spot_img
Homeవింతలు-విశేషాలుUnusual relationship incidents: భర్త మహాశయులంటే వీరే..భార్యలను ప్రియుళ్ల కు ఇచ్చేశారు!

Unusual relationship incidents: భర్త మహాశయులంటే వీరే..భార్యలను ప్రియుళ్ల కు ఇచ్చేశారు!

Unusual relationship incidents: భర్త అంటే భరించేవాడు అని అర్థం. కాకపోతే ఆ భరింపునకు కూడా ఒక హద్దంటూ ఉంటుంది. ఆ హద్దు దాటిపోతే ఓపిక ఏమాత్రం ఉండదు. సహనం ఏ కోశాన కూడా కనిపించదు. ఎందుకురా బాబు ఈ దరిద్రం.. వదిలించుకుంటే మంచిది కదా అనే అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడు మన సమాజంలో మెజారిటీ భర్తల అభిప్రాయం కూడా ఇలానే ఉంది.

గత ఏడాది ఇండోర్ లో ఓ జంట పెళ్లి చేసుకుంది. హనీమూన్ వెళ్ళింది. హనీమూన్ వెళ్లిన చోట భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపించేసింది. ఆ తర్వాత అనేక కట్టు కథలు అల్లింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన తర్వాత మనదేశంలో ఈ తరహా సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. భర్తలను చంపడం.. లేదా గాయపరచడం.. ప్రియుళ్ల సహకారంతో మట్టు పెట్టడం వంటివి ఎక్కువ అయిపోయాయి. కేసులు నమోదవుతున్నప్పటికీ.. న్యాయస్థానాలు శిక్ష విధిస్తున్నప్పటికీ.. మార్పు రావడం లేదు.

ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఝాన్సీ ప్రాంతంలో ఓ భర్త కు తన భార్య ప్రవర్తన పై అనుమానం వచ్చింది. వెంటనే అతడు ఆమె పై నిఘా పెట్టాడు. అతడు ఆఫీసుకు వెళ్తున్నట్టు నాటకమాడాడు. అతడు బయటికి వెళ్లగానే ఆమె అందంగా ముస్తాబయి.. బయటికి వెళ్ళేది. ఒకచోట ఆగగానే ఆమె ప్రియుడు బైక్ వేసుకుని వచ్చేవాడు. ఇద్దరూ కలిసి ఒక హోటల్ రూమ్ కి వెళ్లేవారు. అక్కడ మస్తుగా ఎంజాయ్ చేసేవారు. ఇది కనిపెట్టిన ఆమె భర్త.. పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వారిద్దరిని హోటల్ రూమ్లో ఉండగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే.. దానికి వీరిద్దరే కారణమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు, తనకు ఆ భార్య వద్దని.. ఆమె తన ప్రియుడితోనే ఉండాలని ఆ భర్త వెళ్ళిపోయాడు…

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ అనే నగరంలో దారుణం వెలుగు చూసింది. తన భార్య ఫోన్లో.. తన ఫోటోకు సిమెంట్ డ్రమ్ము అనే క్యాప్షన్ ఉంది. దాన్ని చూసిన ఆ భర్త ఆందోళనకు గురయ్యాడు. ఎందుకంటే ఆమె కొంతకాలంగా వేరే వ్యక్తితో సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఆరు నెలల వయసు ఉన్న తన పాపను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. అంతేకాదు తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసింది. చివరికి భర్త దగ్గరికి వచ్చినప్పటికీ.. ఆమె ఏ మాత్రం సంసారాన్ని కొనసాగించేది కాదు. నిత్యం ప్రియుడితో మాట్లాడుతున్న నేపథ్యంలో అ భర్త గమనించేవాడు. ఆమెను నిలదీస్తే ఆధారాలు అడిగేది. ఇటీవల ఆమె సామాజిక మాధ్యమాలను అతడు పరిశీలించాడు. తన హ*త్యకు ఆమె పన్నిన కుట్ర కోణం గుర్తించాడు. వెంటనే ఆమెను ప్రశ్నించాడు. ఈసారి ఆమె అపర కాలిక అవతారం ఎత్తింది. ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు అడిగితే నిన్ను మాత్రమే కాదు.. కుటుంబాన్ని మొత్తం అంతం చేస్తానని హెచ్చరించింది. దీంతో అతడు తట్టుకోలేక.. నువ్వు నీ ప్రియుడితోనే ఉండు అంటూ వెళ్లిపోయాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటనలు మారిన సమాజ తీరుకు అద్దం పడుతున్నాయి. ఇటీవల కాలంలో భర్తల ప్రాణాలను భార్యలు తీస్తున్న నేపథ్యంలో.. చాలామంది భర్తలు మేల్కొంటున్నారు. భార్య కంటే ప్రాణాలు ముఖ్యమని.. వారిని ప్రియుళ్ళ కు అప్పగిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
NTR

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని...
Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Oktelugu Epaper