spot_img
Homeపండుగ వైభవంVykunta Ekadasi: నేడే వైకుంఠ ఏకాదశి... ఈ ఏకాదశి విశిష్టత ఏమిటో తెలుసా?

Vykunta Ekadasi: నేడే వైకుంఠ ఏకాదశి… ఈ ఏకాదశి విశిష్టత ఏమిటో తెలుసా?

Vykunta Ekadasi: ప్రతి ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.ఈ వైకుంఠ ఏకాదశి రోజు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు ముక్కోటి దేవతల తో కలిసి భూమి పైకి రావడం వల్ల ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు.అదేవిధంగా ఈరోజు ఎవరైతే శ్రీహరిని భక్తిశ్రద్ధలతో కఠిన ఉపవాసాలతో పూజిస్తారో అలాంటి వారికి వారి పాపాల నుంచి మోక్షం కలుగుతుంది కనుక ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. అలాగే సంతానం కావాలనుకుంటున్న వారు ఈ ఏకాదశి రోజున ఈ వ్రతం ఆచరించడం వల్ల వారికి పుత్ర సంతాన యోగం కలుగుతుందని ఈ ఏకాదశిని పుత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఈ విధంగా ఎంతో విశిష్టమైన ఈ ముక్కోటి ఏకాదశి తిథి సాయంత్రం వరకు ఉండటం వల్ల ప్రతి ఒక్కరు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని స్నానమాచరించిన అనంతరం ఇంట్లో శ్రీహరి చిత్రపటానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అనంతరం శ్రీహరి ఆలయాలకు సందర్శించాలి. అయితే ఈ రోజు మొత్తం ఎవరైతే ఉపవాసంతో ఉంటారో అలాంటి వారిపై నారాయణుడి అనుగ్రహం ఉంటుందనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా స్వామివారికి తులసిమాలలతో పూజ చేసిన అనంతరం ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకోవాలి.

Vaikunta-Ekadasi 2022
Vaikunta-Ekadasi 2022

ఈ క్రమంలోనే ఈ రోజు శ్రీహరి ఆలయాలలో ఉత్తర ద్వారం తెరిచి ఉంటారు.ఎవరైతే ఉత్తర ద్వారం కింద ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకుంటారో అలాంటి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం తో విష్ణుసహస్రనామాలు చదువుతూ స్వామివారి సేవలో ఉండాలి. అదేవిధంగా ఉపవాసంతో స్వామివారిని పూజ చేసే వారు కొన్ని నియమాలను కూడా పాటించాలి.

ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో అలాంటి వారు ఉపవాసంతో స్వామివారికి పూజ చేసే ఈ రోజు మొత్తం స్వామివారి సేవలో ఉండి పూజించుకోవాలి. అదేవిధంగా వ్రతమాచరించే వారు ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలాగే ఏకాదశి రోజు రాత్రి నేలపై పడుకోవాలి. ఏకాదశి ద్వాదశి రోజుల్లో బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం ఉన్నవారు ద్వాదశిరోజు ఉదయమే శుభ్రంగా స్నానమాచరించి భోజనం తయారు చేసి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన తర్వాత మీ ఉపవాసం విరమించాలి. ఈ విధంగా ఏకాదశి వ్రతంలో ఈ నియమాలను పాటించడం వల్ల స్వామివారి కరుణాకటాక్షాలు మనపై ఉంటాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper