maoists, naxals
Also Read: నిరుద్యోగ తెలంగాణ
Also Read: కేసీఆర్ రెవిన్యూ ప్రక్షాళన విప్పిన ఫామ్ హౌస్ గుట్టు..!
Also Read: రేవంత్ కొత్త రాజకీయ పార్టీ…. కాంగ్రెస్ కు షాక్ తప్పదా….?
సాధారణంగా ఇటువంటి ప్రచార సందర్భాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను సమర్థించే సంస్థల నేతలు వెంటనే స్పందిస్తుంటారు. అంతేగాక ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా స్పందిస్తుంటారు . పార్టీపై జరిగే ఈ తరహా ప్రచారపు వార్త సంబంధీకులకు చేరడానికి ఇప్పుడు గతంలో మాదిరిగా వ్యవధి కూడా అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా నిమిషాల్లోనే విషయం విశ్వవ్యాప్తమవుతోంది. కానీ గణపతి లొంగుబాటు అంశంలో మావోయిస్టు పార్టీ నాయకులుగాని, దాని అనుబంధ, సానుభూతి సంస్థలకు చెందినవారు గాని ఎటువంటి ప్రకటన చేయడం లేదు. కారణం … మావోయిస్టులకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించే ఒకేఒక వ్యక్తి విప్లవ కవి వరవర రావ్. ఇతనిపై అర్బన్ నక్సల్ ముద్ర వేసి కోరేగావ్ (ప్రధాని ని హత్య చేసేందుకు )కుట్ర కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో తమకూ ఇదే పరిస్థితి ఎదురవుతుందని హక్కుల సంఘాలు కాని, సానుభూతి పరులుకాని స్పందించడంలేదని వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి.ఏంజరిగిందో చెప్పేందుకు మావోయిస్టుల తరపున ఎవరూ లేకపోవడంతో మావోయిస్టులకు సంబందించిన సమాచారం ఏకపక్షంగా ప్రచారమవుతోంది. దీన్తో, దండకారణ్యంలో ఏంజరుగుతోందో, ఏది నిజమో బయటి ప్రపంచానికి అర్థం కాని పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలోనే తెలంగాణా పోలీసు శాఖ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకోబోతున్నదనేది ప్రస్తుత ప్రచారపు సారాంశం. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతితో పాటు మరో నలుగురు ముఖ్య నేతలు కూడా లొంగుబాటను ఎంచుకున్నారనేది తాజా ప్రకంపనల సారాంశం. వీరిలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లొజుల వేణుగోపాల్ అలియాస్ వివేక్, పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కడారి సత్యానారాయణ అలియాస్ కోసాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ, గణపతి సహా ఐదుగురు మావోమయిస్టు పార్టీ నేతలు కేంద్ర కమిటీ సభ్యులు కావడం గమనార్హం.ఈ నాయకుల లొంగుబాటుకు చాలా కాలం నుంచే ఎస్ఐబీ విభాగపు పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తెలంగాణా పోలీసుల కృషి ఫలితంగా మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నేతలు లొంగుబాటను ఎంచుకున్నారనేది తాజా ‘బ్రేకింగ్’ ప్రచారం. ఈ లొంగుబాట్ల అంశంలో ఉత్తర తెలంగాణాకు చెందిన ఒకరిద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులు మధ్యవర్తిత్వం జరిపారనేది కూడా మరో ప్రచారం. మరోవైపు నక్సలైట్లు ఎవరు లొంగిపోయినా తాము స్వాగతిస్తామని తెలంగాణా పోలీసు శాఖ వర్గాలు ప్రకటించినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.
గణపతి సహా మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు లొంగుబాటలో పయనిస్తే తెలంగాణాలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలన ఘటనగా నమోదవుతుందనడంలో సందేహం లేదు. రెండు రోజుల్లో గణపతి, మరికొందరు ముఖ్య నేతలు పోలీసులకు లొంగిపోయే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంగా లొంగుబాట్ల ప్రచారపు అంశం విప్లవోద్యమ చరిత్రలో సంచలన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుందా ? లేక ఉవ్వెత్తున ఎగసిపడుతుందా ? కొద్ది రోజుల్లో తేలిపోనుంది.