ఐసీసీ విడుదల చేసిన మహిళా టీ20 ర్యాంకింగ్స్ ముగ్గురు భారత మహిళ క్రికెటర్లు టాప్ 10లో కొనసాగుతున్నారు. షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ టాప్ 10లో వున్నారు. తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో షఫాలి 744 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్లో కొనసాగుతుండగా స్మృతి, రోడ్రిగ్స్ 7, 9వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో దీప్తి ఆరో స్థానంలో ఉండగా రాధా యాదవ్, పూనమ్ యాదవ్ లు వరుసగా 7, 8స్థానాల్లో వున్నారు. ఇక టీమ్ విభాగంలో ఆస్ట్రేలియా (291), ఇంగ్లండ్ (280), ల తర్వాత భారత్ 3వ స్థానంలో కొనసాగుతుంది.
Also Read: ధోనికి ఏమైంది.. ఫ్యాన్స్ లో టెన్షన్..!