డేటా స్టోరేజీ నిబంధనలు పాటించని కారణంగా మాస్టర్ కార్డ్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు చేపట్టింది. కొత్తగా తన డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ నెట్ వర్క్ లోకి వినియోగదారులకు చేర్చుకోకుండా ఆంక్షలు విధించింది. జూలై 22 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటికే మాస్టర్ కార్డు వినియోగిస్తున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. పేమెంట్స్ కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలని 2018 ఏప్రిల్ 6న ఆర్బీఐ ఆదేశించింది.