Gas Problem: మనలో చాలా మందికి గ్యాస్ సమస్యలు ఉంటాయి. మనం తిన్నది సరిగా జీర్ణం కాకపోతే గ్యాస్ సమస్యలు వేధిస్తాయి. దీంతో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గొంతులో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనం తిన్న ఆహారమే మనకు నష్టం తెస్తుంది. కడుపును కీకారణ్యం చేస్తుంది. ఫలితంగా గ్యాస్ సమస్యలు తెగ బాధిస్తాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో ఏదీ మనసున పట్టదు. గ్యాస్ సమస్యలు మనిషికి ఇబ్బందులు కలిగిస్తాయి. ఆధునిక కాలంలో గ్యాస్ సమస్యలు కామన్ గా మారాయి.

గ్యాస్ సమస్య ఎందుకు వస్తుంది? దానికి కారణాలేంటి? అనే విషయాలపై ఆలోచిస్తే మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. గ్యాస్ సమస్య మనకు రావడానికి మనం తీసుకునే ఆహారమే అవుతుంది. కారం, పులుపు, ఉప్పు తదితర వాటిని మనం మోతాదుకంటే ఎక్కువ తీసుకుంటున్నాం. కడుపులో అవి జీర్ణం కాకపోతే యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. అలా ఉత్పత్తి అయిన యాసిడ్ మంట రూపంలో పైకి ఎగుస్తుంది. దీంతోనే మనకు కడుపులో మంట వస్తుంది. గొంతులో మంటకు కారణమవుతుంది.
గ్యాస్ సమస్యలను తగ్గించుకోవడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఎండోస్కోపి ద్వారా గ్యాస్ సమస్యలను గుర్తించవచ్చు. గ్యాస్ సమస్యలు రాకుండా ఉండాలంటే మజ్జిగ బాగా పనిచేస్తుంది. పులిసిన మజ్జిక కాకుండా అప్పుడే తయారు చేసుకున్న మజ్జిగ తీసుకుంటే ప్రయోజనం. దీంతో మనకు గ్యాస్ సమస్యలు అదుపులోకి వస్తాయి. జీ జంక్షన్ ను బిగుతుగా ఉంచేందుకు కొన్ని చర్యలు తీసుకుంటే మంచిది. ప్రతి రోజు సమయం ప్రకారం తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ ఇబ్బందులను దూరం చేసుకోవడానికి మార్గాలు అన్వేషించుకోవాలి.

పడుకునేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. తలకింద దిండు పెట్టుకోవాలి. గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుడి పర్యవేక్షణలో ఉండటం మంచిది. గ్యాస్ సమస్యలు రాకుండా చేసుకోవడానికి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మసాలాలు లేకుండా చూసుకోవాలి. ఉడకని ఆహారాలు తీసుకుంటే ఇంకా ప్రయోజనం. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి తమ ఆహారాల్లో చేర్చుకోవాలి. గ్యాస్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు మనం తీసుకున్న ఆహారాలు ఉపయోగపడతాయి.