గా ఉంది.

'పెద్ది' 9 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే..

Peddi Success Meet
Peddi Success Meet

Peddi 9 days worldwide collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 12 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఒక స్టార్ హీరో సినిమాకు వారం రోజులు దాటిన తర్వాత కూడా బుక్ మై షో యాప్ లో ఇలాంటి ట్రెండ్ ఉండడం చివరిసారిగా ‘ఓజీ’ చిత్రానికి చూశాము , మళ్లీ ఈ సినిమాకే చూస్తున్నాము. ఇకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద దిగ్విజయంగా ఈ చిత్రం 9 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకొని 10 వ రోజు లోకి అడుగుపెట్టింది. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 296 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా ఈ సినిమాకు ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.

నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 48 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, 9 రోజుల్లో 48 కోట్ల 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి లాభాల్లోకి అడుగుపెట్టింది. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా 18 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు ఈ 9 రోజుల్లో వచ్చాయి. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో అయితే ఈ సినిమా మొదటి రోజు నుండి ఏ మాత్రం జోరు తగ్గకుండా సంచలనాత్మక రికార్డులను నమోదు చేసుకుంది. ట్రేడ్ వర్గాలు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 9 రోజుల్లో 19 కోట్ల 51 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు ఈ ప్రాంతం లో ప్రతితాత్మక 20 కోట్ల క్లబ్ లోకి చేరనుంది.

ఇక తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే 9 రోజుల్లో దాదాపుగా ఈ చిత్రానికి 11 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది ఈ చిత్రం. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 8 కోట్ల రూపాయిలు , గుంటూరు జిల్లాలో 11 కోట్ల 48 లక్షల రూపాయిలు , కృష్ణా జిల్లాలో 9 కోట్ల రూపాయిలు, నెల్లూరు జిల్లా లో 5 కోట్ల 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 131 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 196 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 13 కోట్ల 10 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 3 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 10 కోట్ల 10 లక్షల రూపాయిలు ఓవర్సీస్ నుండి 21 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి , ఓవరాల్ గా 178 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 296 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 41 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.