భారత వైద్య పరిశోధనా మండలి బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్టపట్నానికి వెళ్లనుంది. కరోనాకు ఇక్కడి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందును పరీక్షించనుంది. ఈ బృందం ఆయుర్వేద మందు శాస్త్రీయలను పరీక్షించిన తర్వాతే తిరిగి పంపిణీ జరిగే అవకాశం ఉంది. కరోనాకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై అనుమానాల నివృత్తి కోసం సీఎం వైఎస్ జగన్ శుక్రవారం అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే. అధ్యయనం కోసం ఐసీఎంఆర్ బృందాన్ని కృష్ణపట్నం పంపించాలని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.