Jagan Convoy: వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, చెప్పులు విసిరారు. ఈ రాళ్ల దాడిలో కానిస్టేబుల్, మహిళకు గాయలయ్యాయి. అదే సమయంలో అమరావతి మహిళలకు మద్దతుగా అక్కడే నిరసన చేస్తున్నా టీడీపీ శ్రేణులు, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు ప్రయత్నంచారు. అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు.