Arjun Blast OTT release: ఈ మధ్య కాలం లో విడుదలైన కొన్ని సినిమాల్లో ప్రేక్షకులతో పాటు , ట్రేడ్ ని కూడా సర్ప్రైజ్ కి గురి చేసిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో సీనియర్ హీరో , యాక్షన్ కింగ్ అర్జున్ హీరో గా నటించిన ‘బ్లాస్ట్’ అనే చిత్రం కూడా ఉంది. అర్జున్ హీరోగా సూపర్ హిట్ ని అందుకొని చాలా ఏళ్ళు అయ్యింది. ఈమధ్య కాలం లో ఆయన హీరో పాత్రలకు గుడ్ బై చెప్పి, క్యారెక్టర్ రోల్స్ కి , విలన్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు. మళ్లీ అర్జున్ హీరో గా ఎంట్రీ ఇచ్చి , సూపర్ హిట్ కొడతాడని ప్రేక్షకులు మాత్రమే కాదు, అర్జున్ కూడా ఊహించి ఉండదు. అలాంటి అరుదైన ఘటనే ‘బ్లాస్ట్’ చిత్రానికి జరిగింది. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్క ప్రకారం ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
ప్రీతీ ముకుందన్ , అభిరామి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఫార్మ్ లో లేని సీనియర్ హీరో అర్జున్ చిత్రానికి ఏకంగా 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు , సినిమాలో ఎంతో గొప్ప కంటెంట్ ఉంటే తప్ప , ఈ రేంజ్ వసూళ్లు అసాధ్యం. దీంతో ఓటీటీ లవర్స్ ఏముంది ఈ సినిమాలో అంతగా?, కచ్చితంగా ఓటీటీ లో చూడాల్సిందే అని ఫిక్స్ అయ్యి , ఓటీటీ విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి ఇప్పుడు ఓకే గుడ్ న్యూస్. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ ప్రైజ్ కి కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ 26 న విడుదల చెయ్యాలి.
అందుకే ఈ చిత్రాన్ని ఈ నెల 26 న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు , తమిళం తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో ఈ రేంజ్ బ్లాస్టింగ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , ఓటీటీ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో అలరించబోతుందో చూడాలి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే , రాజారామ్ అనే మిడిల్ క్లాస్ కి చెందిన కరాటీ మాస్టర్ సమాజం లో జరిగే అన్యాయాన్ని ఎదురుకునే క్రమంలో తన భార్య నీలవేణి , కూతురు నీల కు కరాటీ ట్రైనింగ్ ఇస్తూ పెంచుతాడు. అనుకోకుండా నీలా ఒక కార్పొరేట్ సిండికేట్ లో చిక్కుకుంటుంది. అక్కడి నుండి ఎలా బయటపడింది అనేది స్టోరీ. స్టోరీ మామూలుగానే ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే , అందులో వచ్చే ట్విస్టులు వేరే లెవెల్ లో ఉంటాయి. అందుకే ఆడియన్స్ ఈ చిత్రానికి ఈ రేంజ్ లో కనెక్ట్ అయ్యారు.
















కాక్రోచ్ లను చంపేయాలి.. ఆ పార్టీపై పవన్ వీరావేశం వైరల్!
Pawan Kalyan Janata Cockroach Party: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి జాతీయస్థాయిలో సరికొత్త చర్చకు కారణం అయ్యారు. ఢిల్లీ వేదికగా జనసేన ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ సమైక్యతకు దెబ్బతీసే ఏ శక్తులను జనసేన సమర్ధించదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా జనతా కాక్రోచ్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సమాజానికి ఇలాంటివి మంచిది కాదు అంటూ.. ఈ బొద్దింకల పార్టీ విషయంలో అనుసరించాల్సిన అంశాలపై ఆయన జాతీయస్థాయిలో ఇచ్చిన పిలుపు కొత్త చర్చకు దారితీస్తోంది. ఎవరికి వారే కాక్రోచ్ పార్టీలుగా అభివర్ణిస్తూ హైజాక్ చేస్తుండడాన్ని పవన్ గుర్తుచేస్తూ.. ఇటువంటి బొద్దింకలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
* వ్యంగ్య రాజకీయ అస్త్రంగా..
ఇటీవల దేశంలో ప్రముఖ డిజిటల్, వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా పుట్టుకు వచ్చింది జనతా కాక్రోచ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ పేరును పోలి ఉండే ఈ ఉద్యమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజిత్ దీప్ కే గత నెల 16న ప్రారంభించారు. అక్కడకు ముందు రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా జనతా కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చింది. నిరుద్యోగ యువతను, సంస్థలను విమర్శించే కొందరిని ఉద్దేశించి బొద్ధింకలు, సమాజ పరాన్న జీవులు అని సంబోధించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. అందులో భాగంగా జనతా కాక్రోచ్ పార్టీ ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో మీమ్స్, ఆన్లైన్ ప్రచారంతో పాటు ఆఫ్ లైన్ లో సైతం బొద్దింకల దుస్తులు ధరించి దేశ రాజధాని జంతర్ మంతర్, తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ధర్నా చౌక్ వద్ద ప్రత్యక్ష నిరసనలు కూడా జరిగాయి. గత కొంతకాలంగా దేశంలో జనతా కాక్రోచ్ అనేది ట్రెండీగా నిలిచింది.
* తప్పు అని తేల్చి చెప్పిన పవన్..
అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో సమైక్యత భావం ఎక్కువ. దేశభద్రతకు విఘాతం కలిగేలా ఎవరు వ్యవహరించినా పవన్ కళ్యాణ్ నిలదీస్తుంటారు. ఇప్పుడు జనతా కాక్రోచ్ పార్టీ గురించి కూడా ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. సమాజానికి విఘాతం కలిగించే బొద్దింకలను, కాక్రోచ్ పార్టీని సమూలంగా నాశనం చేయాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. సమాజానికి ఇటువంటివి ఎంత మాత్రం ఉపయోగపడవని అభిప్రాయపడ్డారు. అందుకే అటువంటి వ్యవస్థకు ప్రోత్సహించాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు. జనతా కాక్రోచ్ పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న వేళ.. పవన్ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవే ఇప్పుడు వైరల్ అంశంగా మారాయి.