Home Blog Page 126

ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ లేటెస్ట్ సూపర్ హిట్ 'బ్లాస్ట్'.. ఎందులో చూడాలంటే..

Arjun Blast OTT release
Arjun Blast OTT release

Arjun Blast OTT release: ఈ మధ్య కాలం లో విడుదలైన కొన్ని సినిమాల్లో ప్రేక్షకులతో పాటు , ట్రేడ్ ని కూడా సర్ప్రైజ్ కి గురి చేసిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో సీనియర్ హీరో , యాక్షన్ కింగ్ అర్జున్ హీరో గా నటించిన ‘బ్లాస్ట్’ అనే చిత్రం కూడా ఉంది. అర్జున్ హీరోగా సూపర్ హిట్ ని అందుకొని చాలా ఏళ్ళు అయ్యింది. ఈమధ్య కాలం లో ఆయన హీరో పాత్రలకు గుడ్ బై చెప్పి, క్యారెక్టర్ రోల్స్ కి , విలన్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు. మళ్లీ అర్జున్ హీరో గా ఎంట్రీ ఇచ్చి , సూపర్ హిట్ కొడతాడని ప్రేక్షకులు మాత్రమే కాదు, అర్జున్ కూడా ఊహించి ఉండదు. అలాంటి అరుదైన ఘటనే ‘బ్లాస్ట్’ చిత్రానికి జరిగింది. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్క ప్రకారం ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయట.

ప్రీతీ ముకుందన్ , అభిరామి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఫార్మ్ లో లేని సీనియర్ హీరో అర్జున్ చిత్రానికి ఏకంగా 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు , సినిమాలో ఎంతో గొప్ప కంటెంట్ ఉంటే తప్ప , ఈ రేంజ్ వసూళ్లు అసాధ్యం. దీంతో ఓటీటీ లవర్స్ ఏముంది ఈ సినిమాలో అంతగా?, కచ్చితంగా ఓటీటీ లో చూడాల్సిందే అని ఫిక్స్ అయ్యి , ఓటీటీ విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి ఇప్పుడు ఓకే గుడ్ న్యూస్. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ ప్రైజ్ కి కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ 26 న విడుదల చెయ్యాలి.

అందుకే ఈ చిత్రాన్ని ఈ నెల 26 న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు , తమిళం తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో ఈ రేంజ్ బ్లాస్టింగ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , ఓటీటీ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో అలరించబోతుందో చూడాలి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే , రాజారామ్ అనే మిడిల్ క్లాస్ కి చెందిన కరాటీ మాస్టర్ సమాజం లో జరిగే అన్యాయాన్ని ఎదురుకునే క్రమంలో తన భార్య నీలవేణి , కూతురు నీల కు కరాటీ ట్రైనింగ్ ఇస్తూ పెంచుతాడు. అనుకోకుండా నీలా ఒక కార్పొరేట్ సిండికేట్ లో చిక్కుకుంటుంది. అక్కడి నుండి ఎలా బయటపడింది అనేది స్టోరీ. స్టోరీ మామూలుగానే ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే , అందులో వచ్చే ట్విస్టులు వేరే లెవెల్ లో ఉంటాయి. అందుకే ఆడియన్స్ ఈ చిత్రానికి ఈ రేంజ్ లో కనెక్ట్ అయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి కి కోలుకోలేని షాక్ ఇచ్చిన 'టాక్సిక్' మూవీ టీం.. ఇది అసలు ఊహించలేదు..

Chiranjeevi shock over Toxic movie
Chiranjeevi shock over Toxic movie

Chiranjeevi shock over Toxic movie: భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన కన్నడ సూపర్ స్టార్ యాష్ ‘టాక్సిక్’ చిత్రం విడుదల విషయం లో ఎంత జాప్యం జరుగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ముందుగా ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని మార్చి 19 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ అది జరగలేదు. అనేక సన్నివేశాలు రీ షూటింగ్ చేయాల్సిన అవసరం ఉండడం తో , ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్టు వార్తలు వినిపించాయి. జూన్ నెలలో ఎట్టకేలకు విడుదల చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ నెలలో కూడా ఈ చిత్రం రావడం లేదు. దీంతో అందరూ ఈ చిత్రం క్రిస్మస్ కానుక విడుదల చేస్తారేమో అని అనుకున్నారు. అందుకు హీరో యాష్ అసలు ఒప్పుకోవడం లేదట. సంక్రాంతికి విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట యాష్.

ఇప్పటికే ఈ సినిమాపై చాలా ఖర్చు చేసాము , విడుదల వాయిదా పడుతూ రావడం వల్ల మనం చాలానే నష్టపోవాల్సి వచ్చింది. ఈ నష్టాలు పూడవాలంటే , కచ్చితంగా ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చెయ్యాలి, లేదంటే కష్టం అని మేకర్స్ తో యాష్ చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ తో పాటు, హీరో యాష్ కూడా సహనిర్మాతగా వ్యవహరించాడు. అందుకే ఆయన నష్టపోకూడదు అనే ఉద్దేశ్యం తోనే ఈ సినిమాని సంక్రాంతి విడుదల చెయ్యాలని పట్టుబడుతున్నారు. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే సంక్రాంతికి ఈ సినిమా ఒకవేళ విడుదలైతే , మన తెలుగు సినిమాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే సంక్రాంతికి చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా విడుదల కాబోతుంది.

రీసెంట్ గానే పొలాచ్చి లో 12 రోజుల మొదటి షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చింది మూవీ టీం. మొత్తం పని దినాలు 102 రోజులు మాత్రమే అట. అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే , సెప్టెంబర్ లోపు ఈ సినిమా పూర్తి అయిపోవచ్చు. అందుకే సంక్రాంతికి విడుదల చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాని కూడా KVN ప్రొడక్షన్స్ సంస్థ నే నిర్మిస్తోంది. ఇకపోతే టాక్సిక్ చిత్రం తెలుగు వెర్షన్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసాడు. ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటే , దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని టాప్ థియేటర్స్ అన్నిటిని బ్లాక్ చేసుకుంటాడు , చిరంజీవి సినిమాతో పాటు, ఇతర హీరోల సినిమాలు కూడా ఒక డబ్బింగ్ చిత్రం కారణంగా నష్టపోవాల్సి ఉంటుంది, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

అక్షరాల 60 వేల కోట్లు.. అప్పనంగా పంచుకుని తిన్నారు

Tamil Nadu temple revenue controversy
Tamil Nadu temple revenue controversy

Tamil Nadu temple revenue controversy: శీర్షిక చదువుతుంటే రక్తం ఉడికిపోతుంది కదూ.. 60 వేల కోట్లను పంచుకొని తిన్న వెధవలను బహిరంగంగా శిక్షించాలని అనిపిస్తుంది కదూ. నిజమే వాళ్ళు చేసిన దారుణానికి.. ఇంతకాలం పాల్పడిన అన్యాయానికి కచ్చితంగా శిక్షించాల్సిందే. కానీ ఆ పని ఎవరు చేస్తారు.. ఆ పని చేసే దమ్ము ఎవరికి ఉంది..

తమిళనాడులో మన దేశంలోనే ఎక్కువగా ఆలయాలు ఉంటాయి. దీనిని టెంపుల్ స్టేట్ అని పిలుస్తుంటారు. రామేశ్వరాలయం నుంచి మొదలుపెడితే మీనాక్షి వరకు విశిష్టమైన ఆలయాలు తమిళనాడులో ఉంటాయి. ఇక్కడ ఆలయాలు వందల ఎకరాలలో ఉంటాయి. పైగా ఆలయ పరిసర ప్రాంతాల్లోనే వాణిజ్యసముదాయాలు.. ఇతర నిర్మాణాలు ఏర్పాటు చేశారు.. వీటిని అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన సొమ్మును ప్రభుత్వం తీసుకుంటుంది. తమిళనాడులో ఆలయాల ఆస్తుల మీద ప్రభుత్వానికి మాత్రమే హక్కు ఉంటుంది.

ఇంతటి స్థాయిలో ఆస్తులు ఉన్నప్పటికీ ఆశించిన విధంగా ఆదాయం రావడం లేదు. ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న పార్టీ నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం మొదలుపెట్టారు. తమకు అనుకూలమైన వ్యక్తులకు ఆ వాణిజ్య సముదాయాలను అద్దెకు ఇవ్వడం ప్రారంభించారు. దేవస్థానాలకు కాకుండా .. తమ సొంత జేబుల్లోకి ఆ ఆదాయాన్ని మళ్ళించుకున్నారు. ఫలితంగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా దాదాపు 60 వేల కోట్ల ఆదాయం పక్కదారి పట్టింది. వాస్తవానికి వేలకోట్ల ఆదాయం వందల కోట్లకు పడిపోయింది. ప్రభుత్వ పెద్దలకు ఇందులో పాత్ర ఉండడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు.

ఇటీవల తమిళనాడులో ఒక వ్యక్తి ఈ వ్యవహారాన్ని సమాచార హక్కు ద్వారా బయటికి తీసుకొచ్చాడు. అంతేకాదు కోర్టు దాక కూడా వెళ్ళాడు. దీనిపై కేసు విచారణలో ఉంది. ఒకవేళ కేసు విచారణకు వస్తే తమిళనాడు ప్రభుత్వం కచ్చితంగా దోషిగా నిలబడుతుంది. ఒకవేళ కోర్టు ఆ డబ్బు మొత్తం చెల్లించాలని చెప్పినప్పటికీ ఎవరు చెల్లిస్తారు.. ఆ డబ్బు చెల్లించడానికి ఎవరు ముందుకు వస్తారు.. అన్నాడిఎంకె.. డీఎంకే ద్రావిడ వాదాన్ని తలకెత్తుకున్నాయి. కానీ ఓ వర్గాలను మెప్పించడానికి హిందువులను తొక్కేశాయి. అంతేకాదు, దేవాలయ ఆస్తులను కూడా ఆక్రమించాయి. ఓ నివేదిక ప్రకారం తమిళనాడులో చాలావరకు ఆలయాలలో ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయాయి. ఇందులో డీఎంకే.. అన్న డీఎంకే పార్టీ నేతల హస్తముంది ఇప్పుడు టీవీకి నేతలు కూడా అదే పని చేస్తారు. అలాంటప్పుడు ఈ దుర్మార్గుల భరతాన్ని ఎవరు బయటపెడతారు.. సాక్షాత్తు ఆ దేవుడే దిగి వస్తే తప్ప ఈ ఆక్రమాలకు పాల్పడిన దుర్మార్గుల అసలు రంగు బయటపడదు.

మార్కెట్ లేదని నితిన్ తో చేయాల్సిన సినిమా విజయ్ దేవరకొండ తో చేస్తున్న స్టార్ డైరెక్టర్.. అవమానమే ఇది..

Vijay Deverakonda
Vijay Deverakonda

Vijay Deverakonda new movie: వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇచ్చిన కం బ్యాక్స్ ఎలాంటివో గతం లో మనం చాలానే చూశాము . అలాంటి కం బ్యాక్ ఇచ్చిన హీరోల్లో నితిన్ ఒకరు. ఈయన కం బ్యాక్ టాలీవుడ్ కి ఒక కేసు స్టడీ లాంటిది. వరుసగా 14 ఫ్లాప్స్ తర్వాత , కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో , ఇష్క్ చిత్రం ద్వారా భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని , తిరుగులేని కం బ్యాక్ ఇచ్చాడు నితిన్. ఈ సినిమా తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన వసరం రాలేదు. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ , తనకంటూ ఒక స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. సినిమాని థియేటర్స్ లో విడుదల కూడా చేసుకోలేని స్థాయి నుండి , స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకునే స్థాయి వరకు ఎదిగిన నితిన్ ని యంగ్ హీరోలు ఆదర్శంగా తీసుకోవాలి.

అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత నితిన్ కి అసలు ఏది కలిసిరావడం లేదు. చేసిన ప్రతీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ వచ్చాయి. ఆ కారణం చేత ఒకప్పుడు నితిన్ వరుస ఫెయిల్యూర్స్ తో ఎలాంటి దయనీయమైన స్థితికి వచ్చేసాడో , ఇప్పుడు కూడా అదే స్థాయికి పడిపోయాడు. ముఖ్యంగా తాను దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఆదుకున్న డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. అప్పటికి ఆయనకు కూడా పెద్దగా ఇండస్ట్రీ లో పేరు లేదు. అలాంటి సమయం లో ఆయన నితిన్ తో తీసిన ‘ఇష్క్’ చిత్రం కారణంగా , ఇద్దరి తలరాత మారిపోయింది. ఇప్పుడు కూడా విక్రమ్ గొప్ప స్థాయిలో అయితే లేడు , కానీ నితిన్ కంటే చాలా పెద్ద స్థాయిలోనే ఉన్నాడు. రీసెంట్ గానే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయ్యింది.

ఎట్టకేలకు నితిన్ కి చాలా కాలం తర్వాత మంచి సినిమా రాబోతుందని అంతా అనుకున్నారు , కట్ చేస్తే , నితిన్ కి ప్రస్తుతం మార్కెట్ లేకపోవడం తో, అతనితో సినిమా చేయడానికి నిర్మాతలు సుముఖంగా లేరని తెలుస్తోంది. అందుకే రీసెంట్ గా విక్రమ్ కె కుమార్ ప్రముఖ క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ని కలిసి , నితిన్ కి చెప్పిన కథని , అతనికి వివరించాడట. విజయ్ దేవరకొండ కి ఈ కథ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. వెంటనే కాల్ షీట్స్ ఇచ్చేశాడని అంటున్నారు. ఒకప్పుడు నితిన్ తో కలిసి ప్రయాణం చేసి , అతనితో మంచి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్న విక్రమ్ కె కుమార్ కి పాపం ఇలాంటి నిస్సహాయత పరిస్థితి రావడం బాధాకరం , నితిన్ కి కూడా ఇది చాలా పెద్ద అవమానమే అని చెప్పొచ్చు.

కాక్రోచ్ లను చంపేయాలి.. ఆ పార్టీపై పవన్ వీరావేశం వైరల్!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan Janata Cockroach Party: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి జాతీయస్థాయిలో సరికొత్త చర్చకు కారణం అయ్యారు. ఢిల్లీ వేదికగా జనసేన ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ సమైక్యతకు దెబ్బతీసే ఏ శక్తులను జనసేన సమర్ధించదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా జనతా కాక్రోచ్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సమాజానికి ఇలాంటివి మంచిది కాదు అంటూ.. ఈ బొద్దింకల పార్టీ విషయంలో అనుసరించాల్సిన అంశాలపై ఆయన జాతీయస్థాయిలో ఇచ్చిన పిలుపు కొత్త చర్చకు దారితీస్తోంది. ఎవరికి వారే కాక్రోచ్ పార్టీలుగా అభివర్ణిస్తూ హైజాక్ చేస్తుండడాన్ని పవన్ గుర్తుచేస్తూ.. ఇటువంటి బొద్దింకలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

* వ్యంగ్య రాజకీయ అస్త్రంగా..
ఇటీవల దేశంలో ప్రముఖ డిజిటల్, వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా పుట్టుకు వచ్చింది జనతా కాక్రోచ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ పేరును పోలి ఉండే ఈ ఉద్యమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజిత్ దీప్ కే గత నెల 16న ప్రారంభించారు. అక్కడకు ముందు రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా జనతా కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చింది. నిరుద్యోగ యువతను, సంస్థలను విమర్శించే కొందరిని ఉద్దేశించి బొద్ధింకలు, సమాజ పరాన్న జీవులు అని సంబోధించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. అందులో భాగంగా జనతా కాక్రోచ్ పార్టీ ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో మీమ్స్, ఆన్లైన్ ప్రచారంతో పాటు ఆఫ్ లైన్ లో సైతం బొద్దింకల దుస్తులు ధరించి దేశ రాజధాని జంతర్ మంతర్, తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ధర్నా చౌక్ వద్ద ప్రత్యక్ష నిరసనలు కూడా జరిగాయి. గత కొంతకాలంగా దేశంలో జనతా కాక్రోచ్ అనేది ట్రెండీగా నిలిచింది.

* తప్పు అని తేల్చి చెప్పిన పవన్..
అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో సమైక్యత భావం ఎక్కువ. దేశభద్రతకు విఘాతం కలిగేలా ఎవరు వ్యవహరించినా పవన్ కళ్యాణ్ నిలదీస్తుంటారు. ఇప్పుడు జనతా కాక్రోచ్ పార్టీ గురించి కూడా ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. సమాజానికి విఘాతం కలిగించే బొద్దింకలను, కాక్రోచ్ పార్టీని సమూలంగా నాశనం చేయాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. సమాజానికి ఇటువంటివి ఎంత మాత్రం ఉపయోగపడవని అభిప్రాయపడ్డారు. అందుకే అటువంటి వ్యవస్థకు ప్రోత్సహించాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు. జనతా కాక్రోచ్ పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న వేళ.. పవన్ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవే ఇప్పుడు వైరల్ అంశంగా మారాయి.

బెంగాల్ లో ఏపీ ఎంపీ రాజకీయ మంత్రాంగం!

CM Ramesh Bengal Political Strategy
CM Ramesh Bengal Political Strategy

CM Ramesh Bengal Political Strategy: రాజకీయ పార్టీల్లో ట్రబుల్ షూటర్స్ ఉంటారు. పార్టీ కష్టకాలంలో ఉంటే వారే అండగా నిలుస్తారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితి నైనా అనుకూలంగా మార్చే ట్రబుల్ షూటర్లు అన్ని పార్టీల్లో కనిపిస్తుంటారు. ఇప్పుడు జాతీయస్థాయిలో దూకుడుగా ఉన్న భారతీయ జనతా పార్టీకి ట్రబుల్ షూటర్ గా దొరికారు ఏపీ ఎంపీ సీఎం రమేష్. బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీలో ఓ 20 మంది ఎంపీలు ప్రత్యేక శిబిరంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. వారంతా ఇప్పుడు బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కు మద్దతు తెలిపారు. అయితే టీఎంసీ ఎంపీల తిరుగుబాటు, ప్రత్యేక శిబిరం ఆపరేషన్ వెనుక ఉన్నది సీఎం రమేష్ అని తేలిపోయింది. బెంగాల్ లో చేపట్టిన ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఢిల్లీలో అత్యంత పవర్ఫుల్ లీడర్ గా అవతరించారు సీఎం రమేష్.

* సీఎం రమేష్ కు కీలక బాధ్యతలు..
ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలో చేరారు సీఎం రమేష్. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు.. బిజెపి పరంగా ఏపీలో ఓట్లతో పాటు సీట్లు పెంచుకోవడం.. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడం వెనుక ఏపీ బలంగా నిలవడం.. ఇలా అన్ని అంశాల్లో సీఎం రమేష్ దూకుడు కలిసి వచ్చింది. దీనిని గమనించింది బిజెపి హై కమాండ్. అందుకే ఈసారి బెంగాల్ లో తృణముల్ అంతర్గత సంక్షోభాన్ని క్యాష్ చేసుకునే బాధ్యతను సీఎం రమేష్ కె అప్పగించారు. బెంగాలీ ఎంపీల అసంతృప్తిని పసిగట్టడం, వారిని ఏకతాటి పైకి తేవడం, చట్టపరమైన చిక్కులు లేకుండా త్రిపురకు చెందిన ఎన్సిపిఐ లో విలీనం చేసే లా రూట్ మ్యాప్ గీయడం వంటి వాటిలో సీఎం రమేష్ క్రియాశీలక పాత్ర పోషించారు.

* భవిష్యత్తులో మంచి ఛాన్స్..
సీఎం రమేష్ పై కేంద్ర పెద్దలకు రోజురోజుకు నమ్మకం పెరుగుతోంది. ఆయనకు ఏపీ ప్రభుత్వం నుంచి మంచి దన్ను ఉండడం కూడా కలిసి వచ్చే అంశం. బెంగాల్లో కేవలం టిఎంసి ఎంపీలను తేవడమే కాదు.. బిజెపికి మట్టి అంటకుండా.. బిజెపి పై రాజకీయ విమర్శలు రాకుండా.. టీఎంసీ సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ ను రాజకీయంగా సిద్ధం చేయడంలో కూడా సీఎం రమేష్ క్రియాశీలక పాత్ర పోషించారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఉపేందర్ యాదవ్ నివాసంలో జరిగిన చర్చల్లో కీలకంగా మారారు. రాత్రికి రాత్రి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వద్దకు 20 మంది ఎంపీలను తీసుకెళ్లి విలీన పత్రాలను సమర్పించేలా చేయడంలో సీఎం రమేష్ పాత్ర కీలకం. అయితే సీఎం రమేష్ వ్యవహారం మోడీతో పాటు అమిత్ షాకు ఎంతో నచ్చిందట. భవిష్యత్తులో సీఎం రమేష్ సేవలను మరింతగా వినియోగించుకోవాలని కేంద్ర పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

శాంతి ఒప్పందం కుదిరింది.. అమెరికాకు ఏం మిగిలింది?

US Iran Peace Agreement
US Iran Peace Agreement

US Iran Peace Agreement: అమెరికా-ఇరాన్ మధ్య వంద రోజులకుపైగా కొనసాగిన సైనిక ఘర్షణలు చివరకు దౌత్య మార్గంలో ముగిసే అవకాశం కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధి చుట్టూ ఉన్న సైనిక కదలికలు, చమురు రవాణా నౌకలపై దాడులు వంటి సంఘటనలు ప్రాంతీయ స్థిరత్వాన్ని బాగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం ఖరారు అయ్యేందుకు చర్చలు జరిగాయి.

ఒప్పందం నేపథ్యం..
ఇరాన్‌పై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం, దాని పర్యవసానంగా జరిగిన సముద్ర ఘర్షణలు యుద్ధాన్ని మరింత తీవ్రం చేశాయి. ఈ సంఘర్షణలో ముగ్గురు భారతీయ నావికులు ఒమన్ తీరం దగ్గర ఒక చమురు నౌకపై జరిగిన దాడిలో మరణించారు. దీంతో భారత్ తీవ్రంగా ప్రతిస్పందించి, అమెరికా రాయబారిని సమన్వయం చేసింది. ఈ సంఘటనల నేపథ్యంలో రెండు దేశాలు సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయడానికి అంగీకరించాయి.

ఆర్థిక నిబంధనలు, పునర్నిర్మాణం
ఒప్పందంలో ఇరాన్ ఆర్థిక పునరుద్ధరణకు సంబంధించిన అంశాలు కీలకంగా ఉన్నాయి. అమెరికా ఆంక్షలను పాక్షికంగా సడలించడం, ఇరాన్‌కు చెందిన ఫ్రోజెన్ నిధుల విడుదల, అంతర్జాతీయ సహాయం సాధ్యం చేయడం వంటి అంశాలు చర్చల్లో భాగమయ్యాయి. ఐరోపా దేశాల నేతృత్వంలో పునర్నిర్మాణ నిధులు సమకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇరాన్ వైపు ఈ ఒప్పందాన్ని తమ స్థితిని బలోపేతం చేసుకున్నట్లు చూస్తుండగా, అమెరికా వైపు సంఘర్షణ ముగింపు, ప్రాంతీయ స్థిరత్వం ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయి.

చమురు మార్కెట్లపై ప్రభావం..
హార్ముజ్ జలసంధి తిరిగి సాధారణ స్థితికి రావడంతో ప్రపంచ చమురు రవాణా సాఫీగా సాగే అవకాశం ఏర్పడింది. ఒప్పంద వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. ఇది గ్లోబల్ వాణిజ్యానికి ఊరట కలిగించింది. అయితే, ఈ సంఘర్షణ కాలంలో ధరలు ఎక్కువగా ఉండటం వల్ల అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడికి గురయ్యాయి.

రెండు వైపులా సవాళ్లు..
ఈ ఒప్పందం రెండు దేశాలకు కొన్ని రాయితీలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. అమెరికా సంఘర్షణను ముగించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించాలని కోరుకుంది. ఇరాన్ వైపు ఆంక్షల ఎత్తివేత మరియు ఆర్థిక సహాయం పొందేందుకు ప్రయత్నించింది. అయితే, అణ్వాయుధ కార్యక్రమం, లెబనాన్‌లోని సమస్యలు, అమలు యంత్రాంగం వంటి అంశాలపై తుది చర్చలు ఇంకా మిగిలి ఉన్నాయి.

భారతీయ నావికుల మృతి ఈ ఒప్పంద ప్రక్రియలో అంతర్జాతీయ ఒత్తిడిని పెంచింది. ఇది అమెరికా-భారత్ సంబంధాలను కూడా ప్రభావితం చేసింది. ఒప్పందం అమలు జరిగినా, రెండు దేశాల మధ్య నమ్మకం నిర్మాణం, ప్రాంతీయ శక్తుల సహకారం కీలకం. ఈ పరిణామం ప్రాంతీయ శాంతికి ఒక అవకాశం అయినప్పటికీ, దీర్ఘకాలిక స్థిరత్వం కోసం మరిన్ని రాజీలు పర్యవేక్షణ అవసరం.

భోగాపురం విమానాశ్రయం.. రామ్మోహన్ నాయుడు కు ఆ ఛాన్స్ లేనట్టే!

Bhogapuram International Airport
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రారంభానికి కూత వేటు దూరంలో నిలిచింది. వచ్చే నెలలో ప్రారంభోత్సవం ఉంటుందన్న టాక్ నడుస్తోంది. మరోవైపు ప్రైవేటు విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను జూలై 5 నుంచి ప్రారంభించనున్నాయి. వాటికి సంబంధించి ప్రత్యేక ప్రకటన కూడా చేశాయి. ప్రస్తుతం చూస్తుంటే మాత్రం జూలైలో విమానాశ్రయం ప్రారంభం గ్యారెంటీ అని తేలిపోయింది.

* పౌర విమానయాన శాఖ మంత్రిగా కృషి..
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా జరగడంలో.. ఉత్తరాంధ్రకు చెందిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి ఉంది. గత రెండేళ్లుగా ఆయన నిరంతరం పర్యవేక్షిస్తూ పనులను పరుగెత్తించారు. అందుకే పనులు చాలా వేగంగా కొనసాగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంతోనే చాలా వేగంగా పనులు జరిగాయి. ఇక్కడ విమాన రాకపోకలకు సంబంధించి ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. చివరిగా పెండింగ్ పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది.

* శాఖ మార్పు అనివార్యమా?
అయితే ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ సమయానికి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది. ఆయన ప్రస్తుతం పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో ఆ పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి కేంద్రంలో. రామ్మోహన్ నాయుడుకు కీలకమైన పౌర విమానయాన శాఖ దక్కింది. అయితే ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. ఆయన శాఖ మార్పు ఉంటుందన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది.

* విస్తరణకు కసరత్తు..
కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు నరేంద్ర మోడీ కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ నెల 20న ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 18 తో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అందుకే మంత్రి వర్గ విస్తరణలో కొత్తవారికి చోటుతోపాటు పాత వారి శాఖల కేటాయింపు ఉంటుందన్న టాక్ ఉంది. పౌర విమానయాన శాఖ నుంచి తప్పించి.. రామ్మోహన్ నాయుడుకు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఇస్తారని ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. అదే జరిగితే పౌర విమానయాన శాఖ మంత్రిగా భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో.. ప్రధాని తరువాత అదే స్థాయిలో గౌరవం దక్కాల్సిన రామ్మోహన్ నాయుడుకు ఆ ఛాన్స్ లేనట్టే. చూడాలి మరి ఏం జరుగుతుందో..

'అమరావతి'కి... ఆ రైతులు సైతం..!

Amaravati Capital Construction
Amaravati Capital Construction

Amaravati Capital Construction: అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భవన నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి. ఇంకోవైపు ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూముల్లో సైతం నిర్మాణాలు జోరందుకున్నాయి. అయితే మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా చాలా రకాల అడ్డంకులు ఉండేవి. ముఖ్యంగా అంతర్గత రహదారులు, ప్రధాన కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి పనులు పెండింగ్లో ఉండేవి. దానికి కారణం రైతులు భూములు ఇవ్వకపోవడమే. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు సహా 28 రాజధాని గ్రామాలకు చెందిన రైతులు భూములు ఇవ్వకపోవడంతో రోడ్డు కనెక్టివిటీ పనులు నిలిచిపోయాయి.

* జగన్మోహన్ రెడ్డిని కలిసిన రైతులు..
మొన్ననే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు పెనుమాక, ఉండవల్లి రైతులు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు తమ భూములు ఇవ్వాలని చెప్తున్నారని.. అక్కడ మార్కెట్ ధర ప్రకారం డబ్బులు చెల్లించడం లేదని వాపోయారు. అందుకే తాము భూములు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అయితే అలా చెప్పిన మరుసటి రోజు చాలామంది రైతులు తమ భూములు ఇచ్చేశారు. అయితే ఈ ప్రధాన కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి 2766 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఒకవైపు రైతులు జగన్ మోహన్ రెడ్డిని కలిసే సరికి భూముల సేకరణ కష్టమని భావించారు. కానీ ఇప్పుడు ఆ భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. వారి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. రాజధాని కోర్ ఏరియా పరిధిలో రోడ్ల నెట్వర్క్ పూర్తి కావాలంటే ఈ భూములు కీలకం కావడంతో… వీలైనంత త్వరగా భూములను సేకరించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ముమ్మర కసరత్తు ప్రారంభించారు.

* ఎట్టకేలకు భూములు అప్పగింత..
మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు సమాన ప్రాతిపదికన ప్రాధాన్యం కల్పిస్తున్నారు. కానీ పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు గ్రామాల రైతులు మాత్రం అదనంగా ఆశిస్తున్నారు. అయితే మిగతా అమరావతి రైతులకు భిన్నంగా వీరికి ప్రయోజనాలు కల్పిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని సి ఆర్ డి ఏ అధికారులు భావించారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో.. ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చే ప్రయోజనాలను, ప్లాట్ల కేటాయింపుల్లో ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను రైతులకు వివరిస్తున్నారు అధికారులు. దీనిపై రైతుల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది. ఉండవల్లితో పాటు పెనుమాక పరిధిలో రైతులు తాజాగా 30 ఎకరాల భూమిని అప్పగించారు. ఈ 30 ఎకరాల అప్పగింతతో సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు పలు ప్రధాన అంతర్గత లింకు రోడ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగినట్టే.

యుద్ధం జరిగితే భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే.. ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన కామెంట్స్

RSS Chief Mohan Bhagwat
RSS Chief Mohan Bhagwat

RSS Chief Mohan Bhagwat: భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురంలో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది కార్యక్రమంలో మాట్లాడుతూ పాకిస్తాన్ తో చర్చలు జరపాలనే దత్తాత్రేయ హోసబాలే వ్యాఖ్యలను సమర్థించారు. ఆ వ్యాఖ్యలు పొరుగు దేశం ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని చేసినవని ఆయన వివరించారు.

కేంద్ర విదేశాంగ విధానానికి మద్దతు..
భారత్ పాకిస్థాన్ సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఆర్ఎస్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని భగవత్ స్పష్టం చేశారు. సంస్థకు ప్రత్యేకంగా విదేశాంగ విధానం ఏదీ లేదని, ప్రభుత్వ విధానానికే కట్టుబడి ఉంటామని తెలిపారు.

హోసబాలే ఏమన్నారు?
హోసబాలే ఇటీవలి ఇంటర్వ్యూలో జాతీయ భద్రతను ముందుంచుకుని పొరుగు దేశంతో చర్చలు కొనసాగించాలని సూచించారు. ఈ అభిప్రాయాన్ని భగవత్ ఇప్పుడు సమర్థించడం రాజకీయ వర్గాల్లో చర్చను రేకెత్తించింది.

పాకిస్తాన్ ప్రజలపై దృష్టి..
పాకిస్తాన్ లో చాలామంది దేశ విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని భగవత్ పేర్కొన్నారు. అక్కడి కొంతమంది జర్నలిస్టులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను ప్రశంసిస్తున్నారని కూడా ఆయన గమనించారు.

యుద్ధం జరిగితే..
ఏదైనా భవిష్యత్తు సంఘర్షణలో భారత్ నిర్ణయాత్మక విజయం సాధిస్తే, పాకిస్తాన్ ప్రజలు భారత్‌లో విలీనం కావడం లేదా సురక్షితంగా, శాంతియుతంగా జీవించేలా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ ఆర్ఎస్ఎస్‌పై తప్పుడు అవగాహనలు ఎక్కువగా ఉన్నాయని భగవత్ అన్నారు. హిట్లర్ వంటి విధానాలు తమ సంస్థకు సంబంధం లేవని, అన్యాయం, క్రూరత్వాన్ని అరికట్టి మంచిని కాపాడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

ఉద్రిక్తతల నేపథ్యం
2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిస్పందనగా భారత్ మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ నిర్వహించి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు.. ఈసారి సరికొత్త కోణంలో..!

Gnaneswari Missing Case
Gnaneswari Missing Case

Gnaneswari Missing Case: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడడం లేదు. ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. వందలాదిమంది పోలీసులు జల్లెడ పడుతున్నారు. కానీ కనీసం క్లూ కూడా దొరకడం లేదు. కిడ్నాప్ కోణంలో దర్యాప్తు జరుగుతూ వస్తోంది. మరోవైపు చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన కుక్క రావడం.. దానికి జిపిఆర్ఎస్ అనుసంధానం చేసి అడవుల్లోకి వదలడం.. తిరిగి ఆ కుక్క ఇంటికి చేరి క్రమంలో తీవ్ర అలసటకు గురై చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. దాదాపు 8 రోజులు దాటుతోంది జ్ఞానేశ్వరి అదృశ్యమై. వందలాది మంది పోలీసులు అదే పనిగా వెతుకులాట చేస్తున్నారు. రకరకాల అనుమానాలు, భిన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ముమ్మర దర్యాప్తు చేపట్టాలని కాకినాడ ఎస్పీని ఫోన్లో ఆదేశించారు.

* మూఢనమ్మకాలపై అనుమానాలు.. అయితే పాప కోసం వెతుకులాట జరుగుతున్నా ఆచూకీ లేకపోవడంతో.. అనుమానాలు, అమావాస్య మూఢ నమ్మకాల కోణాలపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. పాపా దృశ్యం వెనుక క్షుద్ర పూజలు, అమావాస్య లేదా ఇతర మూఢ నమ్మకాల ప్రభావం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొంతమంది జ్యోతిష్యులు, ఆస్ట్రాలజిస్టులు బాధిత కుటుంబాన్ని ఆశ్రయించారు. చిన్నారి ధరించిన వెండి వస్తువుల ద్వారా జ్ఞానేశ్వరి ఆచూకీ కనుగొనవచ్చు అని చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

* ప్రముఖుల పరామర్శ..
చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబానికి అందరి నుంచి మద్దతు లభిస్తోంది. వీలైనంత త్వరగా ఆ చిన్నారి ఆచూకీ దొరకాలని ప్రతి ఒక్కరూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించారు. నేరుగా కాకినాడ ఎస్పీకి ఫోన్ చేసి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 400 మంది పోలీసులు జల్లెడ పడుతున్నారని ఎస్పీ పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఎస్ టిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని పవన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు బాధిత కుటుంబాన్ని నటి కరాటే కళ్యాణి పరామర్శించారు. కేసు వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ప్రజలు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. తల్లిదండ్రులకు ధైర్యం చెబుతున్నారు.

ఎంత చెప్పినా వినకుండా.. అర్థరాత్రి ఆ పని చేసిన ఎమ్మెల్యే

TDP MLA Midnight Controversy
TDP MLA Midnight Controversy

TDP MLA Midnight Controversy: తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెరుగుతోంది. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేస్తున్నా కొందరు ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు రావడం లేదు. పార్టీతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వారు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారింది. అర్ధరాత్రి పూట ఆ ఎమ్మెల్యే చేసిన హల్చల్ అంతా కాదు. స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. చివరకు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు సముదాయించడంతో చల్లబడ్డారు.

* వివాదాస్పద ముద్ర
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పై వివాదాస్పద ముద్ర ఉంది. గతంలో ఓ మహిళ అధికారిపై ఆయన చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఎమ్మెల్యే ఈసారి సొంత పార్టీ నేతపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆదివారం రాత్రి తన అనుచరులతో సొంత పార్టీ కి చెందిన ఓ లాయర్ ఇంటిపై దూసుకు వెళ్లారు. అక్కడ నానా బీభత్సం సృష్టించారు. ఇంట్లో మహిళలు, పిల్లలు నిద్రిస్తున్న సమయంలో భారీ అనుచరులతో తన సొంత పార్టీ నేత ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. చంపేస్తా అంటూ బహిరంగంగానే హెచ్చరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. పరిస్థితి చేయి దాటుతుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎమ్మెల్యేను సముదాయించే ప్రయత్నం చేశారు.

* ఘటనా స్థలానికి ఎమ్మెల్యే కుమార్తె..
మరోవైపు ఎమ్మెల్యేను శాంతి పరిచేందుకు కుటుంబ సభ్యులు నేరుగా రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే కుమార్తె ఘటనా స్థలానికి చేరుకున్నారు. వద్దు నాన్న ప్లీజ్.. వెళ్లిపోదాం అంటూ కుమార్తె రిక్వెస్ట్ చేశారు. నన్ను ఆపుతావు ఏంటి అని ప్రశ్నించారు. పక్కనే ఉన్న డీఎస్పీతో సైతం వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పినట్లు అయింది. గతంలో కూడా ఈ ఎమ్మెల్యే పై వివాదాలు రావడంతో అధినేత చంద్రబాబు గట్టి హెచ్చరికలే పంపారు. ఒకటి రెండుసార్లు గట్టిగానే సముదాయించారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో చూడాలి.

ఎన్టీఆర్ చెప్పిన మాట వినకుండా యాక్సిడెంట్ కి గురైన స్టార్ కమెడియన్..ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే..

Chitram Srinu Accident Story
Chitram Srinu Accident Story

Chitram Srinu Accident Story: ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా గడిపిన వారిలో ఒకరు ‘చిత్రం’ శ్రీను. చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ కమెడియన్ , ఆ తర్వాత ఆనందం , ఆది , నువ్వు లేక నేను లేను , సొంతం , నీ స్నేహం, మల్లీశ్వరి , వెంకీ, బన్నీ, బొమ్మరిల్లు , ఢీ , దుబాయ్ శీను, కృష్ణ , పరుగు , 100 % లవ్, మనం , దృశ్యం , రాజా ది గ్రేట్ , గీత గోవిందం ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించి , తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈయన కామెడీ టైమింగ్ కి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , ఈమధ్య ఈయనకు ఒకప్పుడు ఉన్నటువంటి డిమాండ్ లేదు.

సినిమాలు అడపాదడపా చేస్తున్నాడు కానీ , ఈయన క్యారెక్టర్స్ ఎలివేట్ అవ్వడం లేదు. మధ్యలో ఈటీవీ లోకి ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు , కానీ ఆదరణ దక్కలేదు. అయితే రీసెంట్ గా ఈయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అవేంటో ఒకసారి ఇందులో చూద్దాం. ఆయన్ని యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ కెరీర్ ప్రారంభం లో ఒక ప్రమాదం జరిగింది. అప్పుడు ఒక స్టార్ హీరో మీ ఇంటికి వచ్చి , ఒక బ్లాంక్ చెక్ మీ చేతికి ఇచ్చి ఎంత కావాలో రాసుకోమన్నాడు అట , దాని సంగతి మాతో పంచుకోండి’ అని అడగ్గా , చిత్రం శ్రీను ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘జూనియర్ ఎన్టీఆర్ గారి మొదటి చిత్రం నిన్ను చూడాలని లో నేను నటించాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గారు నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఇప్పటికీ నాతో ఆయన అలాగే ఉంటారు. ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం నాకు ‘నువ్వు నేను’ మూవీ డేట్ ఉంది. ఇది నేను ఎన్టీఆర్ చెప్పాను. ఎక్కడికి వెళ్తావు నువ్వు , ఇక్కడే కూర్చో అన్నాడు. లేదు , డేట్ ఇచ్చాను , అది కూడా చాలా పెద్ద సినిమా అని చెప్పి బయలుదేరాను, మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ షాక్ కి గురయ్యాడట. ఉదయం వరకు నాతో ఎంతో సరదాగా మాట్లాడిన వ్యక్తికి ఇలా అయ్యిందే అని బాధపడ్డాడట. వెంటనే హాస్పిటల్ కి రెండు కొబ్బరి బోండాలను తీసుకొని నా వద్దకు వచ్చాడు. ఒక బ్లాంక్ చెక్ చేతిలో పెట్టి, నీ పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు, ఎంత కావాలో ఈ చెక్కులో రాసుకొని తీసుకో అన్నాడు. వద్దని ఎంత చెప్పినా ఆయన వినలేదు. ఆరోజు నా మీద ఎన్టీఆర్ చూపించిన ప్రేమ, కేరింగ్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చాడు చిత్రం శ్రీను.

82 ఏళ్ళ వయస్సులో సంచలన రికార్డుని నమోదు చేసిన అమితాబ్ బచ్చన్.. కుర్రోళ్లకు కూడా అసాధ్యం ఇది..

Amitabh Bachchan 82 Age Record
Amitabh Bachchan 82 Age Record

Amitabh Bachchan 82 Age Record: అమితాబ్ బచ్చన్ గురించి కొత్తగా ఏమి చెప్తాము చెప్పండి, ఆయన లాంటి లెజెండ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో చాలా అరుదుగా ఉంటారు అని మాత్రమే చెప్పగలం. అంతకు మించిన మాటలు ఆయన స్థాయిని వర్ణించడానికి మన వద్ద లేవు. 80 ఏళ్ళ వయస్సులో ఆయన ‘కల్కి 2898 AD ‘ లో చూపించిన నట విశ్వరూపాన్ని చూసి నేటి తరం జెన్ జీ ఆడియన్స్ కూడా షాక్ కి గురయ్యారు. ఆరోజుల్లో జనాలు ఎందుకు అమితాబ్ బచ్చన్ సినిమాలకు వెర్రిక్కిపోయేవారో , అమితాబ్ ని మించిన బిగ్గెస్ట్ మాస్ సూపర్ స్టార్ ఇండియా లో ఎవ్వరు లేరని ఎందుకు అనేవారో , కల్కి చిత్రాన్ని చూసిన నేటి తరం ఆడియన్స్ మొత్తానికి అర్థం అయ్యింది. ఆ వయస్సులో ఆయన చేసిన ఫైట్స్ , స్క్రీన్ ప్రెజెన్స్ గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు.

ఇకపోతే ప్రస్తుతం ఆయన వయస్సు 82 ఏళ్ళు. ఈ వయస్సులో ఆయన మరో సంచలన రికార్డుని నమోదు చేశాడు. కేవలం ఒక్క రోజులో 12 షార్ట్ ఫిలిమ్స్ ని లో నటించి, మధ్యలో రెండు స్టిల్ షూట్స్ కూడా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘పని అంటే పనే, అందులో వయస్సుతో సంబంధమే లేదు , అసలు రాజీ పడకూడదు. నేడు నేను 12 షార్ట్ ఫిలిమ్స్ షూటింగ్స్ తో పాటు , రెండు ప్రత్యేక స్టిల్ షూట్స్ లో పాల్గొన్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా సరే , సమాజం తో నన్ను కనెక్ట్ చేసిన ఈ సినిమా కోసం నిరంతరం పని చేస్తూనే ఉండాలి అనేది నా కోరిక. అందులో ఎలాంటి ఆలస్యం లేదు. మిగతావన్నీ జీవితం లో అలా సాగిపోతూనే ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు అమితాబ్ బచ్చన్.

ఆయన మాట్లాడిన ఈ మాటలు నేటి తరం యువతకు ఎంతో ఆదర్శప్రాయం. నేటి తరం యువత 8 గంటలు పని చెయ్యడానికి నీరసించి పోతుంటారు. మన శరీరం అంతకు మించి పని చేయడానికి అసలు సహకరించదు. మనకే ఇలా ఉంటే , 82 ఏళ్ళ వయస్సు ఉన్నవాళ్లకు ఎలా ఉంటుంది చెప్పండి?, కానీ అమితాబ్ బచ్చన్ ఆ వయస్సు లో కూడా ఈ రేంజ్ లో కష్టపడి పని చేస్తున్నాడంటే , ఆయన తన పనిని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం అవుతోంది. ఒక మనిషి ఇందులో అయినా సక్సెస్ అవ్వాలంటే ముందు తానూ చేసిన పనిని ప్రేమించాలి. అప్పుడు సహజంగానే అన్ని జరిగిపోతాయి అనడానికి అమితాబ్ బచ్చన్ ఒక ఉదాహరణ. ఏ రంగం లో ఉన్న వారైనా ఇది గుర్తు పెట్టుకోవాలి.

'బ్లడీ రోమియో' చిత్రం శాశ్వతంగా ఆగిపోయినట్టేనా.. ? 'ప్యారడైజ్' కోసం నాని త్యాగం..

Bloody Romeo
Bloody Romeo

Nani Bloody Romeo Movie Update: నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఒప్పుకొని , తన కెరీర్ లోనే పెద్ద తప్పు చేశాడా?, ఈ సినిమా ఆయన సమయాన్ని చాలా వరకు వృధా చేస్తుందా ? అనే అనుమానాలు నాని అభిమానుల్లో , మూవీ లవర్స్ లో కలుగుతున్నాయి. నాని సినీ కెరీర్ ని ‘దసరా’ కి ముందు , ఆ తర్వాతగా డివైడ్ చేయొచ్చు. అప్పటి వరకు మామూలు జానర్ సినిమాలు చేస్తూ వచ్చిన నాని , ఈ సినిమా తో వేరే లెవెల్ కి వెళ్లే ప్రయత్నం చేసాడు. అనుకున్నట్టుగానే ఆ సినిమా సక్సెస్ అయ్యింది , ఆ తర్వాత నాని చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ‘దసరా’ తో తన స్థాయిని పెంచిన డైరెక్టర్ కావడం తో శ్రీకాంత్ ఓదెల ని బలంగా నమ్మాడు నాని.

అలా నమ్మి ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతలా కష్టపడ్డాడో , ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతి ఇవ్వడానికి ఆయన ఏమేమి చేస్తున్నాడో మన కళ్ళకు కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ‘ఆయా షేర్’ సాంగ్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసి , తన టాలెంట్, కసి ఈ సినిమా కోసం ఎలా ఖర్చు చేస్తున్నాడో అందరికీ అర్థం అయ్యింది. ఈ సినిమా కథ పై చాలా బలమైన నమ్మకం పెట్టుకోవడం వల్లే, సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆడియన్స్ లో ఈ చిత్రం పై కావాల్సినంత హైప్ , క్రేజ్ ఉంది. కానీ వరుస వాయిదాలు కారణంగా ఈ చిత్రం పై హైప్ డైల్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో , ఆగస్టు 21 కి వాయిదా వేశారు.

ఇప్పుడు ఆ తేదీ నుండి కూడా ఈ సినిమా వాయిదా పడింది , షూటింగ్ పూర్తి అవ్వడానికి మరో 60 రోజుల సమయం ఉంది. మరో పక్క ‘ఓజీ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తీసి , యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుజిత్ , నాని కోసం ‘బ్లడీ రోమియో’ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని రెడీ గా ఉన్నాడు. కానీ నాని మాత్రం అందుబాటులో లేడు . రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లొకేషన్స్ ని రెక్కీ చేయడం కోసం లండన్ కి కూడా వెళ్ళాడు సుజిత్. అయితే ఇంతలోపే పవన్ కళ్యాణ్ నుండి సుజిత్ కి ఫోన్ వచ్చింది. ‘ఓజీ 2’ కోసం డేట్స్ అడిగావు కదా, నేను ఈ ఏడాది లోనే డేట్స్ ఇవ్వడానికి సిద్ధం , ఇండియా కి వచ్చినప్పుడు కలవు అని అన్నాడట. ఇప్పుడు సుజిత్ తన ద్రుష్టి మొత్తాన్ని ‘ఓజీ 2’ కి షిఫ్ట్ చేశాడు. దీంతో ‘బ్లడీ రోమియో’ పరిస్థితి ఏంటి?, పూర్తిగా ఆగిపోయినట్టేనా?, ‘ది ప్యారడైజ్’ కోసం నాని ఈ చిత్రాన్ని త్యాగం చేశాడా ?, ఆ త్యాగానికి తగ్గ ఫలితం ‘ప్యారడైజ్’ ఇస్తుందో లేదో చూడాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఉండవల్లిని సైతం లాగేసుకున్న వైసిపి.. ఆడియో వైరల్!

Undavalli Arun Kumar Audio Viral
Undavalli Arun Kumar Audio Viral

Undavalli Arun Kumar Audio Viral: రాజకీయాలు విడిచిపెట్టి విశ్లేషకుడి అవతారం ఎత్తారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. సమకాలీన అంశాలపై విశ్లేషణలు చేస్తుంటారు ఉండవల్లి అరుణ్ కుమార్. నెలకు,, 15 రోజులకు, ఏదైనా ఘటన జరిగినప్పుడు మీడియా ముందుకు వచ్చి విశ్లేషిస్తుంటారు రాజకీయాంశాలపై. అది కూడా ఎక్కువగా రాజమండ్రిలో తన స్వస్థలంలో మీడియాను పిలిచి ఎక్కువగా మాట్లాడుతుంటారు. రాజకీయాల పట్ల లోతైన అవగాహన ఉండడంతో మీడియా సైతం ఆయనకు ప్రాధాన్యమిస్తూ వస్తోంది. అయితే ఆయన మాటల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఫేవర్, ఫ్లేవర్ రెండు కనిపిస్తుంటాయి. చంద్రబాబు నాయకత్వాన్ని పొగుడుతూనే ఆయనలో ఉన్న మైనస్లను ఎత్తిచూపుతుంటారు. జగన్ విషయంలో మాత్రం పరోక్షంగా అభిమానం చూపుతారన్న విమర్శ ఉండవల్లి అరుణ్ కుమార్ లో ఉంది. అయితే ఇప్పుడు అదే విషయాన్ని ఇద్దరు వైసిపి నేతలు మాట్లాడుకోవడానికి సంబంధించిన ఆడియో ఫోన్ కాల్ లీక్ అయ్యింది.

* అనుకూల విశ్లేషణలు..
ప్రస్తుతం రాజకీయ పార్టీలు పెంచి పోషించే డిజిటల్ మీడియా వచ్చేసింది. యూట్యూబ్ ఛానల్స్ తో పాటు అనేక రకాల వెబ్ సైట్లు వచ్చాయి. ఈ క్రమంలో విశ్లేషకుల ముసుగులో చాలామంది పార్టీలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. అయితే వైసీపీకి చెందిన మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో.. మరో నేత ఫోన్ లో మాట్లాడుతూ.. ఉండవల్లి అరుణ్ కుమార్ వాయిస్ మరింత పెంచాలని.. అప్పుడే పార్టీకి బాగుంటుందన్న అభిప్రాయాన్ని వేణుగోపాలకృష్ణతో మరో నేత ఫోన్ లో చెప్పుకొచ్చారు. ఆయన వాయిస్ పెంచుతారు అంటూ ఉండవల్లి గురించి వేణుగోపాలకృష్ణ అవతలి నేతకు సముదాయించే ప్రయత్నం చేశారు. ఆ ఆడియో సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ ను సైతం వైసిపి పేటీఎం బ్యాచ్ వదలదా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో..
ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించిన నేత. 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన దృష్టిలో పడ్డారు ఉండవల్లి అరుణ్ కుమార్. అలా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు 2004లో రాజమండ్రి ఎంపీగా సీటు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో గెలిచిన ఉండవల్లి అరుణ్ కుమార్ పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2009లో రెండోసారి గెలిచారు. కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో పార్టీ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డిని నియంత్రించే ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ కాలేదు. 2014లో రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా విశ్లేషణలు చేశారన్న విమర్శ ఉండవల్లి పై ఉంది. 2019 నుంచి 2024 మధ్య జగన్ సర్కార్ పై విమర్శలు చేసే క్రమంలో.. చంద్రబాబు మాదిరిగా స్ట్రాంగ్ డోస్ ఉండేది కాదు అని టిడిపి వర్గాలు ఉండవల్లి పై ఆగ్రహంగా ఉండేవి. ఇప్పుడు సైతం సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషిస్తున్నారు ఉండవల్లి. ఈ క్రమంలో టిడిపి కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ డోస్ పెంచాలని ఓ నేత వైసిపి మాజీమంత్రి ని కోరడం తో.. ఉండవల్లి అరుణ్ కుమార్ పై రకరకాల చర్చ నడుస్తోంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియాలి.

ఆ క్రీడలో మునిగిపోయిన గుడివాడ అమర్నాథ్!

Gudivada Amarnath
Gudivada Amarnath

Gudivada Amarnath: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది దూకుడు కలిగిన నేతలు ఉన్నారు. అటువంటి వారిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకరు. తొలిసారిగా ఎమ్మెల్యే అయినా ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. మధ్య మధ్యలో ఆయన మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన విపరీతంగా ట్రోల్స్ కు గురవుతుంటారు. అందుకే ఆయనను హై కమాండ్ నియంత్రించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మునుపటిలా గుడివాడ అమర్నాథ్ పెద్దగా బయటకు కనిపించడం లేదు. ఆయన ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొన్ననే అధినేత విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు పరామర్శించారు. ఆ సమయంలో మాత్రం ఆయన జగన్ వెంట కనిపించారు. కానీ విశాఖ రాజకీయాల్లో ఆయన పెద్దగా బయటకు రావడం లేదు ఇప్పుడు. అయితే ఆయన ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ఉత్పన్నం కాగా.. ఓ క్రీడలో మునిగిపోయారని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపైనే ప్రచారం జరుగుతోంది.

* రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం..
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు గుడివాడ అమర్నాథ్. ఆయన తాత గుడివాడ అమ్మన్న, తండ్రి గుర్నాథరావు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. కీలక పదవులు చేపట్టారు. విశాఖ ప్రాంతంలో తమకంటూ రాజకీయాలు చేశారు. అనుకోని పరిస్థితుల్లో గుడివాడ అమర్నాథ్ తెలుగుదేశం పార్టీలో సేవలు అందించారు. ఆ పార్టీ నుంచి కార్పొరేటర్ గా.. తెలుగుదేశం పార్టీ పక్ష నాయకుడిగా ఉండేవారు. వైసిపి ఆవిర్భావం నుంచి మాత్రం ఆ పార్టీలో పని చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అదే అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

* గోల్ఫ్ ఆడుతూ..
తరచూ మీడియాతో మాట్లాడుతూ అడ్డంగా బుక్ అవుతుంటారు గుడివాడ అమర్నాథ్. యూట్యూబ్ ఛానల్స్ తో సైతం ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఆ సమయంలో గుడివాడ అమర్నాథ్ నోటి నుంచి వచ్చే మాటలు టోల్స్ గురవుతుంటాయి. రాష్ట్రానికి పరిశ్రమలు ఎందుకు రాలేదు అని అన్నందుకు కోడి ముందా గుడ్డు ముందా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గుడ్డు మంత్రిగా ముద్రవేశాయి. దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఎందుకు వెళ్ళలేదు అని మంత్రి హోదాలో ఉన్న అమర్నాథ్ ను ప్రశ్నిస్తే అక్కడ చలి ఉంటుందని చెప్పి సోషల్ మీడియాకు గొప్ప అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు మంత్రిగా ఓడిపోవడంతో… పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ఆడే గోల్ఫ్ లో బిజీగా ఉన్నారు. ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడిగా కనిపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది.