12 year old girl assault case : మన ఇంట్లో ఆడపిల్లలకు ఏదైనా జరిగితే మనం ఎలా రెస్పాండ్ అవుతాం.. చిన్నపాటి జ్వరం వస్తేనే ఇబ్బంది పడిపోతుంటాం కదా.. అటువంటిది ఒక 12 సంవత్సరాల బాలిక మీద ఓ 45 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తి మూర్ఖుడిలాగా.. మృగంలాగా మీద పడిపోయి దాడి చేస్తే.. పైగా భవనం నుంచి కింద పడేస్తే.. మనకు ఎలా ఉంటుంది.. మన ఇంట్లో ఆడపిల్ల పై అలా జరిగితే మనం ఎలా స్పందిస్తాం..
చదువుతుంటేనే రక్తం ఉడికిపోతుంది కదూ. కానీ భారత రాష్ట్ర సమితి నాయకులకు మాత్రం అలా ఉడికిపోలేదు. పైగా 12 సంవత్సరాల బాలిక మీద తమ పార్టీ నాయకుడు దారుణం చేస్తే వెనకేసుకొచ్చారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆ బాలిక శీలానికి వెలకట్టే ప్రయత్నం చేశారు. చివరికి మూడు లక్షల వరకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటపడడంతో ఆ గులాబీ పార్టీ నాయకుడి ఆగడాలు చెల్లలేదు. అక్కడి పోలీసు అధికారులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఉదయం లేస్తే నీతులు చెప్పే కేటీఆర్.. ఈ వ్యవహారం గురించి ఇంతవరకు మాట్లాడలేదు. హరీష్ రావు నిమ్స్ లో ఆ బాలికను పరామర్శించి.. జరిగిందంట్లో తమ పార్టీ నాయకుడి తప్పులేదు అన్నట్టుగా సీన్ క్రియేట్ చేశారు. పైగా తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత లేదని నిందను ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. అక్కడ బాలిక మీద దాడి చేసింది గులాబీ పార్టీ నాయకుడు. పైగా అతని మీద రౌడీషీట్ ఉంది. అటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం అతిపెద్ద తప్పు. పైగా అతడు ఆ బాలిక మీద అంతటి దారుణానికి పాల్పడితే కనీసం అతడిని ఇంతవరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. పైగా ప్రభుత్వం మీద నింద వేయడం గులాబీ పార్టీ నాయకులకు చెల్లింది.
ఆ బాలిక వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే మంత్రులు ఆ బాలికను పరామర్శించారు. ఎంతటి ఖర్చైనా సరే వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఎక్కడ ప్రజల నుంచి తమ మీద నిరసన వ్యక్తమౌతుందోనని తెలిసి గులాబీ పార్టీ నాయకులు భలే తెలివిగా కవర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంటే.. ముందుగా సెటిల్మెంట్ కు ప్రయత్నించిన నాయకుల మీద ఖచ్చితంగా కేసులు నమోదు అవుతాయి. అంతేకాదు, వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
















నేను 'గే' కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ హీరోయిన్.. పాపం ఎలాంటి పరిస్థితి వచ్చింది..
Mouni Roy divorce : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి యంగ్ హీరోయిన్స్ లో ఒకరు మౌని రాయ్. ఈమె ఒక సీరియల్ హీరోయిన్ , ఈమెకు వచ్చిన ఫేమ్ , క్రేజ్ కారణంగా సినిమాల్లో కూడా వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా, అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘విశ్వంభర’ చిత్రం లో ఈమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఇదంతా పక్కన పెడితే , సోషల్ మీడియా లో ఈమె స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈమె అప్లోడ్ చేసే ఫోటోలు , వీడియోలకు కుర్రాళ్ళు మెంటలెక్కిపోతుంటారు.
అయితే ఈమధ్య కాలం లో ఈమె పై వస్తున్న రూమర్స్ మామూలివి కాదు. తన భర్త సూరజ్ నంబియార్ తో కొన్ని అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకోవడంతో , మౌని రాయ్ ఒక గే అని కొందరు , కాదు లెస్బియన్ అని కొందరు ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈమె ప్రముఖ హీరోయిన్ దిశా పటాని తో ప్రేమలో ఉందని , త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని రకరకాల రూమర్స్ వ్యాప్తి చెందేలా చేశారు. అందుకు కారణం వీళ్లిద్దరు చాలా క్లోజ్ గా వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలే అందుకు కారణం అని చెప్పొచ్చు. వాటిని చూస్తే ఎవరికైనా అలాంటి అనుమానాలు రావడం సహజమే అనుకోండి, అది వేరే విషయం. అయితే సోషల్ మీడియా లో తనపై జరుగుతున్న ఈ ప్రచారం గురించి మౌని రాయ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చాలా ఎమోషనల్ గా రెస్పాన్స్ ఇచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘నేను గే అంటూ సోషల్ మీడియా లో కొంతమంది విస్తృతంగా ప్రచారం చేశారు. అవి చూసి నేను చాలా బాధపడ్డాను. అందులో ఎలాంటి నిజం లేదు. నేను నా మాజీ భర్త తో విడాకులు తీసుకున్నప్పుడు , ఎమోషనల్ గా చాలా కృంగిపోయాను. ఆ సమయం లో నాకు అండగా స్నేహితులు నిలిచారు. నన్ను బాధ నుండి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమం లో వాళ్ళతో నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. అలా వాళ్ళతో సరదాగా తీసుకున్న ఫోటోలను చూసి , నేను గే అంటూ ముద్ర వేశారు. ఇది అత్యంత శోచనీయం’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.