spot_img
Homeజాతీయ వార్తలుIndia Army : భారత సైన్యానికి భీకర దండు.. పాక్ తోక జాడిస్తే వేసేయడమే.. ఖతమే...

India Army : భారత సైన్యానికి భీకర దండు.. పాక్ తోక జాడిస్తే వేసేయడమే.. ఖతమే ఇక..

India Army : ఒకప్పుడు సరిహద్దుల్లో పరిస్థితి దారుణంగా మారినప్పుడు.. క్షేత్రస్థాయిలో పనిచేసేవారు పై అధికారులకు సమాచారం అందించేవారు. పై అధికారులు తమ దళాలకు నాయకత్వం వహించే వ్యక్తికి చెప్పేవారు. ఆయన హోంశాఖ సెక్రటరీ దాకా తీసుకెళ్లేవారు. హోంశాఖ సెక్రటరీ హోం మంత్రి కి వర్తమానం పంపేవారు. హోమ్ మంత్రి క్యాబినెట్లో చర్చించి.. ప్రధానమంత్రి కి చెప్పి.. ప్రధానమంత్రి మళ్ళి మేడం సలహా తీసుకొని.. రంగంలోకి దిగేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయ్యేది. పాకిస్తాన్ వాడు మన మీద దాడి చేసే వాడు. మన సైనికులను చంపేసేవాడు. ముఖ్యంగా సరిహద్దుల్లో రక్త ప్రవాహం కొనసాగించేవాడు.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాడి చేస్తే ఏకంగా పాకిస్తాన్ మీదికి వెళ్లి ప్రతి దాడులు చేసే స్థాయికి ఇండియన్ ఆర్మీ ఎరిగింది.. ఒకరిని చంపితే పది తలకాయలు తీసుకొచ్చే స్థాయికి ఇండియన్ ఆర్మీ ఎదిగింది. సరిహద్దుల్లో రక్తపాతం సృష్టిస్తే.. పాకిస్తాన్ దేశానికి వెళ్లి ఉగ్రవాదులను చంపే స్థాయికి ఇండియన్ ఆర్మీ ఎదిగింది.. మధ్య మధ్యలో రకరకాల ఆపరేషన్లు.. రకరకాల వ్యవహారాలు.. కరుడుగట్టిన తీవ్రవాదులను మట్టు పెట్టడాలు వంటివి జరిగిపోతున్నాయి. ఫలితంగా పాకిస్తాన్ భారత్ అంటేనే పోసుకుంటున్నది. అయితే భారత్ ఇక్కడితోనే ఆగిపోవడం లేదు. ఇంతటితోనే తన ఆర్మీని నిలుపుదల చేయడం లేదు.

ప్రస్తుతం భారత్ దగ్గర అత్యంత శక్తివంతమైన డ్రోన్లు 50వేల వరకు ఉన్నాయి. ఇవి నిత్యం పహారా కాస్తూ ఉంటాయి. యుద్ధ రంగంలో భీకరంగా పోరాడుతూ ఉంటాయి. చివరికి పాకిస్తాన్ చేతికి చిక్కకుండా ఏం చేయాలో అవి చేసి వస్తాయి. ఒకప్పటితో పోల్చి చూస్తే.. ఇప్పుడు భారత్ దగ్గర అత్యంత ఖరీదైన ఆయుధాలు.. బాంబులు.. యుద్ధ సామగ్రి.. శక్తివంతమైన పరికరాలు ఉన్నాయి. మరో రెండు సంవత్సరాలల్లో వీటి సంఖ్య డబుల్, త్రిపుల్ కాబోతోంది. ఈ లెక్కన చూస్తే పాకిస్తాన్ తోక జాడిస్తే చాలు ఖతం చేసే స్థాయికి ఇండియన్ ఆర్మీ ఎదిగింది.

లక్ష కోట్ల ఖర్చుతో డిఫెన్స్ డిపార్ట్మెంట్ మరిన్ని అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోబోతోంది. ఇవన్నీ కూడా ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా తయారవుతున్నాయి. ఒకప్పుడు ఆయుధాలను భారత్ దిగుమతి చేసుకునేది. వీటికోసం భారీగా ఖర్చు పెట్టేది. కానీ ఇప్పుడు సొంతంగా తయారు చేసుకుంటున్నది. ఇతర దేశాలకు అమ్ముతున్నది. ఈ 12 సంవత్సరాలలో భారత్ ఏ స్థాయిలో ఎదిగింది.. ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది.. అనే విషయాలను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని జాతీయవాదులు అంటున్నారు.
image.png

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular