
రెమ్ డెసివర్ ఇంజక్షన్స్ బ్లాక్ దందాపై మంచిర్యాల పోలీసులు కొరడా ఝులిపించారు. మంచిర్యాలలోని ప్రైవేటు హాస్పిటల్స్ కేంద్రంగా అంబులెన్స్ డ్రైవర్ల ద్వారా సాగుతున్న దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కరోనా బాధితుల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటూ మంచిర్యాలలోని రెండు ప్రైవేటు దవాఖానలకు చెందిన ఇద్దరు సిబ్బంది, ఇద్దరు అంబులెన్స్ యజమానులు ఒక గ్రూపుగా ఏర్పాడి నెల రోజులుగా బ్లాక్ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ఇంజక్షన్ రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.