spot_img
Homeవింతలు-విశేషాలుMidnight Delivery Chaos: అర్ధరాత్రి రెండు గంటలకూ మెట్లు ఎక్కి రావాలట..ఈ డెలివరీ బాయ్ బాధ...

Midnight Delivery Chaos: అర్ధరాత్రి రెండు గంటలకూ మెట్లు ఎక్కి రావాలట..ఈ డెలివరీ బాయ్ బాధ నగర వాసులకు చెంపపెట్టు

Midnight Delivery Chaos: మనుషులంతా ఒక్కటే. కాకపోతే వారి వారి ఆర్థిక పరిస్థితి ఆధారంగా అంతరాలు ఉంటాయి. కులాలు, మతాలు కాదు .. డబ్బుంటేనే ఈ సమాజం ఎన్ని లోపాలు ఉన్నా సరే ఆమోదిస్తుంది. అదే డబ్బు లేకుండా.. లోపాలు లేకుండా ఉంటే కనీసం గౌరవం కూడా ఇవ్వదు. అందుకే డబ్బున్న వారికి దర్పం ఉంటుంది. కళ్ళు నెత్తిన ఉంటాయి. ఈ మాట అనడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బేషజం అంతకంటే లేదు.

కూటికోసం కోటి తిప్పలు అంటారు కదా.. ఈ భూమి మీద ఉన్న మనుషులు తమ కడుపు నింపుకోవడానికి.. తమనే నమ్ముకున్న వారి ఆకలి తీర్చడానికి అనేక రకాల పనులు చేస్తుంటారు. అందులో కొందరు కాస్త సుఖంగా ఉండే పనులు చేస్తే.. మరికొందరేమో కష్టంతో కూడుకున్న పనులు చేస్తారు. కష్టపడి పని చేసే వారికి సమాజం కచ్చితంగా గౌరవం ఇవ్వాలి. అవసరమైతే వారికి తమ వంతు తోడ్పాటు అందించాలి. కానీ నేటి కాలంలో కష్టపడి పనిచేసే వారికి రెస్పెక్ట్ లేకుండా పోతోంది.

ఉదాహరణకు పొలంలో నిత్యం శ్రమించే రైతు.. తమ పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు మార్కెట్ వస్తే ఎవరూ దేఖరు. కనీస విలువ కూడా ఇవ్వరు. కానీ అదే రైతు పంటలు పండించకుండా ఉండి ఉంటే ప్రపంచం మొత్తం పస్తులు ఉంటుంది. ఆ విషయం తెలిసి కూడా చాలామంది రైతులను చులకనగా చూస్తుంటారు. రైతు అంటే గ్రహాంతర వాసిగా భావిస్తుంటారు.

రైతుల సంగతి పక్కన పెడితే మన దేశంలో ప్రస్తుతం ఆన్లైన్ వ్యాపారం పెరిగిపోయింది. అని కూడా డోర్ డెలివరీ దాకా వచ్చేస్తున్నాయి. డోర్ డెలివరీ బాయ్ లకు కనీసం గౌరవం లభించడం లేదు. ముఖ్యంగా నగరాలలో కొన్ని ప్రాంతాలలో డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఎక్కడానికి అవకాశం లేదని అపార్ట్మెంట్ల లో సరికొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చారు. ఆంక్షలు కూడా విధించారు.

లిఫ్ట్ వాడితే డెలివరీ బాయ్ లు జరిమానా చెల్లించాలని షరతులు విధించారు. చివరికి అర్ధరాత్రి రెండు గంటలకు కూడా మెట్లు ఎక్కి రావాలని అపార్ట్మెంట్ వాసులు తీర్మానం చేయడం నిజంగా ఆందోళన కలిగిస్తోంది. ఓ డెలివరీ ఏజెంట్ తనకి ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో చాలామంది అతడి బాధతో ఏకీభవిస్తున్నారు. అతడు అనుభవించిన ఇబ్బందిని తలుచుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. డెలివరీ బాయ్ లు కూడా మనుషులేనని.. వారికి మర్యాద ఇవ్వాలని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు.

గత ఎన్నికల్లో గిగా వర్కర్లకు ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తామని అన్ని పార్టీలు ప్రకటించాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గిగా వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. అయితే కొన్ని అపార్ట్మెంట్లలో మాత్రం డెలివరీ బాయ్ లను పురుగులను చూసినట్లు చూస్తున్నారు. అందువల్లే ఓ డెలివరీ బాయ్ తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అతడికే కాదు చాలామందికి కూడా ఇటువంటి అనుభవమే ఎదురవుతోంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు ఎటువంటి అడుగులు వేస్తాయనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper