
కరోనా కట్టడిలో పోలీసులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వాళ్లు ప్రాణాలు పణంగా పెట్టి మరి కరోనా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన 36 మంది పోలీసుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ డ్యూటీలు చేస్తూ పోలీసు ఉన్నతాధికారులతో సహా మొత్తం 84 మంది ప్రాణాలు కోల్పోయారు.