Homeలైఫ్ స్టైల్Kalivi kodi: ఈ పక్షి కారణంగా వేల కోట్లు ప్రాజెక్ట్ ఆగిపోయిందని మీకు తెలుసా...?

Kalivi kodi: ఈ పక్షి కారణంగా వేల కోట్లు ప్రాజెక్ట్ ఆగిపోయిందని మీకు తెలుసా…?

Kalivi kodi: ఈ భూమిపై ఎన్నో జీవరాసులు మనుగడ సాగిస్తున్నాయనే విషయం మనకు తెలిసిందే.అయితే కొన్ని పక్షులు వాటికి అనుకూలంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలస వెళుతూ ఉండటం మనం చూస్తుంటాము. ఇలా ఈ భూమిపై ఎన్నో జీవరాసులు నివసిస్తున్నాయి. అలాంటి వాటిలో కలివికోడి ఒకటి. ఈ పక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో అరుదుగా కనిపించే ఓ అరుదైన పక్షి ఈ కలివికోడి. భారత పక్షి శాస్త్ర పితామహుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న ఈ పక్షి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.

Kalivi kodi
Kalivi kodi

Also Read: ష‌ర్మిల అరెస్టుతో ఏం జ‌రుగుతోంది?

1986 జనవరి 5వ తేదీ ఐరయ్య అనే ఓ గొర్రెల కాపరి గొర్రెల కోసం వెళ్లి ఈ పక్షిని కనుగొన్నారు.ఇలా ఆ గొర్రెల కాపరి ఈ పక్షిని కనుగొనడం వల్ల ఈ కలివికోడి గురించి దేశం మొత్తం తెలుసుకున్నారు. ఇక ఆయన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఐరయ్యను వాచర్ గా గుర్తించింది. ఈ పక్షి ఆవాస ప్రాంతం నుంచి తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మించాలని భావించారు. ఇదే కనుక జరిగితే ఈ అరుదైన పక్షి జాతి అంతరించిపోతుందని పర్యావరణ కారులు ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆపివేయాలని కోర్టులో పిటిషన్ వేశారు.

ఇక ఈ విషయంపై విచారణ జరిపిన కోర్టు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా ఈ కలివికోడి వల్ల ఏకంగా వంద కోట్లు ప్రాజెక్ట్ ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతం నుంచి కాకుండా దారి మళ్ళించి నిర్మాణం చేపట్టారు.

Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular