Home Blog Page 114

ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు ఈ విషయాల్లో అనుకోని ధన లాభం..

Today 17 June 2026 Horoscope
Today 17 June 2026 Horoscope

Today 17 June 2026 Horoscope:   జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా శుభయోగం జరిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావచ్చు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా వస్తువులు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల కెరీర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులు శుభవార్తల విని అవకాశం ఉంటుంది. గతంలో చేపట్టిన పనులన్నిటిలో ఈరోజు పూర్తి చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి. వివిధ రంగాల్లో పనిచేసే వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు అనేక విషయాల్లో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధికంగా లాభాలు ఉంటాయి. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహరాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటుంది. కొత్త వస్తువుల కొనుగోలుపై దృష్టి పెడతారు. వ్యాపారులకు ఆ గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ముఖ్యమైన పనులన్నీ వాయిదా వేయకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకోకుండా అదృష్టం వరించి అవకాశం ఉంది. దీంతో అపారమైన లాభాలు ఉండే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వసూలు అవుతుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. రావాల్సిన బకాయిలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యమైన ఉద్యోగ ప్రదర్శన ద్వారా ప్రశంసలు అందుతాయి. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఆస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. విదేశాలకు వెళ్లాలని అనుకుంటే ఇదే మంచి సమయం. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధించేందుకు వ్యాపారులు సిద్ధమవుతారు. అనుకున్న కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అనుకోకుండా సంపద తిరిగే అవకాశం ఉంటుంది. శక్తి సమస్యల మీదకు ఖర్చులు చేస్తారు. అయితే కొత్త వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో సమ్యమనం పాటించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రశాంతంగా ఉంటారు.

క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. టీమిండియా అభిమానులకు ‘తీన్’మారే..12 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్

India Cricket Schedule
India Cricket Schedule

India Cricket Schedule: మనలో చాలామందికి క్రికెట్ చాలా ఇష్టం. మన జట్టు ఆడుతుంటే క్రికెట్ చూస్తూ ఉంటాం. చివరికి ఇతర జట్లు ఆడుతుంటే కూడా చూస్తూనే ఉంటాం. ఎందుకంటే క్రికెట్ అనేది మనకు ఒక ఎమోషన్. పరాయి క్రీడ అయినప్పటికీ.. మనదేశంలోనే పుట్టిందన్నట్టుగా మనం ఆ క్రీడను ఓన్ చేసుకున్నాం. ఐపీఎల్ లాంటి టోర్నీ జరిపే మాత్రం మైదానాలు తాండోపతండాలుగా అభిమానులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. దీనినిబట్టి క్రికెట్ అంటే మన వాళ్లకు ఏ స్థాయిలో ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.

ఇండియా ఆడే మ్యాచ్ లను కంటి రెప్ప ఆర్పకుండా అభిమానులు చూస్తారు. అటువంటిది ఒకేరోజు ఇండియా మూడు మ్యాచ్లు ఆడితే.. ఆనందం ఎలా ఉంటుంది
.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్రికెట్ మజా సాగిపోతే ఎలా ఉంటుంది.. ఇప్పుడు ఇదే అనుభూతిని అభిమానులకు అందించేందుకు భారత క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు.

ట్రై సిరీస్ లో భాగంగా భారత్ నేడు అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో పోటీ పడబోతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో గెలవాలి. అలా గెలిస్తేనే ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ ఉదయం పదిగంటల నుంచి మొదలవుతుంది. సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతూ ఉంటుంది.

భారత సీనియర్ల జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో రెండవ వన్డే మ్యాచ్ లక్నో లో ఆడుతోంది. ఇటీవల ధర్మశాలలో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే లక్నోలో గెలిచి.. ట్రోఫీ అందుకోవాలని భారత్ భావిస్తుంది. టీమ్ ఇండియా ప్లేయర్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు.

మరోవైపు భారత మహిళల జట్టు టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ జట్టుతో నేడు పోటీ పడబోతోంది. సాయంత్రం ఏడు గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలవుతుంది. జియో హాట్ స్టార్ లోలైవ్ స్ట్రీమ్ అవుతుంది. భారత ఏ జట్టు నుంచి మొదలు పెడితే మహిళల జట్టు వరకు మూడు మ్యాచ్లు ఒకే రోజు ఉండడం.. అది కూడా గంటల వ్యవధిలో సాగుతూ ఉండడంతో.. అభిమానులకు వీనుల విందైన క్రికెట్ ఆనందం లభించనుంది.

అమెరికా ఎఫ్ 35 ఖతం.. పాక్ పని పట్టడం ఖాయం.. మన స్వదేశీ ’ఆరుద్ర’ రాడర్ వచ్చేసింది.. విశేషాలివీ

Arudhra Radar India

Arudhra Radar India : నేటి కాలంలో యుద్ధాలు వేరే విధంగా సాగుతున్నాయి. బాంబులు కాకుండా పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన మిస్సైల్స్ ద్వారానే యుద్ధాలు నడుస్తున్నాయి.. ఇటువంటి అప్పుడు యుద్ధాలు చేయడం.. మిస్సైల్స్ సంధించడం మాత్రమే కాదు.. శత్రు దేశాల యుద్ధ విమానాలను కూడా పసిగట్టడం.. వాటిని కూల్చేయడం యుద్ధంలో ఒక భాగమే.

ఇప్పటివరకు ఇలా శత్రు దేశాల యుద్ధ విమానాలను గుర్తించే టెక్నాలజీ అమెరికా, చైనా, ఇజ్రాయిల్, వంటి దేశాల వద్ద ఉండేది. మన దగ్గర కూడా ఉన్నప్పటికీ.. అత్యాధునిక స్థాయిలో ఉండేది కాదు. ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలలో పరిణామాలు మారిపోతున్న నేపథ్యంలో.. మన డిఫెన్స్ వ్యవస్థ కూడా అత్యంత ఆధునిక రూపును సంతరించుకుంది. ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ వైమానిక దళం కోసం.. గగనతల నిఘా రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనిని డిఫెన్స్ రీఛార్జ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) రూపొందించింది.. ఈ వ్యవస్థను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. ఈ రాడార్ వ్యవస్థకు ఆరుద్ర అనే పేరు పెట్టారు.

ఆరుద్ర రాడార్ వ్యవస్థ అజిముత్, ఎలివేషన్ ఇలా రెండింటి ఎలక్ట్రానిక్ స్టీరింగ్ తో పని చేస్తూ ఉంటుంది. దీనిని ఫోర్ డి మల్టీ ఫంక్షన్ ఫేజ్డ్ రాడార్ అని పిలుస్తుంటారు. ఇది ఒకే సమయంలో.. టార్గెట్ దూరాన్ని.. దిశ.. వేగాన్ని వెంటనే గుర్తిస్తూ ఉంటుంది. ఇది 400 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను అత్యంత సమర్థవంతంగా గుర్తిస్తుంది. అంతేకాదు రెండు చదరపు మీటర్ల దూరంలో ఉన్న చిన్న యుద్ధ విమానాలను సైతం 300 కిలోమీటర్ల దూరం నుంచే కనిపెడుతుంది. భూమికి 100 మీటర్ల తక్కువ ఎత్తులో ప్రయాణించే డ్రోన్లు.. క్రూయిజ్ మిస్సెస్ నుంచి 30 కిలోమీటర్ల గరిష్ట ఎత్తులో వెళ్లే యుద్ధ విమానాలను సైతం ఇది ట్రాక్ చేయగలుగుతుంది. 360 డిగ్రీల రొటేషన్ లో ఇది నిఘా పెడుతుంది. ఒకే నిర్దిష్టమైన స్టార్టింగ్ మోడ్ లో కూడా పనిచేస్తూ ఉంటుంది.

ఇందులో అత్యంత ఆధునికమైన ఐడెంటిఫికేషన్ ఫ్రెండ్ ఆర్ పో సిస్టమ్ ఉంటుంది.. ఇది ఆకాశంలో ప్రయాణిస్తుంది మన విమానమా.. లేక శత్రు దేశానికి సంబంధించిన విమానమా అని గుర్తిస్తుంది.. ఈశాన్య రాష్ట్రాలు.. జమ్ము కాశ్మీర్ వంటి ప్రాంతాలలో పటిష్టమైన నిఘాను దీని ద్వారా సాగించవచ్చు. కొండ ప్రాంతంలో నిత్యం పహారా కాయవచ్చు. దీనికోసం సరిగా మూడు సంవత్సరాల క్రితం రక్షణ శాఖ తన బడ్జెట్లో 2800 కోట్లు కేటాయించింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థతో ఈ రాడార్ల కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల జరిగిన పరీక్షల్లో ఇది అత్యంత అధునాతమైన స్టెల్త్ ఫైటర్ ఎఫ్ 35 ని కూడా గుర్తించింది. పైగా ఈ పరీక్షను పూర్తి ఏఐ ఆధారిత కంప్యూటర్ సిమిలేషన్ విధానంలో చేయడం విశేషం.

చిరంజీవి ఆ దర్శకులతో సినిమాలు మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నాడా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటివరకు ఆయన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడమే కాకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక రాజకీయ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి అక్కడ ఇమడలేక మళ్ళీ ఇండస్ట్రీ కి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. అప్పట్నుంచి ఇప్పటివరకు భారీ సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు. మధ్యలో కొన్ని విజయాలు తన ఖాతాలో పడినప్పటికి అవి చిరంజీవి రేంజ్ సక్సెస్ లు కావని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆయన చేసిన సినిమాలు భారీగా వర్కౌట్ కావడం లేదు. దాంతో ఎలాగైనా మరోసారి భారీ విజయాన్ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలతో కమర్షియల్ సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి చిరంజీవి రేంజ్ ను చూపించే సినిమాలైతే పడడం లేదు… ఇక ఇప్పుడు మరోసారి బాబీ డైరెక్షన్లో సినిమా చేయడానికి సిద్ధమైన చిరంజీవి ఈ సినిమాతో ఎలాగైనా సరే తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక గతంలో చిరంజీవి ఒక ఇద్దరు దర్శకులతో సినిమాలను చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ అనుకోని కారణాలవల్ల సినిమా అయితే పట్టాలెక్కలేదు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా, మరొకరు శేఖర్ కమ్ముల కావడం విశేషం…

అయితే వీళ్ళిద్దరి డైరెక్షన్ లో తను సినిమా చేయడానికి మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ అనుకొని కారణాల వల్ల రెండు సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో శేఖర్ కమ్ముల చిరంజీవితో ఎలాంటి సబ్జెక్ట్ చేస్తాడు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వెలువడ్డాయి. నిజానికి చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక మాస్ కమర్షియల్ సినిమాని షేర్ కమ్ముల రాశారట.

ఆయన డైరెక్షన్ లో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమా వస్తే ఎలా ఉంటుందనేది చూడడానికి చాలామంది ఆసక్తి చూపించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం గత మూడు సంవత్సరాల క్రితం చిరంజీవితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు.

కానీ చిరంజీవికి ఉన్న కమిట్మెంట్స్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పే సాఫ్ట్ కథ చిరంజీవికి పెద్దగా ఎక్కకపోవడం వల్లే ఆ కథని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మీదట త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గాని నటించే అవకాశం వస్తే మాత్రం మిస్ చేసుకోనని తప్పకుండా వాళ్లతో సినిమా చేస్తానని గతంలో పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పడం విశేషం…

త్రివిక్రమ్ సలహా మేరకు అప్పట్లో మహేష్ బాబు అలాంటి సినిమాలు చేశాడా..?

Mahesh Babu And Trivikram Srinivas
Mahesh Babu And Trivikram Srinivas

Mahesh Babu And Trivikram Srinivas: సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ప్రస్తుతం టాప్ హీరోలందరు వారసత్వ బ్యాగ్రౌండ్ తో వచ్చిన వారే కావడం విశేషం… నిజానికి వారసత్వం అనేది హీరోలకు ఎంట్రీ ఇప్పించడానికి సరిపోతుంది. కానీ ఆ తర్వాత నటుడిగా రాణించడానికి, సక్సెస్ లను సాధించడానికి ఏ బ్యాగ్రౌండ్ ఉపయోగపడదు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తనకు గత కొద్దిరోజుల నుంచి అనుకున్న సక్సెసులైతే రావడం లేదు. ఎట్టకేలకు మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమాతో ఎలాగైనా సరే పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమా చేయబోతున్నాను అంటూ ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు…

ఇలా కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా మహేష్ బాబు ఎంచుకునే సినిమా స్టోరీలు చాలా వైవిధ్యంగా ఉంటూ వస్తున్నాయి. నాని లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ లను మహేష్ బాబు చేయడం అనేది చాలా గొప్ప విషయం…త్రివిక్రమ్ తో ఎప్పుడైతే అతడు సినిమా చేశాడో అప్పటి నుంచి మహేష్ బాబు కెరీర్ మారిపోయింది. ఆయనకి ఎలాంటి సినిమాలు సెట్ అవుతాయి. ఎలాంటి సినిమాలు ఆయన చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంలో త్రివిక్రమ్ అతనికి ఎప్పటికప్పుడు సలహాలైతే ఇస్తూ వచ్చాడట.

దానివల్ల త్రివిక్రమ్ సలహా మేరకు సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టే ప్రయత్నం చేశాడు…అందుకే మహేష్ బాబుకి మాస్ లో ఇంత ఫాలోయింగ్ ఉందో, క్లాస్ ఆడియన్స్ లో కూడా అంతే క్రేజ్ దక్కింది. ఇక యూత్ లో ఆయనకున్న స్టార్ డమ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

మొత్తానికైతే పాన్ ఇండియాలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవాలనే తాపత్రయంతో మహేష్ బాబు ముందుకు సాగుతున్నాడు. రాజమౌళి చేతిలో పడ్డాడు కాబట్టి మహేష్ బాబుకు భారీ విజయం దక్కడమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం మెప్పించే విధంగా ఆయన సినిమా ఉంటుందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరో 'ధనుష్' కొడుకు.. మొదటి సినిమా దర్శకుడు ఎవరంటే..

Dhanush Son
Dhanush Son

Dhanush Son Debut: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా తమిళ హీరో ధనుష్ పేరు ఉంటుంది. తెలుగు , తమిళం హిందీ , మలయాళం , ఇలా అన్ని భాషల్లోనూ ఈయన సూపర్ హిట్స్ ని అందుకొని పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకడిగా నిలిచాడు. అంతే కాదు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్స్ ని కూడా అందుకున్నాడు. ఈయన టాలెంట్ ని చూసి హాలీవుడ్ సినిమాల్లో కూడా ఆఫర్స్ వచ్చాయంటే ధనుష్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు లో కూడా ఈయనకు ‘సార్’, ‘కుబేర ‘ వంటి హిట్స్ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ధనుష్ కి ఇద్దరు కొడుకులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక కొడుకు పేరు యాత్ర రాజా , మరో కొడుకు పేరు లింగా.

వీళ్ళిద్దరిలో యాత్ర రాజా ఇప్పుడు సినిమాల్లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని విధాలుగా సిద్ధం అయ్యాడని తెలుస్తుంది. ఈ చిత్రానికి దర్శకుడు మరెవరో కాదు , ధనుష్ యే అట. తన కొడుకుని స్వయంగా తానే లాంచ్ చెయ్యాలని చూస్తున్నాడు. అయితే ధనుష్ కి దర్శకత్వం వహించడం ఇదేమి కొత్త కాదు. గతం లో ‘రాయన్’ అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ద్వారా ఆయన కొత్తవాళ్ళని ఇండస్ట్రీ కి పరిచయం చేయడం విశేషం. అలా దర్శకుడిగా తనని తానూ నిరూపించుకున్న ధనుష్ , ఇప్పుడు తన సొంత కొడుకుని ఇండస్ట్రీ కి తన దర్శకత్వం లో తెరకెక్కించే సినిమా ద్వారా హీరో గా పరిచయం చేయబోతున్నాడు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

యాత్ర రాజా కేవలం ధనుష్ కొడుకు మాత్రమే కాదు , సూపర్ స్టార్ రజనీకాంత్ మేనల్లుడు కూడా . రజినీకాంత్ లేజసీ ని భవిష్యత్తులో మోసే బాధ్యత యాత్ర పైనే ఉంటుంది. చూసేందుకు గొప్ప అందగాడు కాకపోయినా, ముఖం లో హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సరైన సినిమాలు పడితే చాలు , ఇతను ధనుష్ రేంజ్ హీరో గా భవిష్యత్తులో ఒక వెలుగు వెలుగుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ధనుష్ ప్రస్తుతం అబ్దుల్ కలాం బయోపిక్ లో , అదే విధంగా మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ధనుష్ తన కొడుకు సినిమాపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Pradeep Harsha (@filmy_enthusiast__)

చేతులారా 'పెద్ది' థియేట్రికల్ రన్ ని నాశనం చేస్తున్న నిర్మాతలు.. ఇలా చేస్తే థియేటర్స్ కి ఎవరొస్తారు?

Peddi 20 Days Worldwide Collections
Peddi 20 Days Worldwide Collections

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ చిత్రానికి నేడు కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ నమోదు అయ్యాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి నేడు కూడా గంటకు 3 వేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడుపోయాయి. ఈ రేంజ్ థియేట్రికల్ రన్ గత దశాబ్ద కాలం లో ఏ స్టార్ హీరోకి కూడా లేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీడెడ్, నెల్లూరు మినహా, అన్నిట్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని సంపాదించింది. ఓవర్సీస్ , నార్త్ ఇండియా మినహా, ఈ వీకెండ్ కి మిగిలిన ప్రాంతాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వుధి అనే బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్.

ఇలాంటి బ్లాక్ బస్టర్ రన్ ఉన్నప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ ని మరింత పెంచే కార్యక్రమాలు చెయ్యాలి కానీ , నిర్మాతలు మాత్రం తగ్గించే పనులు చేస్తున్నారు. ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో పాటలు కూడా ఒకటి. ముఖ్యంగా చికిరి చికిరి , రయ్ రయ్ రారా పాటలు సెన్సేషనల్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. కేవలం ఈ పాటలను థియేటర్స్ లో చూసేందుకు జనాలు రిపీట్ గా థియేటర్స్ కి వెళ్తుంటారు. ఇప్పుడు మేకర్స్ ఈ రెండు పాటలను HD క్వాలిటీ తో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. సినిమా థియేట్రికల్ రన్ కి ఎంత ఉపయోగపడుతున్న ఈ రెండు పాటలను ఇలా ఆన్లైన్ లోకి వదిలేస్తే , రేపు ఈ చిత్రాన్ని చూసే రిపీట్ ఆడియన్స్ ఎలా వస్తారు?, మేకర్స్ ఇంత తెలివి తక్కువ పని చేస్తారని అసలు అనుకోలేదు అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇదంతా పక్కన పెడితే మొన్న జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బుచ్చి బాబు ఈ బుధవారం నుండి సరికొత్త సన్నివేశాలను సినిమాలో జత చేయబోతున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఈ అప్డేట్ పై మరోసారి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిని బట్టీ చూస్తుంటే రేపు కొత్త సన్నివేశాలు ఉంటాయా లేదా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. ఒకవేళ ఆ కొత్త సన్నివేశాలు జత చేస్తే , ఈ రెండు పాటలు సోషల్ మీడియా లో విడుదల చేసినప్పటికి కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం చూపించదు , ఇంకా పెరుగుతాయి కూడా , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

ఇద్దరు హీరోలతో ఫ్రెండ్షిప్ చేసి తన కెరియర్ ను కోల్పోయిన స్టార్ హీరో...

Telugu Film Industry
Telugu Film Industry

Telugu Film Industry: సినిమా ఇండస్ట్రీలో హీరోల కెరియర్ ఎన్ని సంవత్సరాల పాటు సాగుతుందనేది ఎవ్వరు చెప్పలేరు. వరుసగా సక్సెస్ లను సాధిస్తే టాప్ పొజిషన్ కి వెళ్తారు. వరుసగా మూటగట్టుకుంటే మాత్రం పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా సెలక్షన్ల విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందులో ఏమాత్రం తేడా జరిగిన కూడా భారీ విమర్శలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అలాగే తమ కెరియర్లను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవచ్చు. ఇప్పటివరకు ఇండస్ట్రీకి వచ్చి మొదట మూడు నాలుగు సినిమాలతో సక్సెస్ లను సాధించి ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి హీరోల్లో తరుణ్ ఒకరు కెరియర్ స్టార్టింగ్ లో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకు పోటీని ఇస్తూనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని తెచ్చుకున్నాడు.

తను చేసిన సినిమాలు కూడా ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అవ్వడం. ముఖ్యంగా అమ్మాయిల్లో అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కూడా తనకు చాలా వరకు ప్లస్ అయింది. కానీ అనుకోని కారణాలవల్ల తరుణ్ చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన స్టోరీ సెలక్షన్స్ సరిగ్గా లేకపోవడం, పర్సనల్ విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కోవడం, కాంట్రవర్సీ ల్లో ఇరుక్కోవడం లాంటివి చేయడంతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది.

దాంతో అతనికి అవకాశాలు కూడా కరువైపోయాయి. ఇక తనతోపాటు కెరియర్ స్టార్టింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు లాంటి నటులు ఇప్పుడు టాప్ హీరోలుగా కొనసాగుతుంటే ఆయన మాత్రం సినిమాలు లేక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయాలనే ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కావడం లేదు.

నిజానికి తరుణ్ లాంటి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నటుడి కెరీర్ అనేది ఇలా పడిపోవడం పట్ల చాలామంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్టం. ఎదిగిన తర్వాత దాన్ని కాపాడుకోవడం మరింత కష్టంతో కూడుకున్న పని…ఇక ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్దలు ఇప్పటికి ఆ మాటలు చెబుతూనే ఉంటారు…

150 స్కూళ్ల మూత.. ఇంత కుట్రా.. దేశభద్రతనే ప్రమాదంలోకి నెట్టారు కదరా..

Fake Documents Scam
Fake Documents Scam

Fake Documents Scam: 3000 కు ఆధార్ కార్డు.. ఐదువేలకు పాన్ కార్డు.. పదివేలకు బర్త్ సర్టిఫికెట్.. 25 వేలకు ఇంకా అనేక రకాల ధ్రువపత్రాలు.. బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత.. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుతున్న తనిఖీలలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఇవి. ఈ గడ్డమీద పుట్టకపోయినప్పటికీ.. ఈ గడ్డతో ఎటువంటి బంధం లేకపోయినప్పటికీ.. సరిహద్దుల నుంచి వచ్చేసి.. ఈ దేశ పౌరసత్వాన్ని దర్జాగా అనుభవించారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా వాడుకున్నారు.

కమలం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మురికిగుంట మొత్తం బయటపడుతోంది. ఓట్ల కోసం ఒక వర్గానికి మమత చేసిన ఆయాచిత లబ్ధి వెలుగులోకి వస్తోంది. అయితే ఇది కేవలం బెంగాల్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పాతబస్తీలో అక్రమంగా ఉంటున్న ఏడుగురు బంగ్లాదేశ్ ప్రజలను పోలీసులు గుర్తించారు. వారి వద్ద ఉన్న ఫేక్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని బంగ్లాదేశ్ కు పంపించారు. కేవలం తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాలకే ఈ వ్యవహారం పరిమితం కాలేదు. కేంద్రం నిఘా పెడితే.. గట్టిగా దృష్టి సారిస్తే దిమ్మతిరిగే వాస్తవాలు తెలుస్తున్నాయి.

ఇటీవల ది హిందూస్తాన్ టైమ్స్ ఒక ప్రత్యేకమైన కథనాన్ని పబ్లిష్ చేసింది. అందులో దేశవ్యాప్తంగా 150 పాఠశాలలు మూతపడుతున్నాయని పేర్కొంది. దీని వెనక ఒక బలమైన కారణం ఉందని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది మరుగున పడుతున్న నేపథ్యంలో.. ది హిందూస్తాన్ టైమ్స్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది.

150 పాఠశాలలు మూతపడడానికి ప్రధాన కారణం.. ఈ దేశభద్రత ప్రమాదంలో ఉండడమే.. ఆ 150 పాఠశాలల ద్వారా ఇప్పటివరకు దాదాపు 19 వేలకు పైగా ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చారట. వాటి ద్వారా ఆధార్ కార్డులు.. ఇతర ధ్రువపత్రాలు పొందారట. ఇటీవల కాలంలో కేంద్ర సంస్థలు దృష్టి సారించడంతో ఈ పాఠశాలల బాగోతం బయటపడింది. దీంతో ఆ పాఠశాలలను మూసి వేయడం మాత్రమే కాకుండా.. అవి జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రాలను కేంద్రం రద్దు చేసింది.

దీనిపై కొంతమంది ఉదారవాదులు మండిపడుతున్నారు. ఆ స్థాయిలో పాఠశాలలను ఎందుకు మూసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీని వెనుక ఉన్న అసలు నిజం ఇది. ఒక వర్గానికి మేలు చేయడానికి.. ఒక వర్గానికి లబ్ధి చేకూర్చడానికి కొంతమంది కూడబలుక్కుని చేస్తున్న దారుణమిది. దీనివల్ల ఈ దేశ ప్రయోజనాలు నాశనం అవుతున్నాయి. ఈ దేశంలోకి దుర్మార్గులు చొరబడుతున్నారు. ఈ దేశాన్ని నాశనం చేయడానికి కొంతమంది శక్తులతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. ఆయనప్పటికీ భారత ఇంటెలిజెన్స్ వర్గాలు మేల్కొనడం.. మన దేశానికి మంచిదయింది. ఇన్ని సంవత్సరాలపాటు ఈ పాఠశాలలు ఎంతమందికి ఇలా జనన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చాయి.. ఎంతమందికి ఈ దేశంలో పంది కొక్కుల మాదిరిగా ప్రవేశించే అవకాశాన్ని కల్పించాయో ఇప్పుడు తేలాల్సి ఉంది.

కోపం google మీద కాదు.. సుందర్ పిచాయ్ కి జరిగిన ఘోర అవమానం వెనుక.. పెద్ద కుట్రే..

Sundar Pichai
Sundar Pichai

Sundar Pichai: అప్పట్లో ఇజ్రాయిల్ పాలస్తీనా మీద యుద్ధం చేస్తున్నప్పుడు.. మనదేశంలో కూడా పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శనలు జరిగాయి. సేవ్ పాలస్తీనా అంటూ చాలామంది నినాదాలు చేశారు. తమిళనాడులో అయితే ఇంకా ఎక్కువగా నిరసనలు జరిగాయి. అక్కడి ప్రభుత్వ పెద్దలు కూడా పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు. కొంతమంది అయితే ఏకంగా యుద్ధాన్ని ఆపడంలో భారత్ తనవంతు పాత్ర పోషించాలని.. అవసరమైతే ఇజ్రాయిల్ మీద దాడులు చేయాలని డిమాండ్ చేశారు.

నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ దేశానికి అనుకూలంగా ఉండడం.. ఇజ్రాయిల్ మనతో సౌఖ్యంగా ఉండడం కొంతమంది ఎర్రిగాళ్లకు నచ్చలేదు. పైగా పాలస్తీనా అంటే వాళ్లకు విపరీతమైన ఇష్టం. దీనికి తోడు అప్పట్లో ప్రియాంక గాంధీ పాలస్తీనా దేశానికి అనుకూలంగా వ్యాఖ్యలు రాసిన ఒక బ్యాగు కూడా ధరించి పార్లమెంటుకు హాజరయ్యారు. వాస్తవానికి ఇజ్రాయిల్.. పాలస్తీనా మీద దాడులు చేస్తే ఇండియాకు ఏంటి సంబంధమో ఇప్పటికీ అర్థం కాని విషయం.

ఇటీవల స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఆయన మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి హాజరయ్యారు. కానీ పాలస్తీనా అనుకూల బ్యాచ్ ఆయన ప్రసంగాన్ని బైకాట్ చేసింది. ఇప్పుడే కాదు ఇటీవల కాలంలో అనేక సందర్భాలలో అక్కడి విద్యార్థులు ఇలా బాయ్ కాట్ చేశారు..

ఇలా బాయ్ కాట్ చేసే బదులు పాలస్తీనా అనుకూల బ్యాచ్.. గూగుల్ ఉత్పత్తులైన యూట్యూబ్.. జిమెయిల్.. గూగుల్ ట్రాన్స్లేట్.. ఆండ్రాయిడ్ వంటి వాటిని బాయికాట్ చేస్తే బాగుంటుంది. సుందర్ పిచాయ్ గూగుల్ సంస్థలో ఉద్యోగి మాత్రమే. గూగుల్ సంస్థకు అధిపతి కాదు. మరోవైపు google సంస్థ ఇజ్రాయిల్ దేశంతో పదివేల కోట్ల క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని కొన్ని సంవత్సరాల క్రితం కుదుర్చుకుంది. అది పాలస్తీనా దేశానికి కడుపు మంట. దీనికి తోడు సుందర్ భారతీయుడు. ప్రస్తుత భారత ప్రధాని ఇజ్రాయిల్ దేశానికి అనుకూలంగా ఉన్నాడు. ఇజ్రాయిల్ దేశంతో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అందువల్లే కొంతమంది పాలస్తీనా వాళ్లు పకడ్బందీ ప్రణాళికతో సుందర్ మీద ఇలా దాడికి దిగారు. అన్నట్టు పాలస్తీనా దేశానికి తమిళనాడు ప్రజలు సంఘీభావం తెలిపారు. ఇజ్రాయిల్ దాడుల పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఒక భారతీయుడు.. అందులో ఒక తమిళ రాష్ట్రానికి చెందినవాడు.. సుందర్ మీద ఇలాంటి దాడి చేయడం నిజంగా అత్యంత ఘోరం.. అత్యంత హీనం.. దీని వెనక ఇంతటి కుట్ర ఉందని వెస్ట్రన్ మీడియా ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేయడంతో.. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనేది తేలిపోయింది. ఇదంతా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా సాగిస్తున్న కుట్ర అని తేలింది.

వెంకీ అట్లూరి వెబ్ సిరీస్ చేయడం వెనక అసలు కారణమేంటంటే..?

Venky Atluri
Venky Atluri

Venky Atluri Web Series: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు చాలామంది హీరోలు వినూత్నమైన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల వైపు కూడా అడుగులు వేస్తున్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకు ప్రతి ఒక్కరు వెబ్ సిరీస్ వైపు ఎందుకని మొగ్గు చూపిస్తున్నారు అనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఇక కుర్ర దర్శకుల నుంచి స్టార్ డైరెక్టర్ల వరకు వెబ్ సిరీస్ ల వెంట పడుతున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు సైతం సిద్దు జొన్నలగడ్డను హీరోగా పెట్టి ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సిరీస్ తో తన వర్క్ చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సిరీస్ ఆయన ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మొత్తానికైతే ఈ సిరీస్ ద్వారా ఆయన జనానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికి వెంకీ అట్లూరి గత రెండు సినిమాల నుంచి తన పంథా ను పూర్తిగా మార్చేశాడు. ప్రేక్షకులను హుక్ చేసే కథలు తీసుకుని దాన్ని గ్రిప్పింగ్ గా రాసుకొని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

అందులో భాగంగానే ఆయన సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి సూర్య తో చేస్తున్న విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాతో సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నాడు… ఆయన చేస్తున్న ఈ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని సాధించాలని చాలామంది అభిమానులు సైతం కోరుకుంటున్నారు… ఇక ఆయన ఇటు సినిమాలు చేసుకుంటునే వెబ్ సిరీస్ లను కూడా చేస్తున్నాడు.

నిజానికి సినిమాలు చేస్తు వెబ్ సిరీస్ చేయడం వల్ల వాళ్ళ క్రేజీ ఏమైనా తగ్గిపోయే అవకాశం ఉందా అని మరి కొంతమంది అభిమానులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్న క్రమంలో వెబ్ సిరీస్ అంటే మినిమం ఎంగేజింగ్ గా ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయిపోయి ఈ సిరీస్ ను చూడడానికి అవకాశమైతే ఉంటుంది. అందుకే వెంకీ అట్లూరి తను రాసుకున్న పాయింట్ ను స్ట్రెయిట్ గా చెప్పడానికి వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది…

బాలయ్య కి విలన్ గా నటించాల్సిన ఆ ఇద్దరు సీనియర్ హీరోలు..ఎలా మిస్ అయ్యారంటే..?

Balayya Koratala Shiva Film
Balayya Koratala Shiva Film

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు ఆయన్ని టాప్ హీరోగా నిలబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లే ప్రయత్నమైతే చేస్తున్నాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న బాలయ్య ఈ మధ్యకాలంలో భారీ విజయాలను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం. అయితే బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాల్లో ఇద్దరు సీనియర్ హీరోలు విలన్స్ గా నటించాల్సింది. కానీ ఆ ఇద్దరు స్టార్ హీరోలు సైతం అతని సినిమాలో విలన్స్ గా నటించలేకపోయారు. కారణం ఏదైనా కూడా తన నుంచి వచ్చే సినిమాల విషయంలో బాలయ్య చాలా క్లారిటిని మెయింటెన్ చేస్తున్నాడు. అందుకే ఈ మధ్యకాలంలో అతనికి వరుసగా సక్సెసులైతే దక్కుతున్నాయి. ఇప్పటికి నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ‘అఖండ 2’ సినిమాతో మరో విజయాన్ని సాధిస్తాడని అందరు అనుకున్నప్పటికి అది అనుకున్న మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డాడు… ఇప్పటివరకు బాలయ్యను డామినేట్ చేయాలని చాలామంది హీరోలు అనుకున్నప్పటికి ఆయన మాత్రం కొత్త పంథాలో ప్రేక్షకులను అలరిస్తూ ఎప్పటికప్పుడు కొత్త అభిమానులను సంపాదించుకుంటున్నాడు.

ఇక బాలయ్య ఇప్పటికి తన సత్తా చాటుకుంటూ ఒక వినూత్న పద్ధతిలో అభిమానులను మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇంతకీ బాలయ్య సినిమాలో విలన్ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరు అంటే ఒకరు రాజశేఖర్ కాగా, మరొకరు వడ్డే నవీన్ కావడం విశేషం…

వీళ్ళిద్దరు బాలయ్య బాబు చేసిన రెండు సినిమాల్లో విలన్ గా నటించాల్సింది. రాజశేఖర్, బాలయ్య బాబు హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘వీర సింహ రెడ్డి’ సినిమాలో రాజశేఖర్ విలన్ గా నటించడానికి మొదట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన ఆ క్యారెక్టర్ లో నటించలేకపోయాడు.

బాలయ్య బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘భగవత్ కేసరి’ సినిమాలో వడ్డే నవీన్ ఒక విలన్ పాత్రను పోషించాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల తను ఆ విలను పాత్రను పోషించలేకపోయాడు… మరి రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు సీనియర్ హీరోలు బాలయ్య బాబుకు విలన్ గా నటించే అవకాశం దక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…

'బిగ్ బాస్ 10' లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఇద్దరు హాట్ యాంకర్స్.. ఈసారి TRP రేటింగ్స్ బద్దలే..

Bigg Boss Season 10 Updates
Bigg Boss Season 10 Updates

Bigg Boss Season 10 Updates: కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ఈ ఏడాది సెప్టెంబర్ 6 నుండి ప్రారంభం కాబోతుంది. గత సీజన్ ఊహలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో , ee సీజన్ ని గత సీజన్ ని మరిపించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ‘అగ్నిపరీక్ష 2’ కి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలైంది. ఈ నెల 12 న ప్రారంభించగా, 20 వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ షో ద్వారా గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా సామాన్యులను ఎంచుకొని బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. 10 మంది సామాన్యులు , 10 మంది సెలబ్రిటీలు ఈ సీజన్ లో సందడి చేయబోతున్నారు అన్నమాట.

అయితే ఇప్పటికే పలువురి సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ టీం ఇంకా ఎవరినీ ఖరారు చెయ్యలేదు , ప్రస్తుతానికి కేవలం సంప్రదింపులు మాత్రమే జరుపుతున్నారు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే , ఈ సీజన్ లోకి ఇద్దరు హాట్ యాంకర్స్ రాబోతున్నారట. వాళ్ళు మరెవరో కాదు , వర్ష , వర్షిణి. ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా వర్ష కి వచ్చిన క్రేజ్ మామూలుది కాదు. ముఖ్యంగా ‘బిగ్ బాస్ 9’ ఫైనలిస్ట్ ఇమ్మానుయేల్ తో ఈమె జోడి కి ఫ్యాన్స్ మాములుగా ఉండరు. వీళ్లిద్దరు కలిసి ఎన్నో వందల స్కిట్స్ , షోస్ చేశారు. ప్రస్తుతం వర్ష యాంకర్ గా కొనసాగుతోంది. ఈమెని రీసెంట్ గానే బిగ్ బాస్ టీం సంప్రదించారట, ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

ఇక ప్రధానంగా వినిపిస్తున్న మరో హాట్ యాంకర్ పేరు వర్షిణి. ఈమె ఈటీవీ లో ప్రసారమయ్యే ‘ఢీ ‘ ద్వారా ఎంత పాపులారిటీ ని సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సుడిగాలి సుధీర్ , యాంకర్ ప్రదీప్, రష్మీ గ్యాంగ్ తో కలిసి ఈమె చేసిన అల్లరి ని అంత తేలికగా మన ఆడియన్స్ మర్చిపోలేరు. గత కొన్ని సీజన్స్ నుండి బిగ్ బాస్ టీం ఈమెని సంప్రదిస్తూనే ఉన్నారు. కానీ ఈమె ఎందుకో ఆసక్తి చూపించలేదు , కానీ ఈ సీజన్ లో మాత్రం ఈమె ఎంట్రీ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయట. ఎందుకంటే ఆమె కాదు అనలేని రెమ్యూనరేషన్ ని బిగ్ బాస్ టీం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈమె ఎంట్రీ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పెద్ది' 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. సీడెడ్ , నెల్లూరు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అసాధ్యమే..

Peddi 12 Days Collections
Peddi 12 Days Collections

Peddi 12 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ జోరు, 12 రోజులు దాటినప్పటికీ కూడా ఏ మాత్రం తగ్గలేదు. వర్కింగ్ డేస్ లో ఈ చిత్రానికి వస్తున్నంత లాంగ్ రన్ , ఈమధ్య కలం లో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 2వ సోమవారం, అనగా 12 వ రోజున దాదాపుగా 1 కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిందని అంటున్నారు. ఇది సాధారమైన విషయం కాదు. ఈ రేంజ్ రన్ ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రానికి రాయలసీమ , నెల్లూరు జిల్లాల్లో నష్టాలు తప్పేలా లేవని లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట.

రాయలసీమ ప్రాంతం లో ఈ చిత్రానికి విడుదలకు ముందు 24 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 12 రోజుల్లో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 4 కోట్లు రావాలి , ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో అయితే మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ కష్టమే. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే విడుదలకు ముందు ఈ చిత్రానికి 6 కోట్ల 30 లక్షల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 80 లక్షల షేర్ రావాలి , ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూస్తే మరో 50 లక్షలు మాత్రమే వచ్చేలా కనిపిస్తోంది.

ఇక మిగిలిన జిల్లాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టింది. నైజాం ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 51 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 21 కోట్ల 53 లక్షలు రాగా , ఈస్ట్ గోదావరి నుండి 12 కోట్ల 18 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 8 కోట్ల 63 లక్షలు , గుంటూరు నుండి 12 కోట్ల 12 లక్షలు , కృష్ణ నుండి 9 కోట్ల 72 లక్షలు , నెల్లూరు నుండి 5 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 141 కోట్ల 59 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 213 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 322 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 192 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఎట్టకేలకు నాగార్జున తో సినిమా ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి.. స్టోరీ మామూలుగా లేదుగా..

Anil Ravipudi And Nagarjun
Anil Ravipudi And Nagarjun

Anil Ravipudi And Nagarjuna: ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ తో కొనసాగుతున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే, అది అనిల్ రావిపూడి మాత్రమే. కమర్షియల్ సినిమాలు ఇతర డైరెక్టర్స్ తీస్తే చూసే మూడ్ లో ఆడియన్స్ లేరు , కానీ అనిల్ రావిపూడి తీస్తే మాత్రం బ్రహ్మరథం పట్టడానికి రెడీ గా ఉంటారు. ఎందుకంటే ఆయన మాత్రమే ప్రస్తుతం కమర్షియల్ జానర్ లో అన్నీ పర్ఫెక్ట్ మీటర్ లో సినిమాలు తీస్తున్నది. థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ నిరాశ చెంది మాత్రం బయటకు వెళ్ళడు , మినిమం గ్యారంటీ ఎంటెర్టైమెంట్ అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంటుంది కాబట్టే , అనిల్ రావిపూడి సినిమాలకు ఇంత క్రేజ్ ఉంటుంది. అయితే సీనియర్ హీరోలలో ఒక్క నాగార్జున తో మినహా, మిగిలిన ముగ్గురుతో సినిమాలు తీసి అనిల్ రావిపూడి వాళ్లకి మెమరబుల్ సూపర్ హిట్స్ ని అందించాడు.

వెంకటేష్ తో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీయగా , మెగాస్టార్ చిరంజీవి తో మన శంకర వరప్రసాద్ గారు వంటి ఇండస్ట్రీ హిట్ , బాలయ్య బాబు తో ‘భగవంత్ కేసరి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తీసాడు. ప్రస్తుతం వెంకటేష్ తో నాల్గవ సినిమా చేస్తున్నాడు. అయితే సీనియర్ హీరోలందరితో సినిమాలు చేశావ్ , అక్కినేని నాగార్జున తో సినిమా ఎప్పుడు అని అనిల్ రావిపూడి ని ప్రతీ ఇంటర్వ్యూ లో , ఈవెంట్స్ లో అడుగుతూనే ఉన్నారు . కచ్చితంగా నాగార్జున గారితో సినిమా చేస్తాను అని క్లారిటీ ఇస్తూ వచ్చిన అనిల్ రావిపూడి , ఎట్టకేలకు ఇప్పుడు కార్యరూపం దాల్చింది. రీసెంట్ గానే వీళ్లిద్దరి కాంబినేషన్ ఒక సినిమాని ఫైనల్ చేశాడట ఒక టాప్ నిర్మాత. అది కచ్చితంగా దిల్ రాజు అయ్యుంటాడని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది కానీ , పూర్తి వివరాలు బయటకు రాలేదు.

వెంకటేష్ , కళ్యాణ్ రామ్ మల్టీ స్టార్రర్ చిత్రం పూర్తి అవ్వగానే, అక్కినేని నాగార్జున తో సినిమాని సెట్స్ మీదకు తీసుకొస్తాడట అనిల్. నాగార్జున కెరీర్ లో ‘హలో బ్రదర్’ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది అందరికీ తెలిసిందే. కేవలం ఆయన కెరీర్ లోనే కాదు , కమర్షియల్ సినిమా ఫార్మాట్లో కొత్త ఒరవడి ని సృష్టించింది ఆ చిత్రం. నాగార్జున తో ఇప్పుడు అదే తరహా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. పర్ఫెక్ట్ గా తీస్తే , ఈ సినిమాతో నాగార్జున కం బ్యాక్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. అవలీలగా ఈయన కూడా 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోక్ చేరిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరోసారి రీ రిలీజ్ కి సిద్దమైన 'గబ్బర్ సింగ్'..ఈసారి సరికొత్త సన్నివేశాలతో..

Gabbar Singh Re Release
Gabbar Singh Re Release

Gabbar Singh Re Release: ఇప్పటి జనరేషన్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఓజీ’ అనే పేరు ఎత్తితే ఎలా పూనకాలు వస్తాయో, సీనియర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ‘గబ్బర్ సింగ్’ పేరు ఎత్తితే అలాంటి పూనకాలు వస్తాయి. పులి , తీన్ మార్ , పంజా వంటి వరుస హ్యాట్రిక్ డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత పవన్ కళ్యాణ్ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. అభిమానులు తమ అభిమాన హీరో మళ్లీ కం బ్యాక్ ఇస్తాడనే ఆశలు కోల్పోయారు. సరిగ్గా అలాంటి సమయం లో విడుదలైన ‘గబ్బర్ సింగ్’ చిత్రం వాళ్లకు ఒక అద్బుతమమైన జ్ఞాపకాలను ఇచ్చింది. మొదటి రోజు నుండి క్లోజింగ్ వరకు టాలీవుడ్ లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమా వసూళ్లను బాహుబలి వచ్చేంత వరకు , ఒక్క స్టార్ హీరో కూడా ముట్టుకోలేకపోయారు.

దీన్ని బట్టీ అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు అనేక సందర్భాల్లో స్పెషల్ షోస్ గా వేసుకొని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు. 2024 లో , ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత , ఈ చిత్రాన్ని మరోసారి పవన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్ చేశారు. మొదటి రిలీజ్ లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో , రీ రిలీజ్ లో కూడా ఈ చిత్రం అలాంటి సెన్సేషన్ సృష్టించింది. మొదటి రోజే ఏకంగా 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది ఈ చిత్రం. ఇప్పటి వరకు ఈ రికార్డు ని మన టాలీవుడ్ లో ఒక్క హీరో కూడా ముట్టుకోలేకపోయారంటే , పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ చిత్రాన్ని ఈ నెల 26 న మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్టు , ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ కాసేపటి క్రితమే ట్విట్టర్ లో అధికారిక ప్రకటన చేసాడు. విడుదల సమయం లో ఎడిటింగ్ లో తొలగించబడ్డ కొన్ని సన్నివేశాలను జత చేసి మరీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారట. మరి ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అయితే ఈ సినిమాకు న్యూట్రల్ ఆడియన్స్ లో క్రేజ్ తక్కువే, 2024 లో కూడా కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ వల్ల ఆ రేంజ్ హిట్ అయ్యింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం పంజా రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు , ఇలాంటి సమయం లో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ని ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.

ఈ అందగత్తె తేల్చేసింది.. భూ కాలుష్యానికి.. ఇన్ని దారుణాలకు మగాళ్లే కారణమట..

Dia Mirza
Dia Mirza

Dia Mirza: భూమి మీద కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు విస్తారంగా ఉన్న చెట్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఫలితంగా మనుషులు నిండు నూరేళ్లు బతకలేకపోతున్నారు. నిండా రోగాలతో నరకం చూస్తున్నారు. చిన్న వయసులోనే ప్రాణాంతక రోగాలతో ప్రాణాలు విడుస్తున్నారు. ఇన్ని అనర్ధాలకు కారణం కాలుష్యం.

పరిశ్రమలు.. చెట్లను కొట్టివేయడం.. అడవులను ఆక్రమించడం.. నదులను మట్టితో పూడ్చివేయడం.. ఇంకా అనేక రకాల కారణాలు కాలుష్యానికి దోహదం చేస్తున్నాయి. ఇప్పటివరకు కాలుష్యం పెరడానికి కారణాలను పై వాటినే విశ్లేషించేవారు. కానీ భూమ్మీద కాలుష్యం పెరగడానికి.. ఈ స్థాయిలో అనర్ధాలు జరగడానికి కారణం కేవలం మగవాళ్లేనట. అదేంటి కేవలం మగవాళ్ళు మాత్రమే కారణమైతే.. ఆడవాళ్లు ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్న మీలో వ్యక్తం అయింది కదూ..

ఈ భూమి మీద కాలుష్యం ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం మగవాళ్ళు అని చెప్పింది ఏదో ప్రసిద్ధమైన యూనివర్సిటీ కాదు. ప్రపంచ స్థాయి వ్యక్తులు చేసిన పరిశీలన కాదు. పేరుపొందిన వ్యక్తులు రూపొందించిన నివేదిక అంతకంటే కాదు. ఈ మాట అన్నది అందగత్తె దియా మీర్జా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. ఫెమినిజం గురించి సరికొత్తగా వ్యాఖ్యానించింది. “ఈ ప్రపంచంలో ఇప్పటివరకు తయారుచేసిన వస్తువులు.. ఉత్పత్తుల వెనుక మగవాళ్ళు ఉన్నారు. వాళ్లు మాతృ స్వామ్య వ్యవస్థకు చరమగీతం పాడారు. పితృ స్వామ్య వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. ఆడవాళ్లను తొక్కేస్తున్నారు. వాళ్లకు అనుకూలంగా ఉత్పత్తులు తయారుచేసి.. ఈ భూమిని మొత్తం కాలుష్య కాసారంలాగా మార్చేసారని” దియామీర్జా వ్యాఖ్యానించింది.

కానీ ఇక్కడ ఫెమినిజం అంటే.. మగవాళ్ళను తిట్టడం కాదు.. ఆడవాళ్ళు ఎదగడం.. ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడం.. అన్నింటికీ మించి సమాజంలో ఉన్నతంగా జీవించడం.. మగవాళ్లను కూడా అదే స్థాయిలో గౌరవించడం.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దియా మీర్జా ఇలా మాట్లాడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అన్నట్టు ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడిన మైక్.. ఉపయోగించిన లైట్లు.. ముఖానికి వేసుకున్న మేకప్.. జుట్టుకు వేసుకున్న డై.. ధరించిన దుస్తులు.. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సంబంధమైనవే. వీటితో పోల్చి చూస్తే మగవాళ్ళు చేసే కాలుష్యం ఎంత.. ఆడవాళ్లు మేకప్ కోసం ఉపయోగించే వస్తువులు ఎకో ఫ్రెండ్లీ కాదు కదా.. పాపం దియా మీర్జా.. మెదడులో చిప్ దొబ్బినట్టు ఉంది.. అందుకే ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తోంది..