
కరోనా వ్యాప్తి దృష్ట్యా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ గడువు వచ్చే సోమవారం ఉదయం 5 గంటలకు ముగియనుంది. అయితే కరోనా పాజిటివ్ కేసులు రోజుకు 25 వేలకు మించకుండా నమోదు అవుతుండటంతో లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడిగించారు. ఢిల్లీలో ఏప్రిల్ 19 నుంచి లాక్ డౌన్ అమల్లో ఉది.