Home Blog Page 121

తినడానికి తిండి లేదు కానీ పాకిస్తాన్ ఆర్మీకి సంపెంగ నూనే.. మీరు మారరు బై

Pakistan defence budget 2026
Pakistan defence budget 2026

Pakistan defence budget 2026: పాకిస్తాన్‌ ఇటీవల తన రక్షణ బడ్జెట్‌ను 18 శాతం పెంచింది. ఇది బాహ్య బెదిరింపుల కారణంగా కాదు, అంతర్గత సంక్షోభాలు తీవ్రంగా ఉన్నప్పటికీ సైనిక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది. మరోవైపు భారత్‌ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తూ, అధునాతన క్షిపణి, వాయు రక్షణ వ్యవస్థలను సిద్ధం చేస్తోంది. ఈ పరిణామాలు దక్షిణాసియా భద్రతా సమతులనంపై ప్రభావం చూపనున్నాయి.

పాకిస్తాన్‌ బడ్జెట్‌ పెంపు నేపథ్యం..
పాకిస్తాన్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి, ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్‌ రక్షణ బడ్జెట్‌ 18 శాతం పెంచడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. బలూచిస్తాన్‌లో తిరుగుబాటు కార్యకలాపాలు, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ అంతర్గత సంక్షోభాలను అదుపు చేయడానికి సైన్యం బలం అవసరమని పాక్‌ సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా, భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉంటాయనే ఆలోచన కూడా ఒక కారణం.

అంతర్గత సంక్షోభం..
పాకిస్తాన్‌లో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో రక్షణ బడ్జెట్‌ పెంచడం అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాల నుంచి నిధులు మళ్లించడమే. బలూచిస్తాన్, పీవోకేలోని అశాంతి సైన్యం వనరులను ఎక్కువగా వినియోగించేలా చేస్తోంది. ఇది దీర్ఘకాలంలో పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనం చేసే ప్రమాదం ఉంది. సైన్యం బలంగా ఉండాలని కోరుకునే వర్గాలు ఈ నిర్ణయాన్ని సమర్థించవచ్చు, కానీ దేశ సమగ్ర అభివృద్ధికి ఇది సరైన మార్గం కాదు.

భారత్‌ సైనిక సన్నాహాలు..
భారత్‌ మరోవైపు తన రక్షణ సామర్థ్యాలను ఆధునీకరించడంలో నిమగ్నమైంది. మల్టీ లేయర్‌ బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థల పరీక్షలు, ఎస్‌–400, ఎస్‌–500 వాయు రక్షణ వ్యవస్థల సంసిద్ధత, ఐరన్‌ డోమ్‌ తరహా స్వదేశీ వ్యవస్థ అభివృద్ధి ఇవన్నీ దేశ రక్షణ వ్యూహంలో భాగం. భారత్‌ యొక్క రక్షణ బడ్జెట్‌ సుమారు 95 బిలియన్‌ డాలర్లు (జీడిపీలో సుమారు 2 శాతం). ఇది పాకిస్తాన్‌తో పోలిస్తే చాలా ఎక్కువ. భారత్‌ ఆర్థికంగా బలంగా ఉండటం వల్ల ఈ వ్యయం సుస్థిరంగా ఉంటుంది.

బడ్జెట్‌ పోలిక..
పాకిస్తాన్‌ పెంచిన డిఫెన్స్‌ బడ్జెట్‌ మొత్తం జాతీయ బడ్జెట్‌ను మించిపోయే స్థాయిలో ఉంది. యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్‌ భారత్‌ను ఎదుర్కోలేదని ఇరు దేశాల సైనిక విశ్లేషకులకు తెలుసు. అయినప్పటికీ పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలు చేపడుతూ ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇది బహుశా అంతర్గతంగా సైన్యం ప్రభావాన్ని కాపాడుకోవడానికి, లేదా చైనా వంటి ఇతర దేశాల మద్దతును ఆశించడానికి కావచ్చు.

ప్రాంతీయ భద్రతపై ప్రభావం..
ఈ పరిణామాలు దక్షిణాసియా శాంతికి మంచివి కావు. పాకిస్తాన్‌ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోకుండా సైనిక వ్యయం పెంచడం వల్ల ఆ దేశం మరింత అస్థిరతకు లోనవుతుంది. భారత్‌ మాత్రం రక్షణ సన్నాహాలతో పాటు ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. రెండు దేశాల మధ్య సంఘర్షణ జరిగితే ఇరు దేశాల ప్రజలే ఎక్కువగా నష్టపోతారు.

పాకిస్తాన్‌ డిఫెన్స్‌ బడ్జెట్‌ పెంపు అనేది శక్తి ప్రదర్శన కాదు, బలహీనతను కప్పిపుచ్చే ప్రయత్నం. అంతర్గత సంక్షోభాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సైనిక వ్యయం పెంచడం దీర్ఘకాలంలో ఆ దేశానికి మంచిది కాదు. భారత్‌ మాత్రం తన రక్షణ సామర్థ్యాలను బలపరచుకుంటూ, శాంతియుతంగా అభివృద్ధి చేసుకోవడమే సరైన విధానం. ప్రాంతీయ శాంతి కోసం ఇరు దేశాలు సంవాదం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది.

'రణబాలి' మూవీ బడ్జెట్ పెరుగుతుందా..? ఇంతకీ విజయ్ మార్కెట్ ఎంత..?

Ranabaali movie budget
Ranabaali movie budget

Ranabaali movie budget: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంది. మన స్టార్ డైరెక్టర్ సైతం ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో కాన్సెప్ట్ లను రాసుకొని సినిమాలను చేస్తూ విజువల్ వండర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్లకి బ్రేకులు వేస్తూ మన వాళ్ళు చేసే సినిమాలు యావత్ ఇండియన్ సినిమా స్థాయిని సైతం శాసించే విధంగా ఉండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక విజయ్ దేవరకొండ సైతం కెరియర్ మొదట్లో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి వరుస సక్సెస్ లను సాధించాడు.

ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ లను సాధించకపోవడంతో ఆయన మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. దాంతో ఎలాగైనా సరే రాబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకొని టాప్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే రణబాలి, రౌడీ జనార్ధన్ లాంటి సినిమాతో మరోసారి భారీ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాని సెప్టెంబర్ 11వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేశారు బాగానే ఉంది. కానీ ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. విజయ్ దేవరకొండ ను టైర్ వన్ హీరోగా మారుస్తుందా? లేదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతుందట.

నిజానికి విజయ్ దేవరకొండ సినీ సక్సెస్ అయితే 100 కోట్లకు పైన కలెక్షన్స్ వస్తాయి. మరి అలాంటిది ఈ సినిమా మీద దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ నైతే కేటాయిస్తున్నారు. ఒకవేళ ప్లాప్ టాక్ తెచ్చుకుంటే మాత్రం భారీగా నష్టాలను చవిచూసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక మందాన కలిసి నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం…

వివాదాలకు దారి తీస్తున్న యాంకర్ విష్ణు ప్రియా 'బాడీ కౌంట్' కామెంట్స్.. వీడియో వైరల్..

Vishnu Priya body count comments
Vishnu Priya body count comments

Vishnu Priya body count comments: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు విష్ణు ప్రియా. టీవీ షోస్ లో యాంకర్ గా , నటిగా ఈమె అందరికీ సుపరిచితురాలే. ‘బిగ్ బాస్ 8’ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి , ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యింది. ఇక సోషల్ మీడియా లో ఈమె రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తనకు సంబంధించిన హాట్ వీడియోలు , ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె ప్రత్యేకంగా సస్క్రైబ్ అనే ఆప్షన్ ని పెట్టుకొని , దాదాపుగా 6 వేలమంది సస్క్రైబర్స్ ని సొంతం చేసుకుంది. వాళ్ళ కోసం ఈమె సెమీ న్యూడ్ ఫోటోలు , వీడియోలు అప్లోడ్ చేస్తూ , నెలకు లక్షల్లో సంపాదిస్తూ ఇండస్ట్రీ లోనే హాట్ టాపిక్ గా మారిపోయింది విష్ణుప్రియ. ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది.

తన సస్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా నిన్న ఈమె ఒక లైవ్ చాట్ ని నిర్వహించింది. ఇందులో అభిమానులు అడిగిన కొన్ని బోల్డ్ ప్రశ్నలకు చాలా బోల్డ్ గానే సమాధానం ఇచ్చింది విష్ణు ప్రియ . ఒక అభిమాని మీ ‘బాడీ కౌంట్’ ఎంత అని అడగ్గా, విష్ణుప్రియ ఏ మాత్రం మొహమాటం లేకుండా ‘5’ అని సమాధానం చెప్పింది. ఈ సమాధానాన్ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. బాడీ కౌంట్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, ఆమె ఉద్దేశ్యం లో 5 మంది పురుషులతో ఇప్పటి వరకు శృంగారం అయ్యింది అని చెప్పడమే. ఇప్పుడు 5 మంది ఎవరు?, అందులో ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అని సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు. ‘బిగ్ బాస్ 8’ లో ఉన్నప్పుడు విష్ణుప్రియ ప్రముఖ సీరియల్ హీరో పృథ్వి రాజ్ ని పిచ్చిగా ప్రేమించిన సంగతి తెలిసిందే.

అతను నాకు నీ మీద ఆసక్తి లేదు అని చెప్పినప్పటికీ కూడా వదలకుండా అతని వెంటనే తిరుగుతూ ఉండేది. ఇక చివరికి అతను ఈమెని బెస్ట్ ఫ్రెండ్ గా స్వీకరించాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ స్నేహం అలాగే కొనసాగుతూ వచ్చింది. వీళ్ళ మధ్యలో కచ్చితంగా లవ్ కూడా ఉందని టాక్. అయితే విష్ణు చెప్పిన ఆ 5 మందిలో పృథ్వి కూడా ఉండుంటాడా?, కచ్చితంగా ఉండే ఉంటాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంచనా వేస్తున్నారు. మరోపక్క విష్ణుప్రియ అమ్మాయి అయ్యుండి , ఇలాంటి మాటలు మాట్లాడడం పై కొంతమంది ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కానీ విష్ణుప్రియ అవేమి పట్టించుకోకుండా తన పద్దతితో ముందుకు వెళ్తూ ఉంది.

 

View this post on Instagram

 

A post shared by 100K (@anni_rakhala_trolls_mawa)

పవన్ కళ్యాణ్ గురి అది

Pawan Kalyan National Politics
Pawan Kalyan National Politics

Pawan Kalyan National Politics: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో జాతీయ భావాలు ఎక్కువ. ఆయన ప్రాంతీయవాదానికంటే జాతీయ సమైక్యతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆ భావనతోనే నిన్న ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టమైన సంకేతాలు పంపారు. తన రాజకీయ పరిధిని మరింత విస్తృతం చేసుకోవాలన్న ఆలోచన పవన్ లో కనిపించింది. కేవలం ప్రాంతీయ రాజకీయాలకే పరిమితం కాకుండా… ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాల్లో ఒక స్పష్టమైన, కీలకమైన పాత్ర పోషించాలనే సంకల్పం పవన్ కళ్యాణ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా పవన్ నోటి నుంచి పదేపదే జాతీయవాదం రావడం వెనుక పక్క వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది.

* నిర్దిష్టమైన సిద్ధాంతంతో..
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన ఆరాటం అధికారం కోసం కాదు. నిర్దిష్టమైన సిద్ధాంతాలతో పాటు దేశభక్తి పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. భారతీయత అనే ఉమ్మడి సూత్రం, బలమైన జాతీయవాద భావజాలం ఆయనలో కనిపిస్తుంది. ఢిల్లీ సమావేశంలో ఆయన ప్రసంగించిన తీరు, ఎంచుకున్న అంశాలు తీసుకుంటే ఒక ప్రాంతీయ పార్టీ నేతగా కాకుండా… దేశ విశాల ప్రయోజనాల దృక్పథం ఉంది. అయితే జనసేన తాజా సంకేతాలు చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ అడుగులు జాతీయస్థాయి వైపు వేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

* ఆయనదే ఆ క్రెడిట్..
ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో సైతం బిజెపి తెలుగుదేశం పార్టీతో జత కట్టడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. అందుకే మోడీతో పాటు అమిత్ షా పవన్ కళ్యాణ్ విషయంలో ప్రత్యేక గౌరవంతో ఉంటారు. అందుకే త్వరలో నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కు దేశవ్యాప్తంగా ఒక బాధ్యత కట్టబెడతారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. దేశవ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ, సామాజిక సమతుల్యం, యువతను దేశ నిర్మాణం వైపు మళ్లించడం వంటి అజెండాలతో.. జనసేన ను జాతీయస్థాయిలో బలోపేతం చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

* ఆ శూన్యత భర్తీ..
సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి జాతీయస్థాయి రాజకీయాల్లో రాణించాలనుకునేవారు చాలా తక్కువ. ఒకవేళ వారు వెళ్లిన ప్రాంతీయ ప్రయోజనాల కోణంలోనే చూస్తుంటారు తప్ప.. సమైక్య భావనతో కాదు. ఆ శూన్యతను భర్తీ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. హిందీ తో పాటు ఇంగ్లీష్ లో ఉన్న పట్టు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్, సనాతన ధర్మంపై ఆయనకు ఉన్న స్పష్టమైన స్టాండ్, జాతీయస్థాయిలో ఉన్న పలుకుబడి, ఏపీ ప్రజల మద్దతు వెరసి.. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల సామర్థ్యం పవన్ కళ్యాణ్ సొంతం. పవన్ కళ్యాణ్ కేవలం ఏపీ డిప్యూటీ సీఎం పదవితో ఆగిపోకుండా.. దేశ రాజకీయ గమనంలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధం కావడం జనసైనికుల్లో జోష్ నింపుతోంది. ఢిల్లీ పెద్దలతో ఆయనకు వ్యూహాత్మక సంబంధాలు జాతీయ నాయకుడిగా తీర్చిదిద్దుతాయని జనసైనికులు బలంగా భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో…

ప్యారడైజ్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారా..?

Paradise movie new release date
Paradise movie new release date

Paradise movie new release date: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ ఇంకా లేటయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. కారణం ఏదైనా కూడా ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనే విషయం పక్కన పెడితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక చిరస్మరణీయంగా నిలిచిపోయే సినిమా అవుతుంది అంటూ మరి కొంతమంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల మేకింగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దసర సినిమాతో తన స్టామినా ఏంటో చూపించిన శ్రీకాంత్ ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. నాని సైతం మాస్ హీరోగా మారడానికి ఈ సినిమాని ఆసరాగా చేసుకుంటున్నాడు. నిజానికి టైర్ వన్ హీరోగా మారే కెపాసిటి నాని కి ఉందా లేదా అనే డైలమా గత కొద్దిరోజుల నుంచి అందరిలో నడుస్తుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే నాని అమాంతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోతాడు. టైర్ వన్ హీరోగా కూడా చోటు సంపాదించుకునే అవకాశం ఉంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిగా వెయిట్ చేయాల్సిందే…

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ లో ఈ మూవీ రిలీజ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ని కూడా తొందర్లోనే అనౌన్స్ చేయడానికి సినిమా యూనిట్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది…

ఈ సినిమా ఎలాగూ పోస్ట్ పోన్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే రవితేజ ‘ఇరుముడి’ సినిమాని ఆగస్టు 21వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అలాగే సంపంత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న ‘భోగి’ సినిమాని సైతం ఆగస్టు 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు…

భోగాపురం విమాన ప్రయాణికుల కోసం.. దేశంలో తొలిసారి!

Bhogapuram Airport
Bhogapuram Airport

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరి కొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. జూలై నుంచి అధికారికంగా విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అయితే విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు చాలా రహదారులు ఉన్నాయి. 52 కిలోమీటర్ల దూరం కాగా.. ట్రాఫిక్ ఇబ్బందులతో దాదాపు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందులను అధిగమించి నేరుగా విశాఖ నగరం నుంచి ఎయిర్పోర్ట్ కు రహదారులను మెరుగుపరిచేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి విమాన ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం పై.. ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల సంఘం జిఎంఆర్ సంస్థకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. విమాన ప్రయాణికులు తమ సొంత కార్లపై భోగాపురం వెళితే ట్రాఫిక్ మరింత ఇబ్బందికరంగా మారుతుందని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేసింది.

* సరికొత్తగా ఆలోచన..
విశాఖ నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జిఎంఆర్ సంస్థ సరికొత్త ఆలోచన చేసింది. విశాఖ నగరంలో 9 చోట్ల వెయిటింగ్ లాంజ్ లు ఏర్పాటు చేయనుంది. దేశంలోనే తొలిసారి ఇటువంటి ఏర్పాట్లు చేయడం. తొలి విడతలో ఐదు లాంజ్ లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నంలో ఉంది. ఇందుకోసం జిఎంఆర్ గ్రూపు ముంబైలో ప్రత్యేకంగా కంటైనర్లను తయారుచేస్తోంది. 40 అడుగుల వెడల్పు, పది అడుగుల పొడవు కలిగిన కంటైనర్లు లాంజ్ రూపంలో అందుబాటులోకి రానున్నాయి. భోగాపురం వెళ్లాల్సిన విమాన ప్రయాణికులు వారికి సమీపంలో ఉన్న కంటైనర్ల వద్దకు చేరుకుంటే.. అక్కడి నుంచి ఆర్టీసీ నడిపే ఎలక్ట్రిక్ బస్సుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళవచ్చు. దీనివల్ల విమానాశ్రయ మార్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. తక్కువ చార్జీలతో విమానాశ్రయానికి చేరుకోవచ్చు. భారతదేశంలోనే తొలిసారిగా విమాన ప్రయాణికుల కోసం కంటైనర్ లాంజ్ అందుబాటులోకి వస్తుండడం విశేషం.

* నాలుగు రోజుల్లో రానున్న బస్సులు..
విశాఖ మహా నగరానికి ప్రభుత్వం 50 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. వాటిలో తొలి విడత 20 బస్సులు నాలుగు రోజుల్లో విశాఖకు రానున్నాయి. మరోవైపు చార్జింగ్ స్టేషన్ల నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. బస్సులు రాగానే ట్రైల్ రన్ కూడా నిర్వహిస్తారు. వీటిలో పది బస్సులు గాజువాక నుంచి జాతీయ రహదారిలో ఆనందపురం మీదుగా భోగాపురం వరకు తిరుగుతాయి. మరో 10 బస్సులు గాజువాకలో బయలుదేరి నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల మీదుగా భోగాపురం విమానాశ్రయానికి వెళ్తాయి. ట్రయల్ రన్ లో భాగంగా చెక్ ఇన్ కౌంటర్లు, లగేజీ స్కానింగ్ వంటి వాటికి సంబంధించి ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మరోవైపు జూలై 5న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం రావాల్సి ఉంది.

గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం..

CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు జరిగి ఆరు నెలలు దాటింది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగాయి. రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యక్తి ఆధారంగానే ప్రజలు కూడా ఓటు వేస్తారు. మున్సిపల్‌ ఎన్నికలు పార్టీ ఆధారంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు పోటీ చేశారు. గ్రామస్తులకు వారు అందించిన సేవలకు గుర్తుగా కొన్ని చోట్ల వార్డు సభ్యులుగా, సర్పంచులుగా కౌన్సిలర్లుగా విజయం సాధించారు. కొందరు ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో పోటీకి వాళ్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇలాంటివారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్తి చెప్పింది. సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం గ్రామస్థాయి నుంచి మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది.

ఉద్యోగ జీవితం ముగిసిపోకుండా..
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేస్తే, గెలిచినా ఓడినా వారి ఉద్యోగ జీవితం ముగిసిపోతుంది. కానీ అంగన్‌వాడీ సిబ్బందికి మాత్రం ఈ నియమంలో మినహాయింపు ఇచ్చి, వారు తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం కల్పించడం సానుకూలమైన చర్య. అంగన్‌వాడీ కార్మికులు గ్రామాల్లో శిశు పోషణ, ఆరోగ్యం, ప్రాథమిక విద్య వంటి కీలక సేవలు అందిస్తారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. వారు స్థానిక సమస్యలను బాగా అర్థం చేసుకుంటారు. అందుకే చాలా మంది గ్రామపంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటారు. కానీ ఉద్యోగం కోల్పోతామనే భయంతో వెనుకడుగు వేస్తుండేవారు.

సీఎం సానుకూల నిర్ణయం..
గ్రామపంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేసిన అంగన్‌వాడీ సిబ్బంది, ఆ స్థానాలు ఖాళీగా ఉంటే తిరిగి నియమించబడతారు. వారు దరఖాస్తు చేసుకుంటే వారి అర్జీలను పరిశీలించి, వారితోనే ఆ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది వారి జీవనోపాధిని కాపాడుతూ, స్థానిక రాజకీయాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది.

ఈ నిర్ణయం ఉద్దేశం..
అంగన్‌వాడీ కార్మికులు గ్రామ స్థాయిలో మహిళల సమస్యలను బాగా అర్థం చేసుకుంటారు. వారు సర్పంచులు, వార్డు మెంబర్లుగా ఎన్నికైతే స్థానిక పరిపాలన మరింత సమర్థవంతంగా ఉంటుంది. సాధారణంగా ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరుత్సాహపడతారు. ఈ నిర్ణయం ఆ అడ్డంకిని తొలగించి, ఎక్కువ మందిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి సహాయపడుతుంది.అంగన్‌వాడీ ఉద్యోగం చాలా మంది కుటుంబాలకు ఏకైక ఆదాయ వనరు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు మళ్లీ ఉద్యోగంలో చేరగలగడం వారి కుటుంబాలను ఆర్థికంగా భద్రపరుస్తుంది. అనుభవజ్ఞులైన అంగన్‌వాడీ కార్మికులు స్థానిక సంస్థల్లోకి వస్తే, పిల్లల పోషణ, మహిళా సాధికారత వంటి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు జరుగుతాయి.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో ముందడుగు. అంగన్‌వాడీ కార్మికులు ఇకపై ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది వారి జీవనోపాధిని కాపాడుతూ, గ్రామాల అభివృద్ధికి కొత్త శక్తిని ఇస్తుంది. ఇలాంటి నిర్ణయాలు మరిన్ని రాష్ట్రాలు అనుసరిస్తే, గ్రామస్థాయి నాయకత్వం మరింత బలపడి, ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయి.

మహిళ అని చూడకుండా.. గుడివాడ అమర్నాథ్ అదేం పని!

Gudivada Amarnath
Gudivada Amarnath

Gudivada Amarnath: ఏపీ రాజకీయాల్లో ఒక వింత వైఖరి కనిపిస్తోంది. మహిళా నేతల పట్ల వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వ్యక్తిత్వాన్ని, రాజకీయ ఎదుగుదలను కించపరిచేలా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో విధానపరమైన విమర్శలు చేయడం సహజమే. కానీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మహిళా నేతలను టార్గెట్ చేయడం మాత్రం ముమ్మాటికీ రాజకీయ దిగజారుడు తనమే. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న గుడివాడ అమర్నాథ్.. ఏకంగా ఈ రాష్ట్ర హోం మంత్రిని, ఒక మహిళా నేతను కించపరచడం మాత్రం సహేతుకం కాదు.

* స్వయంకృషితో ఎదిగి..
ఒక సాధారణ ఉపాధ్యాయురాలిగా ఉన్న వంగలపూడి అనిత, ఎమ్మెల్యేగా, మంత్రిగా రాణించారు. కేవలం తన వాగ్దాటి, నిరంతర పోరాట పటిమతో రాష్ట్ర హోంమంత్రి స్థాయికి ఎదిగారు. ఆమె కెరీర్ ను గమనిస్తే స్వయంకృషి కనిపిస్తుంది. అయితే ఆమె ఎదుగుదల జీర్ణించుకోలేకపోతున్నారు కొందరు. ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు సైతం కనుమరుగవుతున్న తరుణంలో.. అటువంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన గుడివాడ అమర్నాథ్.. ఒక మహిళా నేతకు వచ్చిన ఆదరణను తట్టుకోలేక ఎటువంటి విమర్శలు చేశారని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దళిత మహిళగా ఆ సామాజిక వర్గం వారు కూడా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

* హద్దులు దాటుతున్న విమర్శలు..
మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలను నియంత్రించాలంటే గుడివాడ అమర్నాథ్ ను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. విమర్శలు సరిహద్దులు దాటి వ్యక్తిగత దాడులు చేయడం, మానసికంగా వేధించడం, చివరకు భౌతిక దాడులకు దిగడానికి కూడా రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది అత్యంత ప్రమాదకరం కూడా. రాజకీయాల్లో నైతిక విలువలను పక్కనపెట్టి, కేవలం కక్ష సాధింపు చర్యల కోసం మహిళల ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టడం దారుణం. గుడివాడ అమర్నాథ్ లాంటి వారు చేసిన వ్యాఖ్యలు మరొకరు చేయకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే ఒక హోంమంత్రి, ఒక మహిళా మంత్రిని ఆ స్థాయిలో కించపరచడం అంటే కండకావరమే. అందుకే గుడివాడ అమర్నాథ్ ను గుడిసెట్టి అమర్నాథ్ గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి.

ఒకే గదిలో అమ్మాయి.. అబ్బాయి.. హైదరాబాద్ లో కొత్త కల్చర్.. చివరికి ఏమైందంటే..

Hyderabad shared room incident
Hyderabad shared room incident

Hyderabad shared room incident: హైదరాబాద్ లో పెరుగుతున్న కొత్త సంస్కృతి పెరిగిపోతోంది. ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి కలిసి ఉండే కల్చర్ మొదలైంది. ఐటీ, స్టార్టప్ రంగాల విస్తరణతో హైదరాబాద్‌లో కో-లివింగ్ (Co-Living), సహజీవనం (Live-in Relationship) కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే యువతలో ఈ విధానానికి ఆదరణ పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో వసతి, వ్యక్తిగత స్వేచ్ఛ, సౌకర్యవంతమైన జీవనశైలి వంటి కారణాలతో చాలామంది దీనిని ఎంచుకుంటున్నారు. కానీ ఈ సంబంధాలు మొదట్లో బాగానే అనిపించినా.. ఆ తరువాత పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వస్తోంది. ఎందుకంటే?

ఒక సర్వే ప్రకారం…హైదరాబాద్‌లోని వందలాది హాస్టళ్లు, కో లివింగ్ స్పేస్‌లలో వేలాది మంది యువత కలిసి నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఈ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగ ఒత్తిడిలో కుటుంబానికి దూరంగా ఉన్న యువతకు ఇది స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తోందని మద్దతుదారులు చెబుతున్నారు.

అయితే ఈ సంబంధాలు మొదట్లో సౌకర్యంగా అనిపించినా, కాలక్రమేణా భేదాభిప్రాయాలు, ఆర్థిక వివాదాలు, వ్యక్తిగత గోప్యత సమస్యలు, నమ్మకద్రోహం వంటి అంశాలు తలెత్తుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. సంబంధం ముగిసిన తర్వాత వేధింపులు, మోసం, బెదిరింపులు, ఆస్తి వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు వివిధ పోలీస్ స్టేషన్లకు చేరుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సహజీవనం అనేది చట్టబద్ధంగా నేరం కాదు. కానీ పరస్పర అవగాహన, బాధ్యత, స్పష్టమైన హద్దులు లేకపోతే సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో బాధ్యతారాహిత్యం పెరిగితే సంబంధాలు దెబ్బతింటాయని వారు హెచ్చరిస్తున్నారు.మరోవైపు యువతలో కొందరు దీనిని ఆధునిక జీవనశైలిలో భాగంగా చూస్తున్నారు. వివాహానికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు, కెరీర్‌పై దృష్టి పెట్టేందుకు కో-లివింగ్ ఉపయోగపడుతుందని వాదిస్తున్నారు. సమాజంలో మారుతున్న విలువలు, పట్టణ జీవనశైలి కారణంగానే ఈ ధోరణి పెరుగుతోందని వారు చెబుతున్నారు.

కానీ సంప్రదాయవాదులు మాత్రం ఈ కల్చర్ కుటుంబ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధాల్లో స్థిరత్వం తగ్గడం, సామాజిక బాధ్యతలు తగ్గిపోవడం వంటి అంశాలు భవిష్యత్తులో సమస్యలకు దారితీయవచ్చని భావిస్తున్నారు. ఏదీ ఏమైనా హైదరాబాద్‌లో కో-లివింగ్, సహజీవనం కల్చర్ వేగంగా విస్తరిస్తున్నది వాస్తవం. అయితే ఇది పూర్తిగా సరైందా? తప్పా? అనే దానిపై సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. స్వేచ్ఛతో పాటు బాధ్యత, పరస్పర గౌరవం, చట్టపరమైన అవగాహన ఉంటేనే ఈ తరహా సంబంధాలు విజయవంతమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపైనే నగరంలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.

జనసేనలో చేరికలు.. అంతా కమిటీదే బాధ్యత!

Janasena Joinings Committee
Janasena Joinings Committee

Janasena Joinings Committee: జనసేనలో చేరికలకు అధినేత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కేవలం రాజకీయ పార్టీల నేతలు మాత్రమే కాదు. సమాజం పై ప్రభావం చూపే వివిధ రంగాల ప్రముఖులతో పాటు తటస్థులను పెద్ద ఎత్తున పార్టీలో చేర్పించేందుకు పవన్ కళ్యాణ్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. 14 మంది అత్యంత సీనియర్ నేతలతో కూడిన ఆంధ్రప్రదేశ్ జాయినింగ్స్ కమిటీని అధికారికంగా నియమించారు. తద్వారా వివిధ పార్టీల్లో ఉన్న మంచి నేతలను, సమాజం పై ప్రభావం చూపే నిష్ణాతులను, వివిధ రంగాల ప్రముఖులను జనసేనలో చేర్పించే కసరత్తు మొదలుపెట్టారు. అయితే నియమించిన ఈ కమిటీలో ఇటీవల పార్టీలో చేరిన నేతలతో పాటు పాతవారికి సైతం అవకాశం కల్పించారు.

* సీనియర్ నేతలకు బాధ్యతలు..
జనసేనలో ఈ హై ప్రొఫైల్ కమిటీలో అన్ని ప్రాంతాల నాయకులకు అవకాశం ఇచ్చారు. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగం నేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను నియమితులయ్యారు. పార్టీ సీనియర్లుగా ఉన్న కొటికలపూడి చినబాబు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్, కురికన రవికుమార్, ఒంపూరు గంగులయ్య, టిసి వరుణ్, ఆరణి మదన్ లకు ఈ కమిటీలు చోటు కల్పించారు.

* త్వరలో కీలక సమావేశం..
మొన్నటి ఎన్నికల ముందు, ఫలితాలు వచ్చిన తర్వాత జనసేనలో వివిధ పార్టీల నుంచి నేతలు భారీగా చేరారు. మరి కొంతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు సమాజంలోని విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్తులను పార్టీలోకి ఆహ్వానించి.. వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడమే ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అమరావతిలోని కేంద్ర కార్యాలయంలో కమిటీ సభ్యులకు సమావేశం కానున్నారు. పార్టీలో చేరికల విషయంలో దిశా నిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

భారత్ తెగించి పాక్ పై చేసిన దాడి.. అమెరికా కూడా భయపడింది

India strikes on Pakistan
India strikes on Pakistan

India strikes on Pakistan: రష్యా మీద అమెరికా యుద్ధం చేయలేదు. చైనా మీద కూడా చేయలేదు. చివరికి ఇజ్రాయిల్ జోలికీ వెళ్లలేదు. కారణం ఆ దేశాలలో న్యూక్లియర్ వెపన్స్ ఉండడమే.. మన దేశంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇటీవల ఆ వివరాలను మన దేశమే ప్రకటించింది.. మేము ఎవరి మీద బాంబులు వేయము. మాకు ఆ అవసరం లేదు. ఒకవేళ బాంబులు వేస్తే.. ఆ తర్వాత కథ వేరే విధంగా ఉంటుందని హెచ్చరించింది.

వాస్తవానికి మన దేశం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. గతంలో న్యూక్లియర్ టెస్టులు జరిగినప్పుడు అమెరికా అనేక విధాలుగా అడ్డుకుంది. అమెరికా అడ్డు పుల్ల వేయడంతో ఇందిరాగాంధీ హయాంలో న్యూక్లియర్ టెస్టులు ఆగిపోయాయి. కానీ అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు న్యూక్లియర్ టెస్ట్లు చేశారు. అమెరికా అనేక రకాలుగా ఆంక్షలు విధించినప్పటికీ ఏమాత్రం లెక్కపెట్టలేదు. పైగా నాడు ప్రధానమంత్రి హోదాలో అటల్ జీ అమెరికాకు స్పష్టమైన సంకేతాలు పంపించారు.

“మాకు చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని మేము కాపాడుకోవడం అవసరం. మేము వేరే దేశాల మీద బాంబులు వేసే వాళ్ళం కాదు. మా మీద బాంబులు వేస్తే ఊరుకునే రకం కూడా కాదు. మా సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము ఆయుధాలు తయారు చేసుకుంటున్నాం. దాన్ని కూడా కాదనే అధికారం మీకు లేదంటూ” అటల్ ప్రశ్నించారు..

ఇక ఇటీవల ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు మన దేశానికి సంబంధించిన మిస్సైల్స్ పాకిస్తాన్ మీద దాడి చేశాయి. ముఖ్యంగా పాకిస్తాన్ తయారుచేసిన న్యూక్లియర్ వెపన్స్ ప్రాంతంలో ఎంట్రీ లెవెల్ గేట్లను బద్దలు కొట్టాయి. అంతేకాదు న్యూక్లియర్ రిఫరెన్స్ స్టోర్ చేసే ప్రాంతంలో అనేక వ్యవస్థలను నాశనం చేశాయి. దీనిని పాకిస్తాన్ బయట పెట్టలేదు. కానీ సి ఐ ఏ పరిశీలనలో తేలింది. అంతేకాదు సిఐఏ ఇచ్చిన తాజా నివేదిక అమెరికాకు చుక్కలు చూపించింది.

బాంబులతో దాడి కాదు.. బాంబులు చూపించి ప్రపంచాన్ని భయపెట్టిన దేశంగా భారత్ నిలిచిందని.. భారత్ విషయంలో అమెరికా అడ్డగోలుగా ప్రవర్తిస్తే తర్వాతి పరిణామాలు వేరే విధంగా ఉంటాయని సిఐఏ హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఏకకాలంలో అటు పాకిస్తాన్ దేశానికి.. ఇటు అమెరికాకు భారత్ స్పష్టమైన హెచ్చరికలు పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా పాకిస్తాన్ అదుపులో ఉంటే మంచిదని జాతీయవాదులు చెబుతున్నారు. అమెరికా కూడా అనవసరమైన విషయాలలో కలగజేసుకుంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఎన్టీఆర్ ను పక్కకి తప్పించిన స్టార్ హీరో...

NTR
NTR

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశా మార్చుకుంది. ఒకప్పుడు మూస ధోరణిలో సాగే కథలతో సినిమాలను చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన తెలుగు మేకర్స్ ఇప్పుడు వాళ్ళ పంథా ను మార్చుకున్నారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న స్టోరీలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇండియాలో చాలామంది హీరోలు మన దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే మన వాళ్ళ రేంజ్ ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి మన హీరోలతో సినిమాలు చేయడానికి ఇతర భాషల దర్శకులు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు. మొత్తానికైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఇప్పటివరకు శాసించగలుగుతున్న వాళ్లలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా మొదటి స్థానంలో ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం… ఇక రాబోయే సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లడానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. స్టార్ హీరోలందరు డిఫరెంట్ కథలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఏ మాత్రం తన సత్తా చాటలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘ డ్రాగన్ ‘ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలందరికి పోటీని ఇచ్చాడు. యంగ్ హీరోల్లో తనే ముందు వరుసలో ఉండేవాడు. కానీ ఈ మధ్య కాలంలో తనకి అనుకున్న సక్సెస్ లు రాకపోవడంతో ఆయన కొంతవరకు వెనుకబడిపోయాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో, పుష్ప, పుష్ప 2 సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి తన మార్కెట్ ను పెంచుకున్నాడు. పాన్ ఇండియాలో తనను మించిన హీరోలెవరు లేరనెంతల ముందుకు దూసుకెళ్లాడు. ఒక రకంగా ఎన్టీఆర్ ను భారీ దెబ్బ కొట్టిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది అల్లు అర్జున్ అనే చెప్పాలి.

ఎన్టీఆర్ మార్కెట్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అందుకే అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది… ఇప్పుడు డ్రాగన్ సినిమాతో అయిన ఎన్టీఆర్ అల్లు అర్జున్ క్రేజ్ ను బీట్ చేసే విజయాన్ని అందుకుంటాడా? నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కి అంత మొత్తంలో కలెక్షన్లు వస్తాయా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

రామ్ చరణ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ కోసం మరో సంవత్సర సమయాన్ని తీసుకుంటున్న సుకుమార్...

Ram Charan Sukumar Movie
Ram Charan Sukumar Movie

Ram Charan Sukumar Movie: లెక్కల మాస్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది సుకుమార్ అనే చెప్పాలి. వైవిధ్య భరితమైన కథాంశాలను ఎంచుకోవడమే కాకుండా స్క్రీన్ ప్లే లో కూడా చాలా కొత్త తరహా విధానాన్ని అవలంబిస్తూ ఉంటాడు. అందుకోసమే అతన్ని చాలామంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమాలను చేస్తుంటారు. అలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపించడంలో సుకుమార్ ను మించిన వారు మరెవరు లేరంటూ చాలామంది దర్శక దిగ్గజాలు సైతం ఆయన్ని కొనియాడుతూ ఉంటారు…

అతనితో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు సైతం ఆసక్తిగా ఉంటారు. డిఫరెంట్ మేకింగ్ తో వచ్చే ఆయన ప్రతి సినిమాతో భారీ విజయాన్ని సాధించాలానే ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి సుకుమార్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. మరోసారి రామ్ చరణ్ తో జతకట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

రీసెంట్ గా రామ్ చరణ్ చేసిన ‘పెద్ది’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా స్క్రిప్ట్ సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ తన టీం తో స్క్రిప్ట్ వర్క్ లో కూర్చున్నట్టుగా తెలుస్తుంది. ఒక మూడు నెలల్లో స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ చేసి సినిమాను సెట్స్ మీదకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికైతే ఇంకో సంవత్సరం తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఇవన్నీ పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం పూర్తి చేసుకున్న తర్వాతే సుకుమార్ రంగంలోకి దిగబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…చూడాలి మరి రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…

ఈ దసరా కి పోటీ పడే మూవీస్ ఇవేనా..?

Telugu Dasara Movie Releases 2026
Telugu Dasara Movie Releases 2026

Telugu Dasara Movie Releases 2026: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు మనవాళ్లు సాధించిన విజయాలు ఇతర భాషల హీరోలు సాధించలేకపోతున్నారు. కారణం ఏదైనా కూడా మన దర్శకులు హీరోలు ఒకే తాటి మీద నడుస్తున్నారు. మన దర్శకులు మన హీరోలతోనే సినిమాలు చేయడం వాళ్లకి భారీ సక్సెస్ లను కట్టబెట్టడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ అటు దర్శకత్వ విభాగంలో, ఇటు స్టార్ హీరోల విషయం లోను టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పటివరకు వీళ్ళందరు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు…యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. అందులోను తెలుగు హీరోలే ఇప్పుడు ప్రతి ఒక్కరిని డామినేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

రాబోయే రోజుల్లో కూడా మన హీరోల డామినేషన్ సాగబోతుంది… ఇక ప్రతి సంవత్సరం దసర అనగానే సినిమాల పండుగ మొదలవుతుంది. ఈ సంవత్సరం దసర పండగకి ఏ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తావుతున్నాయి.

ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా కొంత మంది స్టార్ హీరోలు వాళ్లు చేస్తున్న సినిమాలతో భారీ ఇమేజ్ ను తెచ్చుకుంటున్నారు. ఇక ఈ దసర కి నాని హీరోగా చేస్తున్న ప్యారడైజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమా ఆగస్టు లోనే రిలీజ్ అవుతోందనుకున్నప్పటికి ఆ మూవీ షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదట. దాంతో ఈ సంవత్సరం దసర కి ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక దాంతో పాటుగా మరో రెండు సినిమాలను కూడా దసర బరిలో దింపే ప్రయత్నం చేస్తున్నారు. అవి ఏ సినిమాలు అనే విషయంలో ఇంకా క్లారిటి రావడం లేదు. కానీ మరో రెండు సినిమాలైతే దసర బరిలో నిలుస్తాయట. ఇక ఏది ఏమైనా కూడా ఈ దసర కి ఎవరు విజయం సాధిస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఈ ఫోల్డింగ్ ఫోన్ పై ఏకంగా రూ.39 వేల డిస్కౌంట్.. వెంటనే త్వరపడండి..

Google Pixel 10 Pro Fold Discount
Google Pixel 10 Pro Fold Discount

Google Pixel 10 Pro Fold Discount: కాలం మారుతున్న కొత్త స్మార్ట్ ఫోన్ వినియోగంలో కూడా అప్డేట్ కోరుకుంటున్నారు. ఒకప్పడు ప్లాట్ గా ఉండే ఫోన్లపై ఆసక్తిచూపిన వారు ఇప్పుడు ఫోల్డబుల్ మొబైల్స్ పై ఆసక్తి పెంచుకుంటున్నారు. కంపెనీలుసైతం వినియోగదారుల ఆసక్తిని దృష్టిలోఉంచుకొని మార్కెట్లోకి కొత్త డివైజ్ లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ను విక్రయిస్తోంది. అయితే దీనిపై కంపెనీ సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ. 39,289 వరకు భారీ డిస్కౌంట్ లభించనుంది. ఆ వివరాల్లోకి వెళితె..

డిజైన్ పరంగా చూస్తే.. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ అత్యంత స్లిమ్‌గా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. ఇందులో ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, గేర్‌లెస్ హింజ్ (మడత పెట్టే కీలు) ఉపయోగించారు. దీనిని పూర్తిగా విప్పినప్పుడు 8 అంగుళాల OLED డిస్ ప్లేను చూడొచ్చు. ఒక రకంగా చిన్నపాటి టాబ్లెట్ లాంటి అనుభూతిని ఇస్తుంది. ఫోల్డ్ చేసినప్పుడు 6.4అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంటుంది. రెండు డిస్ ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తూ 3000 nits పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటాయి. దీంతో ఎలాంటి వాతావరణంలోనైనా అద్భుతమైన డిస్ ప్లేను అందిస్తాయి.

గూగుల్ తన స్వంత తయారీ అయిన నెక్స్ట్ జనరేషన్ Tensor G5 ప్రాసెసర్‌ను ఇందులో మొదటిసారిగా ప్రవేశపెట్టింది. దీనికి తోడు భారీ 16GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉండడంతో మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్ వారికి గూగుల్ జెమిని ఏఐ ఫీచర్లు అత్యంత వేగంగా, స్మూత్‌గా రన్ అవుతాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా, 10.5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. వీటితో పాటు ఇన్-డిస్‌ప్లే మరియు కవర్ స్క్రీన్‌లపై 10MP సెల్ఫీ కెమెరాలను ఇచ్చారు. గూగుల్ యొక్క ఏఐ ఫోటో టూల్స్ సహాయంతో ప్రొఫెషనల్ స్థాయి ఫోటోలు, 4K వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ భారీ 5,015 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది సాధారణ వినియోగంలో 24 గంటలకు పైగా బ్యాకప్ ఇస్తుంది. అలాగే భద్రత కోసం గూగుల్ టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌ను అమర్చారు.

భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ అసలు ధర రూ.1,72,999 గా ఉంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న లాంచ్ ఆఫర్లలో భాగంగా, మీ పాత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడంతో పాటు ప్రముఖ బ్యాంక్ (HDFC వంటి) క్రెడిట్ కార్డ్‌లపై లభించే ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్లను కలుపుకుంటే వినియోగదారులు మొత్తంగా రూ. 39,289 వరకు ఆదా చేసుకోవచ్చు.

మిడిల్ క్లాస్ పీపుల్స్ లక్ష్యంగా OnePlus కొత్త ఫోన్.. ధర ఎంతంటే..

OnePlus N6
OnePlus N6

OnePlus N6: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పటివరకు ప్రీమియం, మిడ్-రేంజ్ విభాగాల్లో OnePlus సంస్థ సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు సరికొత్త వ్యూహంతో లో బడ్జెట్ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతోంది. మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా N సిరీస్‌లో భాగంగా వస్తున్న మొట్టమొదటి మొబైల్ ‘వన్‌ప్లస్ N6’ ను జూన్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందంటే?

వన్ ప్లస్ భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు తన స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను మూడు స్పష్టమైన ధరల శ్రేణులుగా విభజించింది. ఇప్పటివరకు ఉన్న ప్రీమియం ఫ్లాగ్‌షిప్ సిరీస్ (రూ. 50,000), మధ్యతరగతికి చేరువైన నార్డ్ సిరీస్ (రూ. 25,000 నుంచి రూ. 50,000) లను తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు అత్యంత చౌకైన బడ్జెట్ విభాగంలో సరికొత్తగా ‘N సిరీస్’ ను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త వ్యూహం ద్వారా మార్కెట్లో చాలా తక్కువ ధరలోనే వన్‌ప్లస్ బ్రాండ్ అనుభవాన్ని అందించాలని కంపెనీ భావిస్తోంది.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. వన్‌ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 18,000 నుంచి రూ. 25,000 లోపు బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ కన్నా తక్కువ ధరలో, ఒక నాణ్యమైన ప్రత్యామ్నాయంగా ఇది నిలవనుంది. ఈ ధరలో రియల్‌మి, రెడ్‌మి, iQOO బ్రాండ్ల బడ్జెట్ ఫోన్లకు వన్‌ప్లస్ N6 గట్టి పోటీనిచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

జూన్ 30న గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న ఈ వన్‌ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ (Amazon.in) తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఈ బడ్జెట్ ఫోన్ల వినియోగదారులకు సేవలందించేందుకు వన్‌ప్లస్ తన కస్టమర్ సర్వీస్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా 400 నుండి ఏకంగా 500 సెంటర్లకు విస్తరించింది. రోజువారీ అవసరాలకు బడ్జెట్ ధరలో ఒక బ్రాండెడ్ వన్‌ప్లస్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 3 రోజుల బ్యాకప్.. షావోమి కొత్త ఫోన్.. ఈరోజే విడుదల..

Xiaomi Redmi Turbo 5
Xiaomi Redmi Turbo 5

Xiaomi Redmi Turbo 5: భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షావోమి (Xiaomi) తన సరికొత్త మొబైల్ ను తీసుకురాబోతోంది. దీనిని ఒక రకంగా పవర్‌హౌస్ మొబైల్ అనుకోవచ్చు. ఈ కంపెనీ నుంచి రెడ్‌మీ టర్బో 5 (Redmi Turbo 5) ను జూన్ 16న మార్కెట్లోకి అధికారికంగా వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) వేదికగా విక్రయాలు జరుపుకుంటున్న ఈ ఫోన్, ముఖ్యంగా ఛార్జింగ్ సమస్యలతో విసిగిపోయిన యూజర్లను టార్గెట్ చేస్తూ అల్టిమేట్ ఫీచర్లతో దూసుకొచ్చింది. ఎందుకంటే ఇందులో బలమైన బ్యాటరీ తో పాటు ఫాస్టెస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేసే సౌకర్యం ఉంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో సైతం గరిష్టంగా 5000mAh లేదా 6000mAh బ్యాటరీలను మాత్రమే చూస్తుంటాం. కానీ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రెడ్‌మీ టర్బో 5 లో ఏకంగా 7,540mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వచ్చి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగదారులకు 2 నుండి 3 రోజుల పాటు నిరంతరాయంగా బ్యాకప్ అందిస్తుంది. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ ఏమాత్రం బరువుగా లేదా లావుగా లేకుండా కేవలం 8.18 mm మందంతో చాలా స్లిమ్‌గా డిజైన్ చేయడం షావోమి సాధించిన సాంకేతిక విజయంగా చెప్పవచ్చు.

భారీ బ్యాటరీ అనగానే ఛార్జింగ్ అవ్వడానికి గంటల సమయం పడుతుందని కంగారుపడాల్సిన అవసరం లేదు. దీని కోసం బాక్స్‌లోనే 100W హైపర్‌ఛార్జ్ అడాప్టర్‌ను అందించారు. దీని ద్వారా కేవలం అర గంటలోనే బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఇందులో 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే మీ స్నేహితుల ఫోన్లు లేదా బ్లూటూత్ ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ అయిపోతే, ఈ ఫోన్‌ను ఒక పవర్ బ్యాంక్‌లా వాడుకుని వాటిని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్లో సరికొత్త MediaTek Dimensity 8500 Ultra ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది హెవీ గేమింగ్ తో పాటు మల్టీటాస్కింగ్‌ను ఉపయోగించేవారికి చాలా అనుగుణంగా ఉంటుంది. దీనికి తోడు అల్ట్రా-ఫాస్ట్ LPDDR5X RAM మరియు UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల యాప్స్ ఓపెన్ అవ్వడం, గేమ్స్ లోడ్ అవ్వడం రెప్పపాటు కాలంలో జరిగిపోతాయి.

వీడియోలు మరియు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉండేలా ఇందులో 6.59 అంగుళాల AMOLED డిస్ ప్లే ను అమర్చారు. 1.5K రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ ను అందించే ఈ ఫోన్ లో 3500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది కాబట్టి ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఫోన్ వెనుక భాగంలో ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్‌తో పాటు, కెమెరా మాడ్యూల్ చుట్టూ అమర్చిన RGB లైటింగ్ రింగ్స్ ఈ ఫోన్‌కు సరికొత్త గేమింగ్ మరియు స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. మెటల్ ఫ్రేమ్‌తో కూడిన ఈ డివైజ్‌కు కఠినమైన IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది.

ఇందులో 50MP ప్రధాన కెమెరాను అందించారు. ఇది Sony IMX882 సెన్సార్ మరియు OIS సపోర్ట్‌తో వస్తుంది. దీనివల్ల ప్రయాణాల్లో మరియు రాత్రి వేళల్లో కూడా కదల్లేని, స్పష్టమైన ఫోటోలు, 4K వీడియోలు తీసుకోవచ్చు. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, మరియు సెల్ఫీల కోసం ముందు వైపు 20MP కెమెరా ఉన్నాయి.