Doctor Gaurav Gandhi : అతనో గుండె వ్యాధి డాక్టర్.. ఎన్నో క్లిష్టమైన కేసులను ప్రత్యక్షంగా చూశారు. 16 వేల మంది గుండెకు ఆపరేషన్ చేశారు. ఇతర వైద్యుల కాదన్న కేసులను కూడా ఆయన టేకప్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. రిస్క్ అని తెలిసి కూడా సర్జరీలు చేసిన కేసులెన్నో.. గుండె వ్యాధులపై పూర్తి అవగాహన ఉన్న ఆ డాక్టర్ను అదె గుండోపోటు బలి తీసుకుంది.
దేశవ్యాప్తంగా గుర్తింపు..
అతని పేరు డాక్టర్ గౌరవ్ గాంధీ. రాష్ట్రం గుజరాత్. నివాసం జామ్ నగర్. 41 ఏళ్ల గౌరవ్ గాంధీ ప్రముఖ కార్డియాలజిస్ట్గా పేరు పొందారు. ఇప్పటి వరకు 16 వేల గుండె ఆపరేషన్లు చేశారు. జామ్ నగర్ మొత్తం తెలుసు డాక్టర్ గౌరవ్ అంటే. హస్తవాసి బాగుంటుందని.. వెయిట్ చేసి మరీ గౌరవ్ తోనే ఆపరేషన్లు చేయించుకునే వారు పేషెంట్లు.. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా చేపట్టిన గుండె వ్యాధుల నిరవారణ ఉద్యమంలోనూ గౌరవ్ కీలకపాత్ర పోషించారు. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.
రోజులాగానే విధులు..
జూన్ 6వ తేదీ రాత్రి వరకు ఆస్పత్రిలో పేషెంట్లను చూసి.. జామ్ నగర్ ప్యాలెస్ రోడ్డులోని తన ఇంటికి వచ్చారు. రోజు మాదిరిగానే డిన్నర్ చేసి రాత్రి 11 గంటల సమయంలో నిద్ర పోయారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు లేచి వాకింగ్ కు వెళ్లే డాక్టర్ గౌరవ్.. 2023, జూన్ 7వ తేదీ బుధవారం ఉదయం నిద్ర లేవలేదు. బయట వర్షం పడుతుండటంతో.. నిద్ర లేవలేదని భావించిన కుటుంబ సభ్యులు.. అతన్ని డిస్ట్రబ్ చేయలేదు. 7 గంటల తర్వాత కూడా నిద్ర లేవకపోవటంతో.. ఇంట్లోని కుటుంబ సభ్యులు నిద్ర లేపారు. ఉలుకూ పలుకూ లేకపోవటంతో.. భయమేసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు.
కార్డియాక్ అరెస్ట్తో..
41 ఏళ్ల డాక్టర్ గౌరవ్.. నిద్రలోనే తీవ్ర గుండెపోటు.. కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినట్లు చెబుతున్నారు డాక్టర్లు. కుటుంబ సభ్యులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. రాత్రి పడుకునే మందు అందరితో మాట్లాడాడని.. ఎలాంటి అనారోగ్యం అని చెప్పలేదని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
16 వేల గుండెలు డాక్టర్ గౌరవ్ చలవతోనే ప్రసుత్తం కొట్టుకుంటున్నాయి. 41 ఏళ్ల వయసులోనే ఆయన 16 వేల గుండె ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. ఆ డాక్టర్ ఇక లేరన్న విషయం తెలిసి జామ్నగర్లోని డాక్టర్లతోపాటు.. ప్రజలు షాక్ అయ్యారు. దేశంలోనే అతి చిన్న వయస్సులోనే ప్రముఖ కార్డియాలజిస్ట్గా పేరు పొందిన గౌరవ్.. అదే గుండెపోటుతో చనిపోవటం డాక్టర్ల ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ఇలాంటి ప్రముఖ కార్డియాలజిస్టులే గుండెపోటుతో చనిపోతుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.