Homeక్రీడలుTeam India New Jersey- Asia Cup 2022: ఆసియా కప్ కోసం కొత్త...

Team India New Jersey- Asia Cup 2022: ఆసియా కప్ కోసం కొత్త జెర్సీతో టీమిండియా.. అదిరిపోలా..

Team India New Jersey- Asia Cup 2022: టీమిండియా ఆసియా కప్ కోసం యూఏఈ వెళ్లింది. ఇందులో పాల్గొనేందుకు ఆరు జట్లు వచ్చాయి. దీంతో ప్రాక్టీసు మొదలు పెట్టాయి. రేపటి నుంచి ఆసియా కప్ మ్యాచులు మొదలవుతున్నాయి. దీంతో టీమిండియా టైటిల్ ఫేవరేట్ గా రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే ప్రాక్టీసు చేస్తోంది. టీమిండియా జట్టుకు కొత్త జెర్సీ అందించారు. దీంతో వీటితో టీమిండియా ఆల్ రౌండర్ ఓ ఫొటోను నెట్టింట్లో పెట్టి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇన్నాళ్లు ఎప్పుడు కూడా అలా కొత్త జెర్సీని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన సంఘటనలు లేవు. కానీ ఈసారి మాత్రం ఆటగాళ్లు కొత్త జెర్సీతో కనిపించడం సంచలనం కలిగిస్తోంది.

Team India New Jersey- Asia Cup 2022
Team India New Jersey- Asia Cup 2022

ఆసియా కప్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. యూఏఈలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆసియా కప్ కోసం భారత జట్టు కొత్త జెర్సీని విడుదల చేసింది. దీంతో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొత్త జెర్సీతో ఉన్న జట్టు ఫొటోను షేర్ చేశాడు. పాకిస్తాన్ కూడా కొత్త జెర్సీతో ఉన్న ఫొటోను పోస్టు చేసింది. ఐసీసీ ప్రతి టోర్నమెంట్ లో కొత్త జెర్సీలను అందజేయడం మామూలే. దీంతో ఇప్పుడు కూడా ఆసియా కప్ కోసం కొత్త జెర్సీని అందించింది. రవీంద్ర జడేజా ఇన్ స్టాగ్రామ్ లో కొత్త జెర్సీతో ఉన్న ఫొటోను పంచుకోవడం తెలిసిందే.

Also Read: Anasuya Bharadwaj: లైగర్ మూవీ ఫ్లాప్ అవ్వడం తో సంబరాలు చేసుకుంటున్న యాంకర్ అనసూయ

భారత జట్టు కొత్త జెర్సీ నీలం రంగులో ఉంది. ఆసియా కప్ లో టీమిండియా కొత్త జెర్సీ తో ఉన్న ఫొటోను పంచుకుంటున్నారు. జెర్సీపై ముగ్గురు స్టార్లు కూడా ఉన్నారు. భారత జట్టు కొత్త జెర్సీలో ఆసియా కప్ లోగో కూడా కనిపిస్తుంది. భారత జట్టు ఇప్పటి వరకు మూడు సార్లు ప్రపంచ కప్ టైటిల్స్ గెలుచుకోవడం విశేషం. జడేజా మినహా ఏ ఆటగాడు కూడా కొత్త జెర్సీ ఫొటో షేర్ చేయలేదు. దీంతో కొత్త జెర్సీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రేక్షకుల నుంచి పలు కామెంట్లు కూడా వస్తున్నాయి.

Team India New Jersey- Asia Cup 2022
Asia Cup 2022

పాకిస్తాన్ జట్టు కూడా తన కొత్త జెర్సీ ఫొటోలను షేర్ చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం కెప్టెన్సీలో ఆసియా కప్ ఆడిన పాకిస్తాన్ జట్టు తన కొత్త జెర్సీని విడుదల చేసింది. ఆటగాళ్ల ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో పాక్ ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. ఆసియా కప్ లో భాగంగా ఈనెల 28న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. దీంతో గెలుపుపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ఇరు జట్లు ప్రాక్టీసు ముమ్మరం చేశాయి. ఎలాగైనా గెలిచి తమ ప్రేక్షకులకు కానుగా అందివ్వాలని రెండు జట్లు భావిస్తున్నాయి.

Also Read:Bellamkonda Sreenivas: బిజినెస్ మ్యాన్ మూవీ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్..డైరెక్టర్ ఎవరో తెలుసా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular