Homeక్రీడలుక్రికెట్‌IND vs PAK: దీప్తి శర్మ అదరగొడితే.. మన తెలుగు అమ్మాయి పాకిస్తాన్ ను తగలబెట్టింది..

IND vs PAK: దీప్తి శర్మ అదరగొడితే.. మన తెలుగు అమ్మాయి పాకిస్తాన్ ను తగలబెట్టింది..

IND vs PAK: అసలే ప్రత్యర్థి పాకిస్తాన్. హై టెన్షన్ మ్యాచ్. ఇండియా గెలుపు మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. కాకపోతే పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు. దీంతో ఒక రకంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు ప్రారంభంలోనే టీమ్ ఇండియా రెండు వికెట్ల కోల్పోయింది. స్మృతి, కౌర్ నిలబడకపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది.. అప్పటికి టీమ్ ఇండియా 170 పరుగులు చేసింది.

పాకిస్తాన్ ఈ పరుగులను సాధించడానికి తన ఇన్నింగ్స్ ను బలంగా మొదలుపెట్టింది. ఓవర్ కు 8 పరుగులకు పైగా చొప్పున తీయడం ప్రారంభించింది. దీంతో పాకిస్తాన్ గెలుపు సాధ్యమని అనుకున్నారు. మరోవైపు మునిబా అదరగొట్టే స్థాయిలో బ్యాటింగ్ చేస్తోంది. అరుంధతి రెడ్డి ధారాళంగా పరుగులు ఇస్తోంది.. క్రాంతి గౌడ్ కూడా ఒక్క ఓవర్ లోనే 14 పరుగులు ఇచ్చింది. అప్పటికి టీమ్ ఇండియా మీద ఒత్తిడి పెరిగిపోతోంది. రెండు వికెట్లు పడిపోయినప్పటికీ పాకిస్తాన్ ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ దశలో కౌర్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ధైర్యం చేసింది దీప్తికి బంతి ఇచ్చింది.. ఇక అప్పుడు మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది.

కెప్టెన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని దీప్తి ఏమాత్రం వమ్ము చేసుకోలేదు. తొలి ఓవర్ లో ఒక వికెట్.. రెండవ ఓవర్ లో మరొక వికెట్.. చివరి నాలుగో ఓవర్ లో మూడు వికెట్లు సాధించి మొత్తంగా 5 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా తనను లేడీ బుమ్రా అని ఎందుకు పిలుస్తారో మరోసారి దీప్తి నిరూపించుకుంది.

దీప్తి ఐదు వికెట్లు పడగొట్టి అదరగొడితే.. మన తెలుగు అమ్మాయి శ్రీ చరణి సత్తా చూపించింది. అత్యంత కట్టుదిట్టంగా బంతులు వేస్తూ అదరగొట్టింది.. ఏకంగా మూడు వికెట్లను దక్కించుకుంది. దీప్తి శర్మ పాకిస్తాన్ పతనాన్ని ప్రారంభిస్తే.. శ్రీ చరణి పాకిస్తాన్ మొత్తాన్ని తగలబెట్టేసింది.. ఉక్కిరి బిక్కిరి చేసే బంతులతో పాకిస్తాన్ ప్లేయర్లకు కనీసం పరుగులు తీసే అవకాశం కూడా ఇవ్వలేదు. వెంట వెంటనే వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచింది. ఒక ఎండ్ నుంచి దీప్తి.. మరో ఎండ్ నుంచి శ్రీ చరణి దాడి చేయడంతో పాకిస్తాన్ కు ఏ మాత్రం కోలుకునే అవకాశం లేకుండా పోయింది.

ఆ మధ్య టీం ఇండియా టి20 వరల్డ్ కప్ సాధించినప్పుడు.. శ్రీ చరణి సత్తా చూపించింది. తన బౌలింగ్ వైవిధ్యంతో అదరగొట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఏపీ ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి అందించింది. ఉద్యోగంతో పాటు.. ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేసింది. నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆమెను ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించారు. నాటి కార్యక్రమంలో మిథాలీ రాజ్ కూడా ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper