Home Blog Page 122

Maruti ఫ్లెక్సీ ఫ్యూయెల్ ధర ఇదే.. అఫీషియెల్ అనౌన్స్..

Maruti Wagon R Bio Flex Fuel
Maruti Wagon R Bio Flex Fuel

Maruti Wagon R Bio Flex Fuel: భారత ఆటోమోబైల్ మార్కెట్లో ప్రస్తుతం ‘ఫ్లెక్స్ ఫ్యూయల్’ (Flex-Fuel) కార్లపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, ఖరీదైన ముడి చమురు దిగుమతులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ఇంధన వాడకాన్ని తీవ్రంగా ప్రోత్సహిస్తోంది. త్వరలోనే దేశంలో 100 శాతం ఇథనాల్ ఇంధనం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఒక అడుగు ముందుకు వేసింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ నుండి 85శాతం ఇథనాల్ మిశ్రమం వరకు ఎలాంటి ఇంధనంతోనైనా నడిచేలా రూపొందించిన సరికొత్త ‘వ్యాగన్ ఆర్ బయోఫ్లెక్స్’ కారును మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఈ కారు ధరపై ఇన్నాళ్లు చాలా మంది ఎదురుచూశారు. ఈ కారు ధర ఎంతంటే?

మారుతీ సుజుకీ ఈ సరికొత్త వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్ ప్రారంభ ధరను రూ. 7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ప్రకటించింది. ఈ కారును సాధారణ వ్యాగన్ ఆర్ లోని టాప్ ఎండ్ మోడల్ అయిన ‘జెడ్ ఎక్స్ ఐ ప్లస్’ వేరియంట్ ఆధారంగా రూపొందించారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెగ్యులర్ పెట్రోల్ టాప్ మోడల్‌తో పోలిస్తే ఈ బయోఫ్లెక్స్ వేరియంట్ ధర దాదాపు రూ. 86,000 వరకు అధికం కావడం గమనార్హం.

ఈ సరికొత్త బయోఫ్లెక్స్ వెర్షన్‌ను మారుతీ సుజుకీ సంస్థ తొలుత కేవలం కమర్షియల్ వినియోగానికి మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా క్యాబ్ డ్రైవర్లు రోజుకు ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతారు కాబట్టి, ఇథనాల్ ఇంధనం ద్వారా వారికి నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతాయి. అయితే, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇథనాల్ బ్లెండింగ్ బంకులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ కారును సాధారణ ప్రజలందరికీ విక్రయించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

ప్రస్తుతం కమర్షియల్ మార్కెట్లో క్యాబ్ ఆపరేటర్ల కోసం మారుతీ సుజుకీ ప్రత్యేకంగా ‘వ్యాగన్ ఆర్ టూర్ H3’ మోడల్‌ను అందిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షల నుంచి రూ. 5.89 లక్షల వరకు ఉంది. ఈ టూర్ H3 మోడల్‌తో పోల్చి చూస్తే ఇప్పుడు వచ్చిన సరికొత్త వ్యాగన్ ఆర్ బయోఫ్లెక్స్ ధర రూ. 1.35 లక్షల నుండి రూ. 2.25 లక్షల వరకు ఎక్కువగా ఉంటుంది. కానీ, టూర్ H3 లో ఉండే చిన్న 1.0 లీటర్ ఇంజిన్‌తో పోలిస్తే, బయోఫ్లెక్స్ కారులో మరింత పవర్‌ఫుల్ ఇంజిన్‌ను అందించారు.

వ్యాగన్ ఆర్ బయోఫ్లెక్స్ కారులో 1.2 లీటర్, కె 4 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను ఉపయోగించారు. పెట్రోల్‌లో ఎంత ఎక్కువ శాతం ఇథనాల్ కలిపినా ఇంజిన్ పాడవకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగేలా దీని లోపలి భాగాలను ప్రత్యేకంగా మాడిఫై చేశారు.అయితే ఇంధనం మారినప్పటికీ కారు పవర్, టార్క్ అవుట్‌పుట్‌లో ఎలాంటి మార్పు లేకుండా సాధారణ పెట్రోల్ కారు లాగే 90.9 హెచ్‌పీ పవర్‌ను, 113.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంధనంలో ఇథనాల్ శాతం పెరిగే కొద్దీ మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నందున, ఈ బయోఫ్లెక్స్ వెర్షన్ యొక్క ఖచ్చితమైన మైలేజ్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. డిజైన్ పరంగా చూస్తే మాత్రం ఇది చూడటానికి మనకు రోడ్లపై కనిపించే సాధారణ వ్యాగన్ ఆర్ లాగే ఉంటుంది. కేవలం కారు వెనుక భాగంలో బయోఫ్లెక్స్ అనే బ్యాడ్జ్, అలాగే డోర్లపై ఫ్లెక్స్ ఫ్యూయెల్ అనే గ్రాఫిక్స్ డీకాల్స్ మాత్రమే దీని ప్రత్యేకతను తెలియజేస్తాయి. లోపల 7 అంగుళాల టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

వామ్మో.. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్.. అప్పుడే రద్దీ!

Bhogapuram International Airport
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం అయ్యింది. ఈ నూతన విమానాశ్రయాన్ని జూలై 5న ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రారంభ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు కానీ.. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మొన్ననే సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఎయిర్లైన్స్ కు సంబంధించిన కార్యకలాపాలు జూలై మొదటి వారం నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఇకపై విశాఖ ఎయిర్పోర్టులో బదులు భోగాపురం విమానాశ్రయంలో తమ కార్యాలయం సేవలు అందుబాటులోకి వస్తాయని పలు ప్రైవేటు విమానయాన సంస్థలు ప్రత్యేక ప్రకటనలు చేశాయి.

* పనులు తుది దశకు..
విజయనగరం జిల్లాలో నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయి. నెలల కిందట ప్రధాన పనులు జరగడంతో రాయల్ రన్ కూడా జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన తొలి ఎయిర్ ఇండియా వాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం విమానాశ్రయం రన్ వే పై దిగింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా భోగాపురం ఎయిర్పోర్ట్ రన్ వేను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ట్రయల్ రన్ విజయంతో రన్ వే సామర్థ్యం, భద్రత ప్రమాణాలపై అధికారులకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. దాదాపు పెండింగ్ పనులన్నీ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

* ఉత్తరాంధ్ర ప్రజల కల..
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు మాత్రమే కాకుండా ఒడిస్సా సరిహద్దు ప్రాంతాలకు కూడా ఇది ప్రధాన విమాన కేంద్రంగా మారనుంది. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు విశాఖపట్నం ఉన్న విమాన ప్రయాణ భారం తగ్గడంతో పాటు.. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం తో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన విమాన సేవలు లభించునున్నాయి. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో సందర్శకులతో కిటకిటలాడుతోంది. విశాఖకు వచ్చే పర్యాటకులు సైతం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా మారడం విశేషం.

డెహ్రాడూన్‌ ఘటన.. హిందువుల్లో మొదలైన తిరుగుబాటు.. ఇక తగ్గేదెలే!

Dehradun Incident
Dehradun Incident

Dehradun Incident: దేశంలో మైనారిటీలు హిందువులపై దాడిచేసినప్పుడు ఎవరూ పెద్దగా మాట్లాడరు. మైనారిటీలపై హిందువులు దాడిచేస్తే మాత్రం మైరారిటీలపై వివక్ష చూపుతున్నారని, ప్రభుత్వాలు మైనారిటీల హక్కుల రక్షణలో విఫలమయ్యాయని రోడ్డెక్కుతారు. కానీ ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుంది. ఇంతకాలం మైనారిటీల దాడులను భరించిన హిందువుల్లో ఇప్డుపు మార్పు కనిపిస్తోంది. దెబ్బకు దెబ్బ.. తీయాలన్న చైతన్నం, తిరుగుబాటు కనిపిస్తోంది. డెహ్రాడూన్‌లో జరిగిన బీజేవైఎం నాయకుడి హత్య తర్వాత స్థానికులు చేసిన ప్రతీకార చర్యలు, బుల్డోజర్‌ చర్యలు, ఇంటర్నెట్‌ నిషేధం.. ఇవన్నీ ఒక్కటిగా చూస్తే హిందువుల్లో ఒక కొత్త రకమైన చైతన్యం వచ్చిందని కొందరు అంటున్నారు. కానీ ఇది నిజంగా తిరుగుబాటు సంకేతమా? లేదా చట్ట వ్యవస్థపై నమ్మకం కోల్పోవడం, ఆగ్రహం వల్ల జరిగిన మరో హింసా చక్రమా?

ఘటన నేపథ్యం…
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ జిల్లా సహస్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బైరాగివాలా గ్రామంలో నీటి వివాదం హింసాత్మక ఘర్షణకు దారితీసింది. బీజేవైఎం (బీజేపీ యువ మోర్చా) నాయకుడు వినోద్‌ కుమార్‌ కశ్యప్‌ హత్యకు గురయ్యాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు. దీంతో స్థానికులు ఆగ్రహించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంతియాజ్‌ రజాఖ్‌ సంబంధిత ఇళ్లపై దాడి చేసి కొన్నింటిని తగులబెట్టారు. ప్రభుత్వం బుల్డోజర్లు పంపి చర్యలు తీసుకుంది. అల్లర్లు విస్తరించకుండా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు.

హిందువుల్లో చైతన్యం..
స్థానిక అంశం మతపరమైన ఘటనగా మారింది. దీంతో హిందువులు ఇప్పుడు ‘‘దాడులు ఎదుర్కొనే స్థితి నుంచి దాడులు చేసే స్థాయికి’’ వచ్చారని కొందరు భావిస్తున్నారు. ఇది కొంతమందికి ‘‘చైతన్యం’’ లేదా ‘‘తిరుగుబాటు’’లా కనిపించవచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లలో కొన్ని ప్రాంతాల్లో హిందువులపై హింసాత్మక ఘటనలు పెరిగాయని, వాటికి తగిన ప్రతిస్పందన రావడం లేదని అనుకుంటున్నారు. అయితే నిజమైన చైతన్యం అంటే హింసను హింసతో సమాధానం చెప్పడం కాదు. అది చట్టబద్ధంగా, శాంతియుతంగా, సంఘటితంగా న్యాయం కోరడం.

వ్యవస్థలపై నమ్మకం లేక..
ఇది ‘‘తిరుగుబాటు’’ కాదు, చట్ట వ్యవస్థపై నమ్మకం కోల్పోవడానికి సంకేతం. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం(బీజేపీ) ఈ ఘటనపై స్పందించింది. బుల్డోజర్లు పంపి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులపై చర్యలు మొదలు పెట్టింది. ఇంటర్నెట్‌ నిలిపివేయడం కూడా అల్లర్లు వ్యాపించకుండా చేసే ప్రామాణిక చర్య. ఇది నేరస్థులను భయపెట్టే చర్య, న్యాయం వేగంగా జరిగింది. అయితే బుల్డోజర్‌ చర్యలు న్యాయస్థానాలను దాటి వెళ్లడం, ఒకే సముదాయాన్ని లక్ష్యంగా చేసుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి.

హిందువుల్లో చైతన్యం వచ్చిందని చెప్పడం సులభం. కానీ నిజమైన చైతన్యం హింసను తిరస్కరించి, చట్టం, న్యాయం, శాంతిని బలపరచడంలో ఉంటుంది. డెహ్రాడూన్‌ ఘటన మనకు హెచ్చరిక: ఆగ్రహం సహజం, కానీ దాన్ని సరైన మార్గంలో మళ్లించకపోతే మరిన్ని బాధలు వస్తాయి. న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి. హింస ఎవరికీ పరిష్కారం కాదు. శాంతి, న్యాయం, సామరస్యం ఇవే నిజమైన బలం.

రామ్ చరణ్ కెరియర్ డైలమాలో పడటానికి కారణం ఎవరు..?

Ram Charan Remuneration
Ram Charan Remuneration

Ram Charan Career Dilemma: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతనికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ముఖ్యంగా ‘చిరుత’ సినిమాతో తను మాస్ హీరోగా అవతరించాడు. ఆ తర్వాత ‘మగధీర’ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. రెండో సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ ను బద్దలు కొట్టిన హీరోగా అతనికంటూ ఒక క్రేజ్నైతే ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి రామ్ చరణ్ ఆ తర్వాత కాలంలో పూర్తిగా కమర్షియల్ సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇక రంగస్థలం సినిమాతో తనలోని పూర్తి స్థాయి నటుడిని బయటికి తీసిన రామ్ చరణ్ మొత్తానికైతే నటన పరంగా తన మీద వచ్చిన విమర్శలను తిప్పి కొట్టాడు. ఇక ఇప్పుడు ఆయన పాన్ ఇండియా బాట పట్టిన విషయం మనకు తెలిసిందే. ‘త్రిబుల్ ఆర్’ సినిమా సక్సెస్ అయినప్పటికి దానికి దానికి రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కి కూడా క్రెడిట్ దక్కింది.

‘త్రిబుల్ ఆర్’ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇక రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా సైతం భారీ నష్టాలను మిగుల్చడంతో ఆ సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలైపోయాయి.

ఇక రీసెంట్ గా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా ఓకే అనిపించినప్పటికి రామ్ చరణ్ నుంచి రావాల్సిన సినిమా అయితే కాదని చాలామంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా? రాబోయే సినిమాలతో ఆయన తన మార్కెట్ విపృతంగా పెంచుకోగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ పూర్తిగా గాడి తప్పాడు. అతనికి ఎవరు ఆ కథలను సజెస్ట్ చేశారో తెలియదు కానీ ఆ కథల్లో ఏమాత్రం కంటెంట్ లేకుండా పోయింది. స్క్రీన్ ప్లే తో సినిమా ను నడిపించే ప్రయత్నంలో దర్శకులైతే ముందుకు సాగారు. కానీ రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా కానీ తన బాడీని బిల్డ్ చేయడంలో గాని తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదనే చెప్పాలి…

'కల్కి 2' లో అలియా భట్.. మరి సాయి పల్లవి సంగతి ఏంటి ? పూర్తి వివరాలు మీకోసం..

Kalki 2898 AD Sequel
Kalki 2898 AD Sequel

Kalki 2898 AD Sequel: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సీక్వెల్స్ లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘కల్కి 2’. 2024 వ సంవత్సరం లో విడుదలైన ‘కల్కి’ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. మహాభారతం కి సైన్స్ ఫిక్షన్ జోడించి , నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు అమోఘం. అసలు ఇలాంటి ఆలోచన రావడమే అద్భుతం అనుకుంటే, ఆ ఆలోచనకు అద్భుతమైన విజువల్ ప్రెజెంటేషన్ ఇవ్వడం మరో అద్భుతం. అలాంటి వెండితెర అద్భుతానికి రీసెంట్ గానే సీక్వెల్ షూటింగ్ ని మొదలు పెట్టారు. కమల్ హాసన్ , అమితాబ్ బచ్చన్ మరియు ఇతర తారాగణం పై పలు కీలక సన్నివేశాలను రెసిన్ గానే చిత్రీకరించారు.

రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేశారట. సెప్టెంబర్ నుండి పూర్తి స్థాయి షూటింగ్ మొదలు కాబోతుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ‘sum 30’ పాత్ర నుండి దీపికా పదుకొనే తప్పుకోవడం తో ఆ పాత్రనే సినిమా నుండి తొలగించినట్టు వార్తలు వచ్చాయి. మరికొంత మంది అయితే , ఈ పాత్ర కోసం సాయి పల్లవి ని ఎంచుకున్నారు అంటూ ప్రచారం చేశారు. దీనిపై రీసెంట్ గానే నాగ్ అశ్విన్ స్పందించాడు. ‘sum 30’ పాత్రని తొలగించారు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు , అదే విధంగా ఆ పాత్రని సాయి పల్లవి చేస్తుందంటూ వస్తున్న వార్తల్లో కూడా వాస్తవాలు లేవు, సరైన సమయం వచ్చినప్పుడు , ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ భాగం అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఇందులో ఆమె ‘sum 30’ పాత్ర పోషించలేదని , వేరే కీలక పాత్ర పోషించింది అని , ‘sum 30’ పాత్ర సాయి పల్లవి నే పోషించింది అంటూ ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ గా నాగ్ అశ్విన్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే , ఈ చిత్రం లో సాయి పల్లవి నటించడంలేదు, ఇప్పుడు అలియా భట్ ఈ చిత్రం లో భాగం అయ్యింది అంటున్నారు , ఆమె పై కొన్ని సన్నివేశాలను కూడా తెరకెక్కించారని అంటున్నారు. దీనిని బట్టీ చూస్తుంటే ‘sum 30’ పాత్రని అలియా భట్ పోషించి ఉంది ఉంటుందని , త్వరలోనే మేకర్స్ ఈ విషయం పై అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు ఫ్యాన్స్.

యువకుడి అదృశ్యం.. వైసీపీ 'కాపు' రాజకీయం ప్రారంభం!

Sai Krishna Missing Case
Sai Krishna Missing Case

Sai Krishna Missing Case: ఏపీలో ఏ చిన్న అంశం జరిగిన రాజకీయం చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు సాయి కృష్ణ అనే యువకుడి అదృశ్యం వెనుక కులం కార్డు, రాజకీయ కోణం కనిపిస్తోంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ అదృశ్యమయ్యాడు. పోలీస్ కస్టడీ తరువాత ఆయన అదృశ్యం అయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కస్టడీలోనే ఘాతుకం జరిగి ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ కస్టడీలోనే ఆయనపై దాడి జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు బాధితుడు తల్లి హైకోర్టును ఆశ్రయించారు. పోలీస్ అధికారిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకోవైపు ప్రభుత్వం ఆ సీఐను విఆర్ లో పెట్టింది. ఇంతవరకు ఆ కేసు లో మిస్టరీ మాత్రం వీడడం లేదు..

* చాలా క్రిమినల్ కేసులు..
సాయి కృష్ణ పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి సాయి కృష్ణ ను అదుపులోకి తీసుకొని వచ్చారు. అప్పటి నుంచి అతని ఆచూకీ లేదు. దీనిపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పోలీస్ కస్టడీలో ఏదైనా జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైనే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను దాఖలు చేశారు. విచారించిన కోర్టు సాయి కృష్ణను కోర్టు ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం లాకభ్యత జరిగిందని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

* లాకప్ డెత్ అంటూ ఆరోపణ..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా ఇప్పుడు కాపు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. గాది సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చారు. బాధిత కుటుంబం జనసేనకు అండగా నిలిచిందని… అటువంటి కుటుంబానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అయితే కేవలం వైసీపీ ప్రెస్ మీట్ లు పెట్టి ఆరోపణలు చేస్తోంది. బాధిత కుటుంబం తరఫున ఎటువంటి న్యాయపోరాటం చేయడం లేదు. పెద్దగా ప్రశ్నిస్తున్న దాఖలాలు కూడా లేవు. అయితే ఇదే అంశాన్ని పట్టుకొని ఇప్పుడు వైసిపి రాష్ట్రవ్యాప్తంగా కాపు రాజకీయాన్ని కాక రేపాలని చూస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాతో పాటు డిజిటల్ మీడియాలో దీనిపైన ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. అయితే ఇదంతా కాపుల్లో రగడ సృష్టించేందుకేనని అర్థమవుతోంది. మరోవైపు పోలీసులు మాత్రం సాయి కృష్ణ తమ అదుపులో లేడని చెబుతున్నారు. దీంతో ఆయన అదృశ్యం మిస్టరీ వీడడం లేదు.

స్టేజి మీద ఎమోషనల్ అయిపోయిన హీరో విజయ్ ఆంటోనీ.. దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టిన సతీమణి.

Vijay Antony Emotional Speech
Vijay Antony Emotional Speech

Vijay Antony Emotional Speech: తెలుగు, తమిళ భాషల్లో మంచి ఇమేజ్ , క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోల్లో ఒకరు విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు’ చిత్రంతో ఆరోజుల్లో విజయ్ ఆంటోనీ సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 100 రోజులు మాత్రమే కాదు , 175 రోజులకు పైగా ఈ చిత్రం ఆరోజుల్లో ఆడింది. దాదాపుగా పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ , విజయ్ ఆంటోనీ కి తెలుగు , తమిళ భాషల్లో బిచ్చగాడు తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ మాత్రం పడలేదు. మధ్యలో కొన్ని సినిమాలు యావరేజ్ రేంజ్ లో ఆడాయి కానీ , అవి ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టలేదు , కలెక్షన్స్ పరంగా కూడా అంతంత మాత్రం గానే వచ్చాయి. అందుకే ఇప్పుడు ‘బిచ్చ గాడు’ రేంజ్ హిట్ కోసం విజయ్ ఆంటోనీ ఆ చిత్ర డైరెక్టర్ శశి తో చేతులు కలిపాడు.

వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ కి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ముఖ్య అతిథి గా విచ్చేసింది. అయితే ఈ ఈవెంట్ లో విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయింది. విజయ్ గురించి గొప్పగా చెప్తూ దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇలా విజయ్ ఆంటోనీ సతీమణి గతంలో ఎప్పుడూ కూడా స్టేజి పై ఎమోషనల్ అవ్వలేదు.

ముందుగా విజయ్ ఆంటోనీ సతీమణి ఫాతిమా మాట్లాడుతూ విజయ్ తనకు భర్త మాత్రమే కాదని , తనకీ ఇప్పటికీ ఆయన లవర్ అంటూ చెప్పుకొచ్చింది. తాము ప్రతీ రోజు ఎదో ఒక విషయం లో గొడవ పడుతూనే ఉంటామని, కానీ ఎప్పటికీ ఒకరిపై మరొకరికి ప్రేమ ఇసుమంత కూడా తగ్గదని , పెరుగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చింది. తనకు తండ్రి , తమ్ముడు ఎవ్వరూ లేరని , అన్నీ నేను విజయ్ లోనే చూసుకుంటున్నాను అంటూ ఆమె బాగా ఎమోషనల్ అయిపోయింది. తనని ఇంటికి మాత్రమే పరిమితం చేయకుండా, నిర్మాతని చేసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించే స్థాయిలో నన్ను నా భర్త నిలిపాడని, ఇలాంటి భర్త ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ విజయ్ ని దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టింది. ఇంకా ఆమె ఏమేమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి.

 

బండిని పక్కన పెట్టిన బీజేపీ.. హరీశ్, రేవంత్‌ కోసం ఎందుకు తాపత్రయం?

Bandi Sanjay BJP
Bandi Sanjay BJP

Bandi Sanjay BJP: బీజేపీ.. అంటే ఒక సైద్ధాంతిక పార్టీ. అధికారంతో సంబంధం లేకుండా విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నేతలు ఉంటారని అంతా భావిస్తారు. అయితే అదంతా ఒకప్పుడు. ప్రస్తుత బీజేపీ విధానం మారింది. బెంగాల్‌లో తృణమూల్‌ నుంచి వచ్చిన నేతను ముందు పెట్టి అధికారంలోకి వచ్చింది. అదే వ్యూహం తెలంగాణలో అనుసరించాలని భావిస్తోంది. అధికారం సాధించాలనే ఒకే లక్ష్యంతో బీజేపీ అధిష్టానం కొత్త వ్యూహాలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని లేదా బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును ఆకర్షించి అధికారంలోకి రావాలని ఢిల్లీ నాయకత్వం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సొంతంగా పార్టీని నిర్మించిన స్థానిక నేతలను వదిలేసి, ఇతర పార్టీల నుంచి వచ్చే వారిపై ఎంతగా నమ్మకం పెట్టుకుంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.

కిషన్‌రెడ్డి డిఫెన్స్‌.. బండి దూకుడు..
రాష్ట్రంలో ఎక్కువ కాలం బీజేపీని నడిపిన కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డికి అధిష్టానం అనేక అవకాశాలు ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ పార్టీని బలంగా నిలబెట్టడంలో ఆయన విధానం ఎక్కువగా రక్షణాత్మకంగానే ఉండేది. బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఆయన హిందుత్వ నినాదాలు, ప్రజా యాత్రలు, దూకుడు రాజకీయ శైలి బీజేపీని మూడో స్థానం నుంచి బీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారుగా మార్చాయి. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఫలితాలు ఈ మార్పుకు నిదర్శనం.

బండి తప్పించి కాంగ్రెస్‌ను గెలిపించి..
2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు బండి సంజయ్‌ను అకస్మాత్తుగా అధ్యక్ష పదవి నుంచి తొలగించి మళ్లీ కిషన్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం పార్టీ ఎదుగుదలకు బ్రేకులు వేసింది. ఈ నిర్ణయం వల్ల బీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటర్లు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారు. అనేక క్షేత్రస్థాయి కార్యకర్తలు బండి సంజయ్‌ను పక్కన పెట్టడమే కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు.

ఇప్పుడు వలస నేతలవైపు..
సొంత పార్టీలోని దూకుడు నాయకులను అణచివేసిన ఢిల్లీ నాయకత్వం, ఆ తర్వాత బయటి నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌ వంటి నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఈటల రాజేందర్‌ చేరికతో కొంత ప్రయోజనం జరిగినప్పటికీ, బీజేపీ అసలు బలమైన ఓటు బ్యాంకును నిలబెట్టడంలో ఆయన సాధించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ రేవంత్‌ రెడ్డి లేదా హరీష్‌ రావు వైపు దృష్టి పెట్టడం ఢిల్లీ నాయకత్వం రాజకీయ నిరాశను చూపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు తాత్కాలికంగా అధికారం ఇవ్వగలరేమో గానీ, బీజేపీ భావజాలాన్ని గ్రామస్థాయిలో వ్యాప్తి చేయలేరు.

బండి సంజయ్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే..
రాజకీయ సమీకరణాల పరంగా బండి సంజయ్‌ తెలంగాణలో బీజేపీకి బలమైన ఆయుధంగా మారగలరు. వెనుకబడిన వర్గాలలో ఆయనకున్న సామాజిక పట్టు, యువతలో ఉన్న మాస్‌ ఇమేజ్, హిందుత్వ సెంటిమెంట్, ఏ నాయకుడినైనా ఎదుర్కొనే దూకుడు – ఇవన్నీ పార్టీకి పెద్ద మద్దతు ఇవ్వగలవు. ఒక్కసారి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, రాబోయే ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తెస్తే పార్టీని అధికారంలోకి తీసుకెళ్లగలరని అనేక మంది రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించి సొంత పార్టీని బలహీనం చేసుకోవడం ఏ పార్టీకైనా ప్రమాదకరం. రేవంత్‌ రెడ్డి లేదా హరీశ్‌రావు లాంటి వారు ఒక్కసారిగా బీజేపీలోకి వస్తారని ఆశించడం కంటే, కళ్లముందున్న బండి సంజయ్‌ వంటి స్థానిక నాయకుడికి పగ్గాలు అప్పగించడమే తెలంగాణలో కమలం వికసించడానికి సరైన మార్గం. ఢిల్లీ అధిష్టానం ఇప్పటికైనా వలస వ్యూహాలను వదిలి, స్థానిక నాయకత్వంపై నమ్మకం పెంచుకుంటేనే రాష్ట్రంలో బీజేపీకి విజయం సాధ్యమవుతుంది.

అసలు బీజేపీపై బీఆర్ఎస్ ఎందుకు పోరాడడం లేదు.. కారణమేంటి..?

BRS BJP Strategy
BRS BJP Strategy

BRS BJP Strategy: తెలంగాణ రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాబోయే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీనేనని, కాంగ్రెస్‌తో పోటీ లేదని, తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ శ్రేణులు చేస్తున్న కార్యకలాపాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి.

చెప్పేది ఒకటి.. చేసేది ఇంకోటి..
కేటీఆర్‌ చెప్పినట్లు బీజేపీని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే, ఆ పార్టీ విధానాలు, నిర్ణయాలపై నిరంతర విమర్శలు, ప్రచారం జరగాలి. కానీ ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేస్తున్న సమావేశాలు, నిరసనలు, ప్రచారాలు అన్నీ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాల చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీని నేరుగా ఎదుర్కొనే ప్రయత్నాలు ఇప్పటికీ కనిపించడం లేదు.

గతంలోని బీజేపీ వ్యతిరేకత..
కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఢిల్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై గట్టి వ్యతిరేకత వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపాలని పార్టీ పేరును కూడా టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా మార్చారు. అయితే ఆ తర్వాత ఆ వైఖరి హఠాత్తుగా మారిపోయినట్లు కనిపిస్తోంది. కేంద్ర పెద్దలపై లేదా బీజేపీ విధానాలపై గట్టి విమర్శలు చేసిన సందర్భాలు ఇటీవలి కాలంలో చాలా తక్కువగా ఉన్నాయి.

ఈ కొత్త రాగం వెనుక రాజకీయ వ్యూహం..
కేటీఆర్‌ ఇప్పుడు చెబుతున్న మాటల వెనుక రెండు ప్రధాన ఉద్దేశాలు ఉండవచ్చు. ఒకటి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను బీజేపీ వైపు వెళ్లకుండా బీఆర్‌ఎస్‌వైపు మరల్చి, ఆ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవడం. రెండు, తమ కేడర్‌లో నైరాశ్యం తగ్గించి, తాము ఇంకా రేసులో ఉన్నామని, కాంగ్రెస్‌ మూడో స్థానానికి పడిపోతుందని చెప్పి జోష్‌ నింపడం.

మాటలు కాదు.. చేతలు కావాలి…
కేవలం ప్రెస్‌ మీట్లలో ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం వల్ల ప్రజల్లో నమ్మకం కలగదు. బీఆర్‌ఎస్‌ నిజంగా బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తే, రాబోయే బస్సు యాత్రలు, పాదయాత్రల్లో కేవలం రాష్ట్ర సమస్యలు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా గట్టిగా మాట్లాడాలి. అలా చేస్తేనే ఈ ప్రకటనలకు విలువ ఏర్పడుతుంది.

గత అనుభవాలు గుర్తుంచుకున్న ఓటర్లు తెరవెనుక ఒకటి, తెరపై మరొకటి చేస్తే సులభంగా నమ్మరు. బీఆర్‌ఎస్‌ నిజంగా బీజేపీపై పోరాడాలనుకుంటే, ఆ దిశగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలి. అప్పుడే కేటీఆర్‌ ఆశించినట్లు క్షేత్రస్థాయిలో కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

వైసిపి నిరూపించుకోవాల్సిందే!

YSRCP Caste Politics
YSRCP Caste Politics

YSRCP Political Situation: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పూర్తిగా నైరాస్యంలో పడిపోయింది. 2014లో ఓడిపోయింది కానీ గౌరవప్రదమైన సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలబడింది. ఈసారి మాత్రం దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. పార్టీలో పూర్తిగా నిస్తేజం అలుముకుంది. కొన్ని వర్గాలు అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకం అయిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే ఉన్న ఏకైక అవకాశం స్థానిక సంస్థల ఎన్నికలు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం అన్నది లేకుండా చూడాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం సైతం తాము వైసీపీ ప్రభుత్వం మాదిరిగా వ్యవహరించమని.. పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్నారు. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి టర్నింగ్ పాయింట్ గా నిలిచే అవకాశం ఉంది.

* వైసిపి హయాంలో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో 2021 లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. అప్పట్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తరువాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అధికార పార్టీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరించిందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అందుకే టిడిపి అధినేత చంద్రబాబు ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించారు. అప్పట్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన సంయుక్తంగా 20 శాతానికి పైగా గెలుచుకున్నాయి. 80 శాతం వరకు వైసిపి పంచాయితీలను కైవసం చేసుకుంది. 100కు పైగా మున్సిపాలిటీలతోపాటు 12 కార్పొరేషన్లకు సంబంధించి కూడా వైసిపి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే అప్పట్లో వైసిపి దూకుడుగా వ్యవహరించడమే కాదు.. అధికార జులుం ప్రదర్శించిందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు అనేవి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ 20 శాతానికి పైగా ప్రతిపక్షం గెలుచుకుంటే టర్నింగ్ పాయింట్ అయినట్టే.

* ఎన్నికలకు సిద్ధం..
కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతోంది. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రస్తుతం జరుగుతోంది. వెనువెంటనే సామాజిక పింఛన్లు తో పాటు అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రకటనలు రానున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. అయితే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే అంశం. అప్పట్లో వైసీపీ వ్యవహరించినట్టుగా తమ ప్రభుత్వం వ్యవహరించదని చంద్రబాబు చెబుతున్నారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో కూటమి ఏకపక్షంగా గెలుచుకుంటే వైసీపీకి ఇబ్బందికరమే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 20 శాతానికి పైగా స్థానిక సంస్థలను కైవసం చేసుకుంటే ఆ పార్టీకి ప్లస్ పాయింట్. కానీ వైసిపి ఆ పని చేయగలదా? అంటే అనుమానమే. ఎందుకంటే ఇప్పటికీ ఆ మూడు పార్టీల మధ్య బంధం గట్టిగా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదన్న కసి కనిపిస్తోంది.

పవన్ సీరియస్ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాల్లో హోదా కోసం డిప్యూటీ సీఎం అనే కొత్త పదాన్ని చేర్చుతారు. ఒకే పార్టీలో నేతల మధ్య పోటీ ఉంటే.. పొత్తులో భాగంగా వివిధ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. అటువంటి సమయంలో డిప్యూటీ సీఎం అనే విభజనతో ఒక పదవిని సృష్టిస్తారు. ప్రతి రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి ఉంది. డిప్యూటీ సీఎం పోస్టు ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో సైతం డిప్యూటీ సీఎం పదవులు ఉండేవి. అటు తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్లో సైతం డిప్యూటీ సీఎం సంస్కృతి కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి హయానికి వచ్చేసరికి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు అయ్యారు. కానీ ఈసారి చంద్రబాబు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. అయితే గతానికి భిన్నంగా డిప్యూటీ సీఎం హోదాలో సరైన గౌరవం అందుకుంటున్నారు పవన్ కళ్యాణ్.

* ఎంతో ప్రాధాన్యం..
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలు భాగస్వామ్యం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ను. ఆయన శాఖల విషయంలో కూడా ఎంతో స్వతంత్రం ఇచ్చారు. పంచాయితీ రాజ్ తోపాటు గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ శాఖలో నిధుల మంజూరు, పనులు చేపట్టడం, సంస్కరణలు అమలు చేయడం వంటి వాటి విషయంలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. సీఎం మాదిరిగా కొన్ని శాఖల వైఫల్యాల గురించి కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్. అయితే మిగతా మంత్రులు చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ కు గౌరవం ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అదే గౌరవాన్ని పొందుతున్నారు.

* రాజ్యాంగంలో లేదు..
వాస్తవానికి రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పోస్ట్ లేదు. రాజకీయంగా సృష్టించుకున్న పదవి అది. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎంగా ఉన్న తన ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తన శాఖల విషయంలో మాత్రం చాలా సీరియస్ గా అడుగులు వేస్తున్నారు. అటవీ శాఖ విషయంలో గిరిజన ప్రాంతాల్లో చాలా కార్యక్రమాలు చేపట్టారు. పర్యావరణ శాఖ మంత్రిగా చాలా విషయాల్లో సంస్కరించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా గ్రామాల స్వరూపాన్ని మార్చారు. పల్లె పండుగ పేరుతో గ్రామీణ రహదారులను మెరుగుపరిచారు. అటవీ శాఖ మంత్రిగా కొండా శిఖర గ్రామాల ప్రజల కోసం సరైన రహదారులను నిర్మించారు. ఇప్పుడు గోదావరి పుష్కరాల నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. గోదావరి నది కాలుష్యంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే డిప్యూటీ సీఎంల విషయంలో గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఒక సీరియస్ డిప్యూటీ సీఎంలా గుర్తింపు పొందారు.

ప్రకాష్ రాజ్ చుట్టూ బిజెపి ఉచ్చు!

Prakash Raj
Prakash Raj

Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజు పై హిందూ సమాజం ఆగ్రహం గానే ఉంది. ఆయన అనవసర వివాదాస్పద అంశాల జోలికి వెళ్లి తన మీదకు తెచ్చుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన కర్ణాటక ధర్మస్థల పై అంతర్జాతీయ కుట్రలో ఆయన భాగస్తుడు అని ఆరోపణలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఏకంగా తిరుపతిలో ఆయనపై కోర్టులో ఒక దావా వేయడం విశేషం. దీంతో ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసు నమోదయింది. రాముడితో పాటు లక్ష్మణుడిని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ అత్యంత హేయమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి సీనియర్ నేత, టిటిడి పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తిరుపతిలోని 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించారు. ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగానే మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆయన న్యాయస్థానానికి సమర్పించిన పిటిషన్ లో పేర్కొన్నారు.

* రామలక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు..
కేరళలో లిటరేచర్ ఫెస్టివల్ కు హాజరయ్యారు ప్రకాష్ రాజ్. ఆ సమయంలో హిందూ ధర్మంపై హాట్ కామెంట్స్ చేశారు. రామలక్ష్మణులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాదికి వచ్చిన వలస కూలీలుగా పేర్కొన్నారు. రావణుడి తోటలో పండ్లను దొంగిలించారు అంటూ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. గతంలోనే ప్రకాష్ రాజుకు లీగల్ నోటీసులు పంపించారు లాయర్ ద్వారా బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి. కానీ అందుకు ప్రకాష్ రాజ్ ముందుకు రాలేదు. క్షమాపణలు చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందుకే భాను ప్రకాష్ రెడ్డి ప్రకాష్ రాజ్ పై చట్టపరమైన పోరాటం ప్రారంభించారు. తిరుపతి కోర్టులో క్రిమినల్ దావా దాఖలు చేశారు. హిందూ దేవుళ్ళతోపాటు సంప్రదాయాలపై సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజు చేసే కామెంట్స్ ను కూడా గుర్తు చేశారు భాను ప్రకాష్ రెడ్డి.

* చిత్ర పరిశ్రమకు ఫిర్యాదు..
కేవలం చట్టపరంగానే కాదు ప్రకాష్ రాజ్ పై భాను ప్రకాశ్ రెడ్డి చిత్ర పరిశ్రమకు సంబంధించిన అసోసియేషన్స్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. హిందూ సమాజం ఇస్తున్న ఆదరణతోనే నటుడిగా ప్రకాష్ రాజు కోట్లు సంపాదిస్తున్నారని.. తిరిగి అదే సమాజాన్ని అవమానించేలా మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం మా తో పాటు.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్స్ కు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు కూడా భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై ప్రకాష్ రాజు వరుసగా విమర్శలు చేస్తూ వచ్చారు. పవన్ రాజకీయ విధానాలపై కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి వ్యతిరేక కామెంట్స్ చేస్తుంటారు ప్రకాష్ రాజ్. అయితే బిజెపి ఫిర్యాదుతో ఆయన వెనక్కి తగ్గుతారా? లేదా? అన్నది చూడాలి.

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కొత్త కోణం!

Tuni Missing Girl
Tuni Missing Girl

Missing Child Case: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ వీడడం లేదు. పది రోజులు అవుతున్నా చిన్నారి ఆచూకీ లభించలేదు. వందలాదిమంది పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఈ కేసులో కీలకమైన పెంపుడు కుక్క సైతం మృతి చెందింది. దాని పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత నేరుగా ఈ ఘటనపై పర్యవేక్షణ చేపట్టి.. ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 30 మంది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని నాలుగు ప్రత్యేక బృందాలుగా విభజించి.. చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. వీరితో పాటు 150 మందికి పైగా పోలీసులు పది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగింది. అయినా సరే చిన్న క్లూ కూడా దొరకడం లేదు.

* కుక్క మరణించడంతో..
ఆ చిన్నారితో పాటు వారి పెంపుడు కుక్క కూడా మృతి చెందింది. దీంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదృశ్యమైన రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఈ కుక్క పోలీసులతో పాటు స్థానికులను చూసి భయపడి వెళ్ళిపోయింది. మరుసటి రోజు తిరిగి వచ్చిన తర్వాత కుక్క మెడకు జిపిఎస్ ట్రాకర్ బిగించి.. అది తిరిగే ప్రాంతాలను గుర్తించారు. దాదాపు పది కిలోమీటర్లు తిరిగిన తర్వాత కుక్క అస్వస్థతకు గురై మరణించింది.. పెంపుడు కుక్క మృతి పై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అందుకే పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. కుక్క శివ పరీక్షను చేపట్టి శరీర భాగాల నమూనాలను సేకరించారు. విశాఖ ల్యాబ్ కు తరలించారు . పోస్టుమార్టం నివేదికతో పాటు ల్యాబ్ ఫలితాలు దర్యాప్తులో కొత్త సమాచారం వెలుగులోకి తెచ్చే అవకాశం ఉందని అధికారులు ఒక ఒక అంచనా తో ఉన్నారు.

* అటవీ జంతువులపై అనుమానం..
మరోవైపు చిన్నారి జ్ఞానేశ్వరి అటవీ జంతువుల బారిన పడి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొండచిలువు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని అనుమానిస్తున్నారు. అందుకే చిన్నారి దుస్తులు సహా ఆనవాళ్లు సైతం కనిపించకుండా పోయాయని భావిస్తున్నారు పోలీసులు. అటవీ శాఖ అధికారులు మాత్రం దీనితో విభేదిస్తున్నారు. ఈ ప్రాంతంలో మనుషులపై క్రూర మృగాలు, వన్యప్రాణులు దాడి చేసిన దాఖలాలు లేవని చెబుతున్నారు. దీంతో జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ కేసును. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గ వద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్దిష్టమైన ఆనవాళ్లు ఏవీ లభించకపోవడంతో పోలీసులు సైతం ఏ నిర్ధారణకు రాలేకపోతున్నారు.

జగన్ నోట కాక్రోచ్.. 24 గంటలు తిరగకముందే వైసిపి ఫేస్బుక్ పేజీ క్లోజ్!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ప్రపంచంలో ఏ తప్పు జరిగినా అది చంద్రబాబుది అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి తీరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని మెటా సంస్థ నిలిపివేసింది. దీంతో తాడేపల్లి ప్యాలెస్ పెద్ద గగ్గులు పెడుతోంది. మా గొంతు నొక్కేస్తున్నారు అంటూ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి కింది స్థాయి నేతల వరకు ఒకటే ఏడుపు. ప్రజాస్వామ్య కూని జరిగిందని జగన్ ఆరోపిస్తూ సుదీర్ఘంగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేశారు. అందులో భారత ప్రభుత్వం నుంచి వచ్చిన చట్టపరమైన ఫిర్యాదులు, నిబంధనల ఉల్లంఘనలతో ఈ పేజీని నిలిపి వేశాం అని స్పష్టంగా మెటా సంస్థ రాసుకొచ్చింది. అయినా సరే అదే పనిగా చంద్రబాబును నిందించారు జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ నేతలు.

* దేశం ఫిర్యాదుతోనే..
సోషల్ మీడియా అకౌంట్ కు సంబంధించి దేశానికి తప్పకుండా ఒక బాధ్యత ఉంటుంది. అసభ్య పదజాలాలు అశ్లీలతో కూడిన పోస్టులు ఉంటే కచ్చితంగా మెటా నిషేధిస్తుంది. పైగా అది ఒక రాజకీయ పార్టీకి చెందిన అధికారిక ఫేస్బుక్ అకౌంట్ పేజీ. కచ్చితంగా సమాజం పై ప్రభావం చూపుతుంది. అటువంటి దాని విషయంలో సోషల్ మీడియా నిర్వహణను చూస్తే మెటా లాంటి సంస్థ నిఘా పెడుతుంది. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఫేస్బుక్ అకౌంట్ పేజీ నిలిపివేతకు కారణం చెప్పింది మెటా. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ ఐటీ నిబంధనల ప్రకారం వైసీపీ పేజీని బ్యాన్ చేసిందని కళ్ళముందే అక్షరాలు కనిపిస్తున్నా.. జగన్ మాత్రం ఢిల్లీ వైపు చూసి ఒక్క మాట అనడం లేదు. దానికి కారణం కేసుల భయం అన్నది చిన్నపిల్లాడిని అడిగిన ఇట్టే చెప్పేస్తాడు.

* కేంద్రం చేసిందని తెలుసు..
ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేసినట్టు.. అంతర్జాతీయ సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేగలదా? కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కేంద్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన దెబ్బ కొట్టింది. దానిపై కేంద్రాన్ని నిలదీయాలి. అయితే అంత ధైర్యం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఎందుకంటే అంత సీన్ లేదు కూడా. ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో కేంద్రం నుంచి రియాక్షన్ జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. అందుకే చంద్రబాబు నమ్ముకున్నారు. చంద్రబాబుపై ఒక విమర్శ చేసి క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాక్రోచ్ జనతా పార్టీతో పోల్చుకున్నారు. అంటే అదేదో గొప్పతనంగా చెప్పుకున్నారు కానీ. అది కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రూపొందించింది అనే విషయాన్ని మరిచిపోయి కాక్రోచ్ తో పోల్చారు. అలా పోల్చిన 24 గంటల్లోనే సోషల్ మీడియా ఫేస్బుక్ పేజీ నిలిచిపోయింది. డిజిటల్ కంటెంట్ పేరుతో సమాజంలో అశాంతి రేపుతున్నారంటూ కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిన నివేదికల ఆధారంగానే ఆ యాక్షన్ జరిగింది. ఇంత ఘోరంగా తమను బిజెపిని టార్గెట్ చేస్తోందని… తమ డిజిటల్ సామ్రాజ్యాన్ని కూల్చేస్తుందని తెలిసినా కనీసం ఎక్స్ లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితి జగన్మోహన్ రెడ్డి.

విశాఖకు ఏం తక్కువ..? అంత చులకనా రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy:  ఏపీ అభివృద్ధి పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు లేవు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నా హర్షించిన దాఖలాలు లేవు. కేంద్ర పెట్టుబడులను స్వాగతించిన పరిస్థితి లేదు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుల అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని చెబుతూ.. మాదాపూర్- జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలు కలిపినా.. అంత పరిధి లేని విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్టు అనుమతి లభించింది అంటూ వ్యాఖ్యానించారు రేవంత్. అయితే తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని.. ఏపీకి మాత్రం ప్రాధాన్యమిస్తోందని చెప్పేందుకు రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో విశాఖ ప్రాధాన్యత గుర్తించడంలో రేవంత్ విఫలమయ్యారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

* గ్రేటర్ విశాఖ పరిధి ఎక్కువ..
ఏదైనా ఒక నగర ప్రాధాన్యతను కేవలం భౌగోళిక విస్తీర్ణం, సైజును బట్టి మాత్రమే అంచనా వేయడం సరికాదు. అది సృష్టిస్తున్న ఆర్థిక వ్యవస్థ, జనాభా ప్రాతినిధ్యం, పారిశ్రామిక బలాన్ని బట్టి చూడాలని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన రేవంత్ రెడ్డి చేసిన ఈ పోలిక సరికాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన చెబుతున్నట్టు జూబ్లీహిల్స్, మాదాపూర్ సేరి లింగంపల్లి మండల పరిధిలోని ఐటి కారిడార్ ప్రాంతాలు కలిపినా.. వాటి విస్తీర్ణం కేవలం 45 నుంచి 50 చదరపు కిలోమీటర్ల లోపే ఉంటుంది. కానీ గ్రేటర్ కార్పొరేషన్ పరిధి, నగర విస్తీర్ణమే అక్షరాల 640 చదరపు కిలోమీటర్లు. రేవంత్ పోల్చినట్టు చూస్తే దానికి 12 రెట్లు అదనం అన్నమాట. ఇక విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ పరిధి ఏకంగా 7328 చదరపు కిలోమీటర్లు. ఇలా చూసుకున్న రేవంత్ రెడ్డి అంచనా చాలా తప్పు.

* జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు…
మాదాపూర్ తో పాటు జూబ్లీహిల్స్ లో స్థిర నివాసితులు కేవలం మూడు నుంచి నాలుగు లక్షల వరకు మాత్రమే. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం విశాఖపట్నం పరిధిలో 20 లక్షల కుటుంబాలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోగా.. తాజా జనాభా లెక్కల ప్రకారం మరో ఆరు ఏడు లక్షల కుటుంబాలు పెరిగి ఉంటాయి. దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల జాబితాలో వైజాగ్ 17వ స్థానంలో నిలిచింది. ఇక భారత దేశంలో సంపన్న నగరాల అధికారిక జాబితాలో విశాఖ స్థానం 10. జిడిపిలో కూడా మంచి స్థానంలోనే ఉంది. ఏపీ మొత్తం జిడిపిలో ఒక్క విశాఖ 23 శాతానికి పైగా కలిగి ఉంది అంటే ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. అటువంటి విశాఖ నగరం విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎంత మాత్రం సరికావు అనేది నిపుణుల మాట. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతులు రాకపోవడానికి రాజకీయ నేతలు చేసిన తప్పులు, సాంకేతిక కారణాలే కారణం. ఆ ప్రాజెక్టుతో రాజకీయాలు చేసుకుంటున్నారు. కానీ తమ సోదర రాష్ట్రం రాజకీయంగా సఖ్యతగా మెలుగుతూ ప్రాజెక్టులను సాధిస్తాంది. దానిని గుర్తించాల్సింది పోయి.. ఇతర ప్రాంతాలను కించపరిచేలా మాట్లాడడం మాత్రం సరికాదు. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటేనే చాలా మంచిది.

మటన్ మానేశాడు.. రోజుకు 600 చొప్పున మొదలుపెట్టాడు.. ఇదీ వైభవ్ సూర్య వంశీ అంటే..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: సూర్య వంశీ గురించి రోజుకు ఒక వార్త మీడియాలో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అతడు సెలబ్రిటీ. పైగా దూకుడు మీద ఆడుతున్నాడు. శ్రీలంక సిరీస్లో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. అతడు ఆకాశమే హద్దుగా చెలరేగే రకం. ఐపీఎల్ లో తన సత్తా ఏమిటో చూపించాడు. కొత్తగా తనను తాను ప్రూఫ్ చేసుకోవడానికి ఏమీ లేదు. అయితే శ్రీలంక మైదానాలు అంత పట్టు లేకపోవడంతో సూర్య వంశీ.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు.

సూర్యవంశీ కి మటన్ అంటే చాలా ఇష్టం. గత ఐపిఎల్ లోనే దాన్ని పూర్తిగా మానేశాడు. డైట్ మొత్తం వేరే విధంగా మార్చుకున్నాడు. ప్రత్యేకంగా డైటీషియన్ ను నియమించుకున్నాడు. సాధ్యమైనంతవరకు తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మటన్ మానేసిన తర్వాత సూర్య వంశీ వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నాడు. సింగిల్స్ తీయడంలో కూడా నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నాడు.

వైభవ్ సూర్య వంశీ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. అదే అతడి శ్రమ. ఇప్పుడు అతడు ప్రతిరోజు 600 పైగా బంతులను ప్రాక్టీస్ చేస్తున్నాడు. గతంలో కూడా అతడు ఇదే స్థాయిలో ప్రాక్టీస్ చేసేవాడు. ఇప్పుడు తన ప్రాక్టీస్ మరింత పెంచాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అతడు మైదానంలోనే మునిగి తేలుతున్నాడు. అందువల్లే అతడు భారీగా పరుగులు చేయగలుగుతున్నాడు. శ్రీలంక మైదానాలు అతనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. అందువల్లే ప్రస్తుత సిరీస్లో అంతగా పరుగులు చేయలేకపోతున్నాడు. కాకపోతే అతడు త్వరలోనే మళ్లీ పూర్వపు లయలోకి వస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సూర్య వంశీ గతంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతడి తల్లి అర్ధరాత్రి రెండు గంటలకు లేచేది. అతడికి భోజనాన్ని సిద్ధం చేసేది.. తండ్రి దాదాపు రెండున్నర గంటలు ప్రయాణించేవాడు. ఆ తర్వాత వాళ్లు కోచింగ్ సెంటర్ లోకి వెళ్లి పోయేవారు. కొడుకు ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రాక్టీస్ చేస్తుంటే తండ్రి అక్కడే ఉండేవాడు. అతని కుమారుడి ఆట తీరు పరిశీలించేవాడు. ఇంత శ్రమ పడ్డాడు కాబట్టే.. సూర్య వంశీ ఈ స్థాయిలో ఆకట్టుకుంటున్నాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

సూర్యవంశీ ఈ స్థాయిలో దూకుడుగా ఆడటం వెనుక అతడి ప్రాక్టీసే ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అతడు ఆడే విధానం ఇంత గొప్పగా ఉండడానికి ఆట మీద మక్కువ కారణమని వివరిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తు కాలంలో అతడు మరింత రాటు తేలిపోతాడని.. టీమిండియా అతని చేతుల్లో సెక్యూర్డ్ గా ఉంటుందని మాజీ క్రికెటర్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

భయపడేందుకు అది పాకిస్తాన్ కాదు.. ఇజ్రాయిల్.. అమెరికాకు సినిమా ఇప్పుడు అర్థమైంది

Pakistan And Israel
Pakistan And Israel

Pakistan And Israel: సరిగ్గా కొద్ది నెలల క్రితం పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ అమెరికా వెళ్లారు. ఏవో రంగు డబ్బాలను ప్రెసిడెంట్ ట్రంప్ కు చూపించారు. దానికి అతడు ఎగిరి గంతులు వేశాడు. తప్పకుండా చేద్దామంటూ మాటిచ్చాడు. ఇంతకీ ట్రంప్ కు మునీర్ చూపించిన ఆ రంగు డబ్బాలు మరేంటో కాదు.. ఖరీదైన ఖనిజాలు. అమెరికాకు దోచి పెట్టేందుకు మునీర్ అక్కడదాకా ఎందుకు వెళ్ళాడు అంటే.. అతడి పదవిని కాపాడుకోవడం కోసం.. అమెరికా కన్ను అతని మీద పడకుండా ఉండడం కోసం..

ఇక అప్పటినుంచి ట్రంప్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ విషయంలో సానుకూలంగా ఉండడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఉగ్రవాదులకు స్థావరమైన పాకిస్తాన్ దేశాన్ని.. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరిపే దేశంగా మార్చాడు. అయితే ఆ శాంతి చర్చలు విఫలమయ్యాయి. చివరికి ఈ చర్చలు జరిగిన హోటల్ బిల్లు కూడా పాకిస్తాన్ కట్టలేకపోయింది.

పాకిస్తాన్ తీరు అలా ఉంటే.. ఇజ్రాయిల్ అమెరికా విషయంలో మరో విధంగా స్పందిస్తుంది. ఇటీవల ఇరాన్ దేశంతో జరిగిన యుద్ధంలో ఇజ్రాయిల్ కోసం అమెరికా రంగంలోకి వచ్చింది. ఈ యుద్ధం మీద ఇజ్రాయిల్ 30 రూపాయలు ఖర్చు పెడితే.. 70 రూపాయలు అమెరికా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. యుద్ధం వల్ల అమెరికా భారీగా నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇప్పుడు ఇరాన్ కు ఇవ్వాల్సిన పరిహారం మొత్తం అమెరికాను చెల్లించాలి. యుద్ధం వల్ల ఇజ్రాయిల్ లాభపడింది. అమెరికా నష్టపోయింది. అంతేకాదు ఇరాన్ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం తో మాకు సంబంధం లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేస్తోంది. అంతేకాదు, అమెరికా చెప్పినట్టు వినాల్సిన అవసరం మాకు లేదని ఓపెన్ గా చెప్పేసింది. మా ఇష్టం మేము ఇదేవిధంగా ఉంటామని.. అమెరికా వెలుపడితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించింది. ఇటీవల కాలంలో నేతన్యహు ను పదేపదే అమెరికా అధ్యక్షుడు విమర్శించాడు. అప్పుడు ఇజ్రాయిల్ పెద్దగా కౌంటర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇరాన్ దేశంతో డీల్ కుదుర్చుకున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ మొహమాటం లేకుండా మాట్లాడుతోంది. అయినా అదేమైనా పాకిస్తానా.. అమెరికా చెప్పినట్టు వినడానికి..