Home Blog Page 127

'హ్యాపీ' రీ రిలీజ్ థియేటర్ లో చిందులేసిన మెగాస్టార్ చిరంజీవి కూతురు.. వీడియో వైరల్

Happy Re Release Viral Video
Happy Re Release Viral Video

Happy Re Release Viral Video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళ లో 2006 వ సంవత్సరం నుండే విపరీతమైన క్రేజ్ ఉంది అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఏడాది జనవరి 27 న ఆయన నుండి విడుదలైన ‘హ్యాపీ’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. కానీ తెలుగు లో విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఇదే చిత్రాన్ని మలయాళం లో డబ్ చేసి విడుదల చేశారు. అక్కడ ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మోహన్ లాల్ , మమ్మూటీ సినిమాలతో సమానంగా కలెక్షన్స్ ని రాబడుతూ , అత్యధిక సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా నుండే అల్లు అర్జున్ కి కేరళ లో కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక అప్పటి నుండి అల్లు అర్జున్ ప్రతీ సినిమా మలయాళం లో డబ్ అయ్యేవి.

‘వరుడు’ లాంటి చిత్రం కూడా అక్కడ డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, కేరళ జనాలు అల్లు అర్జున్ ని ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారు అనేది. అయితే ‘హ్యాపీ’ చిత్రాన్ని రీసెంట్ గానే మలయాళం లో 4K క్వాలిటీ కి మార్చి రీ రిలీజ్ చేశారు. అక్కడ ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి , మూడు రోజుల్లో దాదాపుగా కోటి రూపాయిల గ్రాస్ ని రాబట్టి చరిత్ర సృష్టించింది. ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన స్టార్ హీరోల కొత్త సినిమాలు ‘పెద్ది’, ‘ది రాజా సాబ్’ లను మించి ఈ చిత్రం వసూళ్లను రాబడుతుంది అంటే , కేరళ ఆడియన్స్ లో ఈ చిత్రానికి ఎలాంటి కల్ట్ స్టేటస్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ సినిమా థియేటర్ లో మెగాస్టార్ చిరంజీవి కూతురు , తన స్నేహితులతో కలిసి చిందులు వేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది. చిరంజీవి కూతురు అంటే , సొంత కూతురు కాదండోయ్ , ప్రస్తుతం ఆయన డైరెక్టర్ బాబీ తో ఒక గ్యాంగ్ స్టర్ మూవీ చేస్తున్నాడు కదా?, రీసెంట్ గానే పొలాచ్చి లో 12 రోజుల పాటు ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకొని వచ్చారు. ఇందులో యంగ్ హీరోయిన్ అనశ్వర రాజన్ చిరంజీవి కి కూతురు గా నటిస్తోంది. హ్యాపీ రీ రిలీజ్ థియేటర్ లో చిందులు వేసింది ఈమెనే. రీసెంట్ గా ఈమె ‘విత్ లవ్’ అనే చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజీ హీరోయిన్ ఇప్పుడు హ్యాపీ రీ రిలీజ్ థియేటర్ లో ఈ రేంజ్ లో చిందులు వేయడాన్ని చూసి అల్లు అర్జున్ అభిమానులు గర్వపడుతున్నారు. ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.

మహేష్ బాబు తో మైథలాజికల్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన బుచ్చి బాబు.. వీడియో వైరల్..

Buchi Babu Mahesh Babu Film
Buchi Babu Mahesh Babu Film

Buchi Babu Mahesh Babu Film: తెలుగు రాష్ట్రాల్లో ‘పెద్ది’ మేనియా ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రోజుకి ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తూ , తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 రోజుల్లోనే పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. కరువులో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఊపిరి ని ఇచ్చింది ఈ ‘పెద్ది’ చిత్రం. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు తన భుజాల పై ఈ చిత్రాన్ని మోశాడు , అద్భుతంగా నటించి, నేషనల్ అవార్డు కచ్చితంగా రామ్ చరణ్ కి ఇవ్వాల్సిందే అనే రేంజ్ పేరు తెచ్చుకున్నాడు. కానీ డైరెక్టర్ బుచ్చి బాబు మాత్రం తీవ్రమైన విమర్శలు ఎదురుకున్నాడు.

ఎందుకంటే హీరోయిన్ ని ఆయన చూపించిన తీరుని ఆడియన్స్ ఏకిపారేశారు. ఒక సందేశాత్మక చిత్రం తీస్తూ , యువతని తప్పుదోవ పట్టించే ఇలాంటి పాత్రలను ఎలా డిజైన్ చెయ్యాలని అనిపించింది అంటూ ఆయన్ని నిలదీశారు నెటిజెన్స్. అంతే కాకుండా స్క్రీన్ ప్లే విషయం లో కూడా బుచ్చి బాబు చాలా తప్పులు చేసాడని, రామ్ చరణ్ నటన కారణంగా వాటిని ఆడియన్స్ క్షమించారని అంటూ కూడా విమర్శలు చేశారు. అయితే బుచ్చి బాబు తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో దాదాపుగా ఖరారు అయ్యింది అనే వార్తలు విని, సోషల్ మీడియా మహేష్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అతనికి నిన్ను హ్యాండిల్ చేసేంత సత్తా లేదని, చాలా మిడ్ డైరెక్టర్ అని , పెద్ది కేవలం రామ్ చరణ్ వల్ల ఆడుతుందని , దయచేసి అతనికి అవకాశం ఇవ్వొద్దు అంటూ మహేష్ ని ట్యాగ్ చేసి పోస్టులు పెట్టారు.

అయితే మహేష్ తో ఆయన ఎంచుకున్న జానర్ మైథాలజీ అని తెలియడం తో కాస్త శాంతించారు. నిన్న ‘పెద్ది’ చిత్రానికి సంబంధించి ఒక సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ సక్సెస్ మీట్ లో ఒక రిపోర్టర్ బుచ్చి బాబు ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో మైథాలజీ చిత్రమని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ కామెంట్ ఏంటి?’ అని అడగ్గా, అందుకు బుచ్చి బాబు సమాధానం చెప్తూ ‘ఏదైనా టైం నిర్ణయిస్తుంది సార్’ అని చెప్పుకొచ్చాడు. అంటే సోషల్ మీడియా లో ప్రచారమయ్యే వార్తల్లో నిజం ఉందని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు బుచ్చి బాబు. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

పెద్ది' ఓవర్సీస్ , నార్త్ ఇండియా కలెక్షన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన నిర్మాత.. వీడియో వైరల్..

Peddi Overseas Collections
Peddi Overseas Collections

Peddi Overseas Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ బాక్స్ ఆఫీస్ సునామీ ఎలాంటిదో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. వీకెండ్ తర్వాత కలెక్షన్స్ పడిపోయే ఈ కాలం లో , పది రోజులు దాటినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ‘పెద్ది’ చిత్రం రాబడుతున్న వసూళ్లను చూసి , ఆరు నెలల నుండి వ్యాపారం లేక , థియేటర్స్ ని మూసుకున్న బయ్యర్స్ , ఎక్సిభిటర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నేటి తో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్స్, ఎక్సిభిటర్స్ లాభాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఈ చిత్రం ఓవర్సీస్ మరియు నార్త్ ఇండియా మార్కెట్స్ లో ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. రివ్యూస్ అద్భుతంగా ఉన్నాయి, పబ్లిక్ మౌత్ టాక్ కూడా బాగుంది, కానీ ఎందుకు ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో , ఎవరికీ అంతు చిక్కడం లేదు.

నార్త్ ఇండియా లో కూడా ఇదే పరిస్థితి. ఇలాంటి సినిమాలను బాలీవుడ్ ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారు. కానీ ఎందుకో ఈ సినిమాలో అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ ఆదరించలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి హిందీ వెర్షన్ లో కేవలం 28 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి విడుదలకు ముందు 10 మిలియన్ డాలర్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, పది రోజులకు కలిపి కనీసం 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. దాదాపుగా 50 కోట్ల రూపాయిల నష్టం ఒక్క ఓవర్సీస్ ప్రాంతాల్లోనే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ స్థాయి రన్ ని సొంతం చేసుకుంటున్న ఈ చిత్రానికి, ఓవర్సీస్ లో ఈ రేంజ్ ఫలితం రావడం ఏంటో అని ట్రేడ్ పండితులకు కూడా అంతు చిక్కడం లేదు.

అయితే నిన్న ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో ‘పెద్ది’ ఓవర్సీస్ పెర్ఫార్మన్స్ పై రిపోర్టర్ ఒక ప్రశ్న అడగ్గా , అందుకు నిర్మాత సతీష్ కిలారి సమాధానం చెప్తూ ‘ఓవర్సీస్ లో పర్లేదు, బాగానే వచ్చింది , కానీ అనుకున్నంత వసూళ్లు రాలేదు. ఇది ఒక కేసు స్టడీ గానే భావిస్తున్నాము. ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ, ఓవర్సీస్ లో అనుకున్నంత వసూళ్లు రాలేదంటే కచ్చితంగా కేసు స్టడీ నే. ఇప్పటి నుండి బిజినెస్ లెక్కలు ఓవర్సీస్ లో మారుతాయి. నార్త్ లో ఒక సినిమాని ఆడియన్స్ గట్టిగా పట్టుకుంటారు , ఒకసారి పట్టుకోరు. వాస్తవానికి పెద్ది ని అక్కడి ఆడియన్స్ పట్టుకోవాల్సిన సినిమా. ఇప్పటి వరకు 40 కోట్ల గ్రాస్ అక్కడి నుండి వచ్చింది . ఇంకో వారం థియేట్రికల్ రన్ అక్కడ ఉంటుందని ఆశిస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

డీఎస్సీ 2025 పై వైసిపి కుల ముద్ర!

YSRCP DSC 2025 Allegations
YSRCP DSC 2025 Allegations

YSRCP DSC 2025 Allegations: డీఎస్సీ 2025 పై వైయస్సార్ కాంగ్రెస్ అదే పనిగా విషప్రచారం చేస్తోంది. అవి రోజురోజుకు శృతిమించి కులాల వద్దకు కూడా చేర్చింది వైయస్సార్ కాంగ్రెస్. గతంలో కమ్మ డీఎస్పీలు అంటూ 2019 ఎన్నికలకు ముందు హడావిడి చేసిన సంగతి తెలిసిందే. తీరా వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్టీకి చెందిన మంత్రి కమ్మ డీఎస్పీలు కాదు.. అన్ని వర్గాల వారికి అవకాశం ఇచ్చారని శాసనసభలో ప్రకటించారు. అయితే ఇప్పుడు డీఎస్సీ 2025 పై దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. స్పోర్ట్స్ కోటా కింద కమ్మ సామాజిక వర్గం వారికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని చెబుతూ.. కమ్మ డీఎస్పీ అంటూ ప్రచారాలు ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం చానల్స్ లో కూర్చోబెట్టి.. రిటైర్మెంట్ తీసుకున్న అధికారులతో కమ్మ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ విషం చిమ్మడం మొదలుపెట్టారు.

* తప్పు అని తేల్చిన ఫ్యాక్ట్ చెక్..
డీఎస్సీ 2025 పై ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ అధికారులు ఓపికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కమ్మ డీఎస్సీ ఆరోపణలపై కూడా ఏపీ ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగి.. అదంతా తప్పుడు ప్రచారం అని తేల్చేసింది. ఈ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసిన పోస్టులు 381. ఈ 381 పోస్టుల్లో ఓపెన్ క్యాటగిరి కింద ఉన్నవి కేవలం 42 పోస్టులు మాత్రమే. మిగిలిన పోస్టులన్నీ ఎస్సీ, ఎస్ టి, బిసి, మైనారిటీ వర్గాలకు దక్కాయి. ఈ వివాదానికి ప్రధాన కారణం ఆనాలపై రెండు ఓపెన్ క్యాటగిరి పోస్టులు వాటిని పరిశీలిస్తే అందులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు వచ్చినవి కేవలం 9 పోస్టులు మాత్రమే. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు పది పోస్టులు, కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు అత్యధికంగా 16 పోస్టులు వచ్చాయి.

* ఇచ్చినవి తొమ్మిది పోస్టులే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పుడు అని అందరికీ తెలుసు. ఎందుకంటే 381 పోస్టుల్లో.. 9 పోస్టులు అంటే కనీసం మూడు శాతం కూడా లేవు. కానీ ఏ లెక్క ప్రకారం స్పోర్ట్స్ కోటా మొత్తం ఒకే కులానికి కట్టబెట్టారు.. ఇందులో భారీ స్కాం జరిగింది అంటూ తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్. కేవలం మెరిట్, క్రీడా సర్టిఫికెట్ల స్క్రూట్ని ఆధారంగా జరిగిన ఈ నియామక ప్రక్రియను.. ఒక కులానికి ఆపాదించి వివాదం చేయడం చూస్తుంటే కుట్ర కోణం అర్థం అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ ఆరాటం కోసమే నిరుద్యోగ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. దాదాపు ఆరు లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయడంతో వారిలో గందరగోళం రేపి రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ అది వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే ఆధారాలు లేని ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్న సదరు యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఆధారాలు లేని కారణంగా ఆ యూట్యూబ్ ఛానల్ ఆ వీడియోను డిలీట్ కూడా చేసింది. కానీ వదిలిపెట్టే ప్రసక్తి కనిపించడం లేదు. నేరుగా సజ్జల ఫండింగ్ చేసిన ఆ ఛానల్ సంగతి తేల్చాలన్న అభిప్రాయం కూటమి శ్రేణుల్లో వినిపిస్తోంది.

టీపీసీసీ చీఫ్‌గా పొన్నం.. కేబినెట్‌లో ఆది.. మారుతున్న కరీంనగర్‌ పాలిటిక్స్‌

TPCC Chief Change
Ponnam Prabhakar

TPCC Chief Change: తెలంగాణలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం కీలక నిర్ణయాలపై ఆలోచనలు చేస్తోంది. టీపీసీసీ అధ్యక్ష స్థానంలో మార్పు చేసేందుకు సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న నాయకత్వంలో సంఘటనా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనతో పొన్నం ప్రభాకర్‌ను ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది పార్టీ అంతర్గత సమన్వయాన్ని మెరుగుపరచడానికి, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో సంఘటనను పటిష్టం చేయడానికి సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్ష స్థానం ఎల్లప్పుడూ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి, ఈ మార్పు వచ్చినట్లయితే పార్టీ వ్యూహరచనలో మార్పు తప్పదు.

కేబినెట్‌లో మహేశ్‌గౌడ్‌
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ముఖ్యమంత్రి మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను కేబినెట్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలో సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి మార్పులు సాధారణంగా పార్టీలోని వివిధ వర్గాల సంతృప్తిని కల్పించడానికి, అలాగే భవిష్యత్తు ఎన్నికల కోసం సంసిద్ధత చూపించడానికి ఉపయోగపడతాయి. మహేష్‌ కుమార్‌గౌడ్‌కు ఇలాంటి అవకాశం రావడం వల్ల ఆయన ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీకి మరింత మద్దతు లభించే అవకాశం ఉంది.

కొండా సురేఖపై వేటు..
మంత్రివర్గంలో మార్పులు వచ్చినప్పుడు కొండా సురేఖ పదవి నుంచి తొలగించే అవకావం ఉంది. ఆమె స్థానంలో ఆది శ్రీనివాస్‌కు మంత్రి బాధ్యతలు దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి మార్పు కాదు, పార్టీలోని వివిధ వర్గాల మధ్య సమతుల్యతను తీసుకురావడానికి ఒక వ్యూహంగా చూడవచ్చు. ఆది శ్రీనివాస్‌కు ఇలాంటి అవకాశం వస్తే, ఆయనకు మద్దతు ఉన్న నాయకులు, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌ ప్రాంతంలో పార్టీ స్థానం మరింత బలపడే అవకాశం ఉంది. అయితే ఇదంతా ఇప్పటికి కేవలం అంచనాలు, అధికారిక నిర్ణయం ఇంకా రాలేదు.

హాట్‌టాపిక్‌గా ఉమ్మడి కరీంనగర్‌ రాజకీయాలు
ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీపీసీసీ అధ్యక్ష స్థానం, కేబినెట్‌ మార్పులు, మంత్రి పదవుల వంటి అంశాలు నేరుగా ఈ ప్రాంతంలోని నాయకుల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు స్థానిక నాయకుల మధ్య పోటీ, సమన్వయం, ప్రాధాన్యత వంటి అంశాలు ముందుకు వస్తాయి. ఫలితంగా ఉమ్మడి కరీంనగర్‌ రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

మొత్తం మీద కాంగ్రెస్‌ పార్టీలో ఈ మార్పులు కేబినెట్‌లో సమతుల్యతను తీసుకురావడానికి ఉపయోగపడవచ్చు. అయితే ఇవన్నీ ఇప్పటికి ప్రచారం, అంచనాల స్థాయిలోనే ఉన్నాయి. అధికారిక నిర్ణయాలు వచ్చిన తర్వాతే పూర్తి చిత్రం స్పష్టం అవుతుంది.

శామా.. నీ లేత అందాలు చూడతరమా?

Shama Sikander Latest Photos
Shama Sikander Latest Photos

రేవంత్ "హిట్లర్" మాటలు కరెక్ట్ కాదు.. హైడ్రా బాధితులకు న్యాయం..తిరగబడ్డ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud Comments On Revanth Reddy
Mahesh Kumar Goud Comments On Revanth Reddy

Mahesh Kumar Goud Comments On Revanth Reddy: అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు క్రమక్రమంగా బయట పడుతున్నాయి. షబ్బీర్ అలీ ఎపిసోడ్ మర్చిపోకముందే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. అదే కాదు మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో ఉన్న విభేదాలకు బలమైన నిదర్శనమని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.

పీసీసీ చీఫ్ ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల బెంగళూరులో ది హిందూ పత్రిక నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలను ఆ ఛానల్ ప్రతినిధి ప్రస్తావించారు. దానికి మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పారు. రేవంత్ రెడ్డి హిట్లర్ కామెంట్స్ మీద నేను ఏకీభవించను అంటూ మహేష్ కుమార్ గౌడ్ కుండబద్దలు కొట్టారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. దీనిపై ఢిల్లీలో కూడా చర్చ జరిగిందని వ్యాఖ్యానించారు. హిట్లర్ అంటే ప్రపంచం మొత్తం విలన్ గా చూస్తుంటారని.. అలాంటప్పుడు హిట్లర్ వ్యాఖ్యలను ఎవరు సమర్థిస్తారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

హైడ్రా గురించి కూడా ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్నించగా.. మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంగానే సమాధానం చెప్పారు. హైదరాబాద్ లో ఎవరికైనా అన్యాయం జరిగిందని నా దగ్గరికి వస్తే వారికి కచ్చితంగా న్యాయం చేయిస్తానని మహేష్ కుమార్ గౌడ్ మాటిచ్చారు. అక్రమాలను తొలగించేందుకు హైడ్రా పని చేస్తుందని.. హైడ్రా పనితీరును తప్పు పట్టాల్సిన అవసరం లేదని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కొన్ని సందర్భాల్లో ఏవైనా తప్పులు జరిగితే జరిగి ఉండవచ్చని.. వాటిని సరి దిద్దుకునే అవకాశం ఉంటే కచ్చితంగా చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

ఇటీవల మహేష్ కుమార్ గౌడ్ మీద బిగ్ టీవీలో వరుసగా నెగిటివ్ కథనాలు ప్రసారమయ్యాయి. వాటికి మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.. ఈ కథనాల వెనుక కొంతమంది పార్టీ పెద్దల హస్తం ఉందని ప్రచారం జరిగింది. అప్పటినుంచి మహేష్ కుమార్ గౌడ్ కొంతమంది పార్టీ నేతలతో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల షబ్బీర్ అలీ మహేష్ కుమార్ గౌడ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అవి కూడా రాజకీయంగా మహేష్ కుమార్ గౌడ్ ను చాలా ఇబ్బంది పెట్టాయి. ఈ నేపథ్యంలోనే సదరు న్యూస్ ఛానల్ లో ప్రసారమైన ఇంటర్వ్యూలో మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మరి ఈ కోల్డ్ వార్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాల్సి ఉంది.

విజయ్-రష్మిక.. మీకు మా దిష్టే తగిలేలా ఉంది.. క్యూట్ ఫొటోస్

Vijay Deverakonda foundation
Vijay Deverakonda foundation

యుద్ధం ముగిసిందని ట్రంప్ చేతులెత్తాడు.. ఇరాన్ ఓకే అంటేనే డీల్ కుదిరేది..

Trump Iran War Latest Update
Trump Iran War Latest Update

Trump Iran War Latest Update: కొద్ది రోజులుగా సాగుతున్న అమెరికా ఇరాన్ యుద్దం ప్రపంచానికి కంటి మీద కనుకు లేకుండా చేసింది. ముఖ్యంగా హర్ముజుజలసంధి మీదుగా ముడి చమురు రవాణా పూర్తిగా స్తంభించిపోవడంతో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మనదేశంలో అయితే ఏకంగా నాలుగు సార్లు గ్యాస్, ప్రీమియం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. ఫలితంగా వినయోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ద్రవ్యోల్భణం కూడా అదుపు చేయలేని స్థాయిలో పెరిగింది.

యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు తారుమరయ్యాయి. అంతటి అమెరికాలో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. అమెరికా పైకి మేకపోతే గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ తన కాపలా కుక్క పాకిస్థాన్ తో తెరపైకి శాంతి ఒప్పందాన్ని తీసుకొచ్చింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఇరాన్, అమెరికా మధ్యశాంతి చర్చలు జరిగినప్పటికీ అవి మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో పాకిస్థాన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇది జరిగిన తర్వాత రెండు దేశాలు కొద్ది రోజుల పాటు కాల్పుల విరమణను పాటించాయి. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు.. కాల్పులు మొదలయ్యాయి.

యుద్ధంవల్ల రెండు దేశాలకు నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలో.. ఈ వార్ ను విరమించాలనే ప్రతిపాదన వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని ఇరాన్ ను షరతు విధించారు. దానికి ఇరాన్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత అనేక రకాలుగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి యుద్ధాన్ని విరమిస్తున్నట్టు అమెరికా, ఇరాన్ ప్రకటించాయి. వాస్తవానికి ఇరాన్ తో యుద్ధం చేయలేక ట్రంప్ చేతులెత్తేశాడని ఇరాన్ మీడియారాస్తోంది. ఇజ్రాయిల్,అమెరికా మూకుమ్మడిగా దాడులు చేసినప్పటికీ ఇరాన్ వెన్ను చూపించలేదని అక్కడి మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.

యుద్ధం ముగిసిందని ట్రంప్ చెబుతున్నప్పటికీ అసలైన్ ట్విస్ట్ ఇరాన్ ఇచ్చింది. ఇరాన్ దేశానికి చెందిన 24 బిలయన్ డాలర్ల ఆస్తుల వ్యవహారం ఇంకా తేలలేదు. డీల్ కు ముందే 12 బిలయన్ డాలర్ల ఆస్తుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇరాన్ మీడియా చెబుతోంది. ఇరాన్ ఒప్పందాన్ని అమలు చేయకుండా ఆ ఆస్తులను వదిలేది లేదని అమెరికా చెబుతోంది. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధం మొదలవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ యుద్ధం మళ్లీ మొదలయితే పరిస్థితి మొదటికి వస్తుంది. అదే గనక జరిగితే ప్రపంచం మరింత ఆర్థిక ఒత్తిడిలోకి వెళ్లడం ఖాయం.

అన్నదాత సుఖీభవ పై అప్డేట్.. రైతులు ఆ పని చేసుకోవాల్సిందే!

Annadata Sukhibhava Latest Update
Annadata Sukhibhava Latest Update

Annadata Sukhibhava Latest Update: రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆశాజనకంగా పడుతుండడంతో రైతులు వరి సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఇటువంటి సమయంలో రైతులకు పెట్టుబడి సాయంగా ఉపయోగపడేందుకు అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ఏటా మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వంతో కలిపి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన పథకం కింద రూ.20 వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ వాటాగా రూ.14,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వాటాగా రూ.6000 చొప్పున సాయం అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఖరీఫ్ లో తొలి విడత సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

* సాంకేతిక కారణాలతో దూరం..
అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చాలా మంది రైతులు వివిధ సాంకేతిక కారణాలతో దూరమవుతూ వచ్చారు. అటువంటి వారికి సంబంధించి ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇప్పటివరకు ఈ పథకం లబ్ధి పొందని రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాలకు సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అక్కడ తమ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పొందాలంటే రైతులు తమ భూముల వివరాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేయించుకోవాలి. ఒకవేళ ఆధార్ ఇన్ యాక్టివ్ అని వస్తే సరి చేయించుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన డబ్బులు పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి.

* ఆధార్ లింక్ తప్పనిసరి..
చాలామంది అర్హత ఉన్నా అన్నదాత సుఖీభవ పథకం పొందలేకపోయారు. ఈ పథకం పొందాలంటే ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, భూమి రికార్డుల్లో ఎలాంటి తప్పులు లేకుండా ముందే సరి చూసుకోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చెల్లించే వారికి, విద్యుత్తును అధికంగా ఉపయోగించే వారికి, ఇళ్ల స్థలాలు, కార్లు వంటి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారికి ఈ పథకం నుంచి మినహాయించారు. వారి స్థితిగతుల్లో ఏమైనా మార్పులు ఉంటే… దానికి సంబంధించిన పత్రాలతో సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు సంప్రదిస్తే అప్డేట్ లను సరి చేసుకోవాల్సి ఉంటుంది.

నేటి నుంచి SIR... మీ ఇంటికి అధికారులు వస్తే ఏం చేయాలంటే..

Andhra Pradesh SIR 2026
Andhra Pradesh SIR 2026

Andhra Pradesh SIR 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ సోమవారం (జూన్ 15) నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి జాబితాను నవీకరించేందుకు ఈ ప్రత్యేక సర్వే చేపడుతున్నారు. ఓటరు జాబితాలో పేర్లు సరైనవిగా ఉండటం, అర్హులైన ప్రతి పౌరుడు ఓటు హక్కు పొందడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఈ ప్రక్రియలో ఓటర్లు నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ పనిని తప్పనిసరిగా చేయాలి. అదేంటంటే?

SIR ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (BLOలు) సోమవారం నుంచి ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారమ్‌లు అందజేస్తారు. ఓటర్లు తమ వ్యక్తిగత వివరాలు, చిరునామా, కుటుంబ సభ్యుల సమాచారం తదితర వివరాలను పరిశీలించి ఫారమ్‌లో సరిగ్గా నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆధార్, వయస్సు, నివాస ధ్రువీకరణ వంటి పత్రాల వివరాలను కూడా జతచేయవచ్చు.

ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. జూలై 14లోపు నింపిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సంబంధిత BLOలకు తిరిగి సమర్పించాలి. ఈ గడువులోగా ఫారమ్‌లు సమర్పించని వారి వివరాలను అధికారులు ధృవీకరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వారి పేర్లు తదుపరి దశలో పరిశీలనకు వెళ్లే అవకాశం ఉంటుంది.

జూలై 21న ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ జాబితాను విడుదల చేయనున్నారు. ఎన్యూమరేషన్ ఫారమ్ సమర్పించని ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో లేకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫారమ్‌ను పూర్తి చేసి BLOలకు అందజేయాలని సూచిస్తున్నారు.

డ్రాఫ్ట్ జాబితా విడుదల అనంతరం అభ్యంతరాలు, సవరణలు, కొత్త పేర్ల నమోదు, తొలగింపులపై ప్రజలకు అవకాశం కల్పించనున్నారు. తుది పరిశీలన అనంతరం నవీకరించిన ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు ప్రతి అర్హ ఓటరు ఈ ప్రత్యేక సర్వేలో పాల్గొని తమ వివరాలను సకాలంలో సమర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రామ్ చరణ్ చేసిన సినిమాల్లో మహేష్ బాబు కి నచ్చని సినిమా ఏంటంటే..?

Ram Charan
Ram Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం సైతం శాసించే స్థాయికి ఎదిగాడు. రీసెంట్ గా పెద్ది సినిమాతో ప్రేక్షకులందరి మెప్పు పొందిన ఆయన ఇప్పుడు మరోసారి సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రామ్ చరణ్ కెరియర్ లో చేసిన చాలా సినిమాలు అతనికి సక్సెస్ లను అందిస్తే కొన్ని సినిమాలు నిరాశపరిచాయి…

ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ రావడం నిజంగా చాలా గొప్ప విషయం. రాంచరణ్ చేసిన సినిమాల్లో మహేష్ బాబుకి ఒక సినిమా అంటే అసలు నచ్చదట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే ‘గోవిందుడు అందరివాడేలే’ కావడం విశేషం…ఆ సినిమాలో ఎమోషన్స్ అంత పర్ఫెక్ట్ గా కుదరలేదని అది మంచి సబ్జెక్టు, కానీ దానిని ఇంకా ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేసుంటే బాగుండేదని ఆయన పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది…

ఇక రామ్ చరణ్ మహేష్ బాబు ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికి తెలిసిందే. వీళ్లిద్దరు పలు పార్టీలలో కలిసి కనిపించడం ఒకరి ఈవెంట్స్ కి మరొకరు రావడం లాంటివి కూడా మనం గతంలో చూశాం…ఇక ఇలాంటి వీళ్లిద్దరి మధ్య ఎంత మంచి సన్నిహిత సంబంధం ఉన్నప్పటికి ఒకరి సినిమాలను ఒకరు పొగుడుతూ ఏ సినిమాల గురించి మరొకరు మాట్లాడుతుంటారట.

అందులో ఎవరెవరు ఎలా మిస్టేక్స్ చేశారు అనే విషయాల మీద కూడా చర్చించుకుంటారట. దీనివల్ల హీరోల మధ్య పోటీ వాతావరణం ఉండడమే కాకుండా మంచి సినిమాలు చేయాలనే ధోరణిలో కూడా ఆలోచనాలైతే సాగుతాయి. ఇదంతా ఒక పాజిటివ్ వైబ్ అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…చూడాలి మరి వీళ్లిద్దరూ రాబోయే సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారనేది…

ఈ కారును పర్వత ప్రాంతాల్లో టెస్ట్ చేస్తున్నారు.. ఎందుకో తెలుసా..

Mahindra Vision S SUV
Mahindra Vision S SUV

Mahindra Vision S SUV: SUV కార్లను మార్కెట్లోకి తీసుకురావడంలో మహీంద్రా దిట్ట. ఈ సంస్థ నుంచి త్వరలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ SUV ‘మహీంద్రా విజన్ S’. అయితే ఈ కారు గురించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ మరోసారి రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. గతేడాది ఆగస్టు 15న మహీంద్రా తన ‘ఫ్రీడమ్ NU’ ఈవెంట్‌లో ఈ విజన్ S కాన్సెప్ట్‌ను మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో,హైవేలపై ఈ కారును తీవ్రంగా టెస్టింగ్ చేస్తున్నారు. ఈ కారుకు సంబంధించిన డిజైన్, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

Mahindra Vision S కారు డిజైన్ చూస్తుంటే ప్రముఖ లగ్జరీ SUV అని అనిపిస్తుంది. ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్’, మహీంద్రా సొంత బ్రాండ్ ‘స్కోర్పియో’ల కలయికనా అన్నట్లు ఉంది. ఈ కారు నిటారుగా ఉండే బాక్సీ సిల్హౌట్ తో రోడ్‌పై మంచి బోల్డ్ లుక్‌ను ఇస్తుంది. దీని ముందు భాగంలో నిలువు గీతలు గల గ్రిల్ , రౌండ్ లేదా పిక్సెల్ తరహా LED హెడ్‌ల్యాంప్స్, మస్క్యులర్ బంపర్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ 17 నుంచి 18 అంగుళాల భారీ అలాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. వెనుక భాగంలో థార్ తరహాలో టైల్‌గేట్‌పైనే స్పేర్ వీల్ ను అమర్చారు.

ఇటీవలే ఈ కారు లోపల ప్రీమియం ఫీలింగ్ ఇచ్చేలా సరికొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్‌ను మహీంద్రా అందించబోతోంది. టాప్ ఎండ్ వేరియంట్లలో ఇన్ఫోటైన్‌మెంట్ , డ్రైవర్ డిస్‌ప్లే కోసం డ్యూయల్ స్క్రీన్ సెటప్ చేశారు. అంతేకాకుండా ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా ఫుల్ లెంత్ పనోరమిక్ సన్‌రూఫ్ ఇందులో కనిపించడం విశేషం. మిగిలిన ఫీచర్ల విషయానికి వస్తే.. సరికొత్త స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
పవర్‌ఫుల్ ఇంజన్ మరియు సరికొత్త ప్లాట్‌ఫారమ్

ఇంజిన్ విషయానికొస్తే.. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్: ఇది 130 PS పవర్, 230 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్: ఇది 117 PS పవర్, 300 Nm టార్క్‌ను అందిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఃగేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మహీంద్రా విజన్ S ప్రొడక్షన్ మోడల్ 2027 నాటికి భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్లోకి వచ్చాక ఇది సబ్-4 మీటర్ విభాగంలో ఉన్న టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ మరియు స్కోడా కైలాక్ వంటి కాంపాక్ట్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ప్రధానిని కలిసిన టీవీకే విజయ్ కి.. అమిత్ షా అపాయింట్మెంట్ ఎందుకు రద్దయింది.. ఇంత జరిగిందా..

IND vs PAK
IND vs PAK

TVK Vijay PM Modi Meeting: రాజకీయాలలో ఏదైనా జరుగుతుంది. ఏమైనా జరుగుతుంది. అవసరాలు మాత్రమే ఉంటాయి కాబట్టి దానికోసం రాజకీయ పార్టీలు అటు గోడ ఇటు దునుకుతాయి. ఇటు గోడను అటు దునుకుతాయి.. ఓట్లు వేసిన జనం మాత్రం పిచ్చి వాళ్ళవుతారు.

తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీ కే అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా ఆవిర్భవించింది. అలాగని అధికారం దక్కించుకునేంత స్థాయిలో అక్కడి ప్రజలు మెజారిటీ ఇవ్వలేదు. దీంతో ఇతర పార్టీల సపోర్ట్ తీసుకుని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో విజయ్ ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన సాఫీగా సాగిపోతోంది. మధ్యమధ్యలో డిఎంకె నేత స్టాలిన్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్నప్పటికీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే విజయ్ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ లో ప్రభుత్వానికి కావలసిన మెజారిటీ మొత్తాన్ని సమీకరించుకున్నారు. ఎవరికి ఏం చేయాలో అది చేశారు. పుష్ప లెవల్లో సోఫాలు కూడా ఇచ్చారు.

ఇటీవల విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు.. వారిద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత విజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవాలి. అపాయింట్మెంట్ కూడా ఓకే అయింది. ప్రధానమంత్రిని కలిసిన తర్వాత విజయ్ హోం శాఖ మంత్రి వద్దకు వెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పటికి ఆయన కాన్వాయ్ కూడా అమిత్ షా నివాసం వైపు వెళ్ళింది. విజయ్ కాన్వాయ్ అలా బయలుదేరిందో లేదో.. వెంటనే అమిత్ షా కార్యాలయం నుంచి ఫోనొచ్చింది. సార్ అందుబాటులో లేరు.. మీరు తర్వాత రండి అని ఆ ఫోన్లో వ్యక్తి చెప్పారు.

విజయ్ కి ఏం అర్థం కాలేదు.. ఎందుకిలా జరిగిందో కూడా బోధ పడలేదు. సరే బిజీగా ఉంటారని అనుకొని విజయ్ ఆయనను కలవకుండానే తిరుగు ప్రయాణమయ్యారు. అయితే దీని వెనుక డీఎంకే నేత స్టాలిన్ స్కెచ్ ఉంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో డీఎంకే ఆగ్రహంగా ఉంది.. ఇండియా కూటమికి దూరంగా ఉంది.. అంతేకాదు తమిళనాడులో బిజెపికి దగ్గరగా వెళ్తోంది. ఇప్పటికే అమిత్ షా తో స్టాలిన్ ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆయన సూచనల మేరకే అమిత్ షా విజయ్ కి అపాయింట్మెంట్ రద్దు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు డిఎంకె నేతలపై ఉన్న ఈడీ కేసుల విచారణ కూడా ఆగిపోయింది.. ఇటీవల కాలంలో స్టాలిన్ పదేపదే విజయ్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్నారు.. ఈ లెక్కన విజయ్ కి ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా సృష్టించబోతున్నారా.. విజయ్ ప్రభుత్వాన్ని కూలదోసి.. డీఎంకే అధికారంలోకి వస్తుందా.. తమిళనాడు మీడియాలో ఇప్పుడు ఇవే వార్తలు సర్కులేట్ అవుతున్నాయి.

పాక్ గెలిచేదే.. అక్కడే భారత్ మలుపు తిప్పింది.. ఇది టీమిండియా దమ్మంటే..

IND vs PAK
IND vs PAK

IND vs PAK: టి20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద భారత మహిళల జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్లో తడబడినప్పటికీ.. చివర్లో తేరుకుని భారత్ 170 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో తలవంచింది.. ముందుగా దూకుడు ప్రదర్శించినప్పటికీ.. ఆ తర్వాత వెనక్కి తగ్గింది.

భారత జట్టు విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో పాకిస్తాన్ జట్టు మొదట్లో దూకుడుగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.. రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ మునిబా (41) ఎదురుదాడితో పాకిస్తాన్ 6.3 ఓవర్లలోనే 53 పరుగులు చేసింది. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. పాకిస్తాన్ విజయం మీద సంపూర్ణ విశ్వాసంతో ఉంది. కానీ ఆ తర్వాత భారత బౌలర్లు పట్టు బిగించారు. ముఖ్యంగా దీప్తి శర్మ అద్భుతమైన బంతులు వేయడంతో ఏ సందర్భంలోనూ పాకిస్తాన్ జట్టు కోలుకునే విధంగా కనిపించలేదు. దీప్తి శర్మ ఏకంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. తెలుగు అమ్మాయి శ్రీ చరణీ మూడు వికెట్లు సాధించింది. షఫాలివర్మ ఒక వికెట్ దక్కించుకుంది. పాకిస్తాన్ టాప్ ఆర్డర్ వికెట్లు మొత్తం వీరు ముగ్గురు సొంతం చేసుకోవడం గమనార్హం. ఒక దశలో గెలిచే విధంగా కనిపించిన పాకిస్తాన్.. తీవ్రంగా తడబడింది. మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది.

టీమిండియా ఇన్నింగ్స్ కూడా అంత గొప్పగా ప్రారంభం కాలేదు.. షఫాలి వర్మ ఆకట్టుకోలేదు. జెమీమా, భారతి ఒక పరుగు చొప్పున మాత్రమే చేశారు. స్మృతి మందాన (64), కెప్టెన్ కౌర్(36), రీఛాగోష్ (34) పరుగులు చేయడంతో టీమిండియా 170 రన్స్ స్కోర్ చేసింది. రీఛాగోష్ 19 ఓవర్లో 24 పరుగులు చేయడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది.. దీంతో టీమ్ ఇండియా స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఒకరకంగా టీమిండియా విజేతగా నిలవడానికి ఆ ఓవర్ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.. ఆ ఓవర్ లో 24 పరుగులు రావడం టీమిండియా స్కోర్ బోర్డును పూర్తిగా మార్చేసింది. పాకిస్తాన్ ముందు ఒక భారీ స్థాయి లక్ష్యాన్ని విధించేలా చేసింది.

ఈ విజయం టీమిండియా మహిళల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. భారీగా అంచనాలున్న ప్లేయర్లు.. వాటిని అందుకోలేకపోయినప్పటికీ.. మిగతా ప్లేయర్లు జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడటం విశేషం. ఒక దశలో రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును.. కెప్టెన్ కౌర్.. స్మృతి ఆదుకున్నారు. చివర్లో రీచా అదరగొట్టింది.. ఇక బౌలింగ్లో దీప్తి.. శ్రీ చరణి సత్తా చూపించారు.. అందువల్లే భారత్ అద్భుతమైన గెలుపును దక్కించుకుంది.. లోపాలు సవరించుకొని.. టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్లలో జోరు చూపిస్తే వన్డే వరల్డ్ కప్ మాదిరిగానే.. టి20 వరల్డ్ కప్ కూడా మన చేతుల్లో వచ్చి చేరుతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.

దీప్తి శర్మ అదరగొడితే.. మన తెలుగు అమ్మాయి పాకిస్తాన్ ను తగలబెట్టింది..

IND vs PAK
IND vs PAK

IND vs PAK: అసలే ప్రత్యర్థి పాకిస్తాన్. హై టెన్షన్ మ్యాచ్. ఇండియా గెలుపు మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. కాకపోతే పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు. దీంతో ఒక రకంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు ప్రారంభంలోనే టీమ్ ఇండియా రెండు వికెట్ల కోల్పోయింది. స్మృతి, కౌర్ నిలబడకపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది.. అప్పటికి టీమ్ ఇండియా 170 పరుగులు చేసింది.

పాకిస్తాన్ ఈ పరుగులను సాధించడానికి తన ఇన్నింగ్స్ ను బలంగా మొదలుపెట్టింది. ఓవర్ కు 8 పరుగులకు పైగా చొప్పున తీయడం ప్రారంభించింది. దీంతో పాకిస్తాన్ గెలుపు సాధ్యమని అనుకున్నారు. మరోవైపు మునిబా అదరగొట్టే స్థాయిలో బ్యాటింగ్ చేస్తోంది. అరుంధతి రెడ్డి ధారాళంగా పరుగులు ఇస్తోంది.. క్రాంతి గౌడ్ కూడా ఒక్క ఓవర్ లోనే 14 పరుగులు ఇచ్చింది. అప్పటికి టీమ్ ఇండియా మీద ఒత్తిడి పెరిగిపోతోంది. రెండు వికెట్లు పడిపోయినప్పటికీ పాకిస్తాన్ ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ దశలో కౌర్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ధైర్యం చేసింది దీప్తికి బంతి ఇచ్చింది.. ఇక అప్పుడు మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది.

కెప్టెన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని దీప్తి ఏమాత్రం వమ్ము చేసుకోలేదు. తొలి ఓవర్ లో ఒక వికెట్.. రెండవ ఓవర్ లో మరొక వికెట్.. చివరి నాలుగో ఓవర్ లో మూడు వికెట్లు సాధించి మొత్తంగా 5 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా తనను లేడీ బుమ్రా అని ఎందుకు పిలుస్తారో మరోసారి దీప్తి నిరూపించుకుంది.

దీప్తి ఐదు వికెట్లు పడగొట్టి అదరగొడితే.. మన తెలుగు అమ్మాయి శ్రీ చరణి సత్తా చూపించింది. అత్యంత కట్టుదిట్టంగా బంతులు వేస్తూ అదరగొట్టింది.. ఏకంగా మూడు వికెట్లను దక్కించుకుంది. దీప్తి శర్మ పాకిస్తాన్ పతనాన్ని ప్రారంభిస్తే.. శ్రీ చరణి పాకిస్తాన్ మొత్తాన్ని తగలబెట్టేసింది.. ఉక్కిరి బిక్కిరి చేసే బంతులతో పాకిస్తాన్ ప్లేయర్లకు కనీసం పరుగులు తీసే అవకాశం కూడా ఇవ్వలేదు. వెంట వెంటనే వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచింది. ఒక ఎండ్ నుంచి దీప్తి.. మరో ఎండ్ నుంచి శ్రీ చరణి దాడి చేయడంతో పాకిస్తాన్ కు ఏ మాత్రం కోలుకునే అవకాశం లేకుండా పోయింది.

ఆ మధ్య టీం ఇండియా టి20 వరల్డ్ కప్ సాధించినప్పుడు.. శ్రీ చరణి సత్తా చూపించింది. తన బౌలింగ్ వైవిధ్యంతో అదరగొట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఏపీ ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి అందించింది. ఉద్యోగంతో పాటు.. ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేసింది. నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆమెను ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించారు. నాటి కార్యక్రమంలో మిథాలీ రాజ్ కూడా ఉంది.

శ్రేయాంక సూపర్ క్యాచ్.. బిత్తర పోయిన పాకిస్తాన్ ప్లేయర్.. వైరల్ వీడియో

IND vs PAK
IND vs PAK

IND vs PAK: టీమిండియా బ్యాటింగ్ .. బౌలింగ్.. సత్తా చూపిస్తూ ఉంటుంది. భారత మహిళలు కొన్ని సందర్భాలలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటుంటారు. అయితే ఫీల్డింగ్ విషయంలో మాత్రం భారత జట్టు మీద కొన్నిసార్లు సదాభిప్రాయం ఉండదు. దీనికి ప్రధాన కారణం భారత ఫీల్డర్లు చురుకుగా కదలరు. దీనిపై అనేక రకాలుగా విమర్శలు ఉన్నప్పటికీ మన ఫీల్డింగ్ అంతగా మారలేదు.

కానీ ఈ టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫీల్డింగ్ పూర్తిస్థాయిలో మారినట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా ఫీల్డర్లు మైదానంలో పాదరసం మాదిరిగా కదిలారు.. పాకిస్తాన్ జట్టుకు ఏ దశలో కూడా అవకాశం ఇవ్వకుండా బంతులకు అడ్డుగోడలుగా అడ్డు తగిలారు.. కీలకమైన క్యాచ్ లు.. రనౌట్ లు చేసి పాకిస్తాన్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. మునిబా ను దీప్తి శర్మ రనౌట్ చేయడం ఈ మ్యాచ్ మొత్తానికి హైలైట్ అయితే… అంతకు మించిన స్థాయిలో క్యాచ్ పట్టి శ్రేయాంక అదరగొట్టింది. ఇప్పటివరకు జరిగిన టి20 మ్యాచ్లలో ఆమె పట్టిన క్యాచ్ అద్భుతం అంటే.. ఏ స్థాయిలో ఫీల్డింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

శ్రీ చరణి బౌలింగ్లో పాకిస్తాన్ బ్యాటర్ రమీన్ షమీం బంతిని గట్టిగా కొట్టింది. బంతి వేగంగా గాలిలో పరుగులు పెడుతుంటే.. శ్రేయ అమాంతం ఆ బంతిని అందుకుంది. అంతే వేగంతో కింద పడింది. అయినప్పటికీ ఆమె చేతుల్లో బంతిని అలాగే గట్టిగా పట్టుకుంది. ఫలితంగా పాకిస్తాన్ బ్యాటర్ ఒక్కసారిగా షాక్ అయింది. అటువంటి కష్టతరమైన క్యాచ్ అందుకోవడమే ఒకరకంగా ఇబ్బందిగా ఉంటుంది. క్యాచ్ అందుకొని.. శరీరాన్ని నియంత్రించుకొని.. బంతిని అలానే పట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. పైగా శ్రేయ చురుకైన ఫీల్డర్ కూడా. ఆమె ఫీల్డింగ్ చూసి కెప్టెన్ కౌర్ కూడా ఆశ్చర్యపోయింది.

శ్రేయ పట్టిన క్యాచ్ ను చూసి డగ్ అవుట్ లో ఉన్న పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇదేలా సాధ్యం అనుకుంటూ తమలో తామే చర్చించుకున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఫీల్డర్లు ఈ మ్యాచ్లో దారుణంగా ఫీల్డింగ్ చేశారు. కీలకమైన క్యాచ్లు వదిలేసారు. బంతిని ఆపడంలో తడపడ్డారు. ఫలితంగా ప్రారంభంలో రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. పాకిస్తాన్ ప్లేయర్ల నిర్లక్ష్యం వల్ల భారత్ నిలదొక్కుకుంది. తద్వారా పాకిస్తాన్ ఎదుట 171 పరుగుల భారీ టార్గెట్ విధించింది. అటు ఫీల్డింగ్.. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగట్టిన టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకొని.. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో తదుపరి మ్యాచ్ కు సిద్ధమైంది.