
ప్రయదర్శి, హర్షిత్, గౌరీ ప్రియ ప్రధాన ప్రాత్రధారులుగా రూపొందిచి ఆహ ఒరిజినల్ మూవీ మెయిల్ (చాపర్ట్ 1- కంబాలపల్లి కథలు. ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఈ ఏడాది ప్రారంభంలో ఆహా ఓటీటీలో విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందిన ఈ చిత్రం ఇప్పుడు అరుదైన గుర్తింపు దక్కించుకుంది. జూన్ లో నిర్వహించబోయే న్యూయార్క్ ఇండియన్ ఫీల్మ్ ఫెస్టివల్ (ఎన్వైఐఎఫ్ఎఫ్)2021కు ఈ చిత్రం ఎంపికైంది. గొప్ప లెగసీతో చాలా కాలం నుంచి నిర్వహించబడుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో సినిమాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలింస్, ఇండిపెండెంట్, ఆర్ట్ మూవీస్ ఇలా అన్నీ విభాగాలను చెందిన సినిమాలను ప్రదర్శిస్తారు.