spot_img
HomeNewsTamil Nadu News: భర్త చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఆనందంగా భార్య మాటలు.. విచారణలో విస్తుపోయే...

Tamil Nadu News: భర్త చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఆనందంగా భార్య మాటలు.. విచారణలో విస్తుపోయే నిజాలు..

Tamil Nadu News: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువవుతున్నాయి. విలువలకు కట్టుబడి ఉండేవారు రోజురోజుకూ తగ్గిపోతున్నారని ఈ సందర్భంగా మానసిక నిపుణులు చెప్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. డీఎంకే నేత ఒకరు ఇటీవల చనిపోగా, ఆయన మరణం సహజంగా జరిగిందని అనుకున్నారు. కానీ, అది హత్య అన్న సంగతి తన భార్య ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

Tamil Nadu News
Tamil Nadu News

తమిళనాడు స్టేట్.. శివగంగ డిస్ట్రిక్ట్ దేవకొట్టై తాలూకాలోని సదయంకాడు అనే గ్రామానికి చెందిన దేవేంద్రన్ డీఎంకే నేత. కాగా, ఈయన పార్టీ కోసం కట్టుబడి పని చేశాడు. దాంతో స్థానికంగా ఈయనకు మంచి పేరు కూడా ఉంది. కాగా, ఇటీవల ఆయన అనారోగ్యం పాలు కాగా, ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ పరిస్థితి విషమించి దేవేంద్రన్(46) ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అలా ఈయన మరణించడం పట్ల డీఎంకే పార్టీ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: టూత్ బ్రష్ చరిత్ర మీకు తెలుసా.. అప్పట్లో అది ఎలా ఉండేది, ఎవరు తయరుచేశారంటే..?

దేవేంద్రన్ మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే దేవేంద్రన్ మరణించన తర్వాత 15 రోజులకు తమ్ముడు సతీష్ దేవేంద్రన్ అన్న ఇంటికి వెళ్లాడు. అక్కడ తన అన్న భార్య అనగా వదిన సూర్యను చూసి షాక్ అయ్యాడు. భర్త చనిపోయి 15 రోజులు కూడా కాలేదు. అంతలోనే ఆమె ఆనందంగా నవ్వుతూ ఫోన్ లో మాట్లాడుతున్నది. అది గమనించిన సతీష్..తన అన్నది సహజ మరణం కాదని అనుమానించాడు. దేవేంద్రన్ భార్య సూర్య ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేశాడు. తద్వారా సూర్యకు అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖరన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు ధ్రువీకరించుకున్నాడు.

ఈ విషయం పోలీసులకు తెలపడంతో పోలీసులు.. చంద్రశేఖరన్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బయటపడింది. సూర్య ప్లాన్ ప్రకారం తన భర్త దేవేంద్రన్ ను చంపినట్లు తెలుసుకున్నారు. దేవేంద్రన్ కు పెట్టిన భోజనంలో ఎలుకల ముందు కలిపింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురై చివరకు ప్రాణాలు కోల్పోయేలా చేసింది సూర్య. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. భార్య అలా తన భర్త ప్రాణాలు తీసిందా అని ఆశ్చర్యపోయారు.

Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper