Homeజాతీయం - అంతర్జాతీయంసెప్టిక్‌ట్యాంక్‌ క్లీన్‌ చేస్తూ ఇద్దరు మృతి

సెప్టిక్‌ట్యాంక్‌ క్లీన్‌ చేస్తూ ఇద్దరు మృతి

ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీ సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తుండగా ఊపిరాడక ఇద్దరు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖుర్జా ప్రాంతానికి చెందిన ఇద్రీస్‌, సలీంలు ఢిల్లీలోని అజాద్‌పుర ప్రాంతలో ఉన్న ఓ ఫ్యాక్టిరీకి చెందిన సెప్టిక్‌ ట్యాంక్‌ను క్లీన్‌ చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని బీజేఆర్‌ఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్రీస్‌, సలీంలు సోమవారం మృతి చెందారు. మరో ముగ్గురు అబ్దుల్‌ సద్దాం, సలీమ్‌, మన్సూర్‌లు చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనలో ప్యాక్టరీ ఓనర్‌ రాజేందర్‌ సోని, కాంట్రాక్టర్‌ ప్రమోద్‌దంగిని పోలీసులు అరెస్టు చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular