జూలై 23 నుంచి ప్రారంభకానున్న టోక్యో ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్లు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు భారత అథ్లెట్లు జెర్సీలను అలాగే సహాయ సిబ్బంది యూనిఫాంలను ఆవిష్కరించారు. అథ్లెట్ల కోసం నీలం, తెలుపు రంగులతో జెర్సీలు డిజైన్ చేయబడగా, సపోర్ట్ స్టాఫ్ కోసం ప్రత్యేక సూట్లు రూపిందించబడ్డాయి. కాగా షెడ్యూల్ ప్రకారం గతేడాది జరగాల్సిన విశ్వక్రీడలు ఈ ఏడాదికి రీ షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే.