India U19 vs Afghanistan U19 : అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ జట్టును ఓడించి సెమి ఫైనల్ వెళ్ళింది. సెమీఫైనల్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతోంది. బుధవారం హరారే మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ఆఫ్గనిస్తాన్. భారత జట్టు బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో సీనోజాదా (110), ఉజారుల్లా నియా జాయ్(101*) సెంచరీలతో కదం తొక్కడంతో ఆఫ్గనిస్తాన్ జట్టు నిర్నిత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ తొలి వికెట్ 53 పరుగుల వద్ద కోల్పోయింది. రెండో వికెట్ 117 పరుగుల వద్ద కోల్పోయింది. కానీ మూడో వికెట్ కు మాత్రం రికార్డు స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు పరుగులు నమోదు చేశారు. మూడో వికెట్ కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యం నమోదు కావడంతో ఆఫ్గానిస్తాన్ జట్టు తిరుగులేని స్థాయిలో నిలిచింది.
మొదటి రెండు వికెట్లను సమర్థవంతంగా తీయగలిగిన భారత బౌలర్లు.. ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు పండగ చేసుకున్నారు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరి రెండు వికెట్లు సాధించారు. మొదట్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. కానీ ఆ తర్వాత ఆఫ్గనిస్తాన్ బ్యాటర్ల మీద ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారు. దీంతో భారత్ ఎదుట ఆఫ్ఘనిస్తాన్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా గెలవాలంటే 311 పరుగులు చేయాలి. ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్య వంశీ, ఆయుష్ మాత్రే, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండు మీద జట్టు ఆశలు పెట్టుకుంది. వీరంతా సమిష్టిగా ఆడితేనే టీమిండియా విజయం సాధిస్తుంది. లేనిపక్షంలో భారత అభిమానులు బిత్తరపోయే ఫలితం వస్తుంది.