చంచల్ గూడ సమీపంలోని పిల్లి గుడిసెలలో జీహెచ్ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మద్ ఆలీ, ఎంపీ అసద్, మలక్ పేట్ ఎమ్మల్యే బలాల, మంత్రులు తలసాని, ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శీలత పాలొన్నారు. హైదరాబాద్ ను స్లమ్ ఫ్రీ సిటీగా చేసేందుకు గతంలో మురికివాడగా ఉన్న గుడిసెలు బస్తీలో రూ. 24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను జీహెచ్ఎంసీ నిర్మించింది.