రాష్ట్రంలో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంద్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా 200 మంది కరోనా సోకిన జర్నలిస్టులకు తక్షణ సాయం అందించనున్నట్లు ఆయన ఓక ప్రకటనలో తెలిపారు.