దేశంలోనే ఇలాంటి పాలనను ఎక్కడా చూడటం లేదంటూ జగన్ ప్రభుత్వం పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అయితే చెప్పుకొనేది మాత్రం జగన్ ప్రభుత్వం అని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని, అన్ని చోట్ల నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలేదని, రైతులకు జరుగుతన్న అన్యాయాన్ని బీజేపీ ఖండిస్తోందని వ్యాఖ్యానించారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నారని సొంత ఆస్తులను జగన్ ఎందుకు తాకట్టు పెట్టడం లేదని మండిపడ్డారు.
Posted by Somu Veerraju on Friday, 25 June 2021