డ్రగ్స్ కేసు దర్యాప్తు కేంద్ర సంస్థలకు ఇవ్వాలన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిల్ పై నేడు విచారణ జరిగింది. 2016 లో నమోదైన డ్రగ్స్ కేసుల వివరాలు సీబీఐ, ఈడీకి ఇవ్వట్లేదని న్యాయవాది రచనా రెడ్డి తెలిపారు. ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ కేసుల వివరాలు ఇవ్వడం లేదని ఈడీ హైకోర్టుకు తెలిపింది. ఎఫ్ఐఆర్ లు, ఛార్జిషీట్లు , వాంగ్మూలాలు ఇచ్చేలా ఎక్సైజ్ శాఖను ఈడీ కోరింది. ఈడీకి వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.