Homeప్రవాస భారతీయులుH1B Visa Fee Ruling: ఎన్ని కోర్టులు తీర్పులిచ్చినా తిక్క ట్రంప్ ఊరుకునే రకం కాదు

H1B Visa Fee Ruling: ఎన్ని కోర్టులు తీర్పులిచ్చినా తిక్క ట్రంప్ ఊరుకునే రకం కాదు

H1B Visa Fee Ruling: హెచ్ 1 బీ వీసా వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న లక్ష డాలర్ల ఫీజు వసూలు నిర్ణయాన్ని తప్పుపడుతూ ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును ప్రవాస భారతీయ సంఘాలు స్వాగతిస్తున్నాయి.. కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

“అమెరికా దేశంలో సాంకేతిక విభాగాలలో పనిచేయడానికి.. హెల్త్ కేర్ లో పని చేయడానికి.. ఆత్యాధునిక మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాలలో పనిచేయడానికి.. ప్రతిభావంతులు అవసరం. చైనా ఈ విభాగాలలో అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను భర్తీ చేసుకున్నది. అందువల్లే ఈ రంగాలలో అద్భుతాలు చేస్తోంది. అమెరికా మాదిరిగా పనికిమాలిన ఫీజులను వసూలు చేయడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం లేనిపోని నిబంధనలను తీసుకొస్తూ ఇబ్బంది పెడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నారు. దీనివల్ల అమెరికా వెనుకబడిపోతుంది. ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వడంతో మాలాంటి వాళ్ళలో హర్షం వ్యక్తం అవుతుందని” ప్రభాస భారతీయులు చెబుతున్నారు.

అమెరికా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఫెడరల్ కోర్టు తీర్పును ట్రంప్ ఏ విధంగా చూస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. అనే అంశాలపై రకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇటీవల కాలంలో ట్రంప్ యంత్రాంగానికి.. న్యాయవ్యవస్థలకు మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు జరుగుతున్నాయి. చట్ట విరుద్ధమైన అంశాలను ట్రంపు ప్రభుత్వం పదేపదే తెరపైకి తీసుకువస్తుంది. విధానపరమైన అంశాలలో కూడా అనవసరమైన వేలుపెడుతోంది. దీనివల్ల న్యాయవ్యవస్థలు ప్రభుత్వానికి దిమ్మ తిరిగే విధంగా తీర్పులు ఇస్తున్నాయి. అయితే విధానపరమైన అంశాలలో ట్రంప్ ప్రభుత్వం వేలు పెడుతుందని.. ముఖ్యంగా హెచ్ వన్ బి వీసా దారులకు రకరకాల సమస్యలను తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హెచ్ వన్ బీ వీసా ఫీజును లక్ష దారాలకు పెంచుతూ గత ఎడాది ట్రంప ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్.. డెమోక్రటిక్ పార్టీ కోర్టులో సవాల్ చేశాయి. ఈ నేపథ్యంలో బోస్టన్ కోర్టు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం తీసుకొస్తుందని మండిపడింది. అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. అయితే బోస్టన్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల.. శ్వేత సౌధం లోని యంత్రాంగం పైకోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular