spot_img
Homeఅంతర్జాతీయంProtests in Pakistan: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగిసింది.. పాకిస్తాన్ అట్టుడుకుతోంది..

Protests in Pakistan: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగిసింది.. పాకిస్తాన్ అట్టుడుకుతోంది..

Protests in Pakistan: ఇజ్రాయెల్, హమాస్ మధ్య సున్నితమైన శాంతి ఒప్పందం కుదిరింది. దీనిపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఉత్సాహంతో స్పందిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ఈజిప్ట్‌లో ఈ ఒప్పందం జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుంచి నేతలు వచ్చారు. పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా హాజరయ్యరు. మోదీని అమాంతం ఆకాశానికి ఎత్తేశారు. ఇలా ఒకవైపు పాకిస్తాన్‌ సంబురాల్లో పాల్గొంటుంటే.. ఇంకోవైపు ఆఫ్గానిస్తాన్‌ పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించింది. ఇంకోవైపు బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ(బీఎల్‌ఏ) దాడిలు కొనసాగిస్తోంది. ఇంకోవైపు ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ నిరసనలకు దిగుతోంది. ఇలాంటి పరిస్థితిలో పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. చివరకు పాకిస్తాన్‌కు కూడా అర్థం కావడం లేదు.

తెహ్రీకే లబ్బైక్‌ వాదాల ప్రభావం..
కాల్పుల విరమణ ఒప్పందం జరిగే ఈజిప్ట్‌కు పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ హాజరయ్యారు. ఇది పాకిస్తానీలకు నచ్చడం లేదు. ఇక ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ పట్టుకుని అమ్మకానికి వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఇంతకాలం పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహించిన పాకిస్తాన్‌.. ఇప్పుడు కాల్పుల విమరణ ఒప్పందానికి మద్దతు ఇవ్వడంపై తెహ్రీకే లబ్బైక్‌ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో సోమవారం ఉదయం 5 గంటలకు నమాజ్‌ తర్వాత దేశమంతటా ముస్లింలు రోడ్లపైకి వచ్చారు. నిరసన తెలిపారు. దీంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆందోళనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపించింది. ఈ ఘటనలో 300 మంది మరణించారు. 1,900 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో తెహ్రీకె లబ్బైక్‌ పార్టీ నాయకుడు సాద్‌ రిజ్వీ సోదరుడు అనాస్‌ రిజ్వీ మరణించాడు. సాద్‌ రిజ్వీని కూడా సైన్యం టార్గెట్‌ చేసింది. మూడుసార్లు కాల్పులు జరిపారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉంది.

రేర్‌ మినరల్స్‌తో విదేశాల్లో తిరుగుతున్న ఆర్మీ చీఫ్‌..
ఇదిలా ఉంటే.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తమ దేశంలో లభించే రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ గంప నెత్తిన పెట్టుకుని వివిధ దేశాలు తిరుగుతున్నారు. తమ వద్ద లభించే మినరల్స్‌ కొనుగోలు చేయాలని వేడుకుంటున్నాడు. ఇదే సమయంలో పాకిస్తాన్‌లో అల్లర్లు జరగడంతో సైన్యం, పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

అటు‍్టడుకుతున్న పాక్‌..
తాజాగా తెహ్రీకే లబ్బైక్‌ పార్టీ నిరసనలతోపాటు మరోవూపు ఆఫ్ఘాన్-పాక్ సరిహద్దు, భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సిందూర్ 2.0 పరిస్థితులు మరింత ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. దేశీయ రాజకీయ విభేదాలు, మతభేదాల దుమారం, ఆర్మీ-ప్రజల మధ్య సంకీర్ణ పరిణామాలు పాక్ ను అభివృద్ధి మార్గం నుండి దూరం చేస్తున్నాయి.

పాకిస్తాన్ సమాజంలో శాంతి ఒప్పందాలు మేలుకొల్పుతున్నప్పటికీ, అంతర్గత విభేదాలు, రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతలు దేశ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. దేశ నాయకులు అంతర్జాతీయ వేదికలపై శాంతిని గ్లోబల్‌గా ప్రచారం చేస్తారన్నదీ, దేశంలో శాంతి సాధనలో సవాళ్లు ఇంకా ఉంటునా‍్నయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper