IPS Officer Manoj Sharma: సివిల్స్ ఎగ్జామ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్స్ పాస్ అవడం ఒకెత్తు అయితే ఇంటర్వ్యూ పాస్ అవడం మరొక ఎత్తు అని చెప్పాలి. ఇంటర్వ్యూ క్రాస్ చేయాలంటే పుస్తకాలు చదివితే సరిపోదు. నాలెడ్జ్ తో పాటు పర్సనాలిటీ, సమయస్ఫూర్తి వంటి అంశాల గురించి చాలా పరిజ్ఞానం ఉండాలి. ఎలాంటి ప్రశ్న అడిగినా సరే దానికి సమాధానం చెప్పే విధంగా ఉండాలి. అలాంటి సివిల్స్ ఇంటర్వ్యూ కు హాజరు అయిన ఓ వ్యక్తికి వింత ప్రశ్న ఎదురైంది. మరి దానికి ఆయన ఎలాంటి సమాధానం చెప్పాడో తెలుసా?
ఐపీఎస్ ఫైనల్ వరకు వచ్చిన ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో సరిగ్గా ఇంగ్లీష్ లో మాట్లాడలేక ఇబ్బంది పడ్డాడు. దీంతో నీకు ఇంగ్లీష్ సరిగ్గా రావడం లేదు. అలాంటప్పుడు ఐపీఎస్ అయిన తర్వాత ఎలా మేనేజ్ చేస్తావు అని అడిగాడు. అది విన్న తర్వాత ఆ యువకుడు కాస్త సైలెంట్ గా ఉన్నాడు. అధికారి కాస్త ఈ గ్లాస్ వాటర్ తాగి జవాబు చెప్పు అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి నేను ఈ వాటర్ తాగలేను సర్ అంటాడు. దీనికి వాటర్ ఎందుకు తాగలేవు అని ప్రశ్నిస్తాడు అధికారి.
ఆ యువకుడు నేను స్టీల్ గ్లాస్ లో మాత్రమే వాటర్ తాగుతాను కానీ ఈ గ్లాసులో తాగను అని సమాధానం చెప్తాడు. దీంతో ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి కోపం వచ్చి గ్లాస్ కి వాటర్ కి సంబంధం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏ గ్లాసులో వాటర్ తాగుతున్నాం అనేది ముఖ్యం కాదు వాటర్ మాత్రమే ముఖ్యం అన్నాడు. అదే విధంగా అన్నింటిని మేనేజ్ చేయడానికి నా టాలెంట్ మాత్రమే ముఖ్యం. నేను మాట్లాడే భాష కాదు అన్నాడు.
ఈ సమాధానం వినగానే ఆ అధికారి వెంటనే ఈయనను సెలెక్ట్ చేశాడు. ఆ ఐపీఎస్ ఆఫీసర్ పేరు మనోజ్ శర్మ. 2005లో మహారాష్ట్ర కేడర్ నుంచి ఐపీఎస్ అవడమే కాదు ప్రస్తుతం ముంబైలోని రీజియన్ అడిషనల్ కమీషనర్ గా ఎదిగారు. ఒక ప్రశ్న ఆయన జీవితాన్ని మార్చేసిందనే చెప్పాలి. ఆయన టాలెంట్ తో ఎదగడమే కాదు సమయస్ఫూర్తి కూడా ఆయనను ఐపీఎస్ గా నిలిచేలా చేసింది.